Bigg Boss 7 Telugu : బాటమ్ త్రీలో ఆ కంటెస్టెంట్స్… ఊహించనిది జరగబోతుందని షాక్ ఇచ్చిన నాగార్జున!

ఒక్కొక్కరు ముగ్గురు కంటెస్టెంట్స్ పేర్లు చెప్పి రీజన్ చెప్పాలి. శోభా ఇంకా ప్రశాంత్ తేజ టాస్క్ పరంగా వీక్ అని చెప్పారు.

Written By: NARESH, Updated On : October 7, 2023 10:05 pm
Follow us on

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ 7 నాలుగు వారాలుకు నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం కిరణ్ రాథోడ్,రెండో వారం షకీలా, మూడో వారం దామిని ఇక నాలుగో వారం రతిక ఎలిమినేట్ అయ్యారు. నలుగురు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వడం ఆశ్చర్యకరం.ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఉత్కంఠగా మారింది. హౌస్ లో ఉన్న పది మందిలో ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు.

ఈ రోజు ప్రోమోలో నాగార్జున కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ హౌస్ లో ఉన్న పది మందిలో ఎవరు అందరికంటే మోస్ట్ అన్ డిజర్వింగ్(అర్హత లేని వారు) అనుకుంటున్నారో చెప్పాలంటూ అడిగాడు.ఒక్కొక్కరు ముగ్గురు కంటెస్టెంట్స్ పేర్లు చెప్పి రీజన్ చెప్పాలి. శోభా ఇంకా ప్రశాంత్ తేజ టాస్క్ పరంగా వీక్ అని చెప్పారు.

గౌతమ్ ప్రతిదానికి రూల్ రూల్ అంటాడు అని శోభా అంటే, ప్రిన్స్ ఏ బిహేవియర్ ఐతే నచ్చలేదని అన్నాడో ఆ జోన్ లోకి వెళ్ళిపోయాడు అని అమర్ చెప్పాడు. అమర్ మనిషి పరంగా మంచోడే కానీ ఆట మాత్రం చాలా రాంగ్ గా ఆడుతున్నాడు అని శివాజీ రీజన్ చెప్పాడు. ఉన్నోళ్లని పట్టించుకోకుండా పేదోళ్ళని దగ్గరకు తీసుకున్నాడు అనే విధంగా మాట్లాడుతున్నాడు,ఈ బిహేవియర్ వల్ల హౌస్ లో అందరికి ఇబ్బందిగా ఉంటుంది అని తేజ,ప్రశాంత్ ,శుభాశీ చెప్పారు. అందరి నిర్ణయం విన్నాక నాగార్జున బాటమ్ త్రీ ఎవరో నేను రేపు చెప్తాను.మీరు అసలు ఊహించనిది రేపు జరగబోతుంది. గుర్తుపెట్టుకోండి థిస్ సీజన్ ఇస్ ఉల్టా పుల్టా అని చెప్పి ఆడియన్స్ లో టెన్షన్ పెంచేసాడు.

ఆదివారం మినీ లాంచింగ్ ఎపిసోడ్ జరగనున్న విషయం తెలిసిందే. 5 నుండి 7 గురు కొత్త కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తున్నారు. అదే సమయంలో ఇద్దరు ఎలిమినేట్ అవుతారని, ఒకరు సీక్రెట్ రూమ్ కి వెళతారని అంటున్నారు. మరొక ట్విస్ట్ ఏటంటే ఎలిమినేట్ అయిన దామిని, రతికా రోజ్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం కలదట. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అంబటి అర్జున్, పూజా మూర్తి. భోలే షామిలితో పాటు మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి.