Home Blog Page 8382

జేసీ రెడ్డప్ప ఇంత దూకుడు పనికిరాదప్పా?

JC Prabhakar Reddy

JC Prabhakar Reddy

జేసీ ట్రావెల్స్ బస్సుల అక్రమాల కేసులో ఇరుక్కొని నెలరోజులుగా జైల్లో ఉంటున్నా కూడా టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిల తీరు మారకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రత్యర్థి సీఎం జగన్ ఎంతో పట్టబట్టి మరీ ఈ జేసీ ఫ్యామిలీని టార్గెట్ చేసి సీమ ప్రతీకారాలు తీర్చుకుంటున్నాడనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. అధికారంలో ఉన్న పార్టీకి ఎదురెళ్లలేక చాలా మంది టీడీపీ నేతలు మౌనం దాల్చారు. కొందరు అజ్ఞాతంలోకి వెళ్లారు.

మరికొందరు వైసీపీలోనే చేరుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఒకసారి జైలుకు వెళ్లి వచ్చినా కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి తగ్గకపోవడం.. ఏకంగా తొడగొట్టి అడ్డుకున్న పోలీసులను బెదిరించడం సంచలనంగా మారింది.

జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా బెయిల్ పై విడుదలయ్యారు. బయటకు రాగానే పోలీసులపై జేసీ దివాకర్ రెడ్డి తన ప్రతాపం చూపించారని తాజా వీడియోను బట్టి తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరించారు. నీ అంతు చూస్తానంటూ ఆయన సీఐని బెదిరించడం వీడియోలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో దృశ్యాలు టీవీ చానెళ్లలోనూ ప్రసారమయ్యాయి.

Also Read: చిరంజీవితో వీర్రాజు బేటీ.. కారణమిదేనా?

బెయిల్ పై విడుదలై తాడిపత్రికి వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డికి స్వాగతం చెప్పడానికి పెద్ద ఎత్తున అనుచరులు వచ్చి ర్యాలీ తీశారు. ఈ క్రమంలోనే అంబులెన్స్ లకు దారి కూడా ఇవ్వకుండా జేసీ ర్యాలీ కాన్వాయ్ సాగింది. వారిని నియంత్రించడానికి ప్రయత్నించిన పోలీసులు, సీఐపై జేసీ ప్రభాకర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారు. కారు దిగి పోలీసులపైకి ఉరిమి చూస్తూ చేతులు చూపిస్తూ బెదిరింపులకు దిగాడు. తన అనుచరులతో కలిసి పోలీసులపైకి దూసుకెళ్లారు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కాగా నెలరోజులుగా జేసీ ప్రభాకర్ రెడ్డి జైల్లో ఉన్నా ఏమాత్రం తగ్గకుండా బయటకొచ్చాక ఏకంగా పోలీసులపైనే దురుసుగా ప్రవర్తించడంతో వైసీపీ ప్రభుత్వం కూడా కాస్త గట్టిగానే రియాక్ట్ అయ్యింది. వెంటనే అనంతపురం పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డికి షాకిచ్చారు. పోలీస్ విధులకు ఆటంకం కలిగించినందుకు జేసీ ప్రభాకర్ రెడ్డిపై సెక్షన్ 353తోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసినట్టు అనంతపురం పోలీసులు తెలిపారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం.. వీడియోలో జేసీ ప్రభాకర్ రెడ్డి తిట్టినట్టు కన్ఫం కావడంతో ఇప్పుడు ఆయన చిక్కుల్లో పడ్డట్టు అయ్యింది.

Also Read: ఈనాడు రామోజీరావుకు షాక్ తగలనుందా?

సీఎం జగన్ కు ఎదురెళ్లి ఇప్పటికే కష్టాల పాలయ్యారు జేసీ ప్రభాకర్ రెడ్డి. చంద్రబాబు హయాంలో జగన్ ఫ్యామిలీపై దారుణమైన వ్యాఖ్యలు చేసినందుకే ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారని ప్రచారం ఉంది. మరి బెయిల్ పై విడుదలై వచ్చాక కూడా అదే దూకుడును జేసీ ప్రభాకర్ రెడ్డి చూపడం ఆయనను మరింత కష్టాల పాలు చేస్తుందన్న విశ్లేషణలు అనంతపురం జిల్లాలో సాగుతున్నాయి. ప్రతిపక్షంలో ఉండగా ఇంత దూకుడు పనికిరాదని పలువురు నేతలు హితవు పలుకుతున్నారు. ఎంతో ఫైర్ బ్రాండ్ అయిన జేసీ దివాకర్ రెడ్డి సైతం మౌనంగా ఉన్న వేళ ఆయన తమ్ముడు ప్రభాకర్ రెడ్డి మాత్రం తగ్గకపోవడం.. అటు జగన్ సర్కార్ గట్టిగానే ఉండడంతో ఈ ఎపిసోడ్ మరింత రక్తికట్టడం ఖాయమన్న ప్రచారం జిల్లాలో సాగుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డికి మరిన్ని కష్టాలు తప్పేలా లేవంటున్నారు.

వీడియో
https://www.facebook.com/watch/?v=388884605413933

చిరంజీవితో వీర్రాజు బేటీ.. కారణమిదేనా?

Chiranjeevi

Chiranjeevi

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పదవీ బాధ్యతలు చేపట్టాక తొలిసారి మెగాస్టార్ చిరంజీవితో బేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సోము వీర్రాజు మెగాస్టార్ ను కలుకోవడంలో అంతర్యం ఏంటనే చర్చ ఏపీలో జోరుగా చర్చ సాగుతోంది. సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడు అయ్యాక ఇప్పటివరకు తన మిత్రపక్షమైనా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నే కలుసుకోలేదు. వీరిద్దరి ట్వీటర్లో శుభాకాంక్షలు తప్ప నేరుగా ఇప్పటివరకు కలుకున్న దాఖలు లేవు. అలాంటిది చిరంజీవితో సోము వీర్రాజు బేటి కావడం వెనుక అంత్యర్యం ఏంటనే చర్చ నడుస్తోంది.

Also Read: ఈనాడు రామోజీరావుకు షాక్ తగలనుందా?

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా వీర్రాజు నియామకం అయినప్పటికీ ఆయన దూకుడుగా వెళుతున్నారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరి చంద్రబాబుకు వత్తాసుగా మాట్లాడే నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. పార్టీలోని రెబల్స్ ను ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తూ ముందుకెళుతున్నారు. షోకాజ్ నోటీసులు ఇస్తూ చంద్రబాబు కోవర్టులను ముప్పుతిప్పలు పెడుతున్న సంగతి తెల్సిందే. అలాగే ఏపీలోని కాపు సామాజిక వర్గ నేతలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఏపీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను బీజేపీ ఆహ్వానించేందుకు యత్నిస్తున్నారు.

ఏపీలో బీజేపీ పడేందుకు కాపు సామాజిక వర్గంపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కాపు నేతలను పార్టీలో భారీగా చేర్చుకునేందుకు యత్నిస్తుంది. ఏపీలోని కాపు సామాజిక వర్గంలోని నేతలు అటు వైసీపీ, టీడీపీ, జనసేనలకు మద్దతు ఇస్తుండటంతో ఓట్లు చిలీపోతున్నాయి. ఏపీలో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే సొము వీర్రాజు తాజాగా చిరంజీవితో బేటి అయినట్లు తెలుస్తోంది.

Also Read: ప్రభుత్వానికి న్యాయపరమైన చిక్కులు తప్పవా?

చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ కాపు సామాజికవర్గంలో ఆయనకు మంచి క్రేజ్ ఉంది. మోగస్టార్ మద్దతును కూడగట్టడం ద్వారా వీర్రాజు అడుగులు పక్కాగా పడుతున్నాయనే టాక్ విన్పిస్తుంది. కాపు నేతలందరినీ సోము వీర్రాజు ఐక్యం చేసేందుకు యత్నిస్తున్నారనే సంకేతాలు బయటికి వెళుతున్నాయి. ఇది బీజేపీకీ కలిసొచ్చే అంశమే. ఇక జనసేనకు కూడా కాపుల్లో మంచి ఓటు బ్యాంకు ఉంది. 2024 ఎన్నికల్లో కాపు ఓటు బ్యాంకును గంపగుత్తగా లాగి ఏపీలో బీజేపీ బలపడాలని చూస్తోంది. ఇందులో భాగంగానే సోము వీర్రాజు మెగాస్టార్ ఇంటికి వెళ్లి భేటి అయినట్లు తెలుస్తోంది. వీరిద్దరి బేటి రాజకీయం ప్రాధాన్యత సంతరించుకుంది.

రమ్యకృష్ణ దెబ్బకు సక్సెస్ పోగొట్టుకున్న డైరెక్టర్ !

Ramya krishna

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ తరం క్రియేటివ్ డైరెక్టర్స్ లో ముందు వరుసలో నిలిచే పేరు ‘కృష్ణ వంశీ’. హీరోయిన్ రమ్యకృష్ణతో చాలా సంవత్సరాలు ప్రేమ వ్యవహారం నడిపి ఫైనల్ గా రమ్యకృష్ణనే వివాహం చేసుకున్నాడు. అయితే గత కొంత కాలంగా రమ్యకృష్ణ అండ్ కృష్ణ వంశీ బంధం అంత గట్టిగా లేదని రూమర్స్ వస్తున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ గా ఒకప్పుడు మంచి సినిమా తీసిన ఈ డైరెక్టర్ ప్రస్తుతం వరుస ప్లాప్ లతో డీలా పడ్డాడు. కెరీర్ డౌన్ కావడానికి కారణం పర్సనల్ లైఫ్ లోని లోటే అని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్. నిజానికి రమ్యకృష్ణ బోల్డ్ హీరోయిన్. ఇరవై ఏళ్ల క్రితమే బికినీలు వేసి సంచలనం సృష్టించిన హీరోయిన్.

ఆమెలోని ఆ బోల్డ్ కారణంగా సహజమైన ఇల్లాలుగా మారలేకపోయింది. రెమ్యునరేషన్ కోసమో.. లేక గ్లామర్ మీద ఇష్టమో ఏమో తెలియదు గాని, రమ్యకృష్ణ ఇప్పుడు కూడా కొన్ని సినిమాల్లో బోల్డ్ పాత్రలకు గ్రీన్ సిగ్నిల్ ఇస్తోంది. మరి ఇలాంటి హీరోయిన్ తో క్రియేటివ్ డైరెక్టర్ కాపురం సరిగ్గా జరడం లేదనేదే మెయిన్ సమస్య అట. నిజానికి గత కొన్ని సంవత్సరాలుగా కృష్ణవంశీ హైదరాబాద్ లో ఉంటుండగా రమ్యకృష్ణ మాత్రం చెన్నైలో ఉంటుంది. ఇటివలే లెక్కకు మించిన బీరు బాటిల్స్ తో చిక్కి తన లైఫ్ స్టైల్ ఏమిటో మొత్తానికి పబ్లిక్ చేసుకుంది.

ఏది ఏమైనా ఒక మంచి డైరెక్టర్ తన భార్య కారణంగా కేరీర్ పై ఫోకస్ చేయలేకపోవడం బాధాకరమైన విషయమే. ఇప్పటికే తన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేక డిజాస్టర్ లుగా నిలవడంతో కృష్ణవంశీకి స్టార్ హీరోలందరూ దూరం అయిపోయారు. పాపం ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా తన హావా చూపించిన ఈ క్రియేటివ్ డైరెక్టర్.. చివరికి ఎవరూ సినిమా ఇవ్వక, తానే ఓన్ గా సినిమా తీసుకునే పరిస్థితికి రావడం బ్యాడ్ లకే.

ప్రస్తుతం ఈ క్రియేటివ్ డైరెక్టర్ రీమేక్ చేస్తోన్న సినిమా ‘రంగమార్తాండ’. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ మెయిన్ రోల్ చేస్తుండగా.. ఇక ప్రకాష్ రాజ్ సరసన రమ్యకృష్ణ హీరోయిన్ గా నటిస్తోంది. అన్నట్లు ఈ సినిమా చేయడానికి ఆమె రెమ్యునరేషన్ ని కూడా తీసుకుంటుందట. భర్త దగ్గర కూడా రెమ్యునరేషన్ ను వదిలిపెట్టలేదు అన్నమాట.

ఈనాడు రామోజీరావుకు షాక్ తగలనుందా?

Ramojirao

Ramojirao
చరిత్ర కనివీనీ ఎరుగని కరోనా ఉత్పాతానికి అన్ని సంస్థలు విలవిలలాడుతున్నాయి. ముఖ్యంగా 40 ఏళ్లుగా నిర్మించుకున్న సామ్రాజ్యాలు కూలిపోతుండడంతో నిస్సహాయంగా చూస్తూ ఉన్నాడు ఆ మీడియా టైకూన్ ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు. ఇప్పుడు ఆయన తన పత్రికను నడిపించలేక ఉద్యోగులను సాగనంపుతున్న వైనం చర్చనీయాంశమవుతోంది.

Also Read: ప్రభుత్వానికి న్యాయపరమైన చిక్కులు తప్పవా?

అయితే ఎప్పుడు పవర్ ఫుల్ గా ఉండే రామోజీకి ఉద్యోగుల తీసివేతతో కష్టాలు వచ్చిపడ్డాయి. వారు నిరసనలు తెలుపడం.. అవి మీడియాలో రావడంతో రామోజీ రావు ప్రతిష్ట మసకబారుతోంది.

తాజాగా ఈనాడులో తొలగించిన 400 మంది ఉద్యోగులు పోరుబాట పట్టడం ఆ సంస్థకు, అధినేతకు మింగుడు పడని అంశంగా మారిందట.. ఆ 400 మంది ఉద్యోగులు ఈనాడు సంస్థల ముందుతోపాటు రామోజీరావు స్వగ్రామంలో నిరసనకు ప్లాన్ చేయడం శరాఘాతంగా మారిందని సమాచారం. తాజాగా ఈనాడులో వేటుపడ్డ ఉద్యోగులందరూ నిరసనకు ప్లాన్ చేసినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ప్రచారం చేసుకుంటున్నారు.

ఈ 400 మంది ఉద్యోగులు రామోజీరావు స్వస్థలమైన కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలో ఈనెల 13న భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటనలు విడుదల చేయడం గమనార్హం. అంతకుముందు రోజు హైదరాబాద్ లోని ప్రధాన కార్యాలయం ఎదుట తీసేసిన ఉద్యోగులంతా నిరసన చేపట్టాలని ప్లాన్ చేశారట..

Also Read: చంద్రబాబు ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం..!

వాళ్లకు ఈనాడు మేనేజ్ మెంట్ సెటిల్ చేయలేదని.. అలాగే లేబర్ కమిషనర్ వద్ద కూడా ఈనాడు ప్రతినిధులు చర్చించలేదని సమాచారం. దీంతో ఈ 400మంది ఉద్యోగులు పోరుబాట పట్టినట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ఇప్పుడు రామోజీరావుకు ఇంతకంటే అవమానం లేదని.. సొంతూళ్లో నిరసన తెలిపితే ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న చర్చ మీడియా వర్గాల్లో సాగుతోంది.

ప్రభుత్వానికి న్యాయపరమైన చిక్కులు తప్పవా?

AP Govt

AP Govt

మూడు రాజధానుల వ్యవహారంలో న్యాయపరంగా వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పేలా లేవు. ఎందుకంటే రాజధాని తరలింపు, నిపుణుల కమిటీ, హైపర్ కమిటీ, పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటీషన్లపై విచారణ చేసిన హై కోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. అమరావతిలో రాజధాని నిర్మాణం మధ్యలో నిలిపివేసి మరొ చోటికి తరలించడం వల్ల ప్రజాధనం వృదా అవుతుందని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని కీలక వ్యాఖ్యలను ధర్మాసనం చేసింది. ఇప్పటి వరకూ రాజధాని ప్రాంతంలో రూ.52 వేల కోట్లకు సంబంధించిన పనులు చేపట్టినట్లు సీఆర్డీఏ దాఖలు చేసిన కౌంటర్ పిటీషన్ లో పేర్కొంది. ఇందుకు సంబంధించి ఏఏ నిర్మాణాలకు ఎంత ఖర్చు చేశారో న్యాయస్థానానికి వివరాలు సమర్పించాలని సీఆర్డీఏను ధర్మాసనం ఆదేశించింది.

Also Read: చంద్రబాబు ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం..!

ప్రభుత్వ ఖజనాకు వేల రూ.వేల కోట్లు నష్టం వాటిల్లుతుంటే చూస్తూ ఎలా ఉందేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. త్రిసభ్య ధర్మాసనంలో జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తిలు ఉన్నారు. ప్రజాధనాన్ని ఈ విధంగా వృదా చేయడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజధాని తరలింపు, పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు, నిపుణుల కమిటీ, హైపర్ కమిటీ వంటి అంశాలలో ఇప్పటి వరకూ సుమారు 35 పిటీషన్ లు దాఖలైనట్లు సమాచారం. ఈ పిటీషన్లను అన్నింటినిపై ఈ నెల 14వ తేదీన తదుపరి విచారణ నిర్వహించాలని హై కోర్టు ధర్మాసనం నిర్ణయించింది. అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాలపై కౌంటర్ దాఖలు చేస్తామని న్యాయస్థానానికి విన్నవించింది. 14వ తేదీ నాటికి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వాదన ఏంటనే అంశంలో క్లారిటీ రానుంది. అకౌంటెంట్ జనరల్ ను ప్రతివాదిగా చేయాలని దాఖలైన పిటీషన్ ను వచ్చే విచారణకు తమ ముందు ఉంచాలని ధర్మాసనం న్యాయస్ధానం అధికారులను ఆదేశించింది.

Also Read: మీ చావు మీరు చావండి.. ఏపీపై కేంద్రం నిర్ణయమిదే?

మరోవైపు మూడు రాజధానుల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తమకు సంబంధం లేదని చేతులు దులుపేసుకోవడం వైసీపీ ప్రభుత్వానికి ఒక రకంగా కలిసి వచ్చే అంశమే. అయితే న్యాయపరంగా ఎదురయ్యే చిక్కులను ఎదుర్కొవడమే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉన్న అతి పెద్ద సవాల్ గా భావించాలి. ఇది కేవలం రాజధాని రైతులు, అమరావతి ప్రాంత ప్రజలకు మాత్రమే సంబంధించిన అంశమే కాకుండా ఆర్దిక, చట్టపరమైన అంశాలు ఇమిడి ఉన్నందున ఒకటి… రెండు రోజుల్లో తేలే వ్యవహారం కాదని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. రాష్ట్ర రాజధాని అంశం తమ పరిధిలో లేని అంశం అని కేంద్రం కౌంటర్ దాఖలు చేయడాన్ని సవాల్ చేస్తూ పిటీషన్ లు దాఖలు చేసేందుకు పలువురు సిద్ధమయ్యారు. ఈ పిటీషన్ లు నేడో.. రేపో హై కోర్టులో దాఖలు చేసే అవకాశం ఉంది.

విషాదపు ప్రేమ కథ.. ప్రతి పాత్ర వెనుక ఒక కథ !

Meka Suri

Meka Suri

‘మేక సూరి’… ఈ కరోనా కాలంలో ఎంటర్టైన్మెంట్ అండ్ మంచి సినిమా లేదు అని బాధ పడేవారికి జీ5 వారు అందించిన లేటెస్ట్ సినిమా ఇది. గొప్ప కథకు ఆసక్తికరమైన కథనానికి స్టార్స్ అక్కర్లేదు అని నిరూపించిన సినిమా ఇది. ఈ సినిమా చూశాక, తెలుగు సినిమాను కూడా ఇంత సహజంగా తీస్తారా అనిపిస్తుంది. రక్తమాంసాలు ఉన్న పాత్రల తాలూకు గొప్ప జర్నీని సినిమాలో చూపించిన విధానం అద్భుతమైనది. ఇలాంటి సినిమాని ఏ స్టార్ డైరెక్టరో లేక ఏ తల పండిన రచయితో తీసాడు అనుకుంటే.. త్రినాథ్‌ వెలిసెల అనే ముప్పై ఏళ్ల కుర్రాడు తీసాడట. అబ్బా.. అతని పనితనంకు ప్రత్యేక అభినందనలు చెప్పాలి.

Also Read: రష్మిక మైండ్ కరాబు చేస్తున్న హీరో

అతను రాసుకున్న స్క్రీన్ ప్లే గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మనవాళ్ళు అంతా తెలుగులో గొప్ప సినిమాలు రావు అంటారు గాని, నిజంగా ఇలాంటి గొప్ప సినిమా వచ్చినప్పుడు ఎందుకు చూడరు. మంచి సినిమా చూడాలనుకునే వారు జీ5 లో ఉన్న ఈ ‘మేక సూరి’ సినిమాని చూడండి. ప్రతి పాత్రకు ఒక కథ ఉంటుంది. అసలు ఇలాంటి ప్రేమ కథలో అద్భుతమైన సస్పెన్స్ ను పెట్టడం అంటే మాటలా.. అరె కొత్త మొహాలతో ఇంత అవుట్ ఫుట్ ఈ త్రినాథ్‌ వెలిసెల అనే కుర్ర డైరెక్టర్ ఎలా రాబట్టిగలిగాడో.

Also Read: స్పీడున్నోడు.. స్పీడు పెంచాడు..

అనుభూతితో కూడా విషాదపు ప్రేమ కథను థ్రిల్ చేస్తూ చెప్పడం.. పైగా అనేక భావోద్వేగాల సమ్మేళనంలా సాగిన ఈ సినిమా తెలుగు న్యాచురల్ సినిమాల్లో మరో సినిమాగా నిలిచిపోతుంది. ఇక ఈ సినిమాలో చివరిదాకా ఏం జరుగుతుందో.. హీరోయిన్ ను ఎవరు చంపారో అనే పాయింట్ ను అండ్ ట్విస్ట్ ను దర్శకుడు త్రినాథ్‌ వెలిసెల చాలా ఇంట్రస్ట్ గా చెప్పాడు. క్లైమాక్స్ ముగిసే సరికి సినిమా పై దర్శకుడి పై గౌరవం కలుగుతుంది. అలాగే పార్థు సైనా ఛాయాగ్రహణంతో పాటు ప్రజ్వల్‌ క్రిష్‌ సంగీతం ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. వారి నుండి తన కథకు తగ్గ అవుట్ ఫుట్ ను దర్శకుడు చాలా బాగా రాబట్టుకున్నాడు. డిజిటల్ ప్లాట్ ఫామ్ లో బాగా ఆకట్టుకుంటున్న ఈ సినిమాని చూసి మంచి అనుభూతి పొందండి. ఫేమస్ డిస్ట్రిబ్యూట్ కార్తీక్ కంచెర్లకు చెందిన సింబా ఎంటర్‌టైన్మెంట్ ఈ సినిమాని నిర్మించింది.

చంద్రబాబు ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం..!

Chandrababu Naidu

Chandrababu Naidu
అమరావతి విషయంలో అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో తప్పటడుగులు వేసిన చంద్రబాబు ఇప్పడు విశాఖకు రాజధాని తరలింపును అడ్డుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఈ తంటాల్లో ఒకటి కేంద్రం సహకారం కోరడం. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదం అనంతరం వరుసగా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్న చంద్రబాబు తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమరావతి నుంచి రాజధానిని తరలించే అంశంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. కేంద్రం సాయంతో రాజధానిని తరలింపును అడ్డుకోవాలన్న చంద్రబాబు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

Also Read: జగన్ పై గురి పెట్టిన ఎంపీ రఘురామ..!

చంద్రబాబు తన అభిప్రాయాన్ని వెల్లడించిన మరుసటి రోజే కేంద్రం రాష్ట్ర రాజధాని విషయంలో తన వైఖరిని వెల్లడించింది. రాజధాని తరలింపు కేసులో హై కోర్టులో కౌంటర్ దాఖలు చేసిన కేంద్రం రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం లేదని, ఇధి పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అంశమేనని లిఖిత పూర్వకంగా తేల్చి చెప్పింది. దీంతో చంద్రబాబు ఆశలను కేంద్రం అడియాశలు చేసినట్లయ్యింది. ఇన్నాళ్లు బీజేపీలోని తన వర్గం నాయకులతో రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని, అమరావతి తరలింపును అడ్డుకుంటుందని ప్రకటనలు చేయించిన చంద్రబాబు వ్యూహం కేంద్రం దాఖలు చేసిన కౌంటర్ తో బయట పడిందని ఇప్పడు చంద్రబాబు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

Also Read: మరో వివాదంలోకి ఎస్వీబీసీ..!

ఇక అమరావతిని తన బ్రాండ్ గా చేసుకున్న చంద్రబాబుకు చివరి న్యాయ పోరాటం తప్ప మరో మార్గం లేదు. ఇప్పటికే రాజధాని తరలింపు, పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు తదితర అంశాలపై పలువురితో టిడిపి హై కోర్టు, సుప్రీం కోర్టులలో పిటీషన్ లు దాఖలు చేయించింది. న్యాయ పోరాటంతో నైనా అమరావతి నుంచి విశాఖకు రాజధాని తరలింపును అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం అంత తేలిగ్గా తీసుకోలేదు. న్యాయపరంగా ఎదురయ్యే సమస్యలపై నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రాజధాని తరలింపునకు న్యాయ పరంగా ఎదురయ్యే సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలపై అన్వేషణపై చర్యలు ప్రభుత్వం చేపట్టింది.

స్పీడున్నోడు.. స్పీడు పెంచాడు..


ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేశ్‌ బాబు కుమారుడిగా ఈజీగానే ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. తండ్రి, అన్న గణేష్‌ బాబు ప్రొడ్యూస్‌ చేసిన అల్లుడు శీను మూవీతో తెరంగేట్రం చేశాడు. వీవీ వినాయక్‌ లాంటి స్టార్ డైరెక్టర్, అప్పటికే టాప్‌ ప్లేస్‌లో ఉన్న సమంత హీరోయిన్‌.. ఫుల్‌ క్రేజ్‌ ఉన్న దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్.. 40 కోట్ల బడ్జెట్‌తో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా తన కుమారుడు గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చేలా చూసుకున్నాడు సురేశ్‌. మూవీ కూడా ఫర్వాలేదనిపించింది. ఆ మూవీ వచ్చింది 2014లో అయితే ఈ ఆరేళ్లలో సాయి శ్రీనివాస్‌ కేవలం ఏడు సినిమాలే చేయగలిగాడు. అందులో హిట్ల కంటే ఫెయిల్యూర్సే ఎక్కువ. కథ, కథనం పరంగా అతని లాస్ట్ మూవీ రాక్షసుడు బాగానే ఉన్నా సరైన పబ్లిసిటీ లేక ఎక్కువ కలెక్షన్స్‌ రాబట్టలేకపోయింది. బ్యాక్‌గ్రౌండ్‌ బాగానే ఉన్నా.. సక్సెస్‌ ట్రాక్‌ మాత్రం కనిపించకపోవడంతో ఈ యువ కథనాయకుడు ఇప్పుడు స్పీడు పెంచాడు. సీత, రాక్షసుడు సినిమాలతో వైవిధ్యం ఉన్న కథల వైపు వచ్చిన సాయి ఇప్పుడు ‘అల్లుడు అదుర్స్‌’పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్టైనర్గా తెరకెక్కబోయే ఈ మూవీకి అవినాశ్‌ కొల్ల డైరెక్టర్. జి. సుబ్రమణ్యం ప్రొడ్యూసర్కాగా.. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ డైరెక్టర్. ఇస్మార్ట్‌ బ్యూటీ నభా నటేష్‌ హీరోయిన్‌గా ఎంపికైంది. గతేడాదే మూవీకి కొబ్బరి కాయ కొట్టారు. కరోనా కారణంగా షూటింగ్‌ ఆగిపోయింది.

Also Read: రష్మిక మైండ్ కరాబు చేస్తున్న హీరో

అల్లుడు అదుర్స్‌ ట్రాక్‌పై ఉండగానే సాయి శ్రీనివాస్‌ మరో రెండు మూవీస్‌కు ఓకే చెప్పాడు. లాక్‌డౌన్‌ బ్రేక్‌లో పలు కథలు విన్న సాయి…వెంట వెంటనే సినిమాలు చేయాలని డిసైడ్‌ అయ్యాడు. దాంతో, స్వామి రారా ఫేమ్‌ సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ యాక్షన్‌ థ్రిల్లర్కు ఓకే చెప్పాడు. ఈ మూవీ ఈఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్లనుంది. అంతేకాదు తనకు మంచి పేరు తెచ్చిన రాక్షసుడు మూవీకి సీక్వెల్‌ తీయబోతున్నట్టు కూడా ప్రకటించాడు. దీనికి రమేశ్‌ వర్మనే డైరెక్టర్గా వ్యవహరిస్తాడని సాయి వెల్లడించాడు. ఇదే కాదు ఇంకో కొత్త దర్శకుడితో ఓ చిత్రం చేసేందుకు కూడా బెల్లంకొండ సాయి రెడీ అయ్యాడు. ఇప్పటికే కథ విన్నానని, వచ్చే ఏడాది ఈ మూవీని ప్రకటిస్తామని చెప్పాడు. ఇది వరకు స్పీడున్నోడు టైటిల్‌తో ఓ సినిమా తీసిన సాయి మూవీస్‌ విషయంలో స్పీడైతే పెంచాడు గానీ.. అదే స్పీడులో అతనికి సక్సెస్‌ వస్తుందో లేదో చూడాలి.

రష్మిక మైండ్ కరాబు చేస్తున్న హీరో


కన్నడ, తెలుగులో మంచి స్టార్డమ్‌ ఉన్న నటి రష్మిక మందాన్న. ఈ ఇయర్ సరిలేరు నీకెవ్వరూ, భీష్మ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్‌ పడడంతో ఈ అమ్మడు అదృష్టం మరింత పెరిగింది. లక్కీ హీరోయిన్‌ అనే ముద్ర పడడంతో స్టార్ హీరోలు, డైరెక్టర్లు ఆమె డేట్స్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. అటు కన్నడలో కూడా ఆమె క్రేజ్‌ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఎలాగూ తెలుగులో కూడా మంచి గుర్తింపు ఉండడంతో రష్మిక కన్నడ మూవీస్‌ను తెలుగులో కూడా రిలీజ్‌ చేసి క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో రష్మిక, ధ్రువ్‌ సర్జా జంటగా నటించిన కన్నడ ఫిల్మ్‌ ‘పొగరు’ను అదే టైటిల్‌తో తెలుగులో నేరుగా రిలీజ్‌ చేస్తున్నారు. ఈ మూవీపై కన్నడలో విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. ఈ సినిమాలో కరాబు అనే వీడియో సాంగ్‌ ను ఏప్రిల్‌లో యూట్యూబ్‌లో రిలీజ్‌ చేశారు. దానికి ఏకంగా 100 మిలియన్ల వ్యూస్‌ లభించాయి. మంచి లిరిక్స్‌, దానికి తగ్గ మ్యూజిక్‌, ధ్రువ్‌ డ్యాన్స్‌ మూవ్స్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Also Read: ఆ ఫ్లాప్‌ తెలుగు మూవీని హిందీలో 10 కోట్ల మంది చూసేశారు..

ఈ సాంగ్‌ తెలుగు వెర్షన్‌ను ఈ రోజు (బుధవారం) యూట్యూబ్‌లో రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. దానికి కూడా మంచి స్పందన వస్తోంది. హెవీ పర్సనాలిటీతో విలన్‌ మాదిరిగా కనిపిస్తున్న హీరో ధ్రువ్‌.. హీరోయిన్‌ రష్మికను టీజ్‌ చేస్తుండే ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. ఒరిజినల్‌ వెర్షన్‌ను సినిమా మ్యూజిక్‌ డైరెక్టర్ చందన్‌ శెట్టి రాశాడు. తెలుగులో భాస్కరబట్ల లిరిక్స్‌ అందించగా…. ‘రాములో రాములా’ ఫేమ్‌ అనురాగ్‌ కులకర్ణి అందంగా ఆలపించాడు. ‘కరాబు.. మైండు కరాబు.. మెరిసే మతాబు.. నిలబడి చూస్తావా రుబాబు’ అంటూ సాగే లిరిక్స్‌ క్యాచీగా ఉన్నాయి. ఆరు గంటల్లోనే రెండు మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. కాగా, ఈ మూవీని నంద కిషోర్ రూపొందిస్తున్నాడు. శాండిల్‌వుడ్‌లో రష్మికకు ఇది ఐదో చిత్రం. ఇందులో ఆమె ప్రొఫెసర్ పాత్ర పోషించింది. షూటింగ్‌ ఎప్పుడూ పూర్తయింది. మార్చిలోనే రిలీజ్‌ చేయాలని భావించినా.. కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడింది.

లెజెండరీ క్రికెటర్ రాక ఇప్పట్లో లేనట్లే !


లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ కి మొదటి నుండి దక్కాల్సిన స్థాయిలో గౌరవం దక్కలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆయనకంటే ప్రతిభలో అనుభవంలో తక్కువ ఉన్న వ్యక్తులు కూడా ఇండియన్ క్రికెట్ లో కీలక పాత్రలు వెలగబెడుతుంటే.. కపిల్ దేవ్ లాంటి గ్రేట్ టీమ్ లీడర్ మాత్రం ఏమి కాకుండా మిగిలిపోయాడు. కనీసం ఆయన జీవితాన్ని వెండితెర పై అన్నా చూసుకుని సంతోష పడదామంటే.. ఆయన బయోపిక్ విడుదల పై గత కొన్ని రోజులుగా అనేక రూమర్స్ వస్తూ మొత్తానికి ఇప్పట్లో రిలీజ్ లేదని తేల్చేశారు. బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ హీరోగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని యావత్తు క్రికెట్ ప్రేమికులు క్లారిటీ కోసం సినిమా టీమ్ కి సోషల్ మీడియా ద్వారా ఎంత మొర పెట్టుకున్నా దర్శకనిర్మాతలు మాత్రం ఇప్పట్లో మా సినిమా ఉండదని.. డైరెక్ట్ థియేటర్లల్లోనే సినిమా రిలీజ్ అవుతుందని వివరంగా చెప్పుకొచ్చారు.

Also Read: ‘కలర్ ఫొటో’ క్రేజ్‌ మామూలుగా లేదుగా

అసలు ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి. కరోనా మహమ్మారి రాకతో సినిమా రిలీజ్ ఆగింది. అయితే సినిమాని ఓటిటీలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ మొదట ఉన్నా.. పైగా ప్రముఖ ఓటిటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ నుండి ఈ బయోపిక్ కి భారీ ఆఫర్ వచ్చినా.. మేకర్స్ మాత్రం ఓటీటీ వైపు తొంగి చూడలేదు. సినిమాలోని అద్భుతమైన ఫీల్ అండ్ 80 నాటి కాలం సంగతులను పరిస్థితులను ప్రేక్షకులు ఇంకా బాగా ఓన్ చేసుకోవాలంటే థియేటర్ ఫీల్ ఉండాలి. అందుకే కరోనా అనంతరం నేరుగా థియేటర్స్ లోనే తమ సినిమా రిలీజ్ అని మేకర్స్ తమకు వచ్చిన ఆఫర్స్ ను కూడా రిజెక్ట్ చేశారు. నిజానికి అమెజాన్ లో రిలీజ్ చేస్తే.. ప్రొడ్యూసర్లకు ఎలాంటి టెన్సన్స్ లేకుండా భారీ మొత్తంలో డబ్బులు వస్తాయి. అయినా వాళ్ళు డబ్బు కంటే కూడా సినిమాకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం గొప్ప విషయం.

Also Read: ఆ ఫ్లాప్‌ తెలుగు మూవీని హిందీలో 10 కోట్ల మంది చూసేశారు..

ఇక బయోపిక్ ల స్పెషల్ ప్రొడ్యూసర్ విష్ణు ఇందూరి నిర్మిస్తున్న ఈ బయోపిక్ తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో కింగ్ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా తెలుగులో విడుదల కానుంది. తెలుగు ప్రేక్షుకుల్లో కూడా ఈ బయోపిక్ పై మంచి అంచనాలు ఉన్నాయి. ’83’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ బయోపిక్ లో 1983 నాటి ఇండియా వరల్డ్ కప్ ను గెలుచుకున్న క్రమాన్ని, అలాగే కపిల్ దేవ్ జీవితం గమనం, ఆయన సాధించిన విజయాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. అయితే కపిల్ ఫ్యాన్స్ మాత్రం ఎక్కువగా ఆసక్తి చూపుతుంది.. కపిల్ ఎందుకు రిటైర్ తరువాత పెద్దగా తన ప్రభావాన్ని చూపలేకపోయాడు..? ఇండియా క్రికెట్ వ్యవస్థలో తనకంటూ ఏమి లేకుండా ఎందుకు మిగిలిపోయాడు ? అనే అంశాల కోసం ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

జగన్ పై గురి పెట్టిన ఎంపీ రఘురామ..!


నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తన విమర్శలకు మరింత పదును పెట్టారు. ఇప్పుడు నేరుగా సిఎం జగన్ కు సూచనల పేరుతో విమర్శలు చేస్తున్నారు. రాజధాని ప్రాంత మహిళల ఉద్యమంపై సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారం విషయలో సిఎంకు ఘాటైన సూచనలు చేశారు. రాజధాని మహిళలు కరోనా నేపథ్యంలో రహదారి వెంబడి సామాజిక దూరం పాటిస్తూ తమ సమస్యపై స్పందించాలని నిరసన తెలుపుతుంటే సోషల్ మీడియాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కోందరు ఆ మహిళలను కుక్కలతో పోల్చడాన్ని తప్పుబట్టారు. ఆ కుక్కలే రేపు వేట కుక్కలై వెంటాడే రోజులు వస్తాయని గుర్తుపెట్టుకోవాలని సిఎంకు సూచించారు.

Also Read: ఆంధ్రజ్యోతికి చాలెంజ్ చేసిన జగన్ సీఎంవో

ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న పోస్టులు పెట్టినా వృద్ధులు, మహిళలు అని చూడకుండా అరెస్టు చేసి వేదిస్తున్న పోలీసులు ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి గోపాలపురం నియోజకవర్గంలో గుడి కట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. గుడి నిర్మాణం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందన్నారు. హిందువుగా ఈ చర్యలు ఖండిస్తున్నాని స్పష్టం చేశారు. జగన్ క్రిస్టియన్ కాబట్టి చర్చి నిర్మించుకోవాలని సూచించారు.

వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించిన నాటి నుంచి ఎంపీ తన విమర్శలు మరింత పదును పెట్టారు. కీలక అంశాలైన అమరావతి విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీలో నోరు విప్పిన ఏకైక వ్యక్తిగా నిలిచారు. అయినప్పటికీ వైసీపీ ఆయన విషయంలో ఎటువంటి చర్యలు తీసుకునే ధైర్యం చేయలేకపోతుంది.

Also Read: మీ చావు మీరు చావండి.. ఏపీపై కేంద్రం నిర్ణయమిదే?

పార్టీలోనే ఉండి ఇన్ని విషయాల్లో విమర్శలు చేస్తున్న వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని భావించి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. పార్టీ తీసుకున్న అన్ని చర్యలు ఎంపీ రాఘురామ కృష్ణం రాజు విషయంలో విఫలమయ్యాయి. ఆ జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులను పార్టీ ఉసి గొల్పినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది.

ఇదిలా ఉండగా ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు పార్లమెంటులో సీటు మార్చి ఆయనపై పైచేయి సాధించినట్లుగా వైసీపీ భావిస్తుండగా, కేంద్ర హోం శాఖ నుంచి ‘వై’ కేటగిరి భద్రత పొంది ఏంపీ తానేమీ తక్కువ కాదని నిరూపించుకున్నారు. కేంద్ర హోం శాఖ బలగాలతో వై కేటగిరి భద్రత కల్పిస్తున్నట్టు హోం శాఖ రాష్ట్ర డిజిపికి కేంద్ర హోం శాఖ లేఖ రాసింది.

మరో వివాదంలోకి ఎస్వీబీసీ..!


తిరుమల తిరుపతికి దేవస్థానానికి చెందిన శ్రీ వెంకటేశ్వరా భక్తి ఛానెల్ మరో వివాదానికి కేంద్ర బింధువుగా మారింది. గతంలో ఎస్విబీసీ ఛైర్మన్ గా ఉన్న పృధ్వీరాజ్ కు ఛానెల్ కు సంబంధించిన ఒక మహిళా ఉద్యోగితో సంబాషించిన ఆడియో టేపులు బయటకు రావడంతో ఆయన తన పదవిని కోల్పోయిన విషయం విధితమే. అయోధ్యలో దశాబ్ధాల తరబడి కొనసాగుతున్న వివాదానికి తెరపడి హిందువులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రామాలయ నిర్మాణానికి ప్రధాని మోడీ శంఖుస్థాపన చేశారు.

Also Read: 72 సంవత్సరాల తర్వాత భారత్ గా మారిన ఇండియా

అయోధ్యలో రామాలయ నిర్మాణం హిందూదేశంలో ఎంతో కీలకమైన అంశమే. అన్ని మీడియా సంస్థలు శంఖుస్థాపన, రామాలయ విశేషాలు కవరేజ్ కు ప్రత్యేక ఏర్పాటు చేసుకున్నాయి.ప్రైవేట్ భక్తి ఛానెల్స్, న్యూస్ ఛానెల్స్ ఈ కార్యక్రమాన్ని లైవ్ ఇచ్చాయి. రామాలయ నిర్మాణానికి సంబంధించిన అంశాలపై పత్యేక కథనాలను ప్రసారం చేశాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రసారం చేసే శ్రీ వెంకటేశ్వరా భక్తి ఛానెల్ (ఎస్వీబీసీ) మాత్రం రామమందిర నిర్మాణం తమకు సంబంధం లేనట్టుగా వ్యవహరించిందని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు.

అయోధ్య రామాలయ శంఖుస్థాపన విషయమే ఎస్వీబీసీలో ప్రసారం చేయకపోవడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఎస్వీబీసీ సిఇఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్ధేశపూర్వకంగానే ఇటువంటి చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రసారం చేయకపోవడం సరైన చర్య కాదనేది అటు స్వామివారి భక్తులు చెబుతున్నారు.

Also Read: మీ చావు మీరు చావండి.. ఏపీపై కేంద్రం నిర్ణయమిదే?

కొద్ది రోజుల కిందట టిటిడి నిర్వహిస్తున్న సప్తగిరి మాసపత్రిక ఓ వివాదంలో చిక్కుకుంది. ఈ పత్రికలో ప్రచురించిన వ్యాసం వివాదాస్పదంగా మారింది. ఒక విద్యార్ధి పంపిన కథను మాసపత్రికలో ప్రచురించారు. కథలో కుశుడు సీతారాముల కోడుకు కాదని, వాల్మీకి గడ్డితో చేసిన బోమ్మ అంటూ వివాదాస్పద అంశాలు ఉన్నాయి. బాలవాక్కు శీర్షిక పేరుతో ప్రచురితమైన ఈ కథపై హిందుత్వ సంస్థలు ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. దీంతో సప్తగిరి మాసపత్రిక చీఫ్ ఏడిటర్ రాధారమణి, సబ్ ఎడిటర్ ఉత్తర పల్గుణిలను సస్పెండ్ చేస్తూ టిటిడి బోర్డు నిర్ణయం తీసుకుంది. మరి తాజాగా ఎస్వీబీసీపై నెలకొన్న ఈ వివాదంలో ఎవరిపై వేటు పడుతుందోనని సిబ్బంది ఆందోళనతో ఉన్నారు.

ఆంధ్రజ్యోతికి చాలెంజ్ చేసిన జగన్ సీఎంవో


టీడీపీ అధినేత చంద్రబాబుపై అవాజ్య ప్రేమ చూపించే ఆంధ్రజ్యోతికి అధికార వైసీపీ అన్నా.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ అన్నా అస్సలు పడదని ఆ పత్రిక ఓపెన్ చేస్తే ఎవరికైనా తెలుస్తోంది. ప్రతీవారం ఆ పత్రిక ఎండీ కొత్త పలుకు పేరిట జగన్ ను ఏకిపారేయకుండా ఉండలేడు. టీడీపీ అనుకూల పత్రికగా ముద్రపడ్డ ఆంధ్రజ్యోతిలో జగన్ తిట్టకపోతేనే ఆశ్చర్యం అని వైసీపీ నేతలు ఆడిపోసుకుంటారు.

Also Read: మీ చావు మీరు చావండి.. ఏపీపై కేంద్రం నిర్ణయమిదే?

చంద్రబాబును సీఎం చేసేందుకు ఎంతో కష్టపడిన ఆ పత్రిక.. ఇప్పుడు ప్రతిపక్షంలో కూలబడ్డ చంద్రబాబును లేపడానికి పడని కష్టం లేదంటారు. ఎక్కడ వైసీపీ లూప్ హోల్ దొరుకుతుందా ఏసేద్దాం అని వేచిచూస్తున్న ఆంధ్రజ్యోతికి తాజాగా ఓ స్టోరీ కంటబడింది. సో వాస్తవాలు తెలుసుకోకుండా జగన్ ముఖ్యమంత్రి కార్యాలయం తీరుపై ఇష్టానుసారంగా ఓ కథనం వండివార్చింది.

దీంతో తాజాగా ఆ తప్పుడు కథనాల్ని ప్రసారం చేసిన ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ చానెల్ పై ఏకంగా సీఎంవో అధికారులే రంగంలోకి దిగి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఓపెన్ చాలెంజ్ విసిరారు.

సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న ఓ పేద కుటుంబం విషయంలో ఆంధ్రజ్యోతి కనీస విచారణ జరపకుండా సీఎంవోపై అభాండాలు వేస్తూ కథనాలు ప్రసారం చేసింది.

పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురానికి చెందిన చల్లా వీరనాగరావు అనే యువకుడు కరెంట్ కు షాక్ గురయ్యాడు. ఎడమ చేయి, చెవి, కాలు కోల్పోయాడు. హైదరాబాద్ లోని వీ-కేర్ ఆస్పత్రిలో ఈ ఆపరేషన్ జరిగింది. ఏడాది తర్వాత మళ్లీ అనారోగ్యం తిరగబెట్టడంతో తిరిగి అదే ఆస్పత్రికి వెళ్లి నాగరాజుకు ఈసారి ఆస్పత్రి షాకిస్తూ.. 3 ఆపరేషన్లు చేస్తేనే ప్రాణం నిలబడుతుందని.. ఇందుకు 19 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని ఎస్టిమేషన్ వేసి ఇచ్చింది.

దీంతో బాధితుడు తనను ఆదుకోవాలని ఎమ్మెల్యే ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ప్రయత్నించాడు. అయితే సీఎంవో అధికారుల పరిశీలనలో ఆపరేషన్ కు 19 లక్షల రూపాయలు కావని.. రూ.5 లక్షలతో పూర్తవుతుందని తేలింది. అపోలో, గ్లోబర్ ఆస్పత్రుల్లో 5 లక్షలతో పూర్తవుతుందని ఆ ఆస్పత్రులకు వెళ్లి ఎస్టిమేషన్ తీసుకురావాలని సూచించింది. అప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేస్తామని సూచించారు.

Also Read: 72 సంవత్సరాల తర్వాత భారత్ గా మారిన ఇండియా

దీంతో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థ రంగంలోకి దిగి వాస్తవాలను కప్పిపుచ్చుతూ సీఎంవో అధికారులు తాము చెప్పిన చోట ఆపరేషన్ చేయించుకుంటేనే సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తామని కండీషన్ పెట్టారంటూ తప్పుడు కథనాలు వండివార్చింది. ప్రైవేట్ ఆస్పత్రులతో అధికారులు కుమ్మక్కైయ్యారంటూ ఆరోపించింది.

దీంతో ఒళ్లు మండిన జగన్ సీఎం కార్యాలయం అధికారులు ఏకంగా వివరాలతో సోషల్ మీడియాలో ఆంధ్రజ్యోతిని కడిగేశారు. వి-కేర్ ఆస్పత్రి వేసిన ఎస్టిమేషన్ తో ఏ ఇతర ఆస్పత్రితో అయినా నిరూపించాలని ఆంధ్రజ్యోతికి ఓపెన్ చాలెంజ్ విసిరారు. ఈ మేరకు ట్విట్టర్ లో సీఎంవో అధికారి హరికృష్ణ ట్వీట్ చేసి ఏబీఎన్ ను సవాల్ చేయడం అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. ఎప్పుడూ తన కథనాలతో షేక్ చేసే ఆంధ్రజ్యోతినే షేక్ చేసేలా సీఎంవో అధికారులు తొడగొట్టడం.. పత్రిక కు సవాల్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

మీ చావు మీరు చావండి.. ఏపీపై కేంద్రం నిర్ణయమిదే?


ఒక బ్రెడ్డూ ముక్క (ఏపీ రాజధాని) కోసం రెండు పిల్లులు (వైసీపీ, టీడీపీ) కొట్టుకుంటుంటే మధ్యలో వచ్చిన కోతి ఆ బ్రెడ్డును ఎత్తుకుపోయిందట.. ఇప్పుడీ కథలో కోతి పాత్రలో ఉన్న కేంద్రం మాత్రం మీ బ్రెడ్డూ వద్దూ జామూ వద్దని.. మీ చావు మీరు చావండని వదిలేసింది.. దీంతో ఏపీ రాజకీయాలను రసకందాయంలో పడేసింది.

Also Read: 72 సంవత్సరాల తర్వాత భారత్ గా మారిన ఇండియా

అమరావతిపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ ఉండేది. చంద్రబాబు లాబీయింగ్ పనిచేస్తుందా? జగన్ పరపతి పనికొస్తుందా అని అందరూ ఎదురుచూస్తుండగా.. కేంద్ర హోంశాఖ తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అమరావతి రాజధానిపై అఫిడవిట్ దాఖలు చేసింది.

రాష్ట్రానికి రాజధాని నిర్ణయించే అధికారం కేంద్రం పరిధిలోకి వస్తుందా లేదా అని మీనమేశాలు లెక్కిస్తున్న వేళ కేంద్ర హోంశాఖ తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది.

ఏపీ రాజధాని నిర్ణయంతో తమకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. అమరావతిని గత రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిందని.. మూడు రాజధానుల నిర్ణయం కూడా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని తెలిపింది.

Also Read: ముందు చంద్రబాబు స్థానం, ఆ తరువాత సీఎం పీఠం..!

కేంద్రం తాజా నిర్ణయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక గొప్ప ఓదార్పును ఇచ్చింది. రాజధాని విషయంలో ఇక కేంద్రం జోక్యం చేసుకునే అవకాశాలు లేవని క్లియర్ గా తెలిసొచ్చింది.

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బీజేపీతో చేతులు కలిపే ముందు అమరావతి విషయంలో రైతులకు కేంద్రాన్ని ఒప్పించి న్యాయం చేస్తానని మాట ఇచ్చాడు. దీంతో పవన్, చంద్రబాబు కలిసి అమరావతి విషయంలో ఏదైనా చేస్తారని భయపడిన వైసీపీకి ఆ భయాలు మొత్తం తొలిగిపోయాయి. ఇక వైసీపీ మూడు రాజధానులపై ఆడింది ఆట పాడింది పాటగా ఉండనుంది.

-ఎన్నం

ఇది విన్నారా.. అసదుద్దీన్ నోటా లౌకికవాదం..!


నీతులు అనేవి పక్కవాడికి చెప్పేందుకే.. తాము ఆచరించడానికి కాదని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి నిరూపించారు. దేశ ప్రజలు, ప్రపంచమంతా అయోధ్య రామాలయ భూమిపూజపై హర్షం వ్యక్తం చేస్తుంటే.. ఈ నేత మాత్రం లాకౌకవాదం.. సెక్యూరిజం ముసుగులో తన అభిష్టాన్ని దేశప్రజలపై రుద్దే యత్నం చేస్తున్నారు. భారతమాత జై.. అనని వాళ్లు కూడా సెక్యూరిజంపై పతివ్రత మాటలు మాట్లాడడం విడ్డూరంగా మారింది.

Also Read: 72 సంవత్సరాల తర్వాత భారత్ గా మారిన ఇండియా

దేశ ప్రధానిగా ఉన్న మోదీ ఒక మతానికి చెందిన కార్యక్రమంలో ఎలా పాల్గొంటారు.. ప్రధాని అన్న మతాలను సమానంగా చూడాలి కదా అంటూ లాజికులను తీస్తున్నారు. మోదీ హిందుత్వ శక్తులకు ఊతమిస్తున్నాడనే ఆలోచనను మైనార్టీ వర్గాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు కన్పిస్తోంది. దేశ ప్రధానికి అన్ని మతాలకు సమానం అందరూ ఒప్పుకోవాల్సిందే.. అయితే ఐఎంఐ లాంటి మతపార్టీ.. అందులోనూ భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా వ్యవహరించే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ నోటి వెంట నుంచి సెక్యూరిజం మాటలు రావడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

భారతమాత కీ జై.. అనడం.. అనకపోవడం ఆయన వ్యక్తిగత విషయమే అయినా ఆయన వ్యవహర శైలి మైనార్టీలపట్ల, ఇతర మతస్థుల పట్ల ఎలా ఉంటుందో అందరికీ తెల్సిందే. లాకౌకవాదం.. సెక్యూరిజంపై లెక్చర్లు దందే అసరుద్దీన్ ఇతర మతస్థుల మనోభావాలకు అనుగుణంగా ఎప్పుడైనా ప్రవర్తించారనేది ఆలోచించుకోవాలి. ఎంతసేపు మైనార్టీ ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం హిందుత్వ బూచిని చూపెడుతూ పబ్బం గడుపుకోవడమే సరిపోతుందనే వాదనలు ఉన్నాయి. పాతబస్తీకే పరిమితమై ఓ పార్టీ ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పే నేతలకు కౌంటర్ ఇవ్వడం హస్యాస్పదంగా మారిందనే టాక్ విన్పిస్తుంది.

Also Read: కేసీఆర్.. మళ్లీ అదే మాజిక్ రిపీట్ చేశాడా?

అసదుద్దీన్ ఓ వర్గం హక్కుల కోసం పోరాటం చేయడంలో తప్పులేకపోయినా.. రామాలయం పూజ నాడు.. అయోధ్య చరిత్ర నుంచి బాబ్రీ మసీదు ఘటన ఎప్పటికీ తుడిచిపెట్టుకుపోదని.. అయోధ్యలో బాబ్రీ మసీదు ఉండేదని.. ఉందని.. ఖచ్చితంగా ఉంటుందని వ్యాఖ్యానించడం ఆయన అవివేకానికి నిదర్శంగా కన్పిస్తుంది. బాబ్రీ మసీదు నిర్మాణానికి కేంద్రం కూడా సాయం అందిస్తున్న ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కేవలం మైనార్టీలను ఆకట్టుకునేందుకేనని స్పష్టమవుతోంది.

అసదుద్దీన్ ఇప్పటికైనా ఇతర మతాల మనోభావాలను గౌరవిస్తూనే.. తమ వర్గం వారి కోసం పోరాడాలని పలువురు సూచిస్తున్నారు. లేకుంటే మైనార్టీలు కూడా ఎంఐఏం పార్టీని చీదరించుకునే రోజులు రావడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇకనైనా అసదుద్దీన్ వైఖరిలో మార్పు వస్తుందో లేదో వేచి చూడాల్సిందే..!

ఆ ఫ్లాప్‌ తెలుగు మూవీని హిందీలో 10 కోట్ల మంది చూసేశారు..


కొన్ని సినిమాలు అంతే. ఎన్నో అంచనాలు పెట్టుకుంటే బాక్సాఫీస్‌ దగ్గర తుస్సుమంటాయి. ప్రేక్షకులు కూడా ఒక పట్టాన అర్థం కారు. బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టే మూవీస్‌ను ఆ తర్వాత ఆదరిస్తారు. సిల్వర్ స్క్రీన్‌ ‌పై చూసేందుకు ఇష్టపడని వాళ్లు.. నట్టింట్లో, నెట్టింట్లోని బుల్లి తెరలపై తెగ చూసేస్తారు. ఆ లిస్ట్‌లో చాలా మూవీసే ఉన్నాయి. అందులో యువ కథానాయకుడు అక్కినేని అఖిల్‌, నిధి అగర్వాల్‌ జంటగా నటించిన ‘మిస్టర్ మజ్నూ’ కూడా చేరింది. అయితే, ఈ మూవీకి ఓ స్పెషాలిటీ ఉంది. తెలుగు ప్రేక్షకులు మొహం చాటేసిన ఈ సినిమాను హిందీ ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు. హిందీలో డబ్‌ అయిన ఈ మూవీకి యూట్యూబ్‌లో ఏకంగా 100 ప్లస్‌ మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయ. అంటే 10 కోట్ల మంది పైచిలుకు  ఈ సినిమాను చూశారు. ఇన్ని వ్యూస్‌ నెల రోజుల వ్యవధిలోనే రావడం మరో విశేషం. జులై 4వ తేదీన ఈ మూవీ హిందీ డబ్‌ వెర్షన్‌ను యూట్యూబ్‌లో ఫస్ట్‌ అప్‌లోడ్‌ చేయగా… ఇప్పటికి 10.11 కోట్ల వ్యూస్‌ వచ్చాయి.

Also Read: వచ్చింది ప్రభాస్‌ మరి..

నాగార్జున సూపర్ హిట్‌ చిత్రం మజ్ను టైటిల్‌ను ఉపయోగించుకున్న ఈ మూవీపై అఖిల్‌ చాలా ఆశలు పెట్టుకున్నా అవి ఫలించలేకపోయాయి. వెంకీ అట్లూరి డైరెక్ట్‌ చేసిన ఈ మూవీలో అఖిల్‌.. అమ్మాయిల మనసు దోచే విక్కీ పాత్రను పోషించాడు. నిధి అగర్వాల్‌ నిక్కీ అనే పాత్రలో నటించగా.. ఫారిన్‌ నటి ఇజాబెల్లే లీట్‌ మాధవి అనే చిత్ర పాత్ర చేసింది. ఫస్టాఫ్‌ ఎంటర్టైనింగ్‌గా సాగినా… యూఎస్‌కు షిఫ్ట్‌ అయ్యే సెకండాఫ్‌లో ఈ మూవీ గాడి తప్పింది. జబర్దస్త్‌ హైపర్ ఆది కామెడీ ట్రాక్ కూడాపేలిపోయింది. ఈ మూవీలో నాగబాబు, సుబ్బరాజు, రమేశ్‌ రాజు, పవిత్రా లోకేశ్‌ ఇతర పాత్రలు పోషించారు. థమన్‌ మ్యూజిక్‌ అందించాడు. నిర్మాత బీవీఎన్‌ఎస్‌ ప్రసాద్‌కు ఈ చిత్రం లాస్‌ తెచ్చిపెట్టింది.

Also Read: ‘శర్వానంద్’ ఓ వికలాంగుడు అట !

థియేటర్లలో ఎక్కువ రోజులు సందడి చేయలేకపోయిన మిస్టర్ మజ్నూ.. హిందీ వెర్షన్‌ అనూహ్యంగా నార్త్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో గుర్తింపు ఉన్న నిధి అగర్వాల్‌ కోసం హిందీ ప్రేక్షకులు ఈ సినిమాను చూసినట్టు అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా మాతృభాషలో నిరాశ పరిచిన ఓ ఫెయిల్యూర్మూవీతో అఖిల్‌ నార్త్‌ ప్రేక్షకులకు చేరువయ్యాడనొచ్చు. అంతకుముందు చేసిన హలో, అఖిల్‌ కూడా నిరాశ పరచగా కెరీర్లో ఫస్ట్‌ హిట్‌ కోసం అక్కినేని వారసుడు ఎదురు చూస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో రాబోతున్న ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్’తో ఆ కల నెరవేరుతుందని ఆశిస్తున్నాడు. ఈ మూవీలో అఖిల్‌ సరసన హాట్‌ యాక్ట్రెస్‌ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. రీసెంట్‌ గా రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

‘కలర్ ఫొటో’ క్రేజ్‌ మామూలుగా లేదుగా


షార్ట్‌ ఫిలిమ్స్‌తో పేరు తెచ్చుకొని టాలీవుడ్‌కు పరిచయమైన నటుడు సుహాస్. దోచెయ్‌ మూవీతో జూనియర్ ఆర్టిస్ట్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఈ విజయవాడ కుర్రాడు ‘పడి పడి లేచే వయసు’తో హాస్య నటుడిగా మారాడు. ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ, డియర్ కామ్రేడ్‌, మజిలి, ప్రతి రోజు పండగే మూవీస్‌తో పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడతను ‘కలర్ ఫొటో’ అనే మూవీతో హీరోగా మారబోతున్నాడు. అతని క్లోజ్‌ఫ్రెండ్‌, యూట్యూబ్‌లో పాపులర్ అయిన సందీప్‌ రాజ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. సంపూర్ణేష్‌ బాబుతో ‘హృదయ కాలేయం’, ‘కొబ్బరిమట్ట’ లాంటి పేరడీ మూవీస్‌ను రూపొందించిన అమృత ప్రొడక్షన్స్‌పై రాజేశ్ నీలమ్‌, బెన్నీ ముప్పనేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నాడు. నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో చాందినీ చౌదరి హీరోయిన్‌. సునీల్‌ విలన్‌గా నటిస్తున్నాడు.

Also Read: వచ్చింది ప్రభాస్‌ మరి..

డియర్ కామ్రేడ్‌లో తన స్నేహితుడిగా నటించిన సుహాస్‌ హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఈ చిన్న మూవీకి సెన్సేషనల్‌ స్టార్ విజయ్‌ దేవరకొండ తన వంతు సాయం చేశాడు. మూవీ అఫీషియల్‌ టీజర్ను విజయ్‌ రిలీజ్‌ చేశాడు. నల్లగా ఉండే ఓ పేద అబ్బాయి.. అందంగా ఉండే గొప్పింటి అమ్మాయిని ప్రేమిస్తే ఎదురయ్యే సమస్యలను హీరోను ఎలా ఎదుర్కొన్నాడనేది కథాంశం. పల్లెటూరి వాతావారణంలో సాగే ప్రేమకథ ఇది అని టీజర్ చూస్తే తెలుస్తోంది. ‘నాలా నల్లగా ఉన్నోడు అందమైన అమ్మాయిని ప్రేమిస్తే పక్కనుండే ఫ్రెండ్సే ఎగతలి చేస్తారు. ఒకడు బ్లాక్‌ అండ్‌ వైట్‌ అంటాడు. ఒకడు గులాబ్‌జామ్‌ రసగుల్లా అంటాడు. ఒకడేమో ఆశకు హద్దుందా నీకు’ అంటూ సుహాస్‌ అమాయకంగా చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంది. అలాగే, ‘మీరు బాగా ప్రేమించినోళ్లు చనిపోయారు. శవం పక్కన కూర్చుని ఏడుస్తున్నారు. అక్కడికి పులి వచ్చింది. మీరు ఏం చేస్తారండి?’ అని పోలీస్‌ ఆఫీసర్ పాత్రధారి సునీల్‌ అడిగితే ‘పారిపోతామండి’ అనే సుహాన్‌ కామెడీ టైమింగ్‌ బాగుంది. దీనికి ‘చూద్దాం ప్రేమ గొప్పదా.. భయం గొప్పదా’ అంటూ సునీల్‌ కన్నింగ్‌గా ప్రశ్నిస్తాడు.

Also Read: ‘శర్వానంద్’ ఓ వికలాంగుడు అట !

ఒక నిమిషం 41 సెకండ్ల నిడివితో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉన్న ఈ టీజర్ ఇప్పుడు యూట్యూబ్‌తో పాటు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. రిలీజైన 12 గంటల్లోనే వన్‌ మిలియన్‌ వ్యూస్‌ లభించాయి. యూ ట్యూబ్‌లో నంబర్ వన్‌ ట్రెండింగ్‌లో ఉంది. షార్ట్‌ ఫిలింస్‌ ద్వారా యూట్యూబ్‌లో సుహాస్‌కు ఉన్న ఫ్యాన్‌ బేస్‌కు, టీజర్ రిలీజ్‌ చేసిన విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ కూడా తోడవడంతో మూవీపై మంచి హైప్‌ క్రియేట్‌ అవుతోంది. షూటింగ్‌ పూర్తయి పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉన్న ఈ మూవీ తొందర్లోనే ఓటీటీలో రిలీజయ్యే చాన్సుంది. ఈ మూవీకి కీరవాణి కొడుకు కాలభైరవ మ్యూజిక్‌ అందిస్తున్నాడు.