
రాష్ట్ర రాజధాని తరలింపునకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. కార్యనిర్వాహక రాజధానిగా చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో విశాఖ నగరంలో సీఎంఓ, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి స్థల పరిశీలన చేయడం చర్చనీయాంశంగా మారింది. సీఎంఓ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, సెంట్రల్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ (సీఈపీటీ) ప్రెసిడెంట్ బిమల్ పటేల్ కలిసి విశాఖ సాగర తీరంలోని పలు ప్రాంతాలను సందర్శించారు.
రాజధానిని తరలించేందుకు ఖరారు చేసిన రెండు ముహుర్తాలు కరోనా కారణంగా దాటిపోయాయి. శార్వారి నామ ఉగాది, మే 28వ తేదీలు రాజధానిని విశాఖ తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమైనా కరోనా ఉధృతి, లాక్ డౌన్ వల్ల వెనక్కి తగ్గింది. ఏదేమైనా రాజధాని తరలించాలని సీఎం జగన్ పట్టుదలతో ఉన్నారు. వైసీపీ నేతల రాజధాని విషయంలో చేసిన వ్యాఖ్యలలో ఇదే విషయం స్పష్టమవుతోంది. అక్టోబర్ నెలలో విజయదశమి రోజున తరలించేందుకు తాజాగా ముహూర్తం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ ముహూర్తాన్ని విశాఖ సరదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి నిర్ణయించారని వాదనలు ఉన్నాయి.
మరోవైపు రాజధాని తరలింపు విషయంలో రైతులు దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో విచారణ లో ఉంది. పాలనా వికేంద్రీకరణ బిల్లుకు అనుమతి లభించే వరకూ రాజధాని తరలించమని ప్రభుత్వం కోర్టుకు వివరించింది. ఈ క్రమంలో కోర్టులో వ్యవహారం తేలే వరకూ వేచి ఉండకుండా ప్రభుత్వం విశాఖలో రాజధానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటూ పోతుంది. ఇప్పటికే సీఎంఓ కార్యాలయ ఫర్నిచర్ విశాఖ నగరానికి తరలించి భద్రపరిచారు. ఇప్పుడు శాశ్వత భవనాలకు స్థల పరిశీలనలతో రాజధాని తరలింపులో ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదని స్పష్టమవుతోంది.














యంగ్ హీరో ఆకాష్ పూరి హీరోగా చేస్తోన్న కొత్త సినిమా ‘రొమాంటిక్’. లాక్ డౌన్ కు ముందు గోవాలో లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాలో సీనియర్ హాట్ బ్యూటీ రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే రమ్యకృష్ణ, ఆకాష్ పూరి తల్లి పాత్రలో నటిస్తోందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోన్న కేతిక శర్మకి తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తోందట. అంటే సినిమాలో ఆకాష్ పూరికి రమ్యకృష్ణ అత్తగా కనిపించబోతుంది అన్నమాట. గతంలో రమ్యకృష్ణ ఎన్టీఆర్ కి అత్తగా కనిపించింది. అలాగే నాగచైతన్యకి అల్లరి నరేష్ కు కూడా రమ్యకృష్ణ మోడ్రన్ అత్తగా కనిపించి అలరించింది. ఇప్పుడు ఆకాష్ పూరి వంతు వచ్చింది.
వైసీపీ ఆధ్వర్యంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇటీవలే ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఈ సందర్భంగా ‘విధ్వంసానికి ఒక్క చాన్స్’ పేరుతో ఏడాది పాలనపై చార్జి షీట్ ను రూపొందించింది. ఈ పుస్తకాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విడుదల చేశారు. మంగళగిరి లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాదిలో జగన్ సాధించినవి నవ మోసాలు, నవ భారాలు, నవ స్కామ్ లు, నవ అబద్ధాలు, నవ రాజ్యాంగ ధిక్కరణలు, నవ మానవ హక్కుల ఉల్లంఘనలు, నవ మళ్లింపులు అని చెప్పారు.














