Home Blog Page 8428

ఎంపీ ఊహించినట్లే.. ప్రభుత్వం షాక్ ఇచ్చిందా?


మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిలపై వైసీపీ ప్రభుత్వం కేసుల పేరుతో నేరుగా చర్యలకు దిగి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే మరి కొందరు టీడీపీ నేతలపై పరోక్షంగా చర్యలకు ప్రభుత్వం దిగింది. మాజీ మంత్రి నారాయణ విద్య సంస్థను దెబ్బతీసే విధంగా ప్రవేటు జూనియర్ కళాశాలపై అడ్మిషన్ల సంఖ్యను సగానికి తగ్గిస్తూ కొద్ది రోజుల కిందట ఉత్తర్వులు తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ టార్గెట్ చేసింది.

బాబుకి ఆయుధంగా మారుతున్న వైజాగ్ ప్రమాదాలు..!

సీఎం జగన్ ఎంపీ గల్లా జయదేవ్ కు పెద్ద షాక్ ఇచ్చారు. ఎంపీకి చెందిన సంస్థ అమర్ రాజా ఇన్‌ఫ్రా టెక్ లిమిటెడ్ కు 253.61 ఎకరాల భూ కేటాయింపులను ప్రభుత్వం రద్దు చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీఐఐసీ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమర్ రాజా ఇన్‌ఫ్రాకు చిత్తూరు జిల్లాలోని బంగారుపాళెం నునిగుండ్లపల్లి, కొత్తపల్లిలో వివిధ సర్వే నంబర్లలో 483.27 ఎకరాలను కేటాయించింది. ఈ భూమిలో 253.61 ఎకరాలల్లో సంస్థ ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో ఈ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.

ఇది ఓటు బ్యాంకు రాజకీయం కదా పవన్?

ప్రభుత్వం తన సంస్థలపై చర్యలకు దిగే అవకాశం ఉందని ఎంపీ గల్లా జయదేవ్ కొన్నాళ్ల కిందట వెల్లడించారు. తమ ఆర్థిక మూలలను దెబ్బతీసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. అదేవిధంగా ప్రభుత్వం ఎంపీకి చెందిన సంస్థకు భూముల కేటాయింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎంపీ గల్లా జయదేవ్ రాజధాని అమరావతి సహా వివిధ అంశాలపై వైసీపీ ప్రభుత్వం తీరుపై, సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. గల్లా జయదేవ్ తల్లి గల్లా అరుణ కుమారి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన అనంతరం గల్లా కుటుంబం కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరింది. ప్రస్తుతం వైసీపీ చర్యపై ఎంపీ ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.

శోభన్ బాబు వల్లే ఎన్టీఆర్ కు ఇండస్ట్రీ హిట్స్ !


జ్ఞాపకం అనేది.. గడిచినపోయిన జీవితానికి ఓ తీపిగుర్తు. నిజంగా జ్ఞాపకాలైనా.. గొప్పవాళ్ళ పాత విషయాలైనా వినడానికి ఆసక్తికరంగా ఉంటాయి. ప్రస్తుతం సీనియర్ ఎన్టీఆర్ రెండు సూపర్ హిట్ సినిమాల గురించి సోషల్ మీడియాలో అప్పటి విషయాలకు సంబంధించిన జ్ఞాపకాలు హల్ చల్ చేస్తున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఎన్టీఆర్ కెరీర్ లో 1977 సంవత్సరానికి ఓ ప్రత్యేకత ఉందట. ఆ ఏడాది జనవరిలో సంక్రాంతికి విడుదలైన దానవీర శూరకర్ణ సినిమాతో బాక్సాఫీస్ కొత్త రికార్డ్స్ మార్కును దాటేసింది. అది సెకండ్ రిలీజులోనూ కోటి వసూలు చేయడం విశేషం. పైగా కర్ణ హవా నడుస్తుండగానే … ఏప్రిల్ నెలలో అడవి రాముడు విడుదలై.. ఏకంగా నాలుగు కోట్ల వసూళ్లు సాధించి తెలుగు సినిమా స్టామినా పెంచింది. అదే ఏడాది అక్టోబర్ లో యమగోల విడుదలై అప్పటివరకు ఉన్న రికార్డ్స్ ను షేక్ చేసి పారేసింది.

బాబుకి ఆయుధంగా మారుతున్న వైజాగ్ ప్రమాదాలు..!

ఇలా ఎన్టీఆర్ క్రేజ్ ను ఎవ్వరూ అందుకోలేనంతగా ఆయనకు అద్భుత విజయాలనూ అందించిన అడవి రాముడు, యమగోల రెండు చిత్రాలు నిజానికి శోభన్ బాబు చేయాల్సినవి అట. నిర్మాత సూర్యనారాయణగారు గందనగుడి అనే ఓ కన్నడ సినిమా చూసి ముళ్లపూడి వెంకటరమణగారితో కథ తయారు చేయించి… శోభన్ బాబుకు వినిపించారట. ఆయనకి కథ చెప్పగానే అడవి బ్యాక్ డ్రాప్ లో కథ ఎక్కువ రోజులు ఔట్ డోరు ఇలా ఆలోచించి అడవిరాముడు సినిమాని వద్దనుకున్నారు. అలా ఆ కథ ఎన్టీఆర్ దగ్గరకు పోవటం, ఆయన ఓకే చేయడం జరిగిపోయాయట.

టిక్ టాక్.. మనకు లాభమెంత? నష్టమెంత?

మొదట రాఘవేంద్రరావుకి ఈ విషయం చెప్తే ఆయన తనను జోక్ చేయడానికి చెప్తున్నారనుకున్నాట్ట. చివరకి సీరియస్ వ్యవహారమే అని తెల్సాక … ముళ్లపూడి వారి కథను దగ్గర పెట్టుకుని గొల్లపూడి తో కూర్చుని కమర్షియల్ కథగా మార్చే కసరత్తు ప్రారంభించి ఎన్టీఆర్ కు కొత్త ఇమేజ్ ఇచ్చేలా కథ తయారు చేసుకున్నారు. అలాగే మాటల రచయితగా జంధ్యాలను తీసుకున్నారు. అలా తెరకెక్కిన అడవిరాముడుతో సెన్సేషనల్ హిట్ ను అందుకున్నారు. సేమ్ అదేవిధంగా యమగోల సినిమా కూడా శోభన్ బాబు నుండి ఎన్టీఆర్ దగ్గరకి వెళ్ళింది. ఎన్టీఆర్ కు మరో సూపర్ హిట్ సినిమాని అందించింది. మొత్తానికి శోభన్ బాబు వల్ల ఎన్టీఆర్ కు ఇండస్ట్రీ హిట్స్ వచ్చాయి.

పబ్జి, జూమ్.. చైనా యాప్స్ కాదట..!


కేంద్రం ప్రభుత్వం తాజాగా 59 చైనా యాప్స్ బ్యాన్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత సరిహద్దుల్లోని గాల్వానా లోయలో భారత జవాన్లపై చైనా దొంగదెబ్బ తీసింది. గాల్వానా ఘర్షణలో 21మంది భారత జవాన్లు వీరమరణం పొందడంతో యావత్ భారత్ చైనాకు వ్యతిరేకంగా నినదించింది. ఓవైపు శాంతి చర్చలంటూనే మరోవైపు చైనా దొంగదెబ్బతీయడంపై భారతీయులు చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపైకి వచ్చి చైనా అధ్యక్షుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. వీరజవాన్లకు ఘనంగా నివాళ్లర్పించారు. ఈనేపథ్యంలో చైనా వస్తువుల బహిష్కరణ నినాదం సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరిగింది. దీనికి భారతీయులు నుంచి మంచి స్పందన రావడంతో కేంద్రం కూడా ఆ దిశగా ప్రణాళికలను రూపొందించింది.

టిక్ టాక్.. మనకు లాభమెంత? నష్టమెంత?

చైనాను రక్షణపరంగా, ఆర్థికంగా, దౌతపరంగా అన్నివిధంగా భారత్ చైనాకు ధీటుగా జవాబిస్తుంది. ఇప్పటికే సరిహద్దుల్లో కమాండర్ స్థాయి అధికారులకు పరిస్థితినిబట్టి నిర్ణయం తీసుకునే అధికారాన్ని కల్పించి సైనికుల పూర్తి స్వేచ్ఛ కల్పించింది. త్రివిధ దళాలను సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీచేసింది. మరోవైపు చైనాకు చెందిన పలు కాంట్రాక్టులను రద్దు చేస్తూ ఆర్థికంగానూ షాకిస్తోంది. తాజాగా చైనాకు చెందిన 59యాప్స్ ను కేంద్రం బ్యాన్ చేసి చైనాకు గట్టి బుద్ది చెప్పింది. భారత పౌరుల సమాచారం చోరికి గురవుతుందనే కారణంతో ఈ యాప్స్ ను నిషేధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

భారత్ ప్రకటించిన చైనాకు చెందిన 59యాప్స్ లో భారతీయులు ఎక్కువగా ఉపయోగించే టిక్ టాక్ కూడా ఉంది. భారత్ లో ఈ యాప్ కు చాలా క్రేజీ ఉంది. ఇందులో చిన్న వీడియోను పలు సాంకేతిక అంశాలతో ఈజీగా వాడుకునే సదుపాయం ఉంది. ఈ యాప్ కు భారత్లో అత్యధిక వినియోగదారులు ఉన్నారు. ఈ యాప్ వల్ల చాలామంది తమ టాలెంట్ ను నిరూపించుకొని పాపులర్ అయిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అలాగే ఈ యాప్ కు యువత ఎక్కువగా బానిసవడం, లైక్స్ రావడం లేదని ఆత్మహత్యలు, వేధింపులు, విడాకులు వంటివి కూడా వెలుగుచూశాయి. ఈ యాప్ తొలగించడంతో కొంతమంది టిక్ టాక్ ఫ్యాన్స్ నిరుత్సాహం చెందుతున్నారు.

బాబుకి ఆయుధంగా మారుతున్న వైజాగ్ ప్రమాదాలు..!

భారత్ బ్యాన్ చేసిన 59యాప్స్ లో పబ్జీ, జూమ్, వాట్సాప్ యాప్ లేకపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పబ్జీ, జూమ్, వాట్సాప్ యాప్ చైనాకు చెందిన యాప్స్ కాదా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. అయితే వీటిని బ్యాన్ చేయకపోవడానికి కేంద్రం వద్ద చాలా కారణాలున్నట్లు తెలుస్తోంది. అందరు అనుకున్నట్లు జూమ్ చైనా యాప్ కాదు.. జూమ్‌ని సృష్టించిన ఎరిక్ యువాన్ (EricYuan) చైనా-అమెరికన్. ఈయనకు అమెరికా పౌరసత్వం ఉంది. జూమ్, జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ కలిగిన కంపెనీ అమెరికాలో ఉంది. జూమ్‌ సంస్థ యూజర్ల సమాచారాన్ని చైనా ఇచ్చేందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి మాత్రం జూమ్ ను బ్యాన్ చేయలేదు.

అదేవిధంగా పబ్జీ, వాట్సాప్ లు కూడా చైనాకు చెందినవి కాదు.. పబ్జీ(PUBG) గేమ్ యాప్ని దక్షిణ కొరియాకి చెందిన గేమ్ స్టూడియో బ్లూహోల్(Blue Hole) తయారు చేసింది. ఇది పాపులర్ అయ్యాక చైనా కంపెనీ టెన్సెంట్(Tencent) చైనాలో అనుమతిచ్చేందుకు డీల్ కుదుర్చుకుంది. ఇండియాలో ఈ గేమ్‌ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నది టెన్సెంట్ అని గూగుల్ ప్లే స్టోర్‌లో ఉంది. పబ్‌జీ యాజమాన్య హక్కులు ఇప్పుడు ఒక్కరి చేతుల్లో లేవు. దీంతో ఈ గేమ్ యాప్ ను కేంద్రం నిషేధించలేదని తెలుస్తోంది.

అలాగే వాట్సాప్ ను నిషేధించాలని ఎవరూ పెద్దగా డిమాండ్ చేయలేదు. ఇది కూడా చైనాకి చెందిన యాప్ కాదు. వాట్సాప్ ఫేస్‌బుక్ నిర్వహిస్తున్న యాప్. దీనివల్ల వాట్సాప్‌కి ఇండియాలో ఎలాంటి ఢోకా లేదని తెలుస్తోంది. ఈ యాప్స్ నుంచి వచ్చి అన్ని మేసేజ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

బాబుకి ఆయుధంగా మారుతున్న వైజాగ్ ప్రమాదాలు..!


సీఎం వై ఎస్ జగన్ విశాఖను పరిపాలన రాజధానిగా మార్చాలని పట్టుదలతో ముందుకు వెళుతున్న వేళ, వరుస ప్రమాదాలు ఆయన నిర్ణయాన్ని సన్నగిల్లేలా చేస్తున్నాయి. మూడు రాజధానుల అంశం తెరపైకి తెచ్చిననాటి నుండి టీడీపీ ప్రభుత్వం జగన్ కి వ్యతిరేకంగా ఓ యుద్ధమే చేస్తుంది. మూడు రాజధానులు వద్దు ఒక్కటే ముద్దు అంటూ…వారు అమరావతిని కాపాడుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయం జగన్ ని రెండు ప్రాంతాల ప్రజలకు దగ్గర చేస్తుండగా, అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని బాబు ఒక పక్షాన నిలిచి పెద్ద సాహసం చేశారు. బాబు అమరావతి పోరాటం ప్రభావం ఆ మధ్య వైజాగ్ వెళ్ళినప్పుడు ప్రజలు చూపించారు. గో బ్యాక్ చంద్రబాబు అంటూ ఆయన పట్ల నిరసన వ్యక్తం చేశారు. అది వైసీపీ గుండాల చర్య అని బాబు సమర్ధించుకున్నా…వారి ప్రయోజనానికి అడ్డుపడే వారిని ఎవరు మాత్రం సమర్థిస్తారు.

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటావా.. జగన్?

ఇదిలా ఉంటే మే 7వ తేదీన వైజాగ్ ఆర్ ఆర్ వెంకటాపురం గ్యాస్ లీకేజ్ ఘటన వైజాగ్ రాజధాని నిర్ణయంపై తీవ్ర ప్రభావము చూపింది. ఎల్ జి పాలిమర్స్ నుండి విడుదలైన విషవాయువు 11 మంది అమాయక ప్రజల ప్రాణాలు బలిగొంది. 1000 మందికి పైగా ఈ విష వాయువు బారిన పడ్డారు. జగన్ బాధితులకు భారీ పరిహారం చెల్లించి వారి నోళ్లు మూయించారని ప్రతి పక్షాలు గగ్గోలు పెట్టాయి. రాజధానిగా వైజాగ్ శ్రేయస్కరం కాదని వారు ఈ సంఘటన ఉదాహరణగా చూపుతూ.. అమరావతి సెంటిమెంట్ ని బలపరిచే ప్రయత్నం చేశారు. అమరావతిలో జరిగిన అవినీతి బయటికి తీయాలనే ప్రయత్నంలో ఉన్న జగన్, ఆ దిశగా అడుగులు వేస్తూ…తన మూడు రాజధానుల నిర్ణయం సమర్ధించుకోవడమే కాకుండా వైజాగ్ నుండి పాలన సాగించడానికి పావులు కదుపుతున్నాడు.

ఇది ఓటు బ్యాంకు రాజకీయం కదా పవన్?

కాగా నేడు జరిగిన మరో సంఘటన టీడీపీ నాయకులకు ఆయుధంగా మారింది. పరవాడ ఫార్మా సిటీ లోని సాయినార్ కెమికల్స్ నుండి గ్యాస్ లీకేజీ కారణంగా ఇద్దరు మృతి చెందారు. మరొక నలుగురు తీవ్ర అస్వస్థకి గురి అయ్యారు. దీనితో గత నెలలో జరిగిన విషాదాన్ని కూడా లేవనెత్తుతూ టీడీపీ నేతలు విమర్శలకు దిగారు. ఇద్దరు కార్మికుల చావును పెద్ద ఎత్తున ప్రచారం చేసి.. వైజాగ్ నగరం రాజధానిగా అంత అనువైనది కాదనే అభిప్రాయం ప్రజల్లో కలిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే శాసన మండలితో సహాయంతో జగన్ నిర్ణయాలను ముందుకు వెళ్లకుండా బాబు చేస్తుండగా…వరుస ప్రమాదాలు మరిన్ని తలనొప్పులు తీసుకువస్తున్నాయి.

సినీ లోకం నిండా కన్నీళ్లు కష్టాలే !

Telugu Films


ఎక్కడో పుట్టి మొత్తం మానవాళికే ప్రమాదకరంగా మారిన కరోనా వైరస్‌ తీవ్రత భారత్‌లో రోజురోజుకు పెరిగిపోతున్నా.. ప్రభుత్వాలు చూసి చూడనట్టుగా సర్దుకుపోవాల్సిన స్థితి ఒక్క కరోనాతో సాధ్యం అయిందనుకుంటా. పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నా.. అందరికీ సాయం అందించలేని పరిస్థితి. ముఖ్యంగా సినిమా రంగం పై కరోనా పంజా విసిరింది.. షూటింగ్లు జరపకుండా ఇంకా పంజా ఎప్పుడు విసురుదామా అని కాచుకుని కూర్చుంది. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్‌తో థియేటర్స్‌ అన్ని మూసేశారు.. ఇటివలే మొదలెట్టిన సినిమాల షూటింగ్ లన్నీ ఆపేశారు. మరోపక్క కృష్ణ నగర్ కష్టాలు సినిమా పక్షుల్లో రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి.. మరో రెండు నెలలు షూటింగ్ లు లేకపోతే.. సినీ కార్మికులు కడుపు నింపుకోవడం కష్టమే.

ఇది ఓటు బ్యాంకు రాజకీయం కదా పవన్?

మరి ఏం చేయాలి ? సినిమానే నమ్ముకుని బతుకుతున్న వారికి మరో పని రాదు, సరే నేర్చుకుని చేద్దామన్నా ఇప్పటికిప్పుడు పని ఇచ్చే వాడు ఎవడు ? సినిమా జీవులకు ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం అందే పరిస్థితి లేదు. పోనీ రెండు నెలలు కష్ట పడదాం అని సర్దిచెప్పుకున్నా… ఆ తరువాత ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. పైగా ఇప్పటికే చిన్న సినిమాల్లో తమ డబ్బులు ఖర్చు పెట్టిన చిన్న నిర్మాతలకు ఏం అంతుచిక్కట్లేదు. ఇక జూనియర్ ఆర్టిస్ట్ లు అందరూ తీవ్రంగా ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. మళ్ళీ పెద్ద సినిమాల షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయో… మొదలైనా అందరికీ పని దొరుకుతుందో లేదో.. అని సినీ కార్మికులు నరకయాతన అనుభవిస్తున్నారు.

బతికుంటే బలుసాకు తిందాం.. ఇంటికి పోదాం!

ఆ నరకం నుండి వారిని ఆదుకునేది ఎవరు? కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని వాళ్ళు తమ ఆవేదనను వ్యక్తం చేస్తోన్నా.. పట్టించుకున్న దాఖలాలు లేవట. ఎదో ఆ మధ్య మంత్రి శ్రీనివాస్ యాదవ్ నాలుగు కిలోలు రైస్ ఇచ్చాడని.. అంతకుమించి ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం లేదని వారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సినీ కార్మికులకు కూడా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న తమ పథకాలను వర్తింపు చేయాలి. సినిమా పరిశ్రమ పై కెసిఆర్ ప్రభుత్వం కరుణ చూపించాలని కోరుకుందాం.

టిక్ టాక్.. మనకు లాభమెంత? నష్టమెంత?


ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో పని మానేసి ప్రభుత్వ ఉద్యోగులు టిక్ టాక్ చేశారు. అది దుమారం అయ్యి వారు సస్పెండ్ అయ్యారు. కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ కూడా అప్పట్లో ఇలానే ఆఫీసులోనే టిక్ టాక్ చేశాడు. సస్పెండ్ అయ్యాడు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులన్నా లెక్కేలేదు.. చివరకు ఆస్పత్రుల్లో కూడా ఈ టిక్ టాక్ పిచ్చి చోటుచేసుకుంది. చస్తున్నా కూడా టిక్ టాకే లోకమైంది.. చిన్నా.. పెద్ద.. ముసలి ముతక అంతా ఇప్పుడు పొద్దున లేస్తే టిక్ టాక్ లోకమే.. మొన్నీ మధ్య భార్య టిక్ టాక్ మాయలో పడి సంసారాన్ని వదిలేయడం.. ఓ యువకుడితో ఎఫైర్ పెట్టుకోవడం భర్త కడతేర్చాడు. మరో భార్య టిక్ టాక్ తో పాపులర్ అయ్యి ఓ యువకుడితో లేచిపోయింది. ఇలా టిక్ టాక్ లేని సమాజాన్ని ఇప్పుడు ఊహించలేం. అది లేకపోతే బతకలేం.. ఇప్పుడు టిక్ టాక్ భారత ప్రజలకు వ్యసనంలా మారింది..

ఇది ఓటు బ్యాంకు రాజకీయం కదా పవన్?

అయితే నాణేనికి మరో వైపు కూడా ఉంది.. మురికివాడలోని ఓ ముస్లిం యువకుడు టిక్ టాక్ తో ఓవర్ నైట్ స్టార్ అయ్యి కోటీశ్వరుడయ్యాడు. మన హైదరాబాదీ ఉప్పల్ బాలు కూడా ఇలానే టిక్ టాక్ తో పాపులయ్యాడు. టిక్ టాక్ లో ఫేమస్ అయిన కొందరికి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఇలా టిక్ టాక్ తో పాపులరైన వాళ్లు దేశంలో వేలంలో ఉన్నారు. దీంతో డబ్బులు సంపాదించుకున్న బ్యాచ్ కూడా ఎక్కువ..

ఇలా టిక్ టాక్ సామాన్యులను సెలబ్రెటీలను చేసింది కానీ ఎంతో మంది జీవితాలను అతలాకుతలం చేసింది. పొద్దస్తమానం టిక్ టాక్ తోనే గడుపుతూ సంసారాన్ని నాశనం చేసుకున్న జంటలు దేశంలో వేలల్లో ఉన్నారు. దేశంలో దాదాపు 20 కోట్లమందికి పైగా ఈ యాప్ ను దుర్వినియోగం చేసిన వ్యక్తులే ఎక్కువమంది దేశంలో ఉన్నారు. టిక్ టాక్ వల్ల వేల కుటుంబాలు నాశనమయ్యాయి. అక్రమ సంబంధాలు పెరిగిపోయాయి. బూతు ఎక్కువైపోయింది. విశృంఖలత్వం పెరిగిపోయింది. భారతీయ సంప్రదాయలు మంటగలిసి చిన్న పిల్లలు, యువతులు కూడా బట్టలిప్పి నగ్నంగా నృత్యాలు చేసే దుస్థితికి టిక్ టాక్ పిచ్చి తీసుకెళ్లింది.

వైసీపీలో విజయసాయిరెడ్డి సీన్ ముగిసిందా?

అందుకే ఇంత కల్లోలానికి కారణమవుతున్న టిక్ టాక్ ను నిషేధించాలని కొద్దిరోజులుగా దేశంలో సామాజిక ఉద్యమకారులు నెటిజన్లు డిమాండ్లు చేస్తున్నారు. మానవహక్కుల సంఘాలు దీన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశాయి.

అయితే టిక్ టాక్ చైనా యాప్.. దీనివల్ల భారత్ కు రూపాయి లాభం లేదు. యాడ్స్ రూపంలో వేల కోట్లను ఈ చైనా యాప్ కొల్లగొట్టింది. ఆ సంపద అంతా చైనాకే పోయింది. రాజకీయ నేతలు, ప్రభుత్వాలను మెయింటేన్ చేసిన ఈ సంస్థ ఇన్నాళ్లు పబ్బం గడిపిందన్న ప్రచారం ఉంది. కానీ పాపం పండింది. అదే చైనా వల్లే కావడం గమనార్హం.

ఎందరు సామాజిక ఉద్యమకారులు, మానవ హక్కుల సంఘాల వారు గళమెత్తిన మన సర్కార్ టిక్ టాక్ ను నిషేధించలేదు. కానీ చైనా తాజాగా 20 మంది భారత సైనికులను చంపగానే ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకాయి. కేంద్రాన్ని తాకాయి. కేంద్రం కూడా తప్పనిసరి పరిస్థితుల్లో చైనాపై దౌత్య యుద్ధం చేయడానికి డిజిటల్ యుద్ధం మొదలుపెట్టింది. చైనాయాప్స్ నిషేధించి మనతో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాకు బుద్ది చెప్పింది.

ఏది ఏమైతేనేం.. ఈ టిక్ టాక్ వల్ల ఎన్నో కాపురాలు కూలాయి. ఎన్నో జీవితాలు కుదేలయ్యాయి. ఇన్నాళ్లకు చైనా దుందుడుకు చర్యల వల్లే ఆ దేశ యాప్ నిషేధానికి గురైంది. భారతీయులకు విముక్తి కలిగింది. ఇప్పటికైనా ఈ విశృంఖలత్వ యాప్ లకు ప్రజలు దూరంగా ఉంటే అందరికీ మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సమాజాన్ని కలుషితం చేస్తున్న ఇలాంటి యాప్స్ ప్రమాదకరం అంటున్నారు.

-నరేశ్ ఎన్నం

బీజేపీపైనే బాబు ఆశలు.. నెరవేరేలా లేవే?


2014లో బీజేపీతోనే కలిసి వెళ్లారు.. విజయం సాధించారు. అయితే ప్రత్యేక హోదా ఇవ్వని మోడీపై కత్తిగట్టారు.. 2019 ఎన్నికల ముందర మోడీని ఓడిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు శపథం చేసి మరీ కాంగ్రెస్ పంచన చేరారు. అలా ముందే సగం ఓడారు. బాబును రాంగ్ డైరెక్షన్ లో పంపించి టీడీపీ అనుకూల మీడియా పెద్ద తప్పు చేసిందనే వాదన ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయాడు. మోడీ గెలిచాడు. నాడు చేసిన మోసంతో ఇప్పుడు చంద్రబాబును బీజేపీ నమ్మే పరిస్థితిలో లేదు. అందుకే తాజాగా మరోసారి ట్రై చేసినా బీజేపీ నుంచి చంద్రబాబుకు నిరాశే ఎదురైందట..

ఇది ఓటు బ్యాంకు రాజకీయం కదా పవన్?

చంద్రబాబు ఏపీ ఎన్నికల్లో ఓడాక కానీ తత్త్వం బోధపడలేదు. అందుకే ఓడిపోగానే బీజేపీని దువ్వసాగారు. రాజ్యసభలో బిల్స్ పాస్ చేసుకునే బలం లేని బీజేపీకి తన నలుగురు రాజ్యసభ ఎంపీలను పువ్వులో పెట్టి మరీ సాగనంపి బీజేపీతో సాన్నిహిత్యానికి అర్రులు చాచారు. ఆ తర్వాత అప్పట్లోనే ఆర్ఎస్ఎస్ నేతలను కలిసి బీజేపీతో పొత్తుకు వెంపర్లాడారు. కానీ అది వర్కవుట్ అవ్వలేదు..

తాజాగా ఇటీవల మరోసారి ఆర్ఎస్ఎస్ నేతలతో చంద్రబాబు మాట్లాడినట్టు టీడీపీ శిబిరం నుంచి వార్తలు లీక్ అవుతున్నాయి. ఈసారి మాట తప్పనని.. ఖచ్చితంగా బీజేపీతోనే ఉండాలన్న తన నిర్ణయాన్ని చంద్రబాబు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఆర్ఎస్ఎస్ నేతలు మాత్రం ఏపీ రాష్ట్ర బీజేపీ నేతలపైనే చంద్రబాబు పొత్తు విషయం పెట్టినట్టు సమాచారం.

వైసీపీలో విజయసాయిరెడ్డి సీన్ ముగిసిందా?

దీంతో చంద్రబాబులో బీజేపీ పొత్తు ఆశలు అడుగంటాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ జనసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ.. ఇప్పుడు చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి అంత ఉత్సాహం చూపడం లేదట.. వాడుకొని వదిలేసే బాబు నైజం తెలిసి టీడీపీతో పొత్తు వద్దే వద్దంటున్నారట ఏపీ బీజేపీ నేతలు..

ముందుగా జనసేనను పంపి ఆ తర్వాత తాను బీజేపీతో కలిసిపోవాలని చూసిన చంద్రబాబు ప్లాన్లకు ఇప్పుడు ఏపీ స్థానిక నేతలే అడ్డుగా తయారయ్యారట.. చంద్రబాబుది మునిగిన నావ అని.. ఆయనతో పొత్తు వద్దని ఏపీ బీజేపీ నేతలు అధిష్టానానికి ఖరాఖండీగా చెబుతున్నారట.. దీంతో జనసేన, బీజేపీతో కలిసి 2023 ఎన్నికల్లో బరిలోకి దిగాలనుకుంటున్న చంద్రబాబు ఆశలు నెరవేరేలా కనిపించడం లేదట.. ఇలా బాబు ఆశలపై బీజేపీ నీళ్లు చల్లుతోందని అంటున్నారు.

మోదీకి 13వేల జరిమానా.. ఎందుకో తెలుసా?


దేశ ప్రధాని మోదీ జాతినుద్దేశించి తాజాగా ప్రసంగించారు. కరోనా నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఆరోసారి మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. ప్రస్తుతం దేశం ఆన్ లాక్ 1.0నుంచి ఆన్ లాక్ 2.0కు వెళుతోందని తెలిపారు. జూలై 31వరకు ఆన్ లాక్ 2.0 ఉంటుందని ఆయన తెలిపారు. ఈసందర్భంగా ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. కరోనా సమయంలో తాను మాస్కు ధరించలేదని 13వేల జరిమానా విధించారనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు. దేశ ప్రధాని అయిన చట్టానికి అతీతులుకారని.. దేశంలో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని మోదీ సూచించారు.

ఇది ఓటు బ్యాంకు రాజకీయం కదా పవన్?

ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న కరోనా మరణాలను లెక్కలోకి తీసుకుంటే భారత్ మెరుగ్గా ఉందని తెలిపారు. ఆన్ లాక్ 1.0లో ప్రజలు కొంత నిర్లక్ష్యం చేయడం వల్లనే కేసుల సంఖ్య పెరిగిందని పేర్కొన్నారు. ఆన్ లాక్ 2.0లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్నారు. కరోనా సమయంలో పేదప్రజలు ఇబ్బందులు పడకుండా మూడునెలలుగా ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. పేదల జన్ ధన్ ఖాతాల్లో 35వేల కోట్లు జమ చేసినట్లు చెప్పారు. వన్ నేషన్.. వన్ రేషన్ కార్డు తీసుకొచ్చి ప్రజలు ఆకలితో ఉండకుండా చర్యలు చేశామన్నారు. గరీబ్ కల్యాణ్ యోజనకు 1.50లక్షల కోట్లు కేటాయించామని దీనిని నవంబర్ వరకు పొడిగిస్తున్నట్లు మోదీ తెలిపారు. రైతులు, ట్యాక్స్ పేయర్స్ కు ఊరట ఇచ్చినట్లు తెలిపారు.

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటావా.. జగన్?

ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కంటైన్మెంట్ జోన్లపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. నిబంధనలు పాటించనివారు తీరు మార్చుకోవాలని మోడీ సూచించారు. సర్పంచ్ నుంచి ప్రధాని వరకు అందరూ కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. చట్టానికి ఎవరూ అతీతులుకారని తెలిపారు. సరైన సమయంలో లాక్డౌన్ విధించడం వల్లే దేశంలో లక్షలాది ప్రాణాలను కాపాడుకోగలిగమని చెప్పారు. ప్రస్తుతం ఉన్న అన్ లాక్ 2.0 వర్షాకాలమని తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోదీ సూచించారు. కరోనా పట్ల నిర్లక్ష్యంవీడి జాగ్రత్తలు తీసుకుంటే మహమ్మరిని నిలువరించవచ్చని ఆయన తెలిపారు.

ఆర్జీవీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పవన్ ఫ్యాన్స్

Shock to RGV .. Court break for ‘Murder’ release
Shock to RGV .. Court break for ‘Murder’ release


స్టార్ హీరోహీరోయిన్లకు తమకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రతీ ఇండస్ట్రీలో ఉంటుంది. కానీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం అందరు హీరోలంటే ఎక్కువ స్థాయిలో వీరాభిమానులు ఉంటారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కల్యాణ్ ను గానీ, మెగా ఫ్యామిలీనిగానీ ఎవరైనా ఏదైనా అంటే పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోతుంటారు. ఎదుటివాళ్లు ఎంతటి వాళ్లయినా సరే చిల్చీచెండాడేస్తుంటారు. అలాంటిది ఆర్జీవీ ‘పవర్ స్టార్’ మూవీ అనౌన్స్ చేస్తే ఎలాంటి రెస్పాన్స్ లేకుండా ఉండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటావా.. జగన్?

దర్శకుడు రాంగోపాల్ నిత్యం ఏదోఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటాడు. వివాదాలను పెట్టుబడిగా చేసుకుంటూ డబ్బును సంపాదించుకోవడం ఆర్జీవీకి రోటీన్ గా మారింది. పవన్ కల్యాణ్ పై తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పవన్ ఫ్యాన్స్ ను కవ్విస్తూ నిత్యం వార్తల్లో నానుతూ ఉంటాడు. నిత్యం మెగా ఫ్యామిలీలోని ప్రతీఒక్కరిని వర్మ సోషల్ మీడియాలో గెలుకుతూనే ఉంటాడు. దీంతో అప్పట్లో నాగబాబు వర్సస్ ఆర్జీవీ మధ్య వివాదం కొన్నిరోజులపాటు నడించింది. పవన్ ఫ్యాన్స్ కూడా ఆర్జీవీ సోషల్ మీడియాలో పలురకాలుగా టార్గెట్ చేశారు. గతంలో ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ మూవీలోనూ పవన్ ను టార్గెట్ చేసి తన సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ చేసుకున్నాడు.

తెలంగాణలో వైద్యం అందని ద్రాక్షేనా?

కొద్దిరోజులపాటు స్తబ్ధుగా ఉన్న ఆర్జీవీ మరోసారి పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేశాడు. తాజాగా ‘పవర్ స్టార్’ మూవీని తీయబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఈమేరకు పవన్ కల్యాణ్ పాత్రలో నటించబోయే వ్యక్తి వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశాడు. దీనిపై పవన్ ఫ్యాన్స్ ఆర్జీవీని టార్గెట్ చేస్తే సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ చేయాలని ప్లాన్ చేశాడు. అయితే దీనిని ముందుగానే గుర్తించిన పవన్ ఫ్యాన్స్ ‘పవర్ స్టార్’ విషయంలో సైలెంటై వర్మకు షాకిచ్చారు. ఈమేరకు ‘పవర్ స్టార్’ మూవీని పట్టించుకోకూడదని పవన్ ఫ్యాన్స్ డిసైడ్ అని తెలుస్తోంది. ఆర్జీవీ చిప్స్ ట్రిక్స్ కు లొంగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తుంది. నిత్యం వివాదాలతో సొమ్ముచేసే ఆర్జీవీకి పవన్ ఫ్యాన్స్ ఎట్టకేలకు దిమ్మతిరిగేలా షాకిచ్చినట్లు అయింది. దీంతో వర్మ మరేదైనా కాంట్రావర్సీకి తెరలేపుతారా? అనే చర్చ మొదలైంది.

కొండపోచమ్మ కాల్వకు గండి.. తప్పేవరిదీ?


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం నిధులు.. నీళ్లు.. నియామకాలపై ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులపై దృష్టిసారించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేసి మరీ వేలకోట్లతో ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణాలను చేపట్టింది. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. కేవలం మూడేళ్ల కాలంలోనే రికార్డు స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసి కాల్వలకు, పంట పొలాలకు సాగునీరు అందిస్తున్నారు.

ఇది ఓటు బ్యాంకు రాజకీయం కదా పవన్?

సీఎం కేసీఆర్ ఇటీవలే సిద్ధిపేట జిల్లాలో కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును ప్రారంభించారు. మర్కుజ్ మండలంలోని వెంకటాపురం శివారులో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును వేదమంత్రోచ్ఛరణ మధ్య సీఎం కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెల్సిందే. ఈ ప్రాజెక్టుకు కాళేశ్వరం నీటిని కాల్వల ద్వారా తరలిస్తున్నారు. అయితే తాజాగా కొండపోచమ్మ సాగర్ కాల్వకు గండిపడటం ఆందోళన కలిగిస్తుంది. సిద్ధిపేట జిల్లాలోని జగదేవ్ పూర్, ఆలేరు నియోజకవర్గాల్లోని చెరువులను నింపేందుకు నీటిని తరలిస్తున్న క్రమంలో కొండపోచమ్మ సాగర్ కాల్వకు గండిపడినట్లు తెలుస్తోంది. దీంతో ప్రాజెక్టులోని నీళ్లలన్నీ గ్రామాల్లోకి వస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతోన్నారు.

వైసీపీలో విజయసాయిరెడ్డి సీన్ ముగిసిందా?

కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం మేఘా ఇంజనీరింగ్ సంస్థకు కట్టబెట్టింది. ప్రాజెక్టులోని ప్రధాన పనులన్నింటిని మేఘా ఇంజనీరింగ్ సంస్థ చేపట్టింది. మేఘా సంస్థ నాణ్యతలోపంతో నిర్మాణాలు చేపట్టినందువల్లే కొండపోచమ్మ సాగర్కు గండిపడిందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం, మేఘా సంస్థ పనితీరుపై రాజకీయ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. గండిపడి ఊళ్లోలోకి వస్తున్న నీళ్లను వీడియోలు తీసీ సోషల్ మీడియాలో పెడుతూ పలువురు వైరల్ చేస్తున్నారు.

ఇదిలా కొండపోచమ్మసాగర్ కాల్వ పనుల్లో కొన్ని పనులను ప్రభుత్వం స్థానికంగా ఉన్న కొందరు కాంట్రాక్టర్లకు అప్పగించినట్లు తెలుస్తోంది. సదరు కాంట్రాక్టర్లు నాణ్యతలోపంతో నిర్మించడంతోనే కొండపోచమ్మ సాగర్ కాల్వకు గండిపడినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రాజెక్టులో ప్రధాన పనులు చేపట్టిన మేఘా సంస్థ ఈ పనులను పర్యవేక్షించకపోవడం వల్లనే గండిపడిందని పలువురు ఆరోపిస్తున్నారు. కాల్వగండిపై ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సమాధానం ఇస్తుందో వేచి చూడాల్సిందే..!

కృష్ణ అండ్‌ హిజ్‌ లీల.. నెట్‌ఫ్లిక్స్‌కు బాయ్‌కాట్‌ సెగ


లాక్‌డౌన్‌ దెబ్బకు థియేటర్లు మూత పడడంతో నిర్మాతలు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటిదాకా థియేటర్లలో రిలీజైన తర్వాత ఓటీటీకి రైట్స్‌ అమ్ముకున్న నిర్మాతలు.. ఇప్పుడు చిన్న సినిమాలను నేరుగా ఓటీటీలకే ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలో రానా ద‌గ్గుబాటి స‌మ‌ర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ మూవీని ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు. పెరేవు రవికాంత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సిద్ధు, షాలినీ, శ్రద్ధ శ్రీనాథ్, సీరత్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రం యూత్‌ను బాగానే ఆకట్టుకుంది. కానీ, అంతకంటే ఎక్కువగా వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ మూవీకి హిందూవాదం సెగ తగిలింది. సినిమాలో దేవుడి పేరు పెట్టుకున్న కృష్ణ అనే యువకుడు అనేక మంది అమ్మాయిలతో శారీర‌క సంబంధాలు పెట్టుకోవ‌డంపై హిందుత్వ వాదులు అభ్యంత‌రం వ్యక్తం చేస్తున్నారు. పైగా దేవ‌త పేరు పెట్టుకున్న రాధ‌ అనే క్యారెక్టర్ను కూడా బాధితురాలిగా చూపించార‌ని ఆగ్రహిస్తున్నారు. ఈ మూవీ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వుందని, దీన్ని వెంటనే బాయ్ కాట్ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అంతేకాదు ఇలాంటి చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చిన నెట్‌ఫ్లిక్స్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో ట్విట్టర్లో ‘బాయ్ కాట్ నెట్ ఫ్లిక్స్’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటావా.. జగన్?

నెట్ ఫ్లిక్స్ లో అభ్యంతరకరమైన దృశ్యాలున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమ్ అవుతున్నాయని గతంలోనే ఆరోపణలు వచ్చిన వచ్చాయి. సాక్ర్డ్‌ గేమ్స్‌, లైలా, ఘౌల్‌, ఢిల్లీ క్రైమ్ వంటి ప‌లు వెబ్ సిరీస్‌లూ కూడా హిందూ వ్యతిరేకతను ప్రోత్సహించేలా ఉన్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ‘కృష్ణ అండ్ హిజ్ లీల’లో కూడా అలాంటి సన్నివేశాలు ఉండడంతో నెట్ ఫ్లిక్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత సంస్కృతిని, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఎటువంటి చిత్రాలను, షో స్‌ను అంగీకరించే ప్రసక్తే లేదని పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. దీనిపై చిత్రం బృందం, నెట్‌ఫ్లిక్స్‌ స్పందిస్తాయో లేదో చూడాలి.

అమీర్ ఖాన్ ఇంట్లో కరోనా కలకలం


కరోనా వైరస్‌ సాధారణ ప్రజల్నే కాదు సెలబ్రెటీలను కూడా హడలెత్తిస్తోంది. ఏ చిన్న పొరపాటు చేసినా వారి ఇళ్లకు చేరిపోతోంది. ముఖ్యంగా ముంబైలో ఈ మహమ్మారి ప్రభావం అధికంగా ఉంది. ఆ మహానగరం కేంద్రంగా ఉన్న బాలీవుడ్‌కు ఇప్పటికే కరోనా సెగ తలిగింది. పలువురు సినీ సెలెబ్రిటీలు వైరస్‌ బారిన పడ్డారు. తాజాగా స్టార్ హీరో అమీర్ ఖాన్ ఇంట్లో ఈ ప్రాణంతక వైరస్‌ కలకలం సృష్టించింది. ఆమిర్ వద్ద పని చేస్తున్న సిబ్బందిలో కొందరికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దాంతో, ఆమిర్ ఖాన్, ఆయన కుటుంబ సభ్యులు ఉలిక్కిపడ్డారు. అమీర్కు కూడా కరోనా సోకిందేమోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై స్పందించిన బాలీవుడ్‌ విలక్షణ నటుడు తాను క్షేమంగానే ఉన్నానని తెలిపాడు. కుటుంబ సభ్యులందరికీ టెస్టులు చేయించగా నెగిటివ్‌ ఫలితం వచ్చిందన్నాడు. తన తల్లికి మాత్రం ఇంకా పరీక్షలు జరగలేదని పేర్కొంటూ ట్విట్టర్ ద్వారా ఓ సుదీర్ఘ లేఖను పోస్ట్ చేశాడు.

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటావా.. జగన్?

‘నా స్టాఫ్ లో కొందరు కరోనా బారిన పడ్డారని తెలియజేస్తున్నాను. కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే అందరినీ క్వారంటైన్ చేశారు. సకాలంలో, అత్యంత వేగంగా స్పందించి నా స్టాఫ్ కు వైద్య సదుపాయాలను కల్పించిన బీఎంసీ (బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్)కి ధన్యవాదాలు. అంతేకాకుండా చుట్టుపక్కల ప్రాంతాలను ఫ్యూమిగేషన్, స్టెరిలైజ్ చేశారు.

మాలో మిగిలిన వారికి మాత్రం నెగెటివ్ అని తేలింది. ఇప్పుడు మా అమ్మను పరీక్షకు తీసుకెళ్తున్నా. మాకు సంబంధించిన వ్యక్తుల్లో ఆమే చివరి వ్యక్తి. ఆమెకు నెగెటివ్ రావాలని దయచేసి ఆ భగవంతుడిని ప్రార్థించండి. ఈ సందర్భంగా కోకిలాబెన్ ఆసుపత్రికి కూడా ధన్యవాదాలు. అక్కడి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అందిస్తున్న సేవలు చాలా గొప్పవి. టెస్టింగ్ విషయంలో వాళ్లు చాలా జాగ్రత్తగా, ప్రొఫెషనల్ గా వ్యవహరిస్తున్నారు. గాడ్ బ్లెస్ అండ్ స్టే సేఫ్‌. ప్రేమతో మీ అమీర్’ అని అమీర్ ట్వీట్ చేశాడు.

తెలంగాణలో వైద్యం అందని ద్రాక్షేనా?

కాగా, అమీర్ ప్రస్తుతం ‘లాల్ సింగ్ చద్దా’ అనే మూవీలో నటిస్తున్నాడు. టామ్ హాంక్స్ నటించిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ఫారెస్ట్ గంప్’కు ఇది రీమేక్. ‘సీక్రెట్ సూపర్ స్టార్’ దర్శకుడు అద్వైత్ చందన్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. అమీర్ సరసన కరీనా కపూర్ ఖాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమిర్ భార్య కిరణ్ రావు నిర్మిస్తున్న ఈ మూవీని 2020 క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్నారు.

https://twitter.com/aamir_khan/status/1277850257653555205

వైసీపీలో విజయసాయిరెడ్డి సీన్ ముగిసిందా?


వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్ వెన్నంటే ఉన్నాడు. జగన్ వ్యాపార సామ్రాజ్యాన్ని చూశాడు. జగన్ తోపాటు జైలుకెళ్లాడు. అందుకే జగన్ కు నమ్మిన బంటుగా మారాడు. వైసీపీ అధినేత జగన్ ఏకంగా విజయసాయిని రాజ్యసభ ఎంపీని చేసి పార్టీలో తన తరువాత అన్నీ తానై వ్యవహరించే నంబర్ 2 పోస్టును కట్టబెట్టారు.

అయితే వరుసగా పార్టీలో పెరిగిపోతున్న అసహనం.. ఎమ్మెల్యేల విమర్శలు.. ఇటీవల విజయసాయిరెడ్డి వల్లే వైసీపీ నాశనం అవుతోందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు చేసిన ఆరోపణలతో సీఎం జగన్ అలెర్ట్ అయినట్టు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటావా.. జగన్?

నేతలకు జగన్ ను విజయసాయిరెడ్డియే దూరం చేస్తున్నారనే వాదనలు వైసీపీలో ఎక్కువ అవుతున్న నేపథ్యంలో సీఎం జగన్ తన కోటరీని ప్రక్షాళన చేశారని సమాచారం. విజయసాయిరెడ్డి స్థానంలో ఇక సజ్జల రామకృష్ణ రెడ్డిని నియమించారని.. పార్టీ, పాలనలో జగన్ తర్వాత ఇప్పుడు సజ్జలనే అందరూ నేతలు కలవాలని చెప్పినట్టు ప్రచారం సాగుతోంది.

ఇన్నాళ్లు జగన్ ను కలవడానికి ముందు విజయసాయిని అందరూ కలిసేవారు. కానీ విజయసాయి మాత్రం ఎవరిని జగన్ కలవాలో డిసైడ్ చేసేవారు. దాంతోనే అసమ్మతి చెలరేగిందని.. అందుకే ఆయనను జగన్ పక్కనపెట్టినట్టు తెలిసింది.

ఏపీలో దారుణం.. మహిళా ఉద్యోగిపై అధికారి దాడి…

ఇక సజ్జల పూర్తి భిన్నమైన వ్యక్తి అని.. నేతలు, కార్యకర్తల కష్టాలు వింటూ జగన్ కు వివరిస్తూ సమస్యలు పరిష్కరిస్తుంటారు. ఆ క్రమంలోనే తన కోటరీలో జగన్ రెండో స్థానాన్ని సజ్జలకు ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. సజ్జల క్షేత్రస్థాయిలో పరిస్థితులను జగన్ కు వివరిస్తూ తాజాగా ఎమ్మెల్యేలతోనూ మీటింగ్ ల ఏర్పాటుకు నిర్ణయించాడని.. పార్టీలో వచ్చిన ఈ మార్పునకు సజ్జలనే కారణమని అంటున్నారు.

మొత్తంగా ఇన్నాళ్లు వైసీపీలో నంబర్2గా ఉన్న విజయసాయిరెడ్డి శకం ముగిసిందని.. జగన్ ఆయనను దూరం పెట్టారనే ప్రచారం ఆ పార్టీలో సాగుతోంది. ఇది నిజమా? అబద్ధమా అన్నది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది.

ఇది ఓటు బ్యాంకు రాజకీయం కదా పవన్?


ప్రశ్నించడానికే రాజకీయాలలోకి వచ్చానని చెప్పిన పవన్ కళ్యాణ్, కాపుల అభివృద్ధిపై వైసీపీ ప్రభుత్వ చిత్తశుద్ధి అనే అంశం ఎంచుకున్నారు. జూన్ 24న కాపు నేస్తం పథకం క్రింద, ఆర్థికంగా వెనుకబడిన కాపు,బలిజ, వెలమ,తెలగ మహిళల ఖాతాలలో రూ. 15 వేలు జమ చేయడం జరిగింది . ఈ అంశాన్నే పవన్ కళ్యాణ్ లేవనెత్తారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు ఏమిటి? ఇప్పుడు చేస్తున్నది ఏమిటీ?..అన్నారు. చేసిన వాగ్దానాలకు కాపులకు చేస్తున్నాదానికి పొంతనలేదు అన్నారు. కాపు కార్పొరేషన్ కి కేటాయించిన నిధులు, కాపు నేస్తం పథకం అర్హుల సంఖ్య వంటి విషయాలను విమర్శించారు. పనిలో పనిగా కాపుల రిజర్వేషన్ డిమాండ్ ని పక్క దోవపట్టించాడనికే ఈ కాపు నేస్తం పథకం అని ఎద్దేవా చేశారు.

ఏపీలో దారుణం.. మహిళా ఉద్యోగిపై అధికారి దాడి…

ఇక్కడ మనం గమనించాల్సింది జగన్ ఎన్నికల సమయంలోనే కాపుల రిజర్వేషన్ కేంద్ర పరిధిలో అంశం… కావున దానిని నెరవేరుస్తానని మీకు హామీ ఇవ్వలేను అన్నారు. కాపు సామాజిక వర్గ సంక్షేమం కోసం, ఇప్పటి వరకు కేటాయిస్తున్న నిధులు తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెట్టింపు చేస్తా అన్నారు. కాబట్టి కాపు రిజర్వేషన్స్ గురించి జగన్ వైఖరి ఎన్నికల ముందే బట్టబయలు చేసినప్పుడు, ఈ విషయంలో జగన్ ని నిలదీయం సబబు కాదు. అలాగే పవన్ మరో విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఆర్ధికంగా వెనుక బడిన ఉన్నత సామాజిక వర్గం కోసం…కేంద్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్ కల్పించింది. అందులో 5% రిజర్వేషన్ కాపులకు మాత్రమే చట్టం తేవాలన్నట్లు మాట్లాడారు.

స్వచ్ఛమైన రాజకీయాలు చేయడానికి వచ్చాను అని చెప్పుకొనే పవన్ ఆంద్రప్రదేశ్ లో వెనుకబడిన అన్ని సామాజిక వర్గాల కోసం కేటాయించిన రిజర్వేషన్ లో సగభాగం ఒక సామాజిక వర్గానికే దక్కాలని ఎలా అడుగుతారు. వీటిని ఓటు బ్యాంకు, కుల రాజకీయాలు కాక ఏమంటారు?. అధిక భాగం ఓటు షేరు కలిగిన కాపులకు ప్రాధాన్యం ఇచ్చి మిగతా సామాజిక వర్గాలకు అన్యాయం చేయండి అన్నట్లున్న ఆయన మాటలను సామాన్య ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి.

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటావా.. జగన్?

వెనుక బడిన ఉన్నత వర్గాల అభ్యున్నతి కోసం కేంద్రం ప్రవేశపెట్టిన 10% రిజర్వేషన్ సామాజిక వర్గాల వారిగా పంకాలు జరిపే అవకాశం, అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. కాపులను మభ్యపెట్టడానికి వారికి ప్రత్యేకంగా 5% రిజర్వేషన్ కేటాయిస్తున్నట్లు తీర్మానాలు చేసినా, జీవోలు తెచ్చినా వాటి అమలు సాధ్యం కాదు. గత ఎన్నికలకు ముందు అమలుకాదని తెలిసినా చంద్రబాబు ఆ 10% రిజర్వేషన్ లో 5% రిజర్వేషన్ కేవలం కాపులకు మాత్రమే అని అసెంబ్లీలో తీర్మానం చేశారు. మరి ఇప్పుడు కూడా జగన్ కాపు ఓట్ల కోసం అమలుకాదని తెలిసినా మభ్య పెడుతూ ఓ జిఓ తేవచ్చు. దాని వలన జగన్ చిత్త శుద్ధిని కాపులు ప్రశ్నించాల్సివస్తుంది.

భారత్ లో చైనా యాప్స్ కి మంగళం?

Tik tok

టిక్ టాక్ వంటి చైనా యాప్ లు భారత్ లో అత్యంత ప్రజాధరణను పొందిన విషయం తెలిసిందే.. అయితే టిక్‌ టాక్‌ తో స‌హా మొత్తం 59 చైనా యాప్స్‌ పై భార‌త ప్రభుత్వం నిషేధం విధించిన నేప‌థ్యంలో ‘టిక్‌ టాక్ ఇండియా’ నేడు ఓ ప్రక‌ట‌న విడుదల చేసింది. వినియోగదారుల సమాచార భద్రత, గోప్యత విష‌యంలో భార‌తీయ చ‌ట్టాల‌కు లోబ‌డి ఉన్నట్లు పేర్కొంది. భార‌తీయ వినియోగదారులకు సంబంధించిన స‌మాచారాన్ని విదేశీ ప్రభుత్వాల‌తో పంచుకోలేదని చెప్పుకొచ్చింది. చైనాకు కూడా తాము ఎలాంటి స‌మాచారాన్ని అందజేయలేదని వివరణ ఇచ్చింది. ఒక‌వేళ ఎవ‌రైనా భ‌విష్యత్తులో స‌మాచారం కోరినా.. అందజేసే ప్రసక్తే లేదని తెలిపింది. వినియోగదారుల సమాచార భద్రత, గోప్యతకే తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పుకొచ్చింది.

టిక్‌ టాక్ ఇండియా యాప్‌ నకు సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింద‌ని ఆ యాప్ ఇండియన్ చీఫ్‌ నిఖిల్ గాంధీ తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి వివరణ ఇస్తామని చెప్పారు. టిక్‌ టాక్‌ ని భారతీయులకు మరింత దగ్గర చేసేందుకు 14 భాషల్లోకి మార్చామన్నారు. చాలా మంది టిక్‌ టాక్‌ పై ఆధారపడి ఉపాధి పొందుతున్నారని.. టిక్‌ టాక్‌ ని నిషేధిస్తే వారంతా సమస్యలు ఎదుర్కొంటారని చెప్పుకొచ్చారు.

ఇది కరెంట్‌ బిల్లా.. వీకెండ్‌ సినిమా కలెక్షనా!


కరోనా దెబ్బకు ఉద్యోగాలు కోల్పోయి, ఉపాధి కోల్పోయి ప్రజలు ఇబ్బంది పడుతుంటే బిల్లుల పేరుతో వారి జేబులు గుల్ల చేస్తున్నాయి ప్రభుత్వాలు. ముఖ్యంగా లాక్‌డౌన్‌ టైమ్‌లో కరెంట్‌ బిల్లులు అందరినీ ఇబ్బంది పెడుతున్నాయి. సామాన్యులకే కాదు సెలబ్రిటీలకు ఈ బిల్లులు షాకిస్తున్నాయి. తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇదే తంతు జరుగుతోంది. ఊహించని మొత్తంలో బిల్లులు రావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే హీరోయిన్లు స్నేహ, కార్తీక, తాప్సీ వంటి ప్రముఖులు తమ ఇళ్లకు వచ్చిన కరెంట్ బిల్లులు చూసి షాకయ్యారు. వాటి గురించి ఫిర్యాదు చేయడంతో పాటు సోషల్‌ మీడియా వేదికగా నిరసన తెలిపారు.

బతికుంటే బలుసాకు తిందాం.. ఇంటికి పోదాం!

ఇప్పుడు టాలీవుడ్‌ యంగ్ హీరో సందీప్ కిషన్ కు ప్రభుత్వం కరెంట్‌ బిల్లుతో షాకిచ్చింది. తన ఇంటికి వచ్చిన బిల్లు చేసి బిత్తరపోయిన ఈ యంగ్‌ స్టర్ దీని గురించి ట్వీట్ చేశాడు. ఇది కరెంటు బిల్లా.. లేక కొత్త సినిమా వీకెండ్‌ కలెక్షనా అని సెటైర్ వేశాడు. ‘మా ఇంటి దగ్గర ఎలక్ట్రిసిటీ బోర్డు (కరెంట్) మీటర్ చూస్తుంటే అంచనాలకు అందని చిన్నప్పటి ఆటో రిక్షా మీటర్ గుర్తొస్తోంది. ఏంది సార్ ఆ బిల్లు. నెక్ట్స్ ఎవరి ఇంటికి ఎక్కువ బిల్లు వచ్చిందని ఆన్‌ లైన్‌లో వార్ స్టార్ట్‌ ఐనా ఆశ్చర్యం లేదు. ఈబీ (కరెంట్‌) బిల్స్‌ కొత్త సినిమాల వీకెండ్ కలెక్షన్ రిపోర్ట్స్‌ను తలపిస్తున్నాయి’ అని  సందీప్ పేర్కొన్నాడు.

బాలీవుడ్‌లో ‘బంధుప్రీతి’కి నేనూ బాధితురాలినే


ప్రియాంక చోప్రా. మాజీ మిస్‌ వరల్డ్‌. మోడలింగ్‌ నుంచి సినిమాల్లో అడుగుపెట్టి బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ ఎదిగిన టాలెంటెడ్‌ యాక్ట్రెస్. అక్కడి నుంచి హాలీవుడ్‌లో అడుగు పెట్టి గ్లోబల్‌ స్టార్ గా మారిందామె. పాప్‌ సింగర్ నిక్ జొనాస్‌ను పెళ్లి చేసుకొని యూఎస్‌లో సెటిలైందామె. ఇంత సక్సెస్‌ సాధించిన ప్రియాంక కూడా కెరీర్ తొలి నాళ్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొందట. బాలీవుడ్‌లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన ‘బంధుప్రీతి’ (నెపోటిజం)లో తాను కూడా ఓ బాధితురాలినే అని ప్రియాంక వెల్లడించింది. మిస్‌ వరల్డ్‌ కిరీటం గెలిచి.. సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత కొన్ని అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పింది.

తెలంగాణలో వైద్యం అందని ద్రాక్షేనా?

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో నెపోటిజానికి వ్యతిరేకంగా పలువురు సినీ ప్రముఖులు గళమెత్తుతున్నారు. దీని గురించి ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. బాలీవుడ్‌లో అన్ని రకాలుగా బంధుప్రీతి ఉన్నదన్న పీసీ.. గొప్ప వారసత్వం ఉన్న కుటుంబంలో పుట్టడం తప్పేమీ కాదని అభిప్రాయపడింది. అయితే, బయటి వ్యక్తులు ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు అనేక అవాంతరాలు దాటాల్సి వస్తే.. తమ కుటుంబ పేరు నిలబెట్టాలన్న ఒత్తిడి స్టార్ కిడ్స్‌పై ఉంటుందని చెప్పింది. అందువల్ల యాక్టర్ సొంతంగానే ప్రయాణం సాగించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది. తన ప్రయాణంలో ఎదురైనా అవంతరాల గురించి ఆమె మాట్లాడింది.

కేసీఆర్ కు కరోనా మరక.. వదిలేలా లేదుగా?

తాను కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చానని… ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని ప్రియాంక చెప్పింది. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో రెకమెండేషన్ తో వచ్చిన ఒక హీరోయిన్ కోసం, తనను ఓ సినిమా నుంచి తప్పించారని తెలిపింది. దాంతో, తాను చాలా ఏడ్చానని కానీ తొందర్లోనే దాన్ని మరిచిపోయి ముందడుగు వేశానని చెప్పింది. అదే ఇంటర్వ్యూలో, ఆమె కూడా ‘వైఫల్యం’ గురించి కూడా మాట్లాడింది. వైఫల్యం గురించి తనకు భయం లేనప్పటికీ అది తనకు నచ్చదని చెప్పింది. సినీ ప్రముఖుల జీవితాలను మారథాన్‌ రన్నర్లతో పోల్చిన పీసీ వారిపై ఎన్నో బాధ్యతలు ఉంటాయంది. ఒక సెలబ్రిటీ అనారోగ్యానికి గురై షూటింగ్ రద్దు చేస్తే 300 మందికి వేతనం రాదని గుర్తు చేసింది. అందువల్ల ప్రతి ఒక్కరి పనిని ఎలా గౌరవించాలో తనకు తెలుసని, అలాగే, తాను ఎంచుకున్న లక్ష్యాన్ని ఎలా అందుకోవాలనే విషయంలో స్వీయ శిక్షణ తీసుకున్నానని చెప్పుకొచ్చింది.