Home Blog Page 8457

ప్రవీణ్ ప్రకాష్ విశాఖ పర్యటనకు కారణం ఇదే..!


రాష్ట్ర రాజధాని తరలింపునకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. కార్యనిర్వాహక రాజధానిగా చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో విశాఖ నగరంలో సీఎంఓ, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి స్థల పరిశీలన చేయడం చర్చనీయాంశంగా మారింది. సీఎంఓ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, సెంట్రల్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ (సీఈపీటీ) ప్రెసిడెంట్ బిమల్ పటేల్ కలిసి విశాఖ సాగర తీరంలోని పలు ప్రాంతాలను సందర్శించారు.

రాజధానిని తరలించేందుకు ఖరారు చేసిన రెండు ముహుర్తాలు కరోనా కారణంగా దాటిపోయాయి. శార్వారి నామ ఉగాది, మే 28వ తేదీలు రాజధానిని విశాఖ తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమైనా కరోనా ఉధృతి, లాక్ డౌన్ వల్ల వెనక్కి తగ్గింది. ఏదేమైనా రాజధాని తరలించాలని సీఎం జగన్ పట్టుదలతో ఉన్నారు. వైసీపీ నేతల రాజధాని విషయంలో చేసిన వ్యాఖ్యలలో ఇదే విషయం స్పష్టమవుతోంది. అక్టోబర్ నెలలో విజయదశమి రోజున తరలించేందుకు తాజాగా ముహూర్తం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ ముహూర్తాన్ని విశాఖ సరదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి నిర్ణయించారని వాదనలు ఉన్నాయి.

మరోవైపు రాజధాని తరలింపు విషయంలో రైతులు దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో విచారణ లో ఉంది. పాలనా వికేంద్రీకరణ బిల్లుకు అనుమతి లభించే వరకూ రాజధాని తరలించమని ప్రభుత్వం కోర్టుకు వివరించింది. ఈ క్రమంలో కోర్టులో వ్యవహారం తేలే వరకూ వేచి ఉండకుండా ప్రభుత్వం విశాఖలో రాజధానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటూ పోతుంది. ఇప్పటికే సీఎంఓ కార్యాలయ ఫర్నిచర్ విశాఖ నగరానికి తరలించి భద్రపరిచారు. ఇప్పుడు శాశ్వత భవనాలకు స్థల పరిశీలనలతో రాజధాని తరలింపులో ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదని స్పష్టమవుతోంది.

ఆదాయం కోసం పార్న్ స్టార్ గా మారిన కార్ రేసర్


ఆస్ట్రేలియాకు చెందిన రేనీ గ్రేసీ(25) తొలి మహిళా సూపర్ కార్ రేసర్ గా గుర్తింపు తెచ్చుకుంది. గ్రేసీ 1998 సంవత్సరం నుంచి పూర్తి స్థాయి రేసర్ గా మారింది. కార్ రేసింగ్ లో ఛాంపియన్ షిప్ సాధించడంతోపాటు చిన్నతనంలో ఎన్నో రికార్డులను కొల్లగొట్టింది ఈ అమ్మడు. చూపు తిప్పుకోలేని అందం.. సూపర్ టాలెంట్ తో గ్రేసీ కొద్దికాలంలోనే కార్ రేసర్ గా పాపులర్ అయింది. కొన్నాళ్లపాటు కార్ రేసర్ గా రాణించిన ఈ అమ్మడి ఫార్మమెన్స్ 2017 నుంచి దిగజారడం మొదలైంది. కెరీర్ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవడంతోపాటు ఆర్థిక సమస్యలు తోడయ్యాయి. దీంతో గ్రేసీ చివరకు కార్ యార్డ్ లో పని చేయాల్సి వచ్చింది. దీంతో వల్ల పెద్దగా ఆదాయం లేకపోవడంతో ఆమె కార్ రేసింగ్ గుడ్ బై చెప్పి కొత్త కెరీర్ ఎంచుకుంది.

మాజీ రేసర్ గా మారిన గ్రేసీ ప్రస్తుతం పార్న్ స్టార్ అవతారమెత్తి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఒక రోజు ఓన్లీ ఫ్యాన్స్ అనే అడల్ట్ వెబ్ సైట్ చూశాక తన కొత్త కెరీర్ ఏంటో అర్థం చేసుకుందట. ఆ వెంటనే తన నగ్న చిత్రాలు, వీడియోలను ఆ వెబ్ సైట్లో పోస్టు చేయడంతో తొలి వారంలో రెండున్నర లక్షల ఆదాయం వచ్చిందంట. దీంతో తన ఆర్థిక సమస్యలు కొంతమేర తగ్గిపోవడంతో పూర్తిస్థాయిలో పోర్న్ స్టార్ గా మారాలని అనుకుందట. తన జీవితంలో చేసిన ఏదైనా మంచి పని ఉందంటే అది పోర్న్ స్టార్ గా మారడమేనని గ్రేసీ గర్వంగా చెబుతోంది. క్రేజీ పోర్న్ స్టార్ గా మారడమే తన లక్ష్యమని గ్రేసీ చెబుతుండటం గమనార్హం. అయితే ఈ భామ ఆదాయం కోసం పోర్న్ స్టార్ గా మారడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. అయితే వీటన్నింటిని గ్రేసీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతుండటం విశేషం.

హీరో కంటే  విలనే హైలైట్ అవుతాడట !

sanjay-dutt-kgf2-oktelugu

sanjay-dutt-kgf2-oktelugu

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా షార్ప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన `కేజీఎఫ్ చాప్టర్– 1` సృష్టించిన సంచలనాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుత‌ వసూళ్లు సాధించి పాన్ ఇండియా సినిమా అయింది.  ఇక ఈ చిత్రంలో ప్రధానమైన ప్రతినాయకుడి పాత్ర అధీరా కోసం బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ను ఎంచుకున్న సంగతి తెలిసిందే.  దీంతో సినిమా పై  హైప్ మరింత పెరిగింది.  ప్రశాంత్ నీల్ సినిమాను పార్ట్ 1 కంటే భీభత్సమైన రీతిలో తెరకెక్కిస్తున్నాడు, బడ్జెట్ ను కూడా ఆ స్థాయిలొనే ఖర్చు పెడుతున్నాడు.  ఇక సంజయ్ దత్ కి సంబంధించిన పార్ట్ ను  ఇప్పటికే షూట్ చేశారు. అయితే దానికి ఎడిటింగ్ కూడా పూర్తయిందట.  సంజయ్ దత్  సీన్స్ అన్ని అద్భుతంగా వచ్చాయని.. సినిమా మొత్తంలోనే  అధీరా క్యారెక్టర్ ప్రత్యేకంగా ఉంటుందని.. ‘యశ్’ కంటే కూడా సంజయ్ దత్ నే హైలెట్ అవుతాడని కోలీవుడ్ మీడియాలో టాక్ నడుస్తోంది.

కాగా హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తోంది. యావత్తు భారతదేశం ఎదురు చూస్తున్న కొన్ని మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఈ సినిమా కూడా ఒకటనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటి పార్ట్ బంపర్ హిట్ కావడంతో ఈ చిత్రం కోసం అన్ని భాషల ఇండస్ట్రీ ప్రేమికులు కూడా గట్టిగానే ఎదురు చూస్తున్నారు.  ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ అయితే ఈ సినిమా పై పెట్టుకున్న అంచనాలు అన్ని ఇన్ని కావు. ఈ సీక్వెల్ లో తొలి భాగాన్ని మించి భారీ యాక్ష‌న్ ని చూపించ‌నున్నారు ప్రశాంత్ నీల్.

 ఇక కేజీఎఫ్ అనగా కోలార్ బంగారు గ‌నులు. ద‌శాబ్ధాల క్రితం కోలార్ బంగారు గ‌నుల్లో మాఫియా క‌థతో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. కేజీఎఫ్   గ‌నుల‌ పై ప్ర‌పంచ మాఫియా క‌న్ను ఎలా ఉండేది అన్న‌ దానిని తొలి భాగంలోనే ప్రశాంత్ అద్భుతంగా రివీల్ చేశారు. పార్ట్ 2లో ఇంకా భీక‌ర మాఫియాని ప‌తాక స్థాయిలో చూపించ‌నున్నారు.

జేసీ రెడ్డప్పను వదలనంటున్న జగన్


వదల బొమ్మాళీ.. వదలా.. అని ‘అరుంధతి’ సినిమాలో విలన్ హీరోయిన్ అనుష్కను అన్నట్టే.. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ సైతం.. తన రాజకీయ ప్రత్యర్థి.. అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని వదలడం లేదు. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబుతో జట్టుకట్టి వైఎస్ జగన్ పై దారుణ విమర్శలు చేసిన జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు అనుభవిస్తున్నాడని పొలిటికల్ సర్కిల్స్ లో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.

జేసీ దివాకర్ రెడ్డి ప్రధాన బిజినెస్ అయిన జేసీ ట్రావెల్స్ పై సీఎం జగన్ అధికారంలోకి ఎక్కగానే దెబ్బకొట్టారు. ఆయన బస్సుల అక్రమాలు నిగ్గుతేల్చి సీజ్ చేశారు. అనంతరం రాజకీయంగానూ ఆయనను చావుదెబ్బ తీశారు. అనంతపురంలో కోలుకోకుండా దెబ్బేశారు. అనంతపురం మాజీ ఎంపీ జేసీ వర్గానికి జగన్ చెక్ పెట్టారు. తాడిపత్రిలో బలమైన నాయకుడిగా ఉన్న షబ్బీర్ అలీని వైసీపీలో చేర్చుకున్నారు. షబ్బీర్ అలీతోపాటు పలువురు అనుచరులు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. మొత్తం 500 మంది ఎమ్మెల్యే పెద్దారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ప్రధాన అనుచరుడే పార్టీ మారడం జేసీ బ్రదర్స్ ను కోలుకోనీయకుండా చేసింది. ఇదంతా జగన్ ప్లాన్ కావడం.. అనంతపురంలో జేసీ పునాదులు కదిల్చే పని కావడంతో జేసీకి షాక్ తగిలింది.

అక్రమంగా చేస్తున్న జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్ బస్సులపై ఉక్కుపాదం మోపారు. తాడిపత్రిలో జేసీ లారీ వ్యాపారాలకు సైతం చెక్ పెట్టారు. ఇప్పుడు నేతలను లాగుతూ వారిని అష్టదిగ్భంధనం చేస్తున్నారు. జగన్ దెబ్బతో జేసీ జిల్లాలో ఒంటరిగా మిగిలిపోయే ప్రమాదంలో పడ్డారు.

ఇప్పటికే జేసీ ట్రావెల్స్ బస్సులను భారీగా సీజ్ చేసి ఆయన వ్యాపారాన్ని దెబ్బకొట్టిన సీఎం జగన్.. తాజాగా సోమవారం జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. జేసీకి చెందిన 76 వాహనాల రిజిస్ట్రేషన్లను అధికారులు రద్దు చేశారు. బీఎస్3 వాహనాలను నకిలీ డాక్యుమెంట్లతో బీఎస్4గా మార్పు చేసి రిజిస్ట్రేషన్ చేయించినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 154 వాహనాలకు నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు సమర్పించినట్లు అధికారుల విచారణలో తేలింది. 60 వాహనాలను రవాణా అధికారులు సీజ్ చేశారు. మిగతా 94 వాహనాలను జేసీ బ్రదర్స్ అజ్ఞాతంలో దాచిపెట్టారు. వాటిలో నాలుగు లారీలను బస్సులుగా మార్చి తిప్పుతున్నట్లు అధికారులు గుర్తించారు.

ప్రయాణికుల జీవితాలతో జేసీ ట్రావెల్స్ చెలగాటం ఆడిందని అనంతపురం డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ శివరాంప్రసాద్ తెలిపారు. స్క్రాప్ కింద కొన్న బస్సులు, లారీలను రోడ్లపై నడపడం దారుణమన్నారు. జేసీ కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశామని.. ఫోర్జరీ వ్యవహారంపై నివేదిక అందజేసినట్లు పేర్కొన్నారు.

ఇలా జేసీ బ్రదర్స్ ను అష్టదిగ్బంధనం చేసేలా జగన్ పంతం పట్టారు. ఇంటా బయటా ఆయన వ్యాపారాలను, రాజకీయ బలాన్ని జగన్ టార్గెట్ చేసి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

-నరేశ్ ఎన్నం

కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం..


లాక్డౌన్ కారణంగా టాలీవుడ్లో సుమారు మూడునెలలుగా షూటింగులు వాయిదా పడగా, థియేటర్లు మూసివేసిన సంగతి తెల్సిందే. కేంద్రం ఇటీవల అన్ని రంగాలకు షరతులతో కూడిన పర్మిషన్ ఇస్తుండటంతో షూటింగులు, థియేటర్లు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీని పెద్దలు ప్రభుత్వాన్ని విజ్క్షప్తి చేశారు. ఈమేరకు ప్రముఖులు పలుసార్లు సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి త్వరలో షూటింగులు ప్రారంభమయ్యేలా చర్చించారు. చిత్రసీమను నమ్మకొని వేలాది మంది కార్మికులు జీవిస్తున్నారని షూటింగులు ప్రారంభమైతేనే వారికి ఉపాధి దొరకుతుందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా టాలీవుడ్లో నెలకొన్న సమస్యలను కేసీఆర్ ను వివరించగా ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రగతిభవన్లో నేడు సుదీర్ఘంగా సమీక్షలు నిర్వహించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సినిమా, టీవీ షూటింగులకు సంబంధించిన అనుమతి ఇస్తూ సంతకం చేశారు.

టాలీవుడ్లో షూటింగుల సందడి షూరు..
ముఖ్యమంత్రి కేసీఆర్ సినిమా, టీవీ సీరియల్స్ సంబంధించి నేడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొవిడ్-19 మార్గదర్శకాలు, లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ షూటింగ్‌లు నిర్వహించుకునేలా తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పరిమిత సంఖ్యలో సిబ్బంది షూటింగ్‌లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. సినీ పెద్దలతో జరిగిన మీటింగుల్లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ సినిమాలకు సంబంధించి పోస్టు ప్రొడక్షన్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదేవిధంగా షూటింగులకు సంబంధించి మార్గదర్శకాలను తయారుచేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులను ఆదేశించిన సంగతి తెల్సిందే. తాజాగా సీఎం కేసీఆర్ ఇందుకు సంబంధించిన జీవోపై సంతకం చేయడంతో టాలీవుడ్లో షూటింగుల సందడి మొదలు కానుంది.

థియేటర్ల పరిస్థితి ఏంటీ?
తాజాగా సీఎం కేసీఆర్ సినిమా, టీవీలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అయితే థియేటర్లు తెరిచేందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. దీంతో థియేటర్లు ఎప్పుడు తెరుస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఇప్పట్లో వీటికి అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. థియేటర్ల ఓపెనింగ్ కు మరి కొన్ని రోజులు ఆగాల్సిందేనని చెబుతున్నారు. సినిమా, టీవీ షూటింగులకు అనుమతి లభించడంతో టాలీవుడ్లోని ఓ వర్గం సంతోషం వ్యక్తం చేసింది. మరోవైపు థియేటర్లకు అనుమతి లభించకపోవడంతో కొంచెం కష్టంగా మారిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా రెండున్నర నెలలుగా నిలిచిపోయిన సినిమా, టీవీ షూటింగులు తిరిగి ప్రారంభం కానుండటంతో సినీ పెద్దలు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా అనంతరమైనా… మన స్టార్లు స్పీడ్ పెంచాలి !


అసలు మన స్టార్ హీరోలు ఎంత స్పీడ్ పెంచినా సంవత్సరానికి చేసేదే ఒక్క సినిమా. నిజానికి ఫలానా స్టార్ హీరో నుండి సంవత్సరానికి ఆ ఒక్క మూవీ కూడా కచ్చితంగా వస్తుందని నమ్మకంగా చెప్పలేని పరిస్థితిలో టాలీవుడ్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కరోనా వచ్చింది. దాంతో సినిమాలు ఇంకా ఆలస్యం కానున్నాయి. అయితే కరోనా ప్రభావం తగ్గాక మన స్టార్స్ స్పీడ్ పెంచాలి. ఆ రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్‌ బాబు లాంటి మేటి హీరోలంతా జయాపజయాలకు అతీతంగా సంవత్సరానికి ఐదు నుండి ఎనిమిది సినిమాల్లో నటించేవాళ్ళు. సూపర్ స్టార్ కృష్ణ అయితే ఓ ఏడాదిన ఏకంగా పదిహేను సినిమాలకు పైగానే చేశారట. ఒక్క కృష్ణనే కాదు అప్పటి హీరోలందరూ రోజుకి మూడు నుంచీ నాలుగు కాల్షీట్లు ఇచ్చేవాళ్లు, అలాగే పనిచేసేవాళ్లు .

కానీ ఇప్పటి స్టార్స్‌ గ్యాప్ లేకుండా రోజుకి ఒక్క కాల్షీట్‌ కూడా ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నారనేది వాస్తవం. కానీ పెద్ద హీరోలు ఎక్కువ చిత్రాలు చెయ్యడం వల్ల మూస ధోరణికి బ్రేక్‌ వేస్తూ.. స్టార్ల అనే రొటీన్ ఇమేజ్‌ చట్రాల మధ్య నలిగిపోకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల అభిరుచులను అందుకుని అందర్నీ ఆకట్టుకోవచ్చు. సినిమా సినిమాకి ఫ్యాన్స్ ను పెంచుకోవచ్చు. సీనియర్ ఎన్టీఆర్ ఇలానే చేశారు. ‘పాతాళ భైరవి’ లాంటి ఆల్ టైం మాస్ ఫిల్మ్ చేసాక కూడా.. ‘పిచ్చి పుల్లయ్య’ ‘కలసి ఉంటే కలదు సుఖం’ లాంటి అచ్చ కుటుంబ కథా సినిమాలతో వెండి తెర పై పచ్చని తెలుగు దనాన్ని అద్దారు.

అలాగే ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు తదితర స్టార్‌ లంతా ఎక్కువ సినిమాలు చెయ్యడం వల్లే విభిన్నమైన పాత్రల్లో అద్భుతమైన చిత్రాల్లో నటించి తమకంటూ ఒక బాణీని ఏర్పర్చుకోగలిగారు. అందుకే అప్పటి హీరోల్లో ప్రతి ఒక్కరికి తమకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్ ఉంది. మరి ఇప్పటి హీరోల్లో ఆ శైలి, ఆ స్టైల్ ఉందా..? వాస్తవం మాట్లాడుకుంటే సగంమందిది ఒకటే బాణీ కదా. అందుకే ప్రతి స్టార్ హీరో ఎక్కువ సినిమాలు చేస్తే బాగుంటుంది.

లాక్ డౌన్ గ్యాప్ లో విజయ్ దేవరకొండ వర్కౌట్స్ !


డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చాల కాలం తరువాత ఇస్మార్ట్ శంకర్ మూవీతో భారీ విజయాన్నే నమోదు చేసి ప్రస్తుతం తన తరువాత సినిమాని సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో చేస్తోన్నాడు. కాగా తెలంగాణ ప్రభుత్వం షూటింగ్ కి పర్మిషన్ ఇవ్వడంతో షూట్ రెడీ అవుతొంది ఫైటర్ టీమ్. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా జూలై 20 నుండి మొదలుకానుందని, ఆ షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్స్ తియనున్నారని తెలుస్తోంది.

ఇక ఈ చిత్రం ఓ డాన్ అతని కొడుకుకి మధ్య నడుస్తోందని.. డాన్ కొడుకుగా విజయ్ దేవరకొండ నటిస్తున్నాడని.. అయితే విజయ్ దేవరకొండ డాన్ కొడుకుగా కేవలం పదిహేను నిముషాల ప్లాష్ బ్యాక్ స్టోరీలో మాత్రమే కనిపిస్తాడని.. ఆ తరువత చాల భాగం డాన్ కి వ్యతిరేకంగా పని చేస్తుంటాడని సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

కాగా లాక్ డౌన్ తో వచ్చిన గ్యాప్ లో విజయ్ దేవరకొండ తన పాత్ర కోసం కొన్ని వర్కౌట్స్ చేశాడట. విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. అందుకే ఈ సినిమా కోసం బాగా కష్ట పడుతున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి. ఇక ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యారు.

మరోసారి మోడ్రన్ అత్తగా సీనియర్ హాట్ బ్యూటీ !

యంగ్ హీరో ఆకాష్ పూరి హీరోగా చేస్తోన్న కొత్త సినిమా ‘రొమాంటిక్’. లాక్ డౌన్ కు ముందు గోవాలో లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాలో సీనియర్ హాట్ బ్యూటీ రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే రమ్యకృష్ణ, ఆకాష్ పూరి తల్లి పాత్రలో నటిస్తోందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోన్న కేతిక శర్మకి తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తోందట. అంటే సినిమాలో ఆకాష్ పూరికి రమ్యకృష్ణ అత్తగా కనిపించబోతుంది అన్నమాట. గతంలో రమ్యకృష్ణ ఎన్టీఆర్ కి అత్తగా కనిపించింది. అలాగే నాగచైతన్యకి అల్లరి నరేష్ కు కూడా రమ్యకృష్ణ మోడ్రన్ అత్తగా కనిపించి అలరించింది. ఇప్పుడు ఆకాష్ పూరి వంతు వచ్చింది.

ఏమైనా ఇలాంటి అత్త పాత్రలను చేయడంలో ఈ జనరేషన్ లో రమ్యకృష్ణను మించినోళ్లు లేరనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో వస్తోన్న ఈ ‘రొమాంటిక్’ సినిమా నుండి ఆ మధ్య విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ బాగా వైరల్ అయింది. హీరోయిన్ కేతిక టాప్ లెస్ గా హీరోని కౌగిలించుకోవడం.. ఘాడమైన ప్రేమలో ప్రపంచాన్ని మర్చిపోయిన ప్రేమ జంటగా వీరిద్దరూ కనిపించడంతో పోస్టర్ యూత్ ను బాగా ఆకట్టుకోవంతో పాటు సినిమా పై కూడా అంచనాలను పెంచేసింది.

ఇక ఈ సినిమా మాఫియా నేపథ్యంలో జరిగే ఓ ప్రేమ కథగా తెరకెక్కుతుంది. మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందేమో చూడాలి. ఈ రొమాంటిక్ మూవీలో బాలీవుడ్ నటి మందిరా బేడీ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే మరో హిందీ నటుడు మకరంద్ దేశ్ పాండే కూడా మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఏడాది పాలనపై చార్జి షీట్ విడుదల..!

వైసీపీ ఆధ్వర్యంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇటీవలే ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఈ సందర్భంగా ‘విధ్వంసానికి ఒక్క చాన్స్’ పేరుతో ఏడాది పాలనపై చార్జి షీట్ ను రూపొందించింది. ఈ పుస్తకాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విడుదల చేశారు. మంగళగిరి లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాదిలో జగన్ సాధించినవి నవ మోసాలు, నవ భారాలు, నవ స్కామ్ లు, నవ అబద్ధాలు, నవ రాజ్యాంగ ధిక్కరణలు, నవ మానవ హక్కుల ఉల్లంఘనలు, నవ మళ్లింపులు అని చెప్పారు.

వైసీపీ ఏడాది పాలనలో స్కామ్ ల గురించి మాట్లాడాలంటే ఇంకో సంవత్సరం పడుతుందన్నారు. రోడ్డుపై పేద ప్రజలు ఏడుస్తుంటే జగన్ రెడ్డి మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లో సంబరాలు చేసుకున్నారని తెలిపారు. వైసీపీ నేతలు, కార్యకర్తలే వారి పార్టీ గురించి మాట్లాడుతున్నారని, ఇంత దారుణమైన, పనికి మాలిన పాలన చూడలేదంటున్నారని చెప్పారు. రాష్ట్రమంతా కుంభకోణాలు, అరాచకాలే. వైసీపీ సారా అక్రమాలపై పై స్వయంగా స్పీకరే చెప్పారు. వైసీపీ ఏడాది పాలనలో 564మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. 64 లక్షలమందికి రైతు భరోసా అని 45 లక్షలకు కుదించారని, అవ్వా తాతలకు వెయ్యి పెన్షన్ పెంచుతానని చెప్పి కేవలం రూ. 250 పెంచారన్నారు.

ఏపీలో జగన్ రెడ్డి మద్యం దుకాణాలు చూస్తున్నామని, చీప్ లిక్కర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా జగన్ పనిచేస్తున్నారని తెలిపారు. అమ్మఒడి అర్ధఒడిగా మారింది. 83 లక్షలమంది పిల్లలకు అమ్మఒడి అని చెప్పి 43 లక్షలమందికి మాత్రమే ఇచ్చారు. నేడు ట్రాక్టర్ ఇసుక 10,000 లారీ ఇసుక 50,000 వీరి ధన దాహం వల్ల 60 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, 40 లక్షలమంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ కొడుతోందన్నారు. సొంత బాబాయి చనిపోతే సీబీఐ విచారణ జరిపించలేకపోయారని, మీరు చేసిన దారుణాలు బయటపడతాయనేగా కేసు విషయంలో ముందుకెళ్లడం లేదని విమర్శించారు.

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు..


పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించడం కష్టంగా మారడంతో ప్రభుత్వం రద్దుకే మొగ్గు చూపింది. తెలంగాణ హైకోర్టు హైదరాబాద్, రంగారెడ్డి మినహా మిగతా జిల్లాలో పదో తరగతి పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేసింది. అందరికీ ఒకేసారి కాకుండా వేర్వుగా పరీక్షలు నిర్వహిస్తే మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం విద్యాశాఖ అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.

ఈమేరకు నేడు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి ఆధర్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుత తరుణంలో పదోతరగతి విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో నిర్వహించిన ప్రీఫైనల్, అసెస్మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడులను ఖారారు చేయనున్నట్లు ప్రకటించారు. ఈమేరకు అన్ని పాఠశాలల నుంచి గతంలో నిర్వహించిన ప్రీపైనల్ ఎగ్జామ్ రిజర్ట్ లను తెప్పించుకొని పదోతరగతి విద్యార్థులకు గ్రేడింగ్ తయారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 5,34,903మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. ఇప్పటికే విద్యార్థులకు లాంగ్వేజ్ పరీక్షలను పూర్తి చేశాయి. మెయిన్ సబ్జెక్టులు విద్యార్థులు రాయాల్సి ఉండగా కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేసింది. ఇటీవల లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాటు చేసింది. పదో తరగతి విద్యార్థులకు ఆరు సబ్జెక్టులు, 11 పేపర్లు ఉన్నారు. వీటిలో రెండు సబ్జెక్టులకు సంబంధించిన 3 పేపర్ల పరీక్షలు పూర్తయ్యాయి. నేడు ఈ పరీక్షల నిర్వహాణపై చర్చించి ప్రస్తుతం పరీక్షలు నిర్వహించే పరిస్థితులు లేనందున పరీక్షలు రద్దుచేసి విద్యార్థులందరినీ ప్రమోట్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా డిగ్రీ, పీజీ తదితర పరీక్షల నిర్వహణపై భవిష్యత్ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పదో తరగతి విద్యార్థులందరినీ ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడంపై విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వర్క్ ఫ్రమ్ హోమ్ కి సచివాలయ ఉద్యోగుల డిమాండ్..!


ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కివిడ్ 19 పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఎప్పటి వరకూ 10 మందికి కోవిడ్ సోకగా ఈ రోజు ఇద్దరికి కోవిడ్ 19 పాజిరివ్ గా తేలింది. దీంతో ఉద్యోగులు ఆందోళన తీవ్ర స్థాయికి చేరింది. మార్చి 22 అనంతరం లాక్ డౌన్ కారణంగా ఉద్యోగులు ఇంటి నుంచే రెండు నెలల పాటు పనిచేశారు. మే మూడవ వారంలో 4వ విడత లాక్ డౌన్ లో ప్రభుత్వ కార్యాలయాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వడంతో సీఎస్ ఆదేశాల ఉద్యోగులు విధులకు హాజరవుతున్నారు. సచివాలయంలో ఉద్యోగుల రాక ప్రారంభమయ్యాక పాజిటివ్ కేసులు సంఖ్య పెరిగింది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా కొత్త కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.

దీంతో ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ రోజురోజుకు పెరుగుతుంది. ఈ అంశంపై సచివాలయ ఉద్యోగుల సంఘం ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతుంది. మరో వారం రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యంలో ఉద్యోగులు అందుబాటులో లేకుంటే ఇబ్బందులు ఎదురవుతాయని ఉన్నతాధికారులు ఆలోచనలో పడ్డారు. ఈ సారి జరిగేవి బడ్జెట్ సమావేశాలు కావడంతో అధికారులు సిబ్బంది అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉండటంతో ఇంటి నుంచి పని చేసేందుకు అనుమతి ఇవ్వలేదు.

మరోవైపు పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ ఆ శాఖ ఉద్యోగులకు రెండు వారాలపాటు ఇంటి నుంచి పని చేసేందుకు అవకాశం ఇచ్చారు. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. భయాందోళనలో ఉన్న మిగతా డిపార్ట్మెంట్ ఉద్యోగుల కూడా తమకు ఇంటి నుంచి పని చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు.

అసలు తగ్గేదే లేదంటున్న రమ్యకృష్ణ..


మేర్లపాక గాంధీ దర్శకత్వంలో హీరో నితిన్ హీరోగా రీమేక్ కాబోతుంది బాలీవుడ్ సూపర్ హట్ మూవీ ‘అంధాదూన్’. కాగా ఈ చిత్రం హిందీలో విజయం సాధించడానికి గల ప్రధాన కారణాల్లో ఆయుష్మాన్ ఖురాన్ నటనతో పాటుగా నెగెటివ్ రోల్ చేసిన ‘టబు’ పెర్ఫార్మెన్స్ కూడా కీలకమైనదే. అయితే టబు నటించిన ఆ బోల్డ్ క్యారెక్టర్ లో రమ్యకృష్ణ నటించబోతుంది. కాగా ఫిల్మ్ సర్కిల్స్‌ లో తాజా టాక్ ఏమిటంటే, రమ్యకృష్ణ ఈ చిత్రానికి పెద్ద మొత్తంలో డబ్బును డిమాండ్ చేస్తోందట.

రమ్య కృష్ణది ప్రధాన పాత్ర కావడంతో.. పైగా కథ మొత్తం ఆమె చుట్టూ తిరుగుతుండటంతో రమ్యకృష్ణ భారీగా రెమ్యునిరేషన్ అడుగుతుందట. కాగా ఈ చిత్రంలో నటించడానికి రమ్యకృష్ణకు పెద్ద మొత్తంలోనే రెమ్యునిరేషన్ ఇవ్వటానికి మేకర్స్ కూడా ఓకే చెప్పారని తెలుస్తోంది. ఇక నితిన్ ‘భీష్మ’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుని ఎట్టకేలకూ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ హిట్తో  రెట్టించిన ఉత్సాహంతో తన తర్వాతి సినిమాలను చేస్తున్నారు.

చిరంజీవి, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ


త్రివిక్రమ్ – మెగాస్టార్ కాంబినేషన్ కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. వారి డ్రీమ్ కాంబినేషన్స్ లో ఈ కాంబినేషన్ కూడా ఒకటి. పైగా ఈ కాంబినేషన్ అంటే సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఎంతో క్రేజ్ ఉంది. అందుకే ఎప్పటికైనా త్రివిక్రమ్ తో మెగాస్టార్ సినిమా చేస్తే చూడాలనేది మెగా ఫ్యాన్స్ కోరిక. కాగా ఆ కోరిక భవిష్యత్తులో తీరేలా ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేస్తోన్న సినిమా తరువాత, త్రివిక్రమ్ మెగాస్టార్ తో సినిమా చేస్తాడని ఇప్పటికే త్రివిక్రమ్ చిరుకు ఒక లైన్ కూడా చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే త్రివిక్రమ్ ఈ సినిమాని ఫుల్ కమర్షియల్ ఎంటెర్టైనర్ లా చేస్తాడట. ఇక త్రివిక్రమ్ సినిమా అంటే.. ఎమోషన్ అండ్ యాక్షన్ తో పాటు హీరో ఖచ్చితంగా కామెడీ చేయాల్సిందే. ఇక హాస్యాన్ని పండించడంలో మెగాస్టార్ నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి ఈ ఇద్దరి కలయికలో ఎంటెర్టైనర్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించడానికే థ్రిల్ గా అనిపిస్తోంది.

ఇకపోతే చిరు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ కూడా ‘అల వైకుంఠపురములో’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తారక్ సినిమా కోసం స్క్రిప్ట్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు.

మావోలకు వ్యతిరేకంగా గిరిజనుల ర్యాలీ..!


తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని చింతూరు ఏజన్సీలో గిరిజనులు మావోయిస్టులకు వ్యతిరేకంగా ప్రదర్శన చేయడం చర్చనీయంగా మారింది. సహజంగా గిరిజనులకు, మావోయిస్టులకు సత్సంబంధాలు ఉంటాయి. మావోయిస్టులకు గిరిజనులు కొన్ని సందర్భాల్లో సహకారాన్ని అందిస్తారు. చింతూరు సమీపంలో వాగుపై నిర్మిస్తున్న వంతెన పనులు చేస్తున్న వారిని బెదిరించి, అక్కడున్న రెండు జేసీబీలు, లారీలు, ట్రాక్టర్ లు, కాంక్రీట్ మిసక్సర్ ను మావోయిస్టులు తగులబెట్టారు. దీంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. ఈ ఘటనతో ఆగ్రహించిన గిరిజనులు మావోలకు వ్యతిరేకంగా ప్రదర్శన చేపట్టారు.

చింతూరు మన్యంలో సోమవారం మావోయిస్టులకు వ్యతిరేకంగా గిరిజనుల ఈ ర్యాలీ నిర్వహించారు. మండలంలోని తుమ్మల గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకట్రామపురం గ్రామస్థులు ఆ గ్రామం నుండి బ్రిడ్జ్ నిర్మాణ పనులు నిర్వహిస్తున్న ప్రదేశంలో ప్ల కార్డులు పట్టుకొని ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామస్థులు మాట్లాడుతూ మా బ్రిడ్జ్ పనులు అడ్డుకోవద్దని కోరారు. ఈ వర్షాకాలంలో మా ప్రాణాలు గాలిలో కలవకుండా అధికారులు బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయ్యేలా చూడాలని కోరారు.

ఆ అధికారులపై దూకుడు పెంచిన ‘సిట్’..!


అమరావతి రాజధాని భూ సమీకరణలో గత ప్రభుత్వం టీడీపీ నేతలకు అనుచిత లబ్ది చేకూరేలా వ్యవహరించిందన్న ఆరోపణలపై వైసీపీ ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. అందులో భాగంగా సిట్ ను ఏర్పాటు చేసి కొంతమంది అధికారుల అరెస్టులకు దిగింది. అంతే కాకుండా ఈ అంశంపై మరింత దూకుడుగా వెళ్లి టీడీపీకి అనుకూలంగా పని చేసిన అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు, రాజకీయ ప్రత్యర్థి పార్టీపైనా పై చేయి సాధించాలనే ఉద్దేశంతో దూకుడుగా ముందుకెళ్తోంది.

ప్రపంచంలోనే తొలిసారి భూ సమీకరణ అనే నూతన విధానాన్ని రాజధాని కోసం ప్రవేశ పెట్టామంటూ గత టీడీపీ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో రాజధాని భూ సమీకరణలో పనిచేసిన కొందరు డిప్యూటీ కలెక్టర్ లు గత ప్రభుత్వ పెద్దల వత్తిడితో కొన్ని గ్రామాల పరిధిలోని లంకలు, అస్సైన్డ్‌ భూములతోపాటు మెట్ట భూములను జరీబుగా నమోదు చేసి, పలువురు టీడీపీ నేతలకు అనుచిత లబ్ధి చేకూర్చారన్న వాదనలు ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాజధాని భూ సమీకరణలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న వైసీపీ ప్రభుత్వం విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను నియమించింది. విచారణలో అక్రమాలు రుజువు అవ్వడంతో ఒక డిప్యూటీ కలెక్టర్ ను అరెస్టు చేసింది.

రాజధాని గ్రామాల్లో ఒకటైన రాయపూడిలో ఉన్న ఏపీసీఆర్డీయే లోకల్‌ కాంపిటెంట్‌ అథారిటీ కార్యాలయంలో గతంలో డిప్యూటీ కలెక్టర్‌గా వ్యవహరించిన మాధురిని సిట్‌ బృందం రెండు రోజుల కిందట విచారించింది. ఆమె ఆ గ్రామంతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న లింగాయపాలెం, ఉద్ధండరాయుని పాలెం, మోదుగులంక పాలెం తదితర గ్రామాలకు చెందిన ల్యాండ్‌ పూలింగ్‌ వ్యవహారాలనూ పర్యవేక్షించారు. ఈ సమయంలో టీడీపీ నాయకులకు లబ్ధిచేకూరే విధంగా వ్యవహరించారని సిట్ వాదన. మరోవైపు నెక్కల్లులో లేని భూమి సుమారు 3.20 ఎకరాలను పూలింగ్‌కు తీసుకున్నట్లుగా అక్కడ పనిచేసిన డిప్యూటీ కలెక్టర్ మాధురి రికార్డుల్లో చూపి, కొందరు టీడీపీ నేతలకు రూ.కోట్లలో లబ్ధి చేకూర్చారనే ఆరోపణలపై కొద్ది రోజుల క్రితమే ఆమెను ‘సిట్‌’ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

దీంతో రాజధాని భూసమీకరణలో సేవలందించిన అధికారుల్లో ఆందోళన మొదలయ్యింది. రాజధాని భూముల వ్యవహారంలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలు లేకపోలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో రాజధాని ప్రాంతంలో పనిచేసిన అధికారులు ఆందోళన చెందుతున్నారు. టీడీపీ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు అడ్డదారుల్లో నడిచిన అధికారులలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.

బాబుకు షాక్..జగన్ తో టచ్ లో 10మంది ఎమ్మెల్యేలు


టీడీపీ దుకాణం ఖాళీ కాబోతోంది. ఈ మాటలు అన్నది ఎవరో వైసీపీ నేతలు కాదు.. తెలుగుదేశం పార్టీలో తలపండిన సీనియర్ .. అవును. ఏపీ సీఎం జగన్ పనితీరుకు టీడీపీ ఎమ్మెల్యేలు ఆకర్షితులవుతున్నారని.. ఇప్పటికే 10-12మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. 10మంది వస్తారా లేక 12మంది వస్తారా అన్న సంఖ్య ఇప్పుడే చెప్పలేమని ఆయన బాంబు పేల్చారు.

ప్రకాశం జిల్లా నుంచి కూడా పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి చేరుతున్నారన్న సమాచారం ఉందన్నారు కరణం బలరాం. దీనికి కొంత సమయం పడుతుందని వివరించారు. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేల ప్రధాన వ్యాపారంపై తాజాగా జగన్ టాస్క్ ఫోర్స్ దాడులతో అక్కడ టీడీపీ ఎమ్మెల్యేల్లో వణుకు మొదలైంది. ఈ క్రమంలోనే వారంతా పార్టీ మారాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రధానంగా టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి వారి ఆర్థిక అవసరాలే ప్రమాణికంగా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గ్రానైట్ సహా పలు వ్యాపారాల్లో ఉన్న వారిపై జగన్ ప్రభుత్వం నజర్ పెట్టడంతో చేసేదేం లేక వైసీపీ ప్రభుత్వంలోకి చేరుతున్నారని అంటున్నారు.

ప్రధానంగా జగన్ అద్భుతమైన సంక్షేమ పాలనకు ఆకర్షితులవుతున్నారని.. ప్రతిపక్షంలో టీడీపీ ఎమ్మెల్యేలకు సపోర్టు లేక బెంబేలెత్తిపోవడంతోపాటు చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల కూడా టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని టీడీపీ సీనియర్ నేత కరణం ఆరోపించారు.

చంద్రబాబు పోకడకి.. జగన్ వ్యవహారశైలికి చాలా తేడా ఉందని.. నమ్ముకున్న వాళ్లకి సీఎం జగన్ న్యాయం చేస్తారని ప్రశంసించారు.వెలిగొండ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నిర్లక్ష్యం చేశారని.. టీడీపీ ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి తెచ్చినా పూర్తి చేయలేదని కరణం బలరాం తాజాగా ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఎక్కువగా వస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా పోతుందనే మమ్మల్ని రమ్మనలేదని కరణం సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ తో కూడా తనకు సన్నిహిత సంబంధాలున్నాయని ఆయన గుర్తు చేశారు.

తిరుమలలో ట్రయల్ రన్ ప్రారంభం..!

కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా నేటి నుంచి దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను అనుమతినిచ్చిన సంగతి తెల్సిందే. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని తిరుపతి, యాదాద్రి, వేములవాడ, భద్రాచలం తదితర పలు పుణ్యక్షేత్రాలు నేడు తెరుచుకున్నాయి. ఇందులో భాగంగా సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. నేడు, రేపు తిరుపతిలో టీటీడీ ఉద్యోగులు, కుటుంబ సభ్యులకు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. నేడు ప్రారంభమైన ట్రయల్ దర్శనాలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ట్రయల్ దర్శనంలో భక్తుల సంఖ్యను పెంచే వెసులుబాటు గుర్తించినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే భక్తుల సంఖ్య పెంచనున్నామని త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని తెలిపారు.

ట్రయల్ దర్శనాలు సక్సస్..
సోమ, మంగళవారాల్లో టీటీడీ ఉద్యోగులతో ట్రయల్ దర్శనాలు నిర్వహిస్తున్నారు. భౌతికదూరం పాటిస్తూ మాస్కులతో అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారు. భక్తులను థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే వారిని కొండపైకి అనుమతిస్తున్నారు. దాదాపు మూడు నెలల తర్వాత స్వామివారిని దర్శించుకోవడంతో టీటీడీ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 10న స్థానిక భక్తులకు అవకాశం కల్పించనున్నారు. 11నుంచి సాధారణ భక్తులను అనుమతించనున్నారు. గంటకు 500 చొప్పున రోజుకు 5నుంచి 6వేల మంది భక్తులకు అవకాశం కల్పించనున్నారు. ఆన్ లైన్లో 3వేల మందికి, నేరుగా మరో 3వేల మందికి సర్వదర్శనం టికెట్లు జారీ చేయనున్నారు

శ్రీవారి దర్శన వేళలు..
ఉదయం 6.30నుంచి సాయంత్రం 7.30 వరకు మాత్రమే భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతి ఉంటుంది. రాత్రి సమయంలో కర్ఫ్యూ యాథావిధిగా కొనసాగనుంది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ పేర్కొంది. కాలినడకన వెళ్లే భక్తులకు అలిపిరి మార్గంలో ఉదయం 5 నుంచి సాయంత్రం నాలుగు వరకే అనుమతి ఉంటుంది. శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకు అనుమతి లేదన్నారు. ఇక ఘాట్‌ రోడ్డులో ఉదయం 5నుంచి రాత్రి 8గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.

అలిపిరి వద్ద థర్మల్ స్క్రీనింగ్..
దర్శనాలకు వచ్చే భక్తులకు అలిపిరి చెక్‌పోస్ట్ దగ్గర టీటీడీ సిబ్బందికి థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నారు. ర్యాండమ్ శాంపిల్స్ ను సేకరించనున్నారు. వాహనాలను కూడా పూర్తిగా శానిటైజ్ చేయనున్నారు. సరిబేసి సంఖ్యలో ఆన్‌లైన్లో గదులు బుక్ చేసుకునే అవకాశం ఉందని.. గదికి ఇద్దరి చొప్పున మాత్రమే అనుమతి ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది. అదేవిధంగా కల్యాణ కట్ట, శ్రీవారి హుండీ, లడ్డూ కౌంటర్ల వద్ద ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీవారి దర్శనం తర్వాత శఠగోపం, తీర్థం లాంటివి ప్రస్తుతానికి ఉండవని.. పుష్కరణిలోకి భక్తులకు అనుమతి ఉండదని టీటీడీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. తొలి మూడురోజుల అనంతరం ప్రతి రోజు 15వేల నుంచి 20వేలకు పెంచే అవకాశం ఉందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భక్తులకు శుభవార్త తెలిపారు.