స్థానిక ఎన్నికల సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ లో అధికార పక్షం విచ్చలవిడిగా దౌర్జన్యకాండకు పాల్పడటం, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం, రాష్ట్ర ఎన్నికల కమీషన్ పట్టించుకొనక పోవడం, అనేక చోట్ల ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్ కూడా వేయకుండా అడ్డుకొని పలుచోట్ల ఏకగ్రీవ ఎన్నికలు జరుపుకోవడం పట్ల జనసేన, బీజేపీ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
రాష్ట్రంలో క్షీణిస్తున్న పరిస్థితులు బీహార్ ను తలపిస్తున్నాయని మండి పడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న దౌర్జన్యకర పరిస్థితులపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు, రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. రాజకీయాలను నేరమయం కావించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
”151 సభ్యులుండి వీరెందుకు భయపడుతున్నారో.. ఇలా దౌర్జన్యంగా వ్యవహరించేటప్పుడు రాష్ట్ర న్నికలు ఎందుకు పెట్టాలి ? ” అని పవన్ కళ్యాణ్ ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. కొంతమంది పోలీసులు వైసిపి కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
భయపెట్టి సాధించుకునే గెలుపు ఎప్పుడూ నిలబడదన్నారు. దౌర్జన్యాలకు, బెదిరింపులకు లొంగకుండా ఏకగ్రీవం కోసమే అయితే ఇసి ఎందుకు.. ఎన్నికల తంతు ఎందుకు.. అని పవన్ ప్రశ్నించారు. 13 జిల్లాలోనూ ఇంత హింసను ఎన్నడూ చూడలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
నియంతృత్వానికి తోడు ఫ్యాక్షనిజం తోడైందని కన్నా మండిపడ్డాయిరు. మండలాఫీసుల నుండి పోలీసుల సహకారంతో నామినేషన్ పత్రాలను లాక్కెళ్లడం, చింపేయడం, చివరికి ఆర్ఒ ల వద్ద కూడా నామినేషన్ల కాగితాలను చింపేయడం .. తన 47 ఏళ్ల రాజకీయ జీవితంలో మొట్టమొదటిగా చూడటం అని విస్మయం వ్యక్తం చేశారు.
ఏకగ్రీవాల కోసం వైసిపి దాడులకు పాల్పడుతోందని కన్నా విమర్శించారు. వైసిపి దాడుల్ని తప్పించుకొని నామినేషన్లు వేస్తే స్క్రూటినీలో తీసేస్తున్నారని, పోలీసులు కొందరు రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు.
చిత్తూరులో బిజెపి నేతలపై దాడులు చేశారని తెలిపారు. దుర్గి ఎస్సై రౌడీలా వ్యవహరించారని విమర్శించారు. ఎలక్షన్ కమీషన్ పరిధిలో ఉన్న అధికారాన్ని కూడా ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు.




మధ్య ప్రదేశ్లో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కమల్ నాథ్ వచ్చే సోమవారమే, ఈ నెల 16న బలపరీక్ష జరిపేటట్లు చేయాలను బిజెపి పట్టుబడుతున్నది. రెండ్రోజుల క్రితం మాజీ కేంద్రమంత్రి జ్యోతినాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పడంతో.. ఆయనకు మద్దతుగా పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.






సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కొత్త మూవీ గురువారం ప్రారంభమైంది. ఈ మూవీ ప్రారంభోత్సవానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాయాధరమ్ తేజ్ పై క్లాప్ కొట్టి మూవీని ప్రారంభంచారు. దర్శకుడు దేవకట్టా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇంటెన్స్ పొలిటికల్ బ్యాక్డ్రాప్తో ఈ మూవీని దేవకట్టా తెరకెక్కిందును ప్లాన్ చేస్తున్నాడు. సాయితేజ్ కు జోడీగా నివేదా పేతురాజ్ నటిస్తుంది.

ఇండియాలో రాజ్ కపూర్ ఫామిలీ తరవాత ఎక్కువ మంది హీరోలు ఉన్నది మెగాస్టార్ ఫ్యామిలీలోనే …అందుకే వీరిని క్రికెట్ టీం అంటూ మీడియా లో ప్రస్తావిస్తుంటారు. మెగా ఫామిలీ లో మెజారిటీ హీరోలు సక్సెస్ అయిన నేపథ్యంలో వారి ఉనికి కి ఒక ప్రత్యేకత వచ్చింది. ఐతే .వీరిలో అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ ఇప్పటిదాకా నిలదొక్కుకోలేకపోవడమే ఒకింత వెలితిగా అనిపిస్తుంటుంది.
మాస్ మహా రాజా రవితేజ కొత్తగా ఏదైనా ట్రై చేద్దామనుకున్న ప్రతిసారీ ఫెయిల్యూర్ చవిచూశాడు. నా ఆటోగ్రాఫ్ , శంభో శివ శంభో , ఆ అబ్బాయి చాలా మంచోడు, నేనింతే లాంటి డిఫరెంట్ చిత్రాలు చేసి అపజయాల్ని మూటగట్టుకున్నాడు. ఇటీవలే ‘డిస్కో రాజా’ అంటూ డిఫరెంట్ మూవీ చేస్తే అది కాస్తా రవితేజ కెరీర్ లోనే పెద్ద డిజాస్టర్ అయింది. ఆ దెబ్బతో ఇక తన స్టయిల్లోనే పక్కా మాస్ మసాలా సినిమాలు చేయాలని ఫిక్సయిపోయాడు రవితేజ. అందులో భాగంగానే గోపీచంద్ మలినేనితో ‘క్రాక్’ అనే సినిమా చేసాడు. ఇటవలే విడుదలైన దీని టీజర్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.కాగా ఈ చిత్రం 2016 వచ్చిన తమిళ సూపర్ హిట్ ‘సేతుపతి’కి రీమేక్ అని వినికిడి..ఇక దీని తర్వాత రవి తేజ చేయబోయే మరో సినిమా కూడా తమిళ రీమేకే అని తెలుస్తోంది.


2017 లో వచ్చిన మెంటల్ మదిలో చిత్రం తో తెలుగు నాట కాలు మోపిన తమిళ పొన్ను నివేథ పేతురాజ్ టాలీవుడ్ లో మెల్ల మెల్లగా తన స్థానాన్ని పదిల పరుచు కొంటోంది. తెలుగు ప్రేక్షకులకు మెంటల్ మదిలో చిత్రంతో పరిచయం అయిన ఈ అమ్మడు గత ఏడాది చిత్రలహరి ఇంకా బ్రోచేవారెవరు రా అనే చిత్రాల్లో నటించి మెప్పించింది. అందంతో పాటు అద్బుతమైన అభినయ ప్రతిభ ఉన్న నాయిక గా నివేథ పేతురాజ్ కు పేరొచ్చింది. అందుకే నివేద పేతురేజ్ కి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన అల వైకుంఠపురంలో సినిమాలో రెండవ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు.

ఒక వంక పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు చేయడంతో మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్ధకరమైన సమయంలోనే హడావుడిగా కర్ణాటకలో పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్లో ట్రబుల్ షూటర్గా పేరొందిన డీకే శివకుమార్ను ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నియమించారు

