Bigg Boss 7 Telugu : శోభా శెట్టి ఖాతాలో మరో కంటెస్టెంట్ బలి .. దత్త పుత్రిక కోసం బిగ్ బాస్ కుట్ర!

గౌతమ్ ఎలిమినేట్ అయితే... హౌస్లో 7 మంది మిగులుతారు. ఫినాలే అస్త్ర గెలిచిన అర్జున్ ఎలాగూ ఫైనల్ కి వెళ్ళాడు. ఇక ఫైనల్ లో ఉండే ఆ నలుగురు ఎవరో చూడాలి...

Written By: NARESH, Updated On : December 4, 2023 8:34 am
Follow us on

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్ 7 ఏమంటూ మొదలుపెట్టారో కానీ .. ఈ సీజన్ లో జరిగినన్ని అన్ ఫెయిర్ ఎలిమినేషన్స్ మరే సీజన్ లో జరగలేదు. బిగ్ బాస్ ప్రతి వారం లాగే తన దత్త పుత్రిక శోభా శెట్టి ని కాపాడుకునేందుకు మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని బయటకు తోసేశాడు. ఎప్పటిలానే జనాన్ని పిచోళ్ళని చేశాడు బిగ్ బాస్. ప్రతి వారం జనం ఓట్లు వేయడం .. వాటిని లెక్క చేయకుండా తమకు నచ్చిన వాళ్ళని బిగ్ బాస్ ఎలిమినేట్ చేయడం. ఇది చూసి ఆడియన్స్ బిగ్ బాస్ ని తిట్టిపోస్తున్నారు.

అయినా కూడా బిగ్ బాస్ అవేమీ పట్టించుకోవడం లేదు. తమ పని తాను చేసుకుంటూ పోతున్నాడు. దత్త పుత్రిక శోభా శెట్టి ని కాపాడుకునేందుకు ఈ వారం కూడా మరో కంటెస్టెంట్ ని బలి చేశాడని సమాచారం. దీన్ని బట్టి అర్థం అవుతుంది స్టార్ మా బ్యాచ్ పట్ల బిగ్ బాస్ ఎంత ఫేవరిజం చూపిస్తున్నాడో. అయితే ఎలిమినేషన్ ఎపిసోడ్ షూట్ పూర్తి కావడంతో శోభా కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన గౌతమ్ కృష్ణ ని ఎలిమినేట్ చేశారు అని తెలుస్తుంది.

అయితే ప్రశాంత్ దగ్గర అవిక్షన్ పాస్ ఉంది. దీని సాయంతో ఎలిమినేట్ అయిన వాళ్ళని సేవ్ చేయొచ్చు. కానీ ప్రశాంత్ గౌతమ్ కి తన పాస్ ఉపయోగించడం కష్టమే. ఎందుకంటే శివాజీ, గౌతమ్ కి అసలు పడటం లేదు. పైగా గత వారం గౌతమ్ ని నామినేట్ చేసిందే ప్రశాంత్. కాబట్టి గౌతమ్ కి ఎవిక్షన్ పాస్ వాడటం జరగని పని. అంతే కాకుండా ప్రశాంత్, గౌతమ్ మధ్య అంత బాండింగ్ కూడా లేదు.

ఈ నేపథ్యంలో గౌతమ్ ఎలిమినేషన్ తప్పదు. మరి చివరి క్షణంలో బిగ్ బాస్ ఏదైనా ట్విస్ట్ ఇస్తాడో .. లేక గౌతమ్ ని ఎలిమినేట్ చేసి ఇంటికి పంపేస్తాడో తెలియాల్సింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడట. గౌతమ్ ఎలిమినేట్ అయితే… హౌస్లో 7 మంది మిగులుతారు. ఫినాలే అస్త్ర గెలిచిన అర్జున్ ఎలాగూ ఫైనల్ కి వెళ్ళాడు. ఇక ఫైనల్ లో ఉండే ఆ నలుగురు ఎవరో చూడాలి…