Rajeev Chandrasekhar : తిరువనంతపురం.. దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఏం జరుగబోతోందన్నది ఉత్కంఠ నెలకొంది. అక్కడ పోటీచేసే ముగ్గురు కూడా ఉద్దండులే. అభ్యర్థులను ముందుగా ప్రకటించడంతో ఎన్నిక ఆసక్తిగా మారింది.
కాంగ్రెస్ తరుఫున ఇప్పటికే మూడు సార్లు గెలిచిన శశిథరూర్ నాలుగో సారి బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో రెండోస్థానంలో నిలిచిన బీజేపీ రాజీవ్ చంద్రశేఖర్ ను నిలిపారు. ఈయన కార్పొరేట్ దిగ్గజం. ఎంటర్ పెన్యూనర్. కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. ఈయన పోటీకి దిగడం ఆసక్తి రేపుతోంది.
మూడో వ్యక్తి సీపీఐ రవీంద్ర తక్కువేం కాదు.. సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మాస్ లీడర్ గా పేరొందారు. ముగ్గురు ఉద్దండుల మధ్యన ఈ పోరు అందరిలో చర్చనీయాంశమైంది.
రాజీవ్ చంద్రశేఖర్ పోటీతో బీజేపీ బోణీ కొట్టబోతుందా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.