నితిన్ తాజా చిత్రం ‘భీష్మ’ ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మహాశివరాత్రి కానుకగా(ఫిబ్రవరి 21) ‘భీష్మ’ మూవీ రిలీజైంది. నితిన్-రష్మిక జోడికి ప్రేక్షకులు ఫిదా అయి కలెక్షన్ల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ హిట్టు నిలిచిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి బరిలో నిలిచిన ‘సరిలేరునికెవ్వరు’, ‘అల..వైకుంఠపురములో’ తర్వాత భీష్మ ఆ రేంజ్ హిట్టు దక్కించుకుందన్న టాక్ విన్పిస్తుంది.
భీష్మ సాధించిన పది రోజుల కలెక్షన్స్ పరిశీలిస్తే నితిన్ కెరీర్లో ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిందని చెప్పొచ్చు.
నైజాంలో రూ.8.57కోట్లు
సీడెడ్లో రూ.3.13కోట్లు
ఉత్తరాంధ్రలో రూ.2.86 కోట్లు
ఈస్ట్ రూ.1.64 కోట్లు
వెస్ట్ రూ.1.21కోట్లు
గుంటూరులో 1.73కోట్లు
నెల్లూరులో రూ.0.72 కోట్లు
కృష్ణాలో రూ.1.44 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.1.88 కోట్లు
ఓవర్సీస్ రూ.3.10 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా రూ.26.28 కోట్లు కలెక్ట్ చేసినట్లు సమాచారం. అదేవిధంగా ‘బీష్మ’ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 22.7 కోట్ల బిజినెస్ జరిగింది.
భీష్మ చిత్రం కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు మంచి లాభాల బాట పట్టినట్లు తెలుస్తోంది. నితిన్ కెరీర్లో ‘భీష్మ’ బిగ్గెస్ట్ హిట్ నిలిచింది. ఈ మూవీకి దర్శకత్వం వహించిన వెంకీ కుడుములకు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ మూవీ తర్వాత వెంకీ కుడుములకు భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఈ మూవీ తర్వాత నితిన్ ‘అంధాదున్’ రీమేక్లో నటిస్తున్నాడు. ఈమూవీని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఇక హీరోయిన్ రష్మిక జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ నటించే మూవీల్లో ఎంపికైనట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ‘భీష్మ’ మూవీ డిస్ట్రిబ్యూటర్లకు కాసులవర్షం కురిపించడంతోపాటు నటీనటులకు మంచి అవకాశాలను తెచ్చిపెట్టింది.



రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య నెలకొన్న రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజనకు సంబంధించిన వివాదాల పరిష్కారంలో ఒక్కడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నా తెలంగాణ నుండి మద్యం అక్రమంగా ఏపీలో విస్తృతంగా అమ్మడానికి మాత్రం దోహదపడుతున్నది. ఎక్సైజ్ శాఖకు ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఉన్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.



సినిమా ఇండస్ట్రీలో దర్శకులు ఒక్క సినిమా అయినా మెగాస్టార్ చిరంజీవితో చేయాలని కలలు కంటుంటున్నారు. మెగాస్టార్ పిలుపు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తుంటారు. కొందరు డైరెక్టర్లకు ఆ అవకాశం వెంటనే వస్తే మరికొందరికీ చాలా ఏళ్లకు అవకాశం వస్తుంది. మరికొందరు డైరెక్టర్లు తమ కల నెరవేరకుండానే ఇండస్ట్రీని నుంచి తిరుగుముఖం పట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కు మెగాస్టార్ తో మూవీ చేసే అవకాశంచేసే అవకాశం వచ్చింది. అయితే ఈ డైరెక్టర్ తనకు దొరికిన బంపర్ ఆఫర్ ను వదలుకోవడం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక త్వరలోనే జరుగనుంది. బీజేపీ అధిష్టానం పార్టీ అధ్యక్షుడి ఎన్నికపై ఫోకస్ పెట్టడంతో స్థానిక సీనియర్ నేతలు సరికొత్త స్ట్రాటజీని అవలంబిస్తున్నారు. అధ్యక్ష పదవీ రేసులో ఉన్నవాళ్లతోపాటు పదవులపై ఆశలు పెట్టుకున్న వాళ్లంతా ఒకేవిధంగా ఆలోచిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.


మెగాస్టార్ చిరంజీవిని ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తాజాగా కలుసుకోవడం ఆసక్తిని రేపుతుంది. వీరిద్దరూ చాలాకాలం తర్వాత భేటి కావడం రాజకీయ, సీని వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చిరంజీవి, రఘువీరారెడ్డిలు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. కానీ అంత యాక్టివ్ గా కనిపించడంలేదు. ఈ క్రమంలోనే వారిద్దరు మళ్లీ రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
కరోనా పేరు చెబితేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. కరోనా దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుండగా మరోవైపు వేల సంఖ్యలో ప్రజలు తమ ప్రాణాలను పొగొట్టుకుంటున్నాయి. చైనాలో సోకిన కరోనా వైరస్ క్రమంగా 60దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా 90వేలకు పైగా కేసులు నమోదు కాగా 3వేలమంది మృత్యువాత పడినట్లు ప్రాథమిక సమాచారం. తాజాగా కరోనా వైరస్ ఇండియాకు చేరింది.








అటు దర్శకుడిగా ఇటు కొరియోగ్రాఫర్ గా అలానే హీరోగా కూడా మల్టీటాలెంట్స్ తో దూసుకుపోతున్న ‘ప్రభుదేవా’ తొలిసారిగా ఓ పోలీస్ గెటెప్ లో నటించిన పొన్ మానికవల్ అనే తమిళ చిత్రాన్ని తెలుగులో ‘కృష్ణమనోహర్ ఐ.పి.ఎస్’ పేరుతో మార్చి 6న విడుదల కానున్నది. ఈ చిత్రాన్ని పవనపుత్ర ప్రొడక్షన్స్ పతాకంపై యనమల సుధాకర్ నాయుడు సమర్పణలో ఆర్. సీతారామరాజు నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ప్రభుదేవకు జోడీగా డస్కీ బ్యూటీ నివేదా పేతురాజ్ నటిస్తోంది. ఇటీవలే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అల వైకుంఠపురములో నివేదా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో హీరో హీరోయిన్ తో పాటు బాహుబలి ప్రభాకర్, సురేష్ మీనన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 6న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మధ్య ప్రదేశ్ లో చాలా తక్కువ ఆధిక్యతతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం బిజెపి కర్ణాటకలో వలే `ఆకర్ష్ కమల్’ చేపట్టిందా? అవుననే అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్.
హీరోయిన్ చార్మి భారత్ లో కరోనా వైరస్ కేసులు నమోదవడాన్ని స్వాగతిస్తూ ఒక వీడియో పోస్టు చేసింది. దీంతో నెటిజిన్లు ఆమెపై మండిపడుతున్నారు. చార్మి వెకిలి చేష్టలపై నెటిజన్లు ట్రోల్ చేశారు. దీంతో తప్పు తెలుసుకున్న చార్మి వెంటనే వీడియోను డిలీట్ చేసింది. అప్పటికే చార్మికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.