Home Blog Page 8319

‘చలో అంతర్వేది’ భగ్నం.. బీజేపీ, జనసేన నేతల నిర్బంధం

Chalo antarvedi : BJP, Janasenl leaders arrest
ఏపీలో హిందుత్వం మీద వరుసగా జరుగుతున్న దాడులపై బీజేపీ-జనసేన భగ్గుమన్నాయి. బుధవారం ‘చలో అంతర్వేది’ చేపట్టాయి.  అంతర్వేది ఆలయ రథం దగ్ధం కావడంపై  ఆందోళనకు శ్రీకారం చుట్టాయి.  బీజేపీ, జనసేనతోపాటు హిందుత్వ సంఘాలు కూడా అంతర్వేదికి చేరుకోవడంతో అక్కడ  ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో   పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అంతర్వేది ఇప్పుడు పలు హిందూ సంస్థల ఆందోళనతో అట్టుడుకుతోంది.

Also Read: అంతర్వేది ఎపిసోడ్‌: వైసీపీ వ్యూహాత్మక చర్యలు

ఇక అంతర్వేదిపై బీజేపీ, జనసేన పోరుబాట పట్టడంతో ఏపీ సర్కార్ అలెర్ట్ అయ్యింది. భారీగా పోలీస్ బలగాలను మోహరించింది. అంతేకాదు.. వివాదాన్ని సమసిపోయేలా చేసేందుకు ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తోపాటు మంత్రులు వేణు, పినిపె విశ్వరూప్ అంతర్వేది ఆలయం వద్దకు వచ్చారు. కానీ వారిని  చూసి మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు మంత్రులను నిలదీశారు. మంత్రి వెల్లంపల్లి కారుపై రాళ్లు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు వెంటనే మంత్రులను ఆలయం లోపలికి తీసుకెళ్లి పోలీసులు భద్రత కల్పించారు.

అంతర్వేది రథం దగ్గం నేపథ్యంలో బీజేపీ, జనసేనలు కలిసి  ఆందోళనకు పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పలువురు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతోపాటు ఆయన అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆయనను గృహ నిర్బంధం చేశారు. ఇక మాజీ ఎమ్మెల్యే, అమలాపురం నియోజకవర్గం అధ్యక్షుడు అయ్యాజీ సహా పలువురు బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.

ఈ అగ్నిప్రమాద ఘటనపై రాజకీయ కుట్ర కోణం కూడా దాగి ఉండొచ్చనేది ప్రస్తుతం సోషల్‌ మీడియాలో నడుస్తున్న టాక్‌. ఘటన జరిగిన రోజున పిచ్చివాడి చర్యగాను.. నిప్పుల కుంపటి అని.. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ అని ప్రచారం చేసిన పోలీసు యంత్రాంగం.. చివరకు శోధించి శోధించి ‘తేనెతుట్ట’ కారణంగానే జరిగి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో బీజేపీ, జనసేన మండిపడ్డాయి. కేసును నీరుగారుస్తున్నారని ఆందోళన బాటపట్టాయి.

Also Read: ఇంగ్లీష్ మీడియంపై జగన్‌ మార్క్‌ ఆలోచన..

రాజకీయ కుట్రకోణాల వైపు వెళ్లకుండానే ‘తేనెతుట్ట’తోనే కేసు విచారణ ముగించేస్తారా అంటూ బీజేపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వ అధికారిక మీడియాలో అంతర్వేది రథం దగ్ధం వెనుక ‘తేనె సేకరణకు ప్రయత్నించే ముఠా కారణం’ అని నిర్ధారించడంతో  రాజకీయంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి.అయితే..  ప్రతిపక్షాల విమర్శలను ఖాతరు చేయని ప్రభుత్వం కూడా దిద్దుబాటు చర్యలకు దిగింది. విమర్శల్ని పట్టించుకోకుండా ముందుకెళ్లడమే మంచిదని భావించింది. రథం దగ్ధం విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా మంచిది కాదన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.  దీనిపై  కమిటీ వేసి విచారణ జరుపుతున్నారు.

ఏడుపులు తగలెయ్యా.. ట్రోల్స్ దెబ్బకు.. వామ్మో అంటున్న ‘బిగ్ బాస్’

bigboos -4
నిన్న.. మొన్నటి వరకు టిక్ టాక్.. నెపోటిజం పేరుతో బాలీవుడ్ ఇండస్ట్రీని ఏకిపారేసిన ట్రోల్స్.. తాజాగా ‘బిగ్ బాస్’పై పడ్డారు. తెలుగు రియల్టీ షోలలో నెంబర్ వన్ గా ‘బిగ్ బాస్’ షో కొనసాగుతోంది. ఆ పరంపరంను కొనసాగించేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు ‘బిగ్ బాస్-4’ కిందటి ఆదివారం నుంచి ప్రారంభించారు. ప్రారంభ ఎపిసోడ్ నుంచే ఈ షో  మిక్స్ డ్ టాక్ తెచ్చుకోగా విపరీతంగా ట్రోల్స్ బారినపడింది.

Also Read: పూజా హెగ్డేతో ప్రభాస్ కూడా సిద్ధం.. !

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ‘బిగ్ బాస్’పైనే చర్చ జరుగుతోంది. బిగ్ బాస్ కంటెస్టులు, హోస్టు, బిగ్ బాస్ నిర్వాహకులు ట్రోలర్స్ ఏమాత్రం విడిచిపెట్టకుండా ఏకిపారేస్తున్నారు. బిగ్ బాస్ ప్రారంభ ఎపిసోడ్లో నాగార్జున క‌నిపించిన వృద్ధ గెట‌ప్ ను నెటిజన్లు టార్గెట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఆయన పార్టిసిపెంట్స్ తో మ‌రీ వెట‌కారం ఆడుతున్నారంటూ మీమ్స్ తో ఆడేసుకుంటున్నారు.

ప్రస్తుత సీజన్లో చాలామంది అనామకులు ఉన్నారని.. పెద్దగా ఫాలోయింగ్ లేనివారిని బిగ్ బాస్ కంటెస్టెంటులుగా తీసుకొని తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నాడని ట్రోల్స్ చేస్తున్నారు. ఈ సీజన్ కంటే పాత సీజన్లే నయమంటూ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. కంటెస్టులను చూసి వీళ్లా సెలెబ్రిటీలు అంటూ నోళ్లెల్ల‌బెట్టే మీమ్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైర‌ల్ గా అవుతోన్నాయి. సీజన్ ముగిసే నాటికే వాళ్లే సెల‌బ్రిటీలు అవుతారంటూ పంచ్ లు పేలుతున్నాయి.

Also Read: శివసేన ప్రతీకారం: కంగన ముంబై ఆఫీస్ కూల్చివేత

టిక్ టాక్.. బాలీవుడ్ నెపోటిజం ట్రోల్స్ తర్వాత వారికి పెద్దగా పని లేకుండా పోయింది. ఈ సమయంలో బిగ్ బాస్ వచ్చి వారికి పెద్ద పని కల్పించారు. ఈ షోలో అనామకులను తీసుకొచ్చి సెలబ్రెటీల్లా చూపించడాన్నే ట్రోలర్స్ ఆయుధంగా చేసుకొని రెచ్చిపోతున్నారు. తమకు కలిసిచ్చిన అవకాశాన్ని ఈ అవకాశాన్ని ట్రోలర్స్ సద్వినియోగం చేసుకుంటున్నారు. బిగ్ బాస్ ను ట్రోల్స్ తో ఏకిపారిస్తే తమ ఫాలోయింగ్ ను మరింత పెంచుకుంటుండం విశేషం. ట్రోల్స్ దెబ్బకు ‘బిగ్ బాస్’ నిర్వాహకులు హడలిపోతున్నట్లు సమాచారం.

పూజా హెగ్డేతో ప్రభాస్ కూడా సిద్ధం.. !


టాలీవుడ్ నుండి నేషనల్ రేంజ్ లో స్టార్ డమ్ సాధించిన ప్రభాస్ కూడా షూటింగ్ కి రెడీ అవుతున్నాడు. తన ‘రాధే శ్యామ్’ కోసం ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో 5 కోట్ల రూపాయిలు పెట్టి వేసిన ఓ భారీ హాస్పిటల్ సెట్ లో ప్రభాస్ షూట్ కి రెడీ అవుతున్నాడు. ఈ సెట్ లో రెండు వారాల పాటు షూట్ చేయనున్నారని.. అయితే సెట్ లో చాలా తక్కువ సిబ్బంది ఉండేలా షూట్ ప్లాన్ చేస్తున్నారని.. ముందుగా ప్రభాస్ పై వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లోని బిల్డప్ షాట్స్ తీయనున్నారని తెలుస్తోంది. వచ్చే సోమవారం నుండి మొదలుకానున్న ఈ షెడ్యూల్ లో హీరోయిన్ పూజా హెగ్డేతో పాటు మిగిలిన నటీనటులు కూడా పాల్గొంటారట. అయితే పూజా హెగ్డేతో ప్రభాస్ సీన్స్ నే ఎక్కువ రోజులు షూట్ చేస్తారట. సినిమాలో క్లైమాక్స్ కి ముందు వచ్చే ఈ సీక్వెన్స్ చాలా కీలకమైనదట.

Also Read: స్టార్ డైరెక్టర్ తో ఎట్టకేలకు ‘అక్కినేని’ హీరో సినిమా?

కాగా ఈ సీక్వెన్స్ తరువాత దాదాపు పది రోజుల పాటు ఇతర ఆర్టిస్ట్ ల పై కొన్ని సీన్స్ షూట్ చేయనున్నారు. ఆ తరువాత మళ్లీ ప్రభాస్ – విలన్ పై కొన్ని కీలక యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తారట. ఈ సీన్స్ కూడా షూటింగ్ పూర్తి చేసుకుంటే.. ఇక సినిమా కూడా ఆల్ మోస్ట్ పూర్తయిపోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర వెరీ ఎమోషనల్ గా ఉంటుందని, అలాగే క్లైమాక్స్ కూడా చాలా భావోద్వేగంతో సాగుతూ హెవీ ఎమోషనల్ గా ఉంటూనే.. ఫుల్ యాక్షన్ తో సాగుతోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ వి రెండు క్యారెక్టర్స్.. అందులో ఒక క్యారెక్టర్ చనిపోతుందట. ఆ క్యారెక్టర్ ఎండింగ్ సీన్స్ నే పూర్తి ఎమోషనల్ గా ఉంటాయట. ఇప్పుడు ఆ సీన్స్ నే తీయబోతున్నారు. ఈ సినిమా పై ప్రభాస్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

Also Read: కల తీరకుండానే జయప్రకాశ్‌ రెడ్డి కనుమూశారు

ఎందుకంటే ఈ సినిమాకి మొదటినుండి పెద్దగా బజ్ రావట్లేదు. హిట్ అండ్ ఫేమ్ కూడా లేని రాధాకృష్ణ కుమార్ అనే ‘జిల్’ మూవీ డైరెక్టర్ డైరెక్షన్ లో ఈ సినిమా రాబోతుండటంతో సినిమా మార్కెట్ పై ఆ ఎఫెక్ట్ బాగానే పడింది. ఇక ఈ పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్ నుండి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఫ్యాన్స్ కి అంత బాగా కనెక్ట్ కాలేదు. మరి రాధాకృష్ణ ఈ సినిమాని ఎలా తీస్తాడో.. జనం ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని నాలుగు భాషల్లో గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సుశాంత్-రియా కలిసే డ్రగ్స్ వ్యాపారం చేశారా?

sushanth

సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో రోజుకో షాకింగ్ న్యూస్ బయటపడుతోంది. తీగలాగితే డొంక కదిలిన చందంగా.. బాలీవుడ్లోని చీకటీ కోణాలు.. డ్రగ్ మాఫియాతో సంబంధాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. డ్రగ్ కేసులో రియా చక్రవర్తి పూర్తిగా ఇరుక్కుపోతోంది. ఇప్పటికే పోలీసులు మూడురోజులపాటు ఆమెను విచారించి నిన్న అరెస్టు చేశారు.

Also Read: పూజా హెగ్డేతో ప్రభాస్ కూడా సిద్ధం.. !

సుశాంత్ కేసులో డ్రగ్ మాఫియాకు సంబంధాలు ఉన్నట్లు తేలడంతో సీబీఐ, నార్కోటిక్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. డ్రగ్ కేసుతో సంబంధాలున్న బాలీవుడ్లోని పలువురి స్టార్ల పేర్లను రియా చక్రవర్తి విచారణలో వెల్లడించింది. సుమారుగా 26మంది సీని పెద్దలకు డ్రగ్స్ తో లింకులు ఉన్నట్లు చెప్పినట్లు సమాచారం. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం మొదలైంది. ఎవరెప్పుడు అరెస్టు అవుతారోననే ఆందోళన చెందుతున్నారు.

ఈ కేసులో రియా చక్రవర్తి మరో షాకింగ్ న్యూస్ చెప్పడంతో పోలీసులే అవాక్కయినట్లు తెలుస్తోంది. తాను ‘డ్రగ్ సిండికేట్’లో కీలకమైన సభ్యురాలినని.. సుశాంత్ సింగ్ తోపాటు మాదక ద్రవ్యాల సేకరణ కోసం ఫైనాన్స్ నిర్వహణకు డబ్బులు ఖర్చు చేసినట్లు రియానే స్వయంగా ఒప్పుకుందట. ఈ విషయాలను ఎన్సీబీ పోలీసులే చెబుతుండటంతో సుశాంత్ సింగ్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. రియా చక్రవర్తిని పోలీసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా ఆమెకు 14రోజుల జ్యూడిషియల్ కస్టడీని కోర్టు విధించింది.

అంతేకాకుండా డ్రగ్ సిండికేట్ సభ్యులైన దీపేశ్ సావంత్.. షోయిక్ చక్రవర్తి.. మిరండాలకు సైతం రియా చక్రవర్తి సలహాలు, సూచనలు చేసిదట. డ్రగ్ ఔషధాల కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక సమస్యలను కూడా సుశాంత్- రియా చక్రవర్తి కలిసి చాకచక్యంగా పరిష్కరించుకునే వారని డ్రగ్ సిండికేట్ సభ్యులు దీపేశ్ సావంత్, రియా సోదరుడు షోయిక్ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం.

Also Read: శివసేన ప్రతీకారం: కంగన ముంబై ఆఫీస్ కూల్చివేత

డ్రగ్ పంపిణీని సులభంగా పంపిణీ చేసేందుకు డ్రగ్ వ్యాపారి బాసిత్, కైజన్లు తమను ఉపయోగించుకునే వారని పోలీసులు విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రతీ డీల్ రియా చక్రవర్తి కనుసన్నల్లోనే జరిగిందని చెప్పడంతో ఎన్సీబీ పోలీసులు సైతం అవాక్కయినట్లు తెలుస్తోంది. అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసులో ఇంకెన్నీ షాకింగ్ నిజాలు వెలుగులో రానున్నాయో వేచి చూడాల్సిందే..!

కాంగ్రెస్‌లో సీనియర్‌‌ నేతలు వర్సెస్‌ యువనేతలు

0

‘పీసీసీలకు మరిన్ని అధికారాలను అప్పగించాలి. పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేద్దాం. సీడబ్ల్యూసీని పునర్వ్యవస్థీకరించాలి. ఏఐసీసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి’ అంటూ కాంగ్రెస్‌ సీనియర్‌‌ నేతలు రాసిన లేఖను మరిచిపోకముందే.. బహిష్కృత నేతలు సోనియాకు మరో లేఖను రాశారు. ‘నెహ్రూ, ఇందిర, రాజీవ్ కాంగ్రెస్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ నిర్మితమైంది. దేశంలో ప్రజాస్వామ్య పునాదులు కూడా వేశారు. కొంత కాలంగా పార్టీని నడుపుతున్న విధానాన్ని చూస్తుంటే సాధారణ కార్యకర్తల్లో తీవ్ర గందరగోళాన్ని, నిరాశను కలిగిస్తోంది.’ అంటూ పేర్కొన్నారు. వీటన్నింటి పరిశీలిస్తే.. అటు సీనియర్‌‌ నేతలు, ఇటు యువ నేతల మధ్య పార్టీలో పొసగడం లేదనే విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

Also Read: శివసేన ప్రతీకారం: కంగన ముంబై ఆఫీస్ కూల్చివేత

వందేళ్లకు పైగా చరిత్ర.. ఎంతో మంచి రాజకీయ ఉద్ధండులు ఉన్న పార్టీ.. ఒకప్పుడు దేశాన్ని ఏలిన పార్టీ.. ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీలో ఇప్పుడు కొట్లాటలు నడుస్తున్నాయి. అధికార సంక్షోభం ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలను వెలుగులోకి తెచ్చింది. సోనియా గాంధీకి విధేయులుగా ఉన్న సీనియర్‌‌ నేతలకు, యువ నేత రాహుల్‌ గాంధీ నాయకత్వం ఉన్న నేతలకు ఆధిపత్య పోరు పరాకాష్టకు చేరుకుందని చెప్పొచ్చు. ఇటీవల పార్టీని మరోమారు పటిష్టం చేయడానికి యువ నాయకత్వం తీసుకురావాలని యువనేతలు పట్టుబడుతుండగా.. అనారోగ్యంతో బాధపడుతున్న సోనియానే మరోసారి పగ్గాలు చేపట్టేలా సీనియర్లు చేశారన్నది పార్టీలో నడుస్తున్న టాక్‌.

అంత పెద్ద చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో సంక్షేభాలు కొత్తేమీ కాదనే చెప్పాలి. దేశ కాంగ్రెస్‌లోనే కాదు.. రాష్ట్ర కాంగ్రెస్‌లలోనూ పార్టీ పరిస్థితి అంతే. ఎప్పుడూ కుమ్ములాటలు.. ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంటాయి. జాతీయ స్థాయిలో నెహ్రూ, ఇందిర గాంధీలూ సంక్షోభాలను అనుభవించారు. అప్పటి నుంచి ఆ సంక్షోభాలను లైట్‌గానే తీసుకుంటున్న అధినాయకత్వానికి ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు తలనొప్పిలా మారాయి. ఇప్పుడు జరుగుతున్న గొడవలే నాయకత్వం అజెండాగా మారడం అనేది చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌ పార్టీ స్థాపించినప్పటి నుంచీ అందులో వారసత్వ రాజకీయమే నడుస్తోంది. దీనిని ఎవరూ కాదనలేరు కూడా. అదే వారసత్వాన్ని అందిపుచ్చుకొని తల్లి సోనియా నుంచి రాహుల్‌ పార్టీ పగ్గాలు తీసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. గత ఎన్నికల్లో ఓటమి కారణంగా రాహుల్‌ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. ఇప్పడు ఇదే పార్టీలో నాయకత్వ సంక్షోభానికి కారణమైనట్లుగా ప్రచారం జరుగుతోంది.

Also Read: ప్రజలకు అవినీతి రహిత సేవలు: కేసీఆర్

పార్టీలో అధినేత్రి సోనియాగాంధీకి వయసు మళ్లిన సీనియర్లు అండగా నిలుస్తుండగా.. ఆమె తనయుడు రాహుల్‌ గాంధీకి యువతరం నేతలు మద్దతుగా ఉంటున్నారు. వీరిద్దరికీ మధ్య సున్నితంగా జరిగిపోవాల్సిన నాయకత్వ మార్పు కొట్లాటగా మారింది. ఫలితంగా పార్టీలో సంక్షోభం మొదలైంది. పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న నాయకత్వ సంక్షోభం వెనుక సోనియా, రాహుల్‌ కోటరీల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరే కారణమన్నది తెలుస్తూనే ఉంది. అయితే దీని వెనుక అసలు కారణం గమనిస్తే నేతల్లో నెలకొన్న అభద్రతా భావమే అన్నది అర్థమవుతోంది. ఈ పరిణామాలన్నింటి మధ్య అధినేత్రి సోనియా కానీ.. అటు రాహుల్‌ కానీ పార్టీలో నెలకొన్న సంక్షోభానికి ఎటూ పరిష్కారం చూపలేకపోతున్నారు.

శివసేన ప్రతీకారం: కంగన ముంబై ఆఫీస్ కూల్చివేత

Kangana office

సుశాంత్ సింగ్ మరణం వెనుక మహారాష్ట్రలో కొలువుదీరిన శివసేన సర్కార్ ఉందని.. వారే సుశాంత్ హత్యను తొక్కిపెడుతున్నారని బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. దీంతో శివసేన మండిపడడం.. ఆమెకు వార్నింగ్ ఇవ్వడం.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఏకంగా కంగనకు వై కేటగిరి భద్రత కల్పించడం ఇలా వరుస పరిణామాలు సెగలు రేపాయి..

Also Read: సుశాంత్-రియా కలిసే డ్రగ్స్ వ్యాపారం చేశారా?

ఇక కంగనపై తాజాగా శివసేన సర్కార్ ప్రతీకారం మొదలుపెట్టింది. బుధవారం ముంబైలోని కంగన కార్యాలయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా కూల్చివేసింది. దీనిపై కంగనా రౌనత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బుధవారమే కంగన తన స్వస్థలం మనాలి నుంచి ముంబైకి వచ్చారు. ఈ క్రమంలోనే ఆమెకు షాకిస్తూ శివసేన సర్కార్ ఆమె కార్యాలయాన్ని కూల్చివేశారు.

ఈ ఘటనపై కంగన స్పందించింది. ‘తనకు ఆస్తి అన్నది చిన్న విషయం.. ఇవేవీ నా ఆత్మస్థైర్యాన్ని తగ్గించవు. ఇంకా పెంచుతాయి’ అని మహారాష్ట్ర ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చింది. బాబర్ ఆర్మీ తన రామ మందిరాన్ని కూలుస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. నా శత్రువులు నా మాటలన్ని నిజం చేస్తున్నారని.. ముంబైని అందుకే తాను పీవోకే తో పోల్చానని కంగన ట్వీట్ లో నిప్పులు చెరిగారు.

Also Read: కాంగ్రెస్‌లో సీనియర్‌‌ నేతలు వర్సెస్‌ యువనేతలు

https://twitter.com/KanganaTeam/status/1303569152917946368?s=20

కేసీఆరా..మజాకా? మొత్తం బుల్లెట్ ఫ్రూఫ్ పో..!

Bullet pfoor secreteriat

తెలంగాణ సచివాలయం నిర్మాణాన్ని సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్మాత్మంగా తీసుకున్న సంగతి తెల్సిందే. సచివాలయ నిర్మాణానికి ఎవరూ ఎన్ని అడ్డంకులు సృష్టించిన సీఎం కేసీఆర్ చాణిక్యంతో లైన్ క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్లారు. సచివాలయం విషయంలో ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోలేదు. హైకోర్టులో కొంత జాప్యం జరిగినా.. న్యాయంపరంగా ఎలాంటి చిక్కులు రాకుండా పకడ్బంధీ చర్యలు తీసుకోని చివరికీ హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నారు. దీంతో సచివాలయ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది.

Also Read: బాలకృష్ణను కెలికిన పోసాని… ఏం జరిగిందంటే….?

కేసీఆర్ కలలు కంటున్న తెలంగాణ సచివాలయ నిర్మాణానికి లైన్ క్లియర్ కావడంతో చకచక పనులు మొదలు పెడుతున్నారు. ఇప్పటికే పాత సచివాలయాన్ని కూల్చివేశారు. కొత్త సచివాలయ నిర్మాణానికి తెలంగాణ క్యాబినెట్ సైతం ఆమోదముద్ర వేసింది. 500కోట్ల భారీ బడ్జెట్ తో సచివాలయ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం రెడీ అయింది. అయితే ప్రస్తుతం ఆ లెక్క రూ.700కోట్ల చేరబోతుందని టాక్ విన్పిస్తోంది.

తెలంగాణ సచివాలయంలో సీఎం ఛాంబర్ కే ఏకంగా రూ.50కోట్ల మేర ఖర్చు చేస్తున్నారట. దేశంలో ఎక్కడ లేనివిధంగా సీఎం ఛాంబర్ పూర్తిగా బుల్లెట్ ఫ్రూవ్ చేసేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సచివాలయం చుట్టుపక్కల.. సుదూరం నుంచి ఎలాంటి దాడులు జరిగినా ఎలాంటి నష్టం జరుగకుండా ఏర్పాట్లు చేయబోతున్నారట. సీఎం కేసిఆర్ విజన్ మేరకే సచివాలయ నిర్మాణంలో అధికారులు మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

25ఎకరాల్లో ఏడు అంతస్థులతో ఆరులక్షల చదరపు అడుగుల మేరకు సెక్రటేరియట్ నిర్మాణం ఉండనుంది. వేలాది వాహనాలు పార్క్ చేయడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. అదే సమయంల గ్రీనరీకి విపరీతమైన ప్రాధాన్యత కూడా ఇస్తున్నారు. లాండ్ స్కేపింగ్ కోసం జాతీయ స్థాయిలో డిజైన్లు రూపొందించారు. ఇక సచివాలయ భవనంలో ఇంటిరియల్ కోసమే రూ.200కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నారు. భవనంలో ఎక్కడ చూసిన విదేశీ ఫర్మిచర్ కన్పిస్తుందట.

Also Read: ప్రజలకు అవినీతి రహిత సేవలు: కేసీఆర్

సచివాలయం భవనం రాజసం ఉట్టిపడేలా.. తెలంగాణ ప్రతిష్టను పెంచేలా సచివాలయం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఒక్క సచివాలయ భవన నిర్మాణం కోసమే ప్రభుత్వం ఏకంగా రూ.700కోట్ల ఖర్చు చేయడంపై ప్రతిపక్షాలు, ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ కేసీఆర్ చెప్పిన మాటలకు.. చేతలకు ఎక్కడా పోతన లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సచివాలయం భవన నిర్మాణం తప్పనిసరికాకపోయినా.. సీఎం కేసీఆర్ కమిషన్ల కోసం ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే..!

ప్రజలకు అవినీతి రహిత సేవలు: కేసీఆర్

kcr in assembly
kcr in assembly

తెలంగాణ ప్రజలకు అవినీతి రహిత సేవలు అందించడమే తన ప్రథమ కర్తవ్యమని కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థ రద్దుతో ఉద్యోగుల భద్రతకు ఎలాంటి ముప్పు లేదు అని.. నాదీ గ్యారెంటీ అని కేసీఆర్ హామీ ఇచ్చారు.

నూతన రెవెన్యూ చట్టం ప్రవేశపెట్టిన సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ‘‘అన్ని వివరాలతో కూడిన ధరణి పోర్టల్ రూపొందించాం. తెలంగాణ విస్తీర్ణం లక్షా 12వేల చ.కి.మీ. అంటే 2 కోట్ల 75 లక్షల ఎకరాలు. మన రాష్ట్రంలో కోటి 50 లక్షల ఎకరాల భూమి వ్యవసాయ భూమి ఉంది. 66.56 లక్షల అటవీ భూమి ఉంది. మిగిలింది వ్యవసాయేతర భూమి. ధరణి వెబ్‌సైట్ పూర్తి పారదర్శకంగా ఉంటుంది. ప్రపంచంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా చూసుకోవచ్చు. కాపీ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సెక్రటేరియెట్‌, అన్ని కలెక్టరేట్లతో పాటు దేశంలోని ఇతర సురక్షిత ప్రాంతాల్లోనూ సర్వర్లు ఉంటాయి. కొత్త చట్టం ప్రకారం ఏ స్థాయి అధికారికైనా విచక్షణాధికారం ఉండదు. ఏ స్థాయి వ్యక్తైనా ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం ఉండదు. ఈసీ వివరాలు కూడా వెబ్‌సైట్‌లోనే లభిస్తాయి. దేనిపడితే దాన్ని అధికారులు రిజిస్ట్రేషన్ చేసే వీలుండదు. ఆటో లాక్ సదుపాయం ఉంది’ అంటూ బుధవారం అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌‌ నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టారు.

Also Read: కేసీఆర్ కొత్త రెవిన్యూ చట్టంతో అవినీతిని అంతమొందిస్తారా…?

ఒక విధంగా తెలంగాణ రైతులకు ఇది శుభవార్తే. ఈ చట్టం ప్రకారం.. ఇక ఎవరు కూడా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న నూతన రెవెన్యూ చట్టం బిల్లు వివరాలను కేసీఆర్‌‌ వెల్లడించారు. ఈ చట్ట ప్రకారం తెలంగాణలోని ప్రతి ఇంచు భూమిని సర్వే చేయిస్తామని తెలిపారు. ప్రతి సర్వే నెంబర్‌కు కో ఆర్డినేట్స్ ఏర్పాటు చేస్తామని.. ప్రతి భూమికి అక్షాంశాలు, రేఖాంశాలుగా కొలతలు నిర్దేశిస్తారని వెల్లడించారు. ఈ చట్టం వచ్చాక భూమి కోసం ఎవరూ గొడవ పడే ఘటనలు ఉండబోవని భరోసా ఇచ్చారు.  రెవెన్యూ కోర్టులను కూడా రద్దు చేస్తున్నట్లు సభా వేదికగా ప్రకటించారు.

మంగళవారం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి సంచలన నిర్ణయం తీసుకున్న కేసీఆర్‌‌.. వెంటనే వారి నుంచి ఫైల్స్‌ను సేకరించారు. వీఆర్వో వ్యవస్థ రద్దుతో ఇక తమ భవిష్యత్‌ ఏంటని అందరూ ఆందోళనలో పడ్డారు. వారి ఆందోళనలను పటాపంచలు చేస్తూ కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వారికి ఊపిరిపోశారు. రెవెన్యూ శాఖలో ఉద్యోగుల భద్రతకు ఎలాంటి ఢోకా లేదని ప్రకటించారు. రెవెన్యూ సంస్కరణలతో ఇబ్బందులు తొలగుతాయి తప్ప ఉద్యోగులకు వచ్చిన నష్టం ఏం లేదని చెప్పారు. వీఆర్వోలను స్కేల్‌ ఉద్యోగులుగా గుర్తిస్తామని స్పష్టం చేశారు. స్థాయికి తగ్గట్లు వీఏవోలకు వివిధ శాఖల్లో ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం కేసీఆర్‌‌ భరోసా ఇచ్చారు.

Also Read: బాలకృష్ణను కెలికిన పోసాని… ఏం జరిగిందంటే….?

రెవెన్యూ అదికారులపై గతంలో అనేక దాడులు జరిగాయని.. పీవీ, ఎన్టీఆర్‌‌, చంద్రబాబు, వైఎస్సార్‌‌ హయాంలో కొన్ని మార్పులు జరిగాయని.. అయినా గత పాలకులు రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపలేదని కేసీఆర్ పేర్కొన్నారు. టీఆర్‌‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. గత మూడేళ్లుగా రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రెవెన్యూలో అవినీతి పెరిగిపోయింది. ప్రజలకు అవినీతి రహిత సేవలు అందించేందుకు ఈ మా ప్రయత్నమని చెప్పుకొచ్చారు.

కీసరలో ‘లంచం’ రికార్డును దాటేసిన అడిషనల్ కలెక్టర్

తెలంగాణలో ఇప్పటివరకు అత్యధికంగా లంచం పట్టుబడి రికార్డు సృష్టించింది కీసరలోనే. కోటి 10లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెండ్ గా అప్పటి కీసర తహసీల్దార్ నాగరాజు పట్టుబడ్డాడు. ఈ సంఘటన తెలంగాణతో యావత్ యావత్ దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఆ సంఘటన మరువక ముందే తెలంగాణలో మరో అధికారి రికార్డు స్థాయిలో లంచం తీసుకుంటూ పట్టుబడటం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.

Also Read: ఈరోజు అసెంబ్లీలో కేసీఆర్ మరో కీలక నిర్ణయం!

కీసర సంఘటనను తలదన్నేలా మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ లంచం తీసుకుంటూ ఏసీబీకి తాజాగా పట్టుబడ్డాడు. నర్సాపూర్ డివిజన్లోని చిప్పలకుర్తి గ్రామంలోని 113 ఎకరాల భూమికి ఎన్వోసీ ఇచ్చేందుకు కోటి 12లక్షల లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా కోటి రూపాయల మేర ఆస్తులకు లంచం కింద ఒప్పందం పత్రాలు రాసుకున్నాడు. తొలి విడుతగా బాధితులు 40లక్షల డబ్బులు నగేష్ కు ముట్టజేబుతుండగా ఏసీబీ పోలీసులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.

తెలంగాణ సర్కార్ కొత్త రెవిన్యూ చట్టం తీసుకొస్తుందటంతో తమ ఆటకు సాగవని రెవిన్యూ అధికారులు గ్రహించినట్లు ఉన్నారు. దీనిలో భాగంగా ఇప్పుడే అందినకాడికి దోచుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. అయితే అత్యాశకు పోయిన నగేష్ బాధితుల నుంచి లంచానికి కోటి 12లక్షల లంచానికి ఒప్పందం పత్రం రాసుకున్నాడు. ఈ ఒప్పంద పత్రమే ప్రస్తుతం అతడిని ఈ కేసు నుంచి తప్పించుకోకుండా చేసినట్లు కన్పిస్తుంది.

Also Read: కేసీఆర్ కొత్త రెవిన్యూ చట్టంతో అవినీతిని అంతమొందిస్తారా…?

నగేష్ భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యండెండ్ గా పట్టుబడటంతో అతడి ఇంట్లో కూడా పోలీసులు సోదాలు చేశారు. అతడి ఆస్తులకు సంబంధించిన విలువైన పత్రాలు, బ్లాక్ చెక్కులు, ఒప్పంద పత్రాలను స్వాధీనం చేసుకొని విచారణ చేపడుతున్నారు. కోటి 12లక్షల లంచానికి సంబంధించిన డీలులో 40లక్షల నగదు, 72లక్షలకు భూమి రిజిష్ట్రేషన్ చేసుకునేలా ఒప్పందం రాసుకోవడం ఈ కేసులో ట్వీస్ట్ గా మారింది. అవినీతి అధికారుల దురాశే.. చివరికీ వారిని కటకటల వెనక్కి పంపుతుందని తాజా సంఘటన మరోసారి నిరూపించింది.

టాలీవుడ్లో పొరుగింటి పుల్లకూర.. యమ టెస్టీ..!

Tollywood film Industryప్రస్తుతం టాలీవుడ్లో ఇబ్బడిముబ్బడిగా తెరకెక్కుతున్న రీమేక్ సినిమాలను చూస్తే.. పొరుగింటి పుల్లకూర అంటే మన టాలీవుడ్ పరిశ్రమకు ఎంత రుచో అర్థం అవుతోంది. ఇప్పటికే టాలీవుడ్ ను పరభాష నటులతో నిండిపోయింది. తెలుగు సినిమాలో ఒక్క హీరో.. ఇద్దరు ముగ్గురు తెలుగు నటీనటులు మినహా మిగతావారంతా వారే ఉంటారు. ఇక హీరోయిన్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.. అసలు తెలుగమ్మాయిలకు టాలెంట్, గ్లామర్ లేదన్నట్లు ఇండస్ట్రీ చూస్తోంది. ఏదో చెప్పుకోవడానికి ఒకరిద్దరు మినహా పెద్దగా తెలుగమ్మాయిలకు ఛాన్స్ ఇచ్చిన పాపానా టాలీవుడ్ ఇండస్ట్రీ పోలేదని చెప్పడం అతిశయోక్తి కాదేమో..!

Also Read: కల తీరకుండానే జయప్రకాశ్‌ రెడ్డి కనుమూశారు

ఇప్పటికే పరభాష నటులతో కంపుకొడుతున్న టాలీవుడ్ ఇండస్ట్రీ.. ప్రస్తుతం రీమేకులకు డంప్ యార్డుగా మారింది. లోకల్ టాలెంట్ ఏమాత్రం గుర్తించకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ వ్యవహరిస్తున్న తీరు అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. పెద్ద హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల సినిమాల వరకు అందరు ఇప్పుడు ఒకటే మంత్రం జపిస్తున్నారు. అదే రీమేక్ మంత్రం.. పరాయి భాషలో హిట్టయిన సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు దర్శకులు, నిర్మాతలు, హీరోలు పోటీపడుతుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

టాలీవుడ్లో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాలను పరిశీలిస్తే దాదాపు అన్ని సినిమాలు కూడా రీమేకులే కన్పిస్తున్నాయి. పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ సినిమా ‘వకీల్ సాబ్’ బాలీవుడ్లో సూపర్ హిట్టుగా నిలిచిన ‘పింక్’ రీమేక్ గా వస్తోంది. వెంకటేష్ హీరోగా నటిస్తున్న ‘నారప్ప’.. మెగాస్టార్ చిరంజీవి నటించనున్న ‘లూసీఫర్’.. ‘వేదలమ్’.. సినిమా మలయాళం, తమిళంలో సూపర్ హిట్టుగా నిలిచిన సినిమాలే. అదేవిధంగా తమన్నా-సత్యదేవ్ జంటగా తెరకెక్కుతున్న ‘గుర్తిందిగా శీతాకాలం’.. నిర్మాత రాంచరణ్ కొనుగోలు చేసిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ మూవీలన్నీ కూడా రీమేక్ చిత్రాలే.

ఈ చిత్రాలను తెలుగు నెటివిటీకీ మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. పోటాపోటీగా రీమేక్ సినిమాలు తెలుగులో వస్తుండటంతో టాలీవుడ్ ఇండస్ట్రీ రీమేక్ ల డంప్ యార్డుగా మారిందా? అనే సందేహం కలుగుతోంది. తెలుగులో కంటెంట్ అందించేవారే కరువయ్యా? అన్న ప్రశ్నలు తలెత్తుతోన్నాయి. షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ రాకతో ఇటీవలీ కాలంలో మంచి కంటెంట్ తో సినిమాలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో తెలుగులో యంగ్ స్టర్స్ తీసే షార్ట్ ఫిలిమ్స్ అన్నీ ప్రపంచ వ్యాప్త ఖ్యాతిని పొందుతూ ఎన్నో అవార్డులను.. రివార్డులను అందుకొని సత్తాచాటాయి.

Also Read: బాలయ్య ఆర్డర్.. ఇష్టం లేకపోయినా చేయాల్సిందే !

టాలీవుడ్ ఇండస్ట్రీ  లోకల్ టాలెంట్ ను గుర్తించకపోవడంతో తెలుగులో రీమేకుల హవా కొనసాగుతోందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నారు. కరోనా ప్రస్తుతం ఇండస్ట్రీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో కోట్లు ఖర్చుపెట్టి పరభాష చిత్రాలను కొనుగోలు చేసి రీమేక్ చేసే బదులుగా లోకల్ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తే ఇండస్ట్రీకే మంచి జరుగుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా టాలీవుడ్ లోకల్ టాలెంట్ గుర్తిస్తుందా? లేదా పొరుగుంటి పుల్లకూర రుచి అన్న చందంగా వ్యవహరిస్తుందా? అనేది వేచి చూడాల్సిందే..!

స్టార్ డైరెక్టర్ తో ఎట్టకేలకు ‘అక్కినేని’  హీరో సినిమా? 

Akkineni Akhil
చిత్రసీమలోకి అడుగుపెట్టిన వారందరికీ ఒక్కోక్కరికి ఒక్కో డ్రీమ్ ఉంటుంది.  నటీనటులు ఫలానా దర్శకులతో పని చేయాలని.. ఫలానా బ్యానర్లో పని చేయాలని తహతహలాడుతుంటారు. ఇక దర్శకులు ఏమో స్టార్ హీరోలు హీరోయిన్లతో పని చేయాలని కోరుకుంటారు. ఇక సినిమాలను నిర్మించే నిర్మాతలు కూడా ఫలానా వారితో పని చేయాలని కోరుకుంటారు. క్రేజీ కాంబినేషన్లను సెట్ చేసిందుకు ఉవ్విళ్లురుతుంటారు.

Also Read: బాలయ్య ఆర్డర్.. ఇష్టం లేకపోయినా చేయాల్సిందే !

డబ్బులు ఖర్చుపెట్టే నిర్మాత అనుకుంటే కానిదీ ఏముందని అందరు అనుకుంటారు. అయితే అనుకోగానే అన్ని కుదరవు.. హీరోహీరోయిన్లు అందుబాటులో ఉంటే డైరెక్టర్ సెట్ కాకపోవచ్చు. ఇలా వీరుంటే వారు.. వారంటే వీరు లేక మధ్యలోనే ఆగిపోయిన సినిమాలెన్నో ఉన్నాయి. చాలామంది నిర్మాతలు వారి డ్రీమ్స్ నెరవేర్చుకోకుండానే సినిమా నిర్మాణాలు చేస్తూ ముందుకెళుతుండటం చూస్తునే ఉన్నాం. ఇలాంటి కోవలోకే నిర్మాత అనిల్ సుంకర వస్తారు..

నిర్మాత అనిల్ సుంకర కూడా ఒక్క డ్రీమ్ ఉంది. ఆయన ఇండస్ట్రీలోని అందరితో సన్నిహితంగా ఉంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో చాలా సన్నహితంగా మెలుగుతుంటారు. అయితే ఆయనకు తొలి నుంచి అక్కినేని ఫ్యామిలీ అంటే ఎంతో అభిమానం. ఈ కారణంగానే ఆయన అక్కినేని హీరోలలో ఎవరితోనైనా సినిమా చేయాలని భావించారు. ఎన్నోసార్లు ప్రయత్నించినా సెట్ కాకపోవడంతో అనిల్ సుంకర డ్రీమ్ నెరవెరకుండా పోయింది.

తాజాగా ‘సైరా’ దర్శకుడు సురేందర్-అఖిల్ కాంబినేషన్ సెట్ అయింది. ఈ సినిమా తొలుత బన్నీ వాసు దగ్గరకు వెళ్లగా ఆయన అనిల్ సుంకరకు రికమెండ్ చేశారు. ఆ తర్వాత ఆయన దీనిని 14రీల్స్ సంస్థకు ఇద్దామనుకున్న కుదరల్లేదు. దీంతో ఈ సినిమాను అనిల్ సుంకర వద్దే ఆగింది. సురేందర్ రెడ్డి సినిమాలంటే భారీ బడ్జెట్ ఉండాల్సిందే.

Also Read: కల తీరకుండానే జయప్రకాశ్‌ రెడ్డి కనుమూశారు

కథ డిమాండ్ మేరకు 30 నుంచి 40కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని తెలుస్తోంది. అఖిల్ పై అంత బడ్జెట్ ఎక్కువై అయినప్పటికీ అనిల్ సుంకర్ తన డ్రీమ్ తీర్చుకునేందుకు ఈ సినిమాను నిర్మిస్తున్నాడట. ప్రస్తుతం అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ పూర్తయ్యాక అనిల్ సుంకర నిర్మించే మూవీ పట్టాలెక్కబోతుందని సమాచారం.

కల తీరకుండానే జయప్రకాశ్‌ రెడ్డి కనుమూశారు

Jayaprakash reddy
20 ఏండ్లకు పైగా ఇండస్ర్టీ.. 300లకు పైగా సినిమాలు.. రాయలసీమ స్టైల్‌లో డైలాగ్స్‌.. ఏనాడూ బ్రేక్ తీసుకోని కెరియర్‌‌.. మన జేపీ సొంతం. క్యారెక్టర్‌‌ ఆర్టిస్టుగా జయప్రకాశ్‌ రెడ్డి ఎంతో మంది ఆదారాభిమానాలను దోచుకున్నారు. అటు రంగ స్థలంలో.. ఇటు సినిమాల్లో చేస్తూ బిజీ లైఫ్‌ అనుభవించారు. అటు విలన్‌.. ఇటు కమెడియన్‌గా మెప్పించారు. కానీ.. ఆయన చివరి కోరిక తీరకుండానే కనుమూసినట్లుగా తెలుస్తోంది.

Also Read: జేపీ మృతిపై స్పందించిన ప్రధాని మోదీ..తెలుగులో నివాళి

సినిమాల్లోకి రాక‌ముందు జేపీ నాట‌కాల్లో మెరిశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా.. ఎంతో ముచ్చటపడి జేపీ ‘అలెగ్జాండర్‌‌’ నాటకం రాయించుకున్నారు. తర్వాతర్వాత దీనిని సినిమా రూపంలో తేవాలని, ప్రేక్షకులకు చేరువ చేయాలని ఆయన అనుకున్నారు. కానీ.. ఆ కల తీరలేదు.

‘అలెగ్జాండర్’ నాటకాన్ని జేపీ ఎంతో ఇష్టపడి చేశారు. అయితే చాలా ఏళ్ల కిందటే ప్రముఖ దర్శకుడు ధవల సత్యం సహాయంతో ఈ నాటకాన్ని తెరమీదకు కూడా తీసుకొచ్చారట. వంద నిమిషాల నిడివి ఉన్న ఈ నాటకంలో జయప్రకాశ్‌రెడ్డి ఒక్కరే తెర మీద కనిపిస్తారట. కోట శ్రీనివాసరావు, అల్లరి నరేష్, కొండవలస, రావి కొండలరావు, సాయికుమార్, తెలంగాణ శకుంతల, రఘుబాబు మాటలు ఫోన్లో మాట్లాడుతున్నట్లు వినిపిస్తాయట.

Also Read: జేపీ మృతి తీరని లోటు.. ప్రముఖుల ట్వీట్లు

సినిమాను పూర్తిచేసినా.. అది విడుదల కాలేదు. దీని విడుదల కోసం జేపీ ఎంత ప్రయత్నించినా ఫలించలేదు. ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించాలి అంటూ చాలా సందర్భాల్లో జేపీ తన కోరికను బయటపెట్టేవారు. థియేటర్లలో రిలీజ్‌ చేస్తే అంతగా ప్రాముఖ్యం దక్కదని.. అందరూ చూడలేరని భావించి ఓటీటీ ద్వారా అయినా ఈ సినిమాను రిలీజ్‌ చేయాలని అనుకున్నారు. ఇప్పుడు ఓటీటీ ట్రెండ్‌ నడుస్తుండడంతో ఆ దిశగా జేపీ ప్రయత్నాలు చేస్తుండగానే జేపీ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆయ‌న క‌ల తీర‌కుండానే మిగిలిపోయింది.

కరోనాను మించి.. ముందుంది ముసళ్ల పండుగ

1
Carona india


ప్రపంచంలో వైరస్‌లు కొత్తేమీ కాదు. గతంలో స్పానిష్‌ ఫ్లూ.. ఎబోలా, స్వైన్‌ ఫ్లూ, సార్స్‌, మెర్స్‌  అంటూ ఎన్నో వైరస్‌లు వచ్చాయి. అందరినీ ముప్పు తిప్పలు పెట్టాయి. కానీ.. ఇప్పుడొచ్చిన కరోనా మహమ్మారి ప్రజలను వదలడం లేదు. లక్షల మందిని వేధిస్తూనే ఉంది. ఇప్పటివరకు వరల్డ్‌ వైడ్‌ 9 లక్షల మందిని బలితీసుకుంది. దాదాపు 3 కోట్ల మంది వరకు వైరస్‌ బారిన పడ్డారు. అయితే.. ఇలాంటి వైరస్‌లు ఈ కరోనాతో ఆగిపోవని, భవిష్యత్తులో మరిన్ని వైరస్‌లు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ గెబ్రెయేసస్‌.

Also Read: డేంజర్: కరోనాతోపాటే మరో రెండు భీకర వ్యాధులు

రానున్న రోజుల్లో వైరస్‌లను ఎదుర్కొనేందుకు అందరూ మానసికంగా, శారీరకంగా ఇప్పటికంటే ఎక్కువగా సిద్ధపడాలని స్పష్టం చేశారు. రానురాను ప్రభుత్వాలు కూడా ప్రజారోగ్యంపై భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుందని అంటున్నారు. కరోనాకు వ్యాక్సిన్‌ రెడీ అయినట్లు రష్యా ప్రకటించింది. మూడో దశ ప్రయోగాలకు ఇండియాతో ఒప్పందం చేసుకుంది. మూడో దశ ట్రయల్స్‌ ఇంకా ప్రాసెస్‌లో ఉండగానే.. ఆ దేశం ఆల్‌రెడీ వ్యాక్సిన్‌ను ఆ దేశంలోకి విడుదల చేసింది.

నవంబర్‌‌ 1న టీకా వస్తుందంటూ అగ్రదేశమైన అమెరికా ప్రకటించింది. పంపిణీకి రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేయాలంటూ ఆయా రాష్ట్రాలకు సూచించింది. మన దేశంలోనూ ప్రయోగాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో డబ్ల్యూహెచ్‌వో టీకాకు సంబంధించిన మరో వాదన వినిపించింది. వ్యాక్సిన్‌ వచ్చినా అది తొందరగా పేద దేశాలకు అందించాలని.. లేదంటే భారీ నష్టం చూడాల్సి వస్తుందని డబ్ల్యూహెచ్‌వో అధినేత టెడ్రోస్‌ అభిప్రాయపడ్డారు. అందుకే ప్రతీ దేశానికి వ్యాక్సిన్‌ అందించడం తప్పనిసరి అని సూచించారు.

Also Read: షాకింగ్: వికటించిన ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్.. ప్రయోగాలకు బ్రేక్

టీకా కొనలేని.. తయారు చేసుకోలేని వంద దేశాలకు టీకా అందేలా చూసేందుకే డబ్ల్యూహెచ్‌వో కొవ్యాక్స్‌ అనే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భారత్‌నూ భాగస్వామిగా చేర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. ఇందులో చేరేదేలేదని అమెరికా ఇప్పటికే స్పష్టం చేసింది. వీటన్నింటి నేపథ్యంలో వ్యాక్సిన్‌ వచ్చాక పేద దేశాలకు ఎవరి నుంచి సాయం అందుతుందో తెలియకుండా ఉంది.