Home Blog Page 57

ప్రముఖుల భద్రతను కట్ చేసిన రేవంత్‌రెడ్డి.. అసలు కారణం ఇదే!

CM Revanth Reddy
CM Revanth Reddy

Revanth Reddy : తెలంగాణలో రెండు రోజులుగా భద్రత కుదింపు అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మాజీ ఐపీఎస్, బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ సెక్యూరిటీని తెలంగాణ ప్రభుత్వం కుదించింది. దీంతో ప్రవీణ్‌కుమార్‌ను చంపాలని రేవంత్‌ సర్కార్‌ చూస్తోందని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ నేతలు కూడా దీటుగా సమాధానం ఇస్తున్నారు. నిబంధనల మేరకే సెక్యూరిటీ కుదించామని పేర్కొంటున్నారు. భయం ఉంటే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

తగ్గిన మావోయిస్టుల ప్రభావం..
రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావం గణనీయంగా తగ్గిన నేపథ్యంలో
తెలంగాణ ప్రభుత్వం సుమారు 100 మంది ప్రముఖులకు అందిస్తున్న భద్రతను తొలగించాలని నిర్ణయించింది. ఈ చర్య భద్రతా వనరులను మరింత సమర్థవంతంగా వినియోగించడానికి తీసుకున్న నిర్ణయంగా చూడవచ్చు. రాష్ట్రంలో మావోయిస్టు సంస్థల ప్రభావం, కార్యకలాపాలు గత కొన్నేళ్లుగా బాగా తగ్గాయి. ఇది పోలీసు విభాగం చేపట్టిన వివిధ చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక ప్రజల సహకారం వల్ల సాధ్యమైంది. ఈ మార్పు కారణంగా ప్రభుత్వం కొంతమంది ప్రముఖులకు అందిస్తున్న అదనపు భద్రత అవసరం లేదని భావించింది.

భద్రతా తొలగింపు వివరాలు..
ప్రభుత్వం 100 మంది ప్రముఖులకు అందిస్తున్న బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు, గన్‌మెన్‌లు వంటి సౌకర్యాలను ఉపసంహరించుకోవాలని అధికారులను ఆదేశించింది. ఇంతకు ముందు కొందరికి ‘‘వన్‌ ప్లస్‌ వన్‌’’ స్థాయి భద్రత ఉండగా, మరికొందరికి ‘‘టూ ప్లస్‌ టూ’’ స్థాయి భద్రత ఉండేది. ఇప్పుడు ఈ సౌకర్యాలను తగ్గించాలని నిర్ణయించారు. ఈ కొత్త నిబంధనలు జులై 1 నుంచి అమలులోకి రానున్నాయి.

ప్రస్తుత భద్రతా వ్యవస్థ..
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం దాదాపు 600 మంది ప్రముఖులకు వివిధ స్థాయిల్లో భద్రత అందిస్తోంది. ఈ జాబితాలో రాజకీయ నాయకులు, మాజీ మంత్రులు, ఇతర ముఖ్య వ్యక్తులు ఉన్నారు. మావోయిస్టు ముప్పు తగ్గినందున ఈ జాబితాను సమీక్షించి, అవసరం లేని వారికి భద్రతను తగ్గించడం ద్వారా ప్రభుత్వం వనరులను ఆదా చేయాలని చూస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర భద్రతా పరిస్థితిలో మెరుగుదలను సూచిస్తుంది. మావోయిస్టు సమస్యను ఎక్కువగా అదుపులో ఉంచినందున భద్రతా వనరులను ఇతర ముఖ్యమైన అవసరాలకు మళ్లించవచ్చు. అయితే ఈ తొలగింపు కొందరు ప్రముఖుల్లో ఆందోళన కలిగించే అవకాశం ఉంది. అదే సమయంలో ఈ చర్య ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. భద్రతా సిబ్బందిని, వాహనాలను మరింత అవసరమైన ప్రాంతాలకు ఉపయోగించవచ్చు. అయితే భద్రత తొలగించిన వారి వ్యక్తిగత భద్రతా పరిస్థితిని కూడా ప్రభుత్వం నిరంతరం సమీక్షించాల్సిన అవసరం ఉంది.

వివేక్ ఆత్రేయ విషయంలో వెనకడుగు వేస్తున్న స్టార్ హీరోలు... కారణం ఏంటంటే...

Vivek-Athreya
Vivek-Athreya

Vivek Athreya Movies : తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటివరకు చాలామంది స్టార్ హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక దర్శకులు సైతం వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి ని సంపాదించి పెట్టుకోవడమే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్నారు. యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సైతం ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. కెరియర్ మొదటి నుంచి కూడా స్క్రీన్ ప్లే మీద ఎక్కువ ఫోకస్ చేసి సినిమాలను చేస్తున్న ఆయన ఇప్పుడు మాత్రం స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. కెరియర్ మొదటి నుంచి కూడా ఆయన శ్రీ విష్ణు, నాని లాంటి హీరోలతోనే సినిమాలు చేశాడు. కానీ ఇప్పుడు బాలయ్య బాబు కి కథనైతే వినిపించాడు. కానీ బాలయ్య ఆ కథను రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక దాంతో కోలీవుడ్ స్టార్ హీరో అయిన సూర్యతో వివేక్ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ప్రస్తుతం సూర్య కూడా తెలుగు దర్శకుల మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. మన వాళ్లతో సినిమాలు చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇప్పటికే వెంకీ అట్లూరి డైరెక్షన్ లో విశ్వనాధ్ అండ్ సన్స్ అనే సినిమాని చేస్తున్న ఆయన ఇప్పుడు వివేక్ ఆత్రేయకి సైతం డేట్స్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. తెలుగులో ఉన్న స్టార్ హీరోలు అతన్ని పట్టించుకోకపోవడానికి గల కారణం ఏంటి అంటే ఆయన ఇప్పటివరకు చిన్న సినిమాలను చేశాడు.

అలాగే పెద్ద హీరోల ఇమేజ్ ను హ్యాండిల్ చేయగలిగే కెపాసిటి అతనికి ఉందా? లేదా అనే ధోరణిలోనే మన వాళ్ళు చాలా రకాలుగా ఆలోచిస్తున్నారని వాళ్ళకంటూ ఒక క్లారిటి వస్తే మాత్రం మన హీరోలు సైతం అతనికి డేట్స్ ఇస్తారని ఆ విషయంలో తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకుంటున్నా క్రమంలో మన తెలుగు దర్శకులు మాత్రం అతన్ని పట్టించుకోవడం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక వివేక్ ఆత్రేయ తను చేయబోయే సినిమాతో ఎలాంటి పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తాడనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

 

'గాడ్ ఆఫ్ వార్' అప్డేట్ ఏంటి..? ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సాయంత్రం రెడీగా ఉండండి..

ntr-god-of-war-movie-update-official-announcement-today-evening

NTR God Of War : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. కెరియర్ మొదట్లోనే మాస్ హీరోగా అవతరించిన ఆయన ఆ తర్వాత చేసిన సినిమాలతో కొంతవరకు ప్లాప్ లను ముట్టగట్టుకున్నాడు. అయినప్పటికి ఆయన ఎక్కడా తడబడకుండా వరుస సక్సెస్ లను సాధించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. టైర్ వన్ హీరోల్లో తను కూడా ఒకడిగా వెలుగొందుతుండటం విశేషం… ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గాడ్ ఆఫ్ వార్ ‘ అనే సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాతో ఎలాగైనా సరే తన సత్తా ఏంటో చూపించాలనే ప్రయత్నంలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు.

తను అనుకున్నట్టుగానే త్రివిక్రమ్ ఈ సినిమాని ఎన్టీఆర్ తో చేస్తున్నాడా? లేదంటే అల్లు అర్జున్ తో చేయబోతున్నాడా అనే విషయంలో సరైన క్లారిటి అయితే రావడం లేదు. మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఈ సినిమా ఎన్టీఆర్ తోనే చేస్తున్నారు అంటూ ఒక క్లారిటి కి వచ్చేశారు. తాజాగా దీనిపై అప్టేట్ వచ్చింది.

ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా నుంచి నేడు సాయంత్రం 5:04 గంటలకు అధికారిక ప్రకటన విడుదల కానుంది. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ తన X ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ అనౌన్స్‌మెంట్‌ను Jr. NTR అధికారిక ట్విటర్ (X) అకౌంట్ నుంచి విడుదల చేయనున్నట్లు తెలిపారు. ‘అరవింద సమేత వీరరాఘవ’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్–ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడం, అలాగే కుమారస్వామి కథతో తెరకెక్కనుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించబోతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలతో పెద్దగా సక్సెస్ లనైతే సాధించలేకపోతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకొని టాప్ డైరెక్టర్ గా మారాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే మాత్రం ఆయన చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు…

ఇక మొత్తానికైతే ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ను ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ పోస్టర్ కూడా చాలా అద్భుతంగా ఉండడంతో గాడ్ ఆఫ్ వార్ సినిమా ఎన్టీఆర్ తోనే ప్రకటించబోతున్నారు అనే విషయం పైన ప్రతి ఒక్కరికి క్లారిటి వచ్చింది…

పవన్ కళ్యాణ్ ను సీఎం గా చూడాలని అదిరిపోయే కథ రెడీ చేసిన స్టార్ డైరెక్టర్...

Pawan Kalyan CM Seat Pressure
Pawan Kalyan CM Seat Pressure

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చాలామంది దర్శకులు సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆచితూచి ముందుకు అడుగులు వేస్తున్నాడు. ఈ సంవత్సరం ఇప్పటికే హరీష్ శంకర్ దర్శకత్వంలో చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఫ్లాప్ అయింది. దాంతో రాజకీయ రంగంలో ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో కూడా తన అభిమానుల్లో నిరాశపరచకూడదనే ఉద్దేశ్యంతో అవకాశం దొరికిన ప్రతిసారి మంచి కథలతో సినిమాలు చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఆయన సురేందర్ రెడ్డి తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికి ఆ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందనే విషయంలో సరైన క్లారిటి రావడం లేదు. ఇక డైరెక్టర్ సుజీత్ సైతం ఓజీ 2 ఉంటుందంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. దాంతో ఈ సినిమా షూటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇక మరో దర్శకుడు పవన్ కళ్యాణ్ సీఎం గా చూపించడానికి ఒక అద్భుతమైన కథ కూడా రాసుకున్నారట. మరి ఆ డైరెక్టర్ కి పవన్ కళ్యాణ్ సినిమా చేసే అవకాశాన్ని ఇస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…

ఇంతకీ ఆ దర్శకుడు ఎవరంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న శంకర్ కావడం విశేషం… ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా ఆయన చాలావరకు ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇంతకుముందు ఆయన రామ్ చరణ్ తో ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేశాడు.

ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తానని అనుకున్నాడు కానీ ఆ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో శంకర్ భారీ విమర్శలనైతే మూటగట్టుకున్నాడు. దాంతో అతనితో సినిమాలు చేయడానికి ఎవరు ఆసక్తి చూపించడం లేదు. కానీ అతను పవన్ కళ్యాణ్ తో మాత్రం ఒక అదిరిపోయే కథతో సినిమా చేస్తానని చెబుతున్నాడు. ఒకప్పుడు ఒకే ఒక్కడు మూవీ తో సంచలనాన్ని క్రియేట్ చేసిన ఆయన ఇప్పుడు మరోసారి అలాంటి పాయింట్ తో వచ్చి సూపర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు.

ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో అలాంటి సినిమా చేస్తానని తన సన్నిహితుల దగ్గర చెబుతున్నారట. అలాగే పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తే తన కథను కూడా వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది… వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

మనదేశంలో ఒకరికి ముగ్గురున్నారట.. సర్వేలో దిమ్మతిరిగే నిజాలు

Fake Relationships
Fake Relationships

Relationship Survey : ఇటీవల కాలంలో మీడియాలో వార్తలు చూస్తే.. పేపర్లో పేజీలు తిరిగేస్తుంటే.. వివాహేతర సంబంధాల గురించి వార్తలు చూస్తూనే ఉన్నాం. అనైతికమైన బంధాల వల్ల జరిగే దారుణాల గురించి వింటూనే ఉన్నాం. వాటి వల్ల ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి.. ఎన్ని దారుణాలు చోటుచేసుకుంటున్నాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ జనాలు మారడం లేదు. కనీసం వాటిని తప్పు కూడా అనుకోవడం లేదు. మనుషుల్లో నైతికత కోల్పోవడంతో ఇటువంటి చాటుమాటు వ్యవహారాలు సాగిపోతున్నాయి.

మనుషుల్లో అనైతికమైన బంధాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇండిపెండెంట్ ఏజెన్సీ గ్లోబల్ పాపులేషన్ రివ్యూ అనే సంస్థ ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో దారుణమైన నిజాలు వెలుగు చూసాయి. మొత్తంగా 50 దేశాలలో ఈ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచ సగటు తొమ్మిదిగా తేలింది. ఈ జాబితాలో టర్కీ మొదటి స్థానంలో నిలిచింది. ఈ దేశంలో ఒక వ్యక్తి 14.5 మంది భాగస్వాములను కలిగి ఉన్నాడని తేలింది. ఇది కేవలం సగటు మాత్రమే. టర్కీ తర్వాత ఆస్ట్రేలియా 13.3 మంది.. న్యూజిలాండ్ 13.2 మంది భాగస్వాములతో మిగతా స్థానంలో నిలిచాయి. ఐస్లాండ్ 13.0.. దక్షిణాఫ్రికా 12.5.. ఫిన్లాండ్ 12.4.. నార్వే 12.1, ఇటలీ 11.8.. స్వీడన్ 11.8.. స్విట్జర్లాండ్ 11.1 భాగస్వాములను కలిగి ఉన్నాయి..

ఈ జాబితాలో అమెరికా 10.7తో 12 స్థానంలో ఉంది.. ఇంగ్లాండ్ 9.8 సగటుతో 21 స్థానంలో ఉంది. అయితే అమెరికాలో అందరూ పత్తితులు కాదు. ప్రాంతాన్ని బట్టి ఈ సంఖ్య మారింది. లూసియాన్న రాష్ట్రంలో ఏకంగా ఈ సంఖ్య 10.7 గా ఉంది. ఇక యుట రాష్ట్రంలో ఈ సగటు 2.6 గా మాత్రమే ఉంది. ఎందుకంటే ఇక్కడ సంప్రదాయాలను పాటిస్తారు. ఇక ఆశ ఖండంలో ముఖ్యంగా మనదేశంలో ఈ సంఖ్య తక్కువగా ఉంది. ఈ జాబితాలో చివరి స్థానంలో ఉంది. భారతీయులు తమ జీవితకాలంలో సగటున కేవలం ముగ్గురు మాత్రమే లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. కుటుంబ సాంప్రదాయాలు.. వివాహ వ్యవస్థ.. కట్టుబాట్లు వంటి వాటి ద్వారా భారత్ ఈ స్థానంలో ఉంది. పెళ్లికి ముందు లైంగిక వ్యవహారాలు భారత్ లో నిషేధం. సమాజం కూడా వీటిని ఆమోదించదు. అందువల్లే మనదేశంలో ఇలాంటి పరిస్థితి ఉంది. ఆసియాలో మిగతా దేశాల్లో కూడా ఇటువంటి విధానాల కొనసాగుతున్న అని తెలుస్తోంది. ఆసియా ఖండంలో హాంకాంగ్ లో 3.7.. వియత్నాంలో 3.2 , చైనాలో 3.2 తమ జీవితకాలంలో అక్కడి ప్రజలు లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నట్టు తెలుస్తోంది.

రోజా కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్.. పోలా అదిరిపోలా.. వైరల్ వీడియో

Roja Son Birthday

Roja Son Birthday : ఆ డెకరేషన్ ఒ రేంజ్ లో ఉంది. స్టేజి అదిరిపోయింది. కేక్ అయితే అత్యంత భారీగా ఉంది. బాంబులు పేలాయి. చిచ్చుబుడ్లు వెలుగులు విరజిమ్మాయి. అతిథులు ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ లో వచ్చారు. ఇక బర్త్డే బాయ్ అయితే సినిమా హీరో లాగా ఉన్నాడు. రింగుల జుట్టు.. దానికి తగ్గట్టుగా నలుపు రంగు డ్రెస్.. యంగ్ కౌ బాయ్ లాగా ఉన్నాడు.

అతడిని పట్టుకొని సీనియర్ నటి.. మాజీ మంత్రి రోజా వేదిక మీదికి వచ్చారు. ఆమె తీసుకొచ్చిన ఆ వ్యక్తి మరెవరో కాదు ఆమె కొడుకు.. కృష్ణ కౌశిక్. తన కొడుకు 20వ పుట్టినరోజు వేడుకలను రోజా అత్యంత ఘనంగా నిర్వహించారు.. ఈ వేడుకకు అత్యంత సన్నిహితులను.. కుటుంబ సభ్యులను మాత్రమే రోజా ఆహ్వానించారు. తన కొడుకు కోరిక మేరకు జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు రోజా. వచ్చిన అతిథులు ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ లో వచ్చారు. వారంతా కూడా రోజా కుమారుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

కృష్ణ కౌశిక్ కేక్ కట్ చేసి ముందుగా తన మాతృమూర్తి రోజాకు పెట్టారు. ఆ తర్వాత తండ్రి సెల్వమణికి కేక్ పెట్టారు. అనంతరం వచ్చిన బంధుమిత్రుల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ వేడుకలను రోజా అత్యంత ఘనంగా నిర్వహించారు. తన పదవిలో లేకపోయినప్పటికీ.. కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ కొడుకు పుట్టినరోజు వేడుకల విషయంలో మాత్రం తగ్గలేదు. పైగా తన కొడుకుకు ఇష్టమైన విధంగా వేడుక నిర్వహించారు…

రోజా మంత్రిగా ఉన్నప్పుడు కొడుకు కోరిక మేరకు ఒక విలాసవంతమైన కారును కొనుగోలు చేశారు. అప్పుడు అది కాస్త వివాదాస్పదమైంది. దానిపై కొన్ని మీడియా సంస్థలు వ్యతిరేకమైన కథనాలను ప్రసారం చేశాయి. ఆ తర్వాత రోజా వాటి మీద క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నగరి నియోజకవర్గంలో రోజా ఓడిపోవాల్సి వచ్చింది. ఓడిపోయినప్పటికీ కూడా నగరి నియోజకవర్గంలో ఆమె తిరుగుతూనే ఉన్నారు. కార్యకర్తలను కలుస్తూనే ఉన్నారు. వేడుకలకు.. ఇతర కార్యక్రమాలకు ఆమె హాజరవుతూనే ఉన్నారు. తద్వారా 2029 లో జరిగే ఎన్నికల్లో మరోసారి నగరి నుంచి పోటీ చేసి గెలుపొందాలని రోజా చూస్తున్నారు.

మద్యం ఆడాళ్లు ఎందుకు తాగొద్దు.. ఈ మేడం భలే లాజిక్ పట్టింది..

Actress Madhavilatha
Actress Madhavilatha

Madhavi Latha : మగాళ్లు మందు తాగితే ఈ సమాజం పెద్దగా పట్టించుకోదు. ఆడవాళ్ళు తాగితే వింతగా చూస్తుంది. ఘోరం అన్నట్టుగా ముద్ర వేస్తుంది. ఆమెను చెడుగా చూస్తుంది. ఇంటి పని విషయంలో ఆడవాళ్లు చేస్తే ఈ సమాజం ఒక విధంగా చూస్తుంది. అదే మగవాళ్ళు చేస్తే ప్రపంచానికి ఏదో అరిష్టం పట్టినట్టు.. అదేదో ఘోరం జరిగిపోయినట్టు చూస్తుంది.. ఇంటి పని ఆడవాళ్లకు మాత్రమే సొంతమా.. మగవాళ్ళు చేయకూడదా.. మగవాళ్ళు చేస్తే ఏమైనా కిరీటాలు రాలిపోతాయా.. ఇదిగో ఇలా ప్రశ్నించింది ఆమె. సోషల్ మీడియాలో రచ్చ రంబోలా అవుతోంది.

ఇంతలా ప్రశ్నించిన ఆమె పేరు మాధవి లత. గతంలో కొన్ని సినిమాలు చేసింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో నాయకురాలిగా కొనసాగుతోంది. నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా పోస్టులు పెడుతూ.. ఏదో ఒక విధంగా వీడియోలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటుంది మాధవి లత. స్త్రీవాదం గురించి మాధవి లత గొప్పగా చెబుతుంటారు. కొన్ని సందర్భాలలో కట్టు తప్పుతుంటారు. అయినప్పటికీ ఆమెను కొంతమంది సమర్థిస్తారు. మరికొంతమంది విమర్శిస్తారు. ఎవరు ఎలా ఉన్నా సరే మాధవి లత మాత్రం తన ధోరణి మార్చుకోరు. తన అభిప్రాయాన్ని మొహమాటం లేకుండా చెబుతూనే ఉంటారు.. అందువల్లే ఆమె బిజెపిలో ఫైర్ బ్రాండ్ లీడర్గా ఎదిగారు..

మాధవి లత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ముఖ్యంగా మద్యం తాగే విషయంలో మగవాళ్ళను ఒక విధంగా.. ఆడవాళ్లను మరొక విధంగా ఈ సమాజం చూస్తుందని.. అది ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. ఇంటి పని విషయంలో కూడా మగవాళ్ళు చేస్తే ఒక విధంగా.. ఆడవాళ్లు చేస్తే మరొక విధంగా ఈ సమాజం చూస్తుందని.. అది సరైనది కాదు అంటూ ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఆమె ఈ పోస్ట్ చేసిన తర్వాత చర్చ మొదలైంది. కొంతమంది ఆమెకు అనుకూలంగా.. మరి కొంతమంది ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఎవరు ఎలా అనుకున్న సరే మాధవి లత తన అభిప్రాయాన్ని మాత్రం చెబుతూనే ఉంటారు. ఏ మాత్రం వెనకడుగు వేయరు.

బిజెపిలో ఫైర్ బ్రాండ్ లీడర్లలో మాధవి లత ఒకరుగా ఉన్నారు. గతంలో ఆమె కొన్ని సినిమాలలో నటించారు. ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ఆడవాళ్ళ విషయంలో మొహమాటం లేకుండా తన స్వరాన్ని వినిపిస్తున్నారు. ఒకవేళ ఆడవాళ్లు తప్పులు చేస్తే ఎటువంటి వెనుకంజ వేయకుండా గట్టిగా మాట్లాడుతున్నారు. తాజాగా మద్యం తాగే విషయంలో సరికొత్త అంశాన్ని తెరపైకి తెచ్చి.. చర్చ మొదలుపెట్టారు. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

టీమిండియా ఓటమికి భారతీయుడే కారణం.. ఎవరితను.. నేపథ్యం ఏంటి..

Jai Moondra

India vs Ireland : టి20 లలో టీమ్ ఇండియా నెంబర్ వన్ స్థానంలో ఉంది.. అంతేకాదు టి20 వరల్డ్ కప్ కూడా సాధించింది. అటువంటి టీమ్ ఇండియా అత్యంత అనామకమైన ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది. 2024 తర్వాత టీమిండియా సిరీస్ కోల్పోవడం ఇదే తొలిసారి. ఐర్లాండ్ జట్టుతో రెండు టి20 మ్యాచ్ల సిరీస్ ఆడిన టీమ్ ఇండియా.. రెండు మ్యాచ్లు కూడా ఓడిపోవడం విశేషం. జట్టులో భీకరమైన ప్లేయర్లు ఉన్నప్పటికీ.. ఐర్లాండ్ చేతిలో ఓటమి పాలు కావడానికి సగటు భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

టీమిండియా రెండు మ్యాచ్ల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం బ్యాటర్ల వైఫల్యం.. తొలి మ్యాచ్లో సంజు శాంసన్ నిరాశపరిచాడు. కెప్టెన్ అయ్యర్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, ఇలా టాప్ ఆర్డర్ బ్యాటర్లు మొత్తం అవుట్ అయ్యారు. అత్యంత దారుణమైన ఆట తీరు కొనసాగించి టీమిండియా పరువు మొత్తం పోగొట్టారు. ఆటగాళ్లు ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడంతో.. అసలు టీమిండియా ఎందుకు ఆడుతోందనే ప్రశ్న సగటు అభిమానిలో వ్యక్తం అయింది.

రెండో మ్యాచ్లో కూడా టీమిండియా ఓపెనర్లు ఇద్దరు సున్నా పరులకు అవుట్ కావడం అత్యంత నిరాశపరిచింది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ దారుణమైన ఆట తీరుకొనసాగించారు. ఫలితంగా టీమిండియా ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కిషన్ రన్ అవుట్ అయ్యాడు. కెప్టెన్ అయ్యర్ కూడా మరోసారి నిరాశపరిచాడు. ఈ దశలో అక్షర్ నిదానంగా బ్యాటింగ్ చేశాడు. తిలక్ వర్మ ఆఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత అనవసరమైన షార్ట్ ఆడి.. అవుట్ అయ్యాడు. శివం దుబే కూడా ఔట్ కావడంతో టీమ్ ఇండియా ఓటమి లాంచనమైంది. చివర్లో హర్షిత్ రానా సత్తా చూపించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒక పరుగు తేడాతో టీమిండియా ఓటమిపాలైంది.

టీమిండియా ఇలా ఓడిపోవడానికి ప్రధాన కారణం జై ముండ్రా. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రమే కాదు.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు. ముండ్రా తొలి మ్యాచ్లో రెండు వికెట్లు పడగొట్టాడు. రెండో మ్యాచ్ లో కూడా అదే స్థాయిలో సత్తా చూపించాడు. ఓపెనర్లు.. కెప్టెన్ అయ్యర్ వికెట్లను తన ఖాతాలో వేసుకొని.. టీమ్ ఇండియాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఫలితంగా టీమిండియా ఇతడి ధాటికి తట్టుకోలేకపోయింది. జై ముండ్రా భారతదేశానికి చెందినవాడు. ఇతడిది రాజస్థాన్ రాష్ట్రం.. కొంతకాలంగా ఐర్లాండ్లో క్రికెట్ ఆడుతున్నాడు. గత ఏడాది ఐర్లాండ్ జాతీయ జట్టులో అడుగు పెట్టాడు. అయితే ఇప్పటికీ అతడు ఇండియన్ పౌరసత్వాన్ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు.

ఇడుపు కాయితం వర్సెస్ చిప్పకూడు.. కవిత జనసేన షాక్

Kalvakuntla Kavitha, Jana Sena Party

Jana Sena Party  : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు కల్వకుంట్ల కవిత. రోజురోజుకు ఆమె మాటలు శృతిమిస్తున్నాయి. దీంతో జన సైనికులు స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఒక ప్రత్యేక ఉద్దేశంతోనే ఆమె ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అర్థమవుతోంది. తన తండ్రి మాదిరిగా సెంటిమెంట్ ఆస్త్రాన్ని ప్రయోగించి తన తెలంగాణ రక్షణ సేన ఉనికిని బలంగా చాటుకోవాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు లక్షలాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆపై ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఆయనపై కామెంట్స్ చేస్తే రియాక్షన్ ఉంటుందని.. దాని ద్వారా రాజకీయం చేయవచ్చన్న ఆలోచనతో ముందుకు వెళుతున్నట్లు అర్థం అవుతోంది. అయితే పవన్ కళ్యాణ్ పై ఆమె వాడుతున్న భాష మాత్రం అభ్యంతరకరంగా ఉంది.

* ఆ సినిమాను పవన్ కు జతచేస్తూ..
ఇటీవల ఇడుపు కాయితం అనే సినిమా టైటిల్ వివాదంగా మారింది. తెలంగాణ వాడుక భాషలో విడాకుల కోసం తీసుకునే ధ్రువీకరణ పత్రం అన్న మాట. అయితే ఈ సినిమా టైటిల్ పై అనేక రకాల కామెంట్స్ వచ్చాయి సోషల్ మీడియాలో. దీంతో చాలామంది ఈ ఇడుపు కాయితం అంటే ఏంటి అని ప్రశ్నించారు. ఒకవైపు ఆ వివాదం నడుస్తుండగా.. కల్వకుంట్ల కవిత స్పందించారు. దాని గురించి పవన్ కళ్యాణ్ ను అడగాలని సూచించారు. దీంతో ఈ వివాదం కొత్త టర్న్ తీసుకుంది. పవన్ వ్యక్తిగత జీవితానికి ముడి పెడుతూ కల్వకుంట్ల కవిత కామెంట్స్ చేశారని అర్థం అవుతోంది. దీనిపై జనసైనికులు స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. చిప్పకూడు కవిత అనేదానికి అర్థం చెప్పాలి అంటూ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఒక ట్వీట్ చేశారు. దీంతో అది విపరీతంగా వైరల్ అవుతోంది. జన సైనికులు సైతం ట్రోల్ చేస్తున్నారు.

* వ్యూహం ప్రకారమే..
అయితే కవిత ఒక వ్యూహం ప్రకారమే పవన్ కళ్యాణ్ పై ఫోకస్ పెట్టినట్లు అర్థం అవుతోంది. కచ్చితంగా కవిత కామెంట్స్ చేస్తే దానికి స్పందిస్తారు జనసైనికులు. గతంలో కెసిఆర్ సైతం ఇదే వ్యూహం అనుసరించేవారు. ఆయన చంద్రబాబును మధ్యకు లాగి సెంటిమెంటును రగిలించేవారు. ఇప్పుడు చంద్రబాబును కవిత టార్గెట్ చేసుకున్న పెద్దగా వర్కౌట్ కాదు. అందుకే పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం, ఒక రకమైన సెంటిమెంట్ క్రియేట్ చేయాలని భావించడం.. స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఆమె శృతి మించి వ్యాఖ్యలు చేస్తున్నారు. అర్థంపర్థం లేని మాటలు ఆడుతున్నారు. అయితే కేవలం తన పార్టీ ఉనికి కోసమే ఈ ప్రయత్నం అన్నది విశ్లేషకుల మాట. ఆమె ఊహిస్తున్నది, అంచనా వేసింది కొంతవరకు వర్క్ అయినట్టు కనిపిస్తోంది. ఏదో విడాకులు అని అర్థం వచ్చే సినిమా టైటిల్ ను.. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని గుర్తుచేస్తూ సెటైరికల్ గా కవిత మాట్లాడడం చూస్తుంటే పక్కా వ్యూహం అని తెలుస్తోంది.

ఈ ఐదు రాశుల వారికి ఈరోజు అన్ని విజయాలే..

Horoscope
Horoscope

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోకుండా ధన లాభం ఉండనుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారి జీవితం ఈరోజు సంతోషంగా సాగుతుంది. డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది. సొంత వాహనాలపై ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. అనుకోకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు రాజకీయాల్లో రాణించే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు అధికారుల మద్దతుతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు ఇతరుల సహాయం ఉంటుంది. మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి ఇదే మంచి సమయం. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. కొన్ని పనుల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వీరితో వ్యాపార అభివృద్ధి పెరిగే అవకాశం ఉంటుంది. అనవసరపు వివాదాల్లోకి తల దూర్చకుండా ఉండడమే మంచిది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవ మర్యాదలు తిరిగి అవకాశం ఉంది. మానసికంగా ఇబ్బందులు ఏర్పడతాయి. వ్యాపారులు ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం చేకూరి అవకాశముంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారు శుభవార్తలు వింటారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం చేకూరుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టే వ్యాపారులకు ఇదే మంచి సమయం.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు నాణ్యమైన ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ఉండడంతో శత్రువులపై విజయం సాధిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టే వారికి తోటి వారి సహకారం ఉంటుంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని విజయాలే సమకూరుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయం పెరిగిన దానికి తగిన విధంగా ఖర్చులు ఉండే అవకాశం ఉంటుంది. పాత స్నేహితులను కలవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈరోజు పెండింగ్ పనులు పూర్తవుతాయి. కొన్ని ఖర్చులను నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. పెద్దల ఆశీస్సులతో కొత్తగా పెట్టుబడును పెడతారు. కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గ్రహాల అనుగ్రహంతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం. శని దేవుడి అనుగ్రహంతో శత్రులపై విజయం సాధిస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. పూర్వికులు ఆర్థిక సంబంధించి శుభవార్తలు వింటారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి నిరుద్యోగులకు ఈరోజు శుభవార్తలు అందుతాయి. ఉద్యోగులు గతంలో చేపట్టిన ప్రాజెక్టుల నుంచి లాభాలు పొందుతారు. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. అనవసరపు వివాదాల్లోకి తరచూచకుండా ఉండడమే మంచిది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండడమే మంచిది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. రాజకీయాల్లో ఉండే వారికి పదోన్నతులు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

కేతన్ కేసు.. సియా, చేతన్ పక్కా ప్లాన్ తోనే.. సీన్ రిక్రియేషన్ లో దారుణ నిజాలు

Ketan Agarwal Case
Ketan Agarwal Case

Ketan Agarwal case : పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు తీవ్రత నేపథ్యంలో పోలీసులు సీన్ రిక్రియేషన్ చేశారు. ఫలితంగా దారుణమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు ఆ విషయాలను చెబుతున్నప్పుడు ఆందోళన వ్యక్తం చేశారంటే.. ఈ ప్లాన్ అమలు చేయడానికి సియా, కేతన్ ఎంత క్రూరానికి తెగబడ్డారో అర్థం చేసుకోవచ్చు. పోలీసులు నిర్వహించిన సీన్ రిక్రియేషన్లో దారుణమైన నిజాలు తెలుగులోకి వచ్చాయి. అవి సభ్య సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ సంఘటన యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది అంటే.. ఆ సంఘటన తీవ్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

జూన్ 4న కేతన్ అగర్వాల్ ను చంపడానికి అతడికి కాబోయే భార్య సియా, ఆమె ప్రియుడు చేతన్ ప్రణాళిక రూపొందించారు. అయితే ఆ ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు. దీంతో జూన్ 18న మరోసారి ప్రణాళిక రూపొందించారు. ఉదయం ఏడు నుంచి సాయంత్రం పది గంటల వరకు ఈ వ్యవహారం మీదనే వారిద్దరు చర్చలు సాగించారు.

ఆరోజు ఉదయం 7 గంటల నుంచి వారిద్దరు ప్లాన్ అమలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో చేతన్ తనను గుర్తుపట్టకుండా ఉండడానికి తన మొబైల్ దాటాను ఆఫ్ చేశాడు. జిపిఎఫ్ ఆప్షన్ కూడా డిస్ యాక్టివేట్ చేశాడు.

ఆరోజు ఉదయం 8 గంటలకు తన షాప్ దగ్గరికి చేరుకున్నాడు. తన ఫోన్ అక్కడే పెట్టి.. ఎటు వెళ్లలేదు అన్నట్టుగా అందరిని నమ్మించాడు. ఒకవేళ ఎవరైనా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి మాట్లాడాలని.. తన దగ్గర పని చేసే కార్మికుడికి చెప్పాడు.

తన మీద అనుమానం రాకుండా ఉండడానికి తన సంస్థలో పనిచేసే ఉద్యోగి ఫోన్ తీసుకొని.. కోట వద్దకు వెళ్లిపోయాడు. ఒకవేళ మాట్లాడాల్సిన అవసరం ఏర్పడితే అదే ఫోన్ నుంచి చేశాడు.

ఆ కోట ప్రాంతంలో తనను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు హుడి ధరించాడు. తన మీద అనుమానం రాకుండా ఉండడానికి కొండమీదికి వెళ్లిపోయాడు.

చేతన్ చెప్పినట్టుగానే కేతన్ అగర్వాల్ ను సియా కొండ ప్రాంతంలోని చివరి అంచు వరకు తీసుకొచ్చింది. అప్పటికి మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాలు దాటింది. చేతన్ కు సియా సైగలు చేయడం మొదలుపెట్టింది. అప్పటిదాకా అక్కడ దాక్కుని ఉన్న చేతన్ ఒక్కసారిగా బయటికి వచ్చి కేతన్ ను పైనుంచి కిందికి నెట్టేసాడు.

ఆ తర్వాత వారిద్దరు కిందికి వచ్చారు. సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాల తర్వాత తన ఫోన్లో ఇంటర్నెట్ ఆన్ చేశాడు.

ఇంటర్నెట్ ఆఫ్ చేస్తే తాను పోలీసులకు దొరకనని కేతన్ భావించాడు. కానీ పోలీసులు అదే ఆధారంతో అతడిని పట్టుకున్నారు. దాదాపు 10 గంటల 40 నిమిషాల పాటు అతడు ఇంటర్నెట్ నిలుపుదల చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ లలో అతడు హుడీ ధరించిన చిత్రాలు దర్శనమిచ్చాయి. అతడి ఫోన్ కు వచ్చిన కాల్స్ వేరే వ్యక్తులు ఎత్తినట్టు పోలీసులు తమ పరిశీలనలో గుర్తించారు. అయితే సీన్ రీ క్రియేషన్ లో పోలీసులు కేవలం సియాను మాత్రమే తీసుకొచ్చారు.

బెన్ స్టోక్స్ రిటైర్మెంట్.. బజ్ బాల్ మొనగాడు.. ఇంగ్లాండ్ రాతను మార్చిన ఆటగాడు..

Ben Stokes retirement

Ben Stokes retirement : అది 2019 వన్డే ప్రపంచ కప్.. ఫైనల్ మ్యాచ్.. అప్పటిదాకా ఇంగ్లాండ్ ఒక్క వన్డే వరల్డ్ కప్ కూడా అందుకోలేదు. క్రికెట్ పుట్టిన ఇంగ్లాండ్ దేశానికి ఇది ఒక వెలితి. సరిగ్గా 2019లో ఇంగ్లాండ్ ఫైనల్ వెళ్ళింది. నాటి మ్యాచ్లో ఒక ఆటగాడు 84 పరుగులు చేశాడు. చివరి వరకు నాట్ అవుట్ గా నిలిచాడు. అతడు ఆడిన ఆ ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ జట్టును విజేతగా నిలిపింది. అంతేకాదు ఇంగ్లాండ్ జట్టుకు అతడిని హీరోగా చేసింది. అతడు మరెవరో కాదు బెన్ స్టోక్స్.

బౌలింగ్ వేయగలడు. బ్యాటింగ్ చేయగలడు.. మెరుపు వేగంతో బంతులను కూడా ఆపగలడు. అందువల్లే అతడు అండ్రూ ప్లింటాఫ్ తర్వాత ఆ స్థాయిలో ఆల్రౌండర్ గా పేరు తెచ్చుకున్నాడు. 2019లోనే హెడింగ్ లీ లో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు సాధించిన 135* పరుగులు యాషెస్ సిరీస్ లోనే అత్యంత చారిత్రాత్మకమైనవి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ లు ఆడాడు స్టోక్స్.

2022లో ఇంగ్లాండ్ టెస్ట్ సారధి స్థానం నుంచి రూట్ తప్పకుండా తర్వాత రెడ్ బాల్ బాధ్యతలను స్టోక్స్ అందుకున్నాడు. హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ తో కలిసి బాజ్ బాల్ క్రికెట్ ను ప్రవేశపెట్టాడు. న్యూజిలాండ్.. దక్షిణాఫ్రికా.. పాకిస్తాన్.. ఇతర దేశాల మీద ఇంగ్లాండ్ ఈ క్రికెట్ ద్వారానే సిరీస్ విజయాలు నమోదు చేసింది. అంతేకాదు టెస్ట్ క్రికెట్ కు సరికొత్త ఊపిరి అందించింది.

స్టోక్స్ గడిచిన కొంతకాలంగా గొప్ప ఫామ్ లో లేడు. బ్యాటింగ్ సరిగ్గా చేయలేకపోతున్నాడు. బౌలింగ్ కూడా సరైన దిశలో వేయలేకపోతున్నాడు. దీనికి తోడు ఇటీవల యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లాండ్ ఓడిపోయింది. అంతకుముందు ఇండియా చేతిలో కూడా వరుస ఓటములు ఎదురయ్యాయి. దీనికి తోడు స్టోక్స్ మద్యం తాగి గొడవలు పెట్టుకోవడం వల్ల పరుగు పోగొట్టుకున్నాడు. ఆరోగ్యం కూడా అంత బాగాలేదు. ఆమధ్య ప్రాక్టీస్ చేస్తుండగా బంతి తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. కొద్దిరోజులపాటు ఆస్పత్రి పాలయ్యాడు. తిరిగి మళ్ళీ జట్టులోకి వచ్చినప్పటికీ మునుపటి మాదిరిగా ఆడలేక పోతున్నాడు. అందువల్లే ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న సిరీస్ లోనే అతడు టెస్ట్ క్రికెట్ నుంచి తట్టుకున్నాడు. ఇప్పటికే అతడు టి20, వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

హర్మన్ ప్రీత్ కౌర్ సిక్సర్ల సింహగర్జన.. బెంబేలెత్తిన ఆస్ట్రేలియా.. అభిమానులకు సండే ట్రీట్

Harmanpreet Kaur

Harmanpreet Kaur : అసలే ఆదివారం.. అందులోనూ ఆస్ట్రేలియా.. కచ్చితంగా గెలవాలి.. ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీఫైనల్ వెళ్ళిపోయింది.. టీమిండియా మీద ఒత్తిడి ఉంది.. ఇటీవల దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓడిపోకుండా ఉంటే టీమ్ ఇండియాకు ఇంత ఇబ్బంది వచ్చేది కాదు. అందువల్లే టీమిండియాకు ఈ మ్యాచ్లో గెలవాల్సిన పరిస్థితి.

పైగా బంగ్లాదేశ్ జట్టు మీద దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో గెలిచింది. టీమిండియా సెమీఫైనల్ వెళ్లాలంటే కచ్చితంగా ఆస్ట్రేలియా మీద గెలవాలి. అందువల్లే ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు దూకుడుగా బ్యాటింగ్ చేశారు. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ నిర్ణయానికి తగ్గట్టుగానే టీమిండియా బ్యాటర్లు బ్యాటింగ్ చేశారు.

ఓపెనర్లు స్మృతి 38, షఫాలీ 34 పరుగులు చేశారు. తొలి వికెట్ కు వీరిద్దరూ 66 పరుగులు జోడించారు. ఆ తర్వాత 83 పరుగుల వద్ద టీమ్ ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం కెప్టెన్ కౌర్, జమీమా సూపర్ ఆట తీరు ప్రదర్శించారు. ముఖ్యంగా కెప్టెన్ కౌర్ 27 బంతుల్లోనే 56 పరుగులు చేసింది. ఇందులో ఆరు ఫోర్లు.. మూడు సిక్సర్లు ఉన్నాయి. ముఖ్యంగా చివరి ఓవర్ లో సోఫీ బౌలింగ్లో హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టి కౌర్ అదరగొట్టింది. చివరి ఓవర్ లో భారత జట్టు ఏకంగా 23 పరుగులు సాధించింది. తద్వారా ఆస్ట్రేలియా ముందు 171 పరుగుల టార్గెట్ విధించింది. కేవలం నాలుగు టికెట్లు కోల్పోయి టీమ్ ఇండియా ఈ ఘనత అందుకుంది.

కౌర్ ఈ టి20 వరల్డ్ కప్ లో ఇప్పటివరకు తన స్థాయి బ్యాటింగ్ చేయలేదు. కానీ ఆస్ట్రేలియా మీద మాత్రం సింహగర్జన చేసింది. సూపర్ ఆటతీరుతో ఆకట్టుకుంది. జమీమాతో కలిసి మూడో వికెట్ కు ఏకంగా 64 పరుగులు జోడించింది. నాలుగో వికెట్ కు రీఛా తో కలిసి కేవలం ఐదు బంతుల్లోనే 19 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. తద్వారా టీమ్ ఇండియాను అత్యంత పటిష్ట స్థితిలో నిలిపింది.. చివరి ఓవర్ లో హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కౌర్.. 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించింది. వేగంగా ఆడే క్రమంలో క్యాచ్ అవుట్ అయింది. ఈ హాఫ్ సెంచరీ ద్వారా t20 లలో ఆస్ట్రేలియా మీద కౌర్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా జట్టు మీద మూడు హాఫ్ సెంచరీలు చేసిన టీమిండియా కెప్టెన్ గా అవతరించింది.. అంతేకాదు టి20 లలో ఆస్ట్రేలియా మీద టీమిండియాకు ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం.

ప్రతీకార దాడులు మొదలు పెట్టిన ఇరాన్‌.. మధ్యప్రాచ్యం మళ్లీ మండుతోంది!

Iran Missile Attack
Iran Missile Attack

Iran Missile Attack: అమెరికా–ఇరాన్‌ మధ్య ఇటీవలే శాంతి ఒప్పందం కుదిరింది. దీంతో ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంది. ముఖ్యంగా చమురు సంక్షోభం ముగిసిందని సంబరపడ్డాయి. దాడులు ఆగిపోతాయని భావించాయి. కానీ అమెరికా తన బుద్ధి వంకర అని మరోమారు నిరూపించుకుంది. ఇరాన్‌పై జూన్‌ 27న తీవ్రమైన దాడులు చేసింది. దీంతో ఇరాన్‌ కూడా జూన్‌ 28న ప్రతీకార దాడులు ప్రారంభించింది. అమెరికా మిత్రరాజ్యాలైన కువైట్, బహ్రెయిన్‌పై క్షిపణి దాడులు చేసింది. ఇది మధ్యప్రాచ్యంలో ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచి, ప్రాంతీయ యుద్ధం వైపు వెళ్లే అవకాశాలను సృష్టించింది.

ఇరాన్‌ ప్రతీకార చర్యలు..
అమెరికా తన మిస్సైల్, డ్రోన్‌ నిల్వ కేంద్రాలపై దాడి చేసినందుకు బదులుగా ఇరాన్‌ తన ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్‌స్‌(ఐఆర్‌జీసీ) ఈ దాడులు తమ భద్రతా ప్రయోజనాల కోసం అనివార్యమని పేర్కొంది. కువైట్, బహ్రెయిన్‌ వంటి అమెరికా మిత్ర దేశాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఇరాన్‌ అమెరికాపై పరోక్ష ఒత్తిడి పెంచాలని చూస్తోంది.

కువైట్, బహ్రెయిన్‌ భద్రతా చర్యలు..
ఇరాన్‌ దాడుల నేపథ్యంలో కువైట్‌ వెంటనే తన ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థను పూర్తి స్థాయిలో యాక్టివేట్‌ చేసింది. బహ్రెయిన్‌ ప్రభుత్వం ప్రజలను సురక్షితమైన ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని హెచ్చరించింది. రెండు దేశాలు కూడా అత్యవసర భద్రతా చర్యలు తీసుకుంటున్నాయి. ఇది వీరి భద్రతా వ్యవస్థలు ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయో పరీక్షించే పరిస్థితిని సృష్టించింది.

అమెరికా హెచ్చరికలు..
ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌ను బహిరంగంగా హెచ్చరించారు. ఇరాన్‌ సైనిక చర్యలు కొనసాగిస్తే దాని ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ హెచ్చరిక ఇరాన్‌పై అమెరికా ఎంత తీవ్రమైన వైఖరిని అనుసరిస్తోందో చూపిస్తుంది. అమెరికా తన మిత్ర దేశాల భద్రతను రక్షించడానికి మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

మధ్యప్రాచ్యంలో ఇప్పటికే ఉన్న సంక్లిష్ట పరిస్థితిని మరింత దిగజార్చాయి. ఇరాన్‌ తన ప్రతీకార చర్యలను అమెరికా మిత్ర దేశాలపైకి విస్తరించడం ద్వారా సంఘర్షణను విస్తృతం చేస్తోంది. కువైట్, బహ్రెయిన్‌ వంటి చిన్న గల్ఫ్‌ దేశాలు ఈ సంఘర్షణలో చిక్కుకోవడం వారి ఆర్థిక, భద్రతా పరిస్థితులను దెబ్బతీసే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరా, ఆర్థిక మార్కెట్లు తీవ్రంగా ప్రభావితం కావచ్చు. అదే సమయంలో ఇరాన్‌ తన ఉనికిని కాపాడుకోవడానికి మరింత ఆక్రమణాత్మకంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ పరిస్థితి యూరప్, ఆసియా దేశాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. అంతర్జాతీయ సమాజం వెంటనే దౌత్యపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

చైతన్య, నారాయణతో పాల వ్యాపారం.. కవిత చెప్పిన ఆ గుంట నక్క ఎవరు..

Kalvakuntla Kavitha
Kalvakuntla Kavitha

Kalvakuntla Kavitha: తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత విలేకరుల ముందుకు వచ్చిందంటే చాలు ఏదో ఒక విషయాన్ని బయటపడుతూనే ఉన్నారు. మీడియాకు కావలసినంత మసాలా అందిస్తూనే ఉన్నారు. తద్వారా మీడియాలో ఆమె విస్తృతంగా చర్చలో ఉంటున్నారు. భారత రాష్ట్ర సమితి నుంచి బయటికి వచ్చిన తర్వాత కవిత మొదట్లో కాస్త హుందా గానే మాట్లాడారు. కొన్ని విషయాలను మాత్రమే మీడియాకు చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆమె పూర్తిగా మారిపోయారు. ప్రతి విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెబుతూనే ఉన్నారు.

తెలంగాణ రక్షణ సేన పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత కల్వకుంట్ల కవిత భారత రాష్ట్ర సమితి మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ నుంచి మొదలుపెడితే కేటీఆర్ వరకు ఎవరిని వదిలిపెట్టకుండా తిడుతూనే ఉన్నారు. ప్రజా సమస్యల మీద స్పందిస్తున్నారు.. నిరసనలు.. ఆందోళనలు చేపడుతున్నారు. అంతేకాదు.. అనేకా అంశాల మీద రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. తద్వారా కవిత తెలంగాణ రాజకీయాలలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు.

ఇటీవల ఇడుపు కాయితం అన్న సినిమాకు సంబంధించి వివాదం ఏర్పడిన నేపథ్యంలో కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ పదానికి అర్థం తెలియాలంటే పవన్ కళ్యాణ్ ను అడగాలని కవిత పరోక్షంగా విమర్శించారు. తద్వారా ఈ వివాదంలోకి పవన్ కళ్యాణ్ ను లాగారు కవిత. అంతేకాదు ఇటువంటి విషయాల మీద భారత రాష్ట్ర సమితి నాయకులు ఇప్పుడు మాట్లాడే అవకాశం లేకుండా పోయిందని కవిత పేర్కొన్నారు. అక్కడితోనే కవిత ఆగిపోలేదు.. మరో నాయకుడి మీద కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలతో గుంట నక్కలాంటి నాయకుడు పాల వ్యాపారం చేస్తున్నాడని కవిత ఆరోపించారు. అటువంటి వ్యక్తి భారత రాష్ట్ర సమితిలో కొనసాగడం ఆ పార్టీ చేసుకున్న దరిద్రమంటూ ఆమె ఆరోపించారు. గుంటనక్క అని కవిత సంబందించిన ఆ వ్యక్తి ఎవరని సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన విద్యాసంస్థల విషయంలో ఉద్యమకారులు తీవ్రంగా స్పందించారు. శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థల మీద దాడులు కూడా చేశారు.

ఇటీవల కాలంలో భారత రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించిన ఓ కీలక నాయకుడు ఆ రెండు విద్యాసంస్థలకు పాలు పోస్తున్నారని.. వ్యాపారం సాగిస్తున్నారని కవిత ఆరోపించారు. ఇటీవల కాలంలో హరీష్ రావు పేరు ప్రస్తావించకుండా గుంట నక్క అని కవిత అంటున్నారు. బహుశా విద్యా సంస్థలతో వ్యాపారం చేస్తున్నది ఆయనేనని తెలంగాణ రక్షణ సేన నాయకులు అంటున్నారు. హరీష్ రావు భార్య పాల వ్యాపారం చేస్తున్నారు. ఒక డెయిరీ కూడా ఆమె ఏర్పాటు చేశారు. అందువల్లే కవిత ఈ ఆరోపణలు చేశారని తెలుస్తోంది. మరి దీనిపై హరీష్ రావు వర్గం నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

15 వేల మందిని చంపాలనుకున్నాడు.. వీడికి ఇంకా బతికే హక్కు ఉందా.. సజ్జనార్ మార్క్ న్యాయమే సరి..

Fayyaz Arrest
Fayyaz Arrest

Fayyaz Arrest: పులిలాంటి క్రూర జంతువు ఆకలి వేస్తేనే వేటాడుతుంది. ఆకలి తీరితే పక్కనుంచి జింక వెళ్లినా సరే పట్టించుకోదు. ఎందుకంటే దానికి ఆకలి తీరితే సరిపోతుంది. కానీ మనుషులు అలా కాదు.. మనుషుల్లో ఉన్న లోభం .. అత్యాశ వల్ల దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. ఘోరాలు చేస్తున్నారు. సాటి మనుషులపై ఏమాత్రం సానుభూతి లేకుండా దాడులు చేస్తున్నారు. చివరికి అత్యంత క్రూరంగా చంపేస్తున్నారు. న్యాయస్థానాలు ఎన్ని రకాలుగా శిక్షలు వేసినా సరే ఈ తరహా వ్యక్తుల వ్యక్తిత్వం మారడం లేదు. పైగా కొత్త కొత్తగా వారిలో క్రూరమైన ఆలోచనలు పుడుతున్నాయి.

మనదేశంలో ఇటీవల మొహర్రం జరిగింది. ఇది ఒక సంతాప సందేశం లాంటి కార్యక్రమం. చనిపోయిన ముస్లింలను తలుచుకుని సాగించే వ్యవహారం. ఇటువంటి కార్యక్రమాన్ని కూడా ఒక వ్యక్తి నరమేధానికి వాడుకోవాలనుకున్నాడు. ఏకంగా 15000 మందిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఒక దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. వాస్తవానికి మొహర్రం సమయంలో ముస్లింలే ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. తోటి ముస్లింలనే చంపడానికి అతడు ప్రయత్నించాడు అంటే ఎంతటి క్రూరమైన వ్యక్తో అర్థం చేసుకోవచ్చు. పైగా పోలీసులు దర్యాప్తులో అతనికి సంబంధించిన అనేకమైన విషయాలు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది.

15 వేల మందిని చంపడానికి ప్రణాళిక రూపొందించిన ఆ వ్యక్తి పేరు ఫయాజ్.. ఇతడు ముంబైలో జరిగిన మొహర్రం ఊరేగింపులో విషపు క్యాప్సూల్ పంపిణీ చేయడానికి నిర్ణయించుకున్నాడు. అయితే అతని వ్యవహార శైలి ముందుగానే తెలియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అతని వద్ద నుంచి దాదాపు 14 వేల 900 క్యాప్సూల్స్ స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా మరో 30 వేల క్యాప్సూల్స్.. 50 కిలోల ఎలుకల మందు అతడు ఆర్డర్ చేసినట్లు గుర్తించారు. ఇంతమందిని చంపడానికి అతడు గొప్ప కార్యంగా చెబుతున్నాడు.

ఫయాజ్ ఉన్నత విద్యావంతుడు. ఇతడు బీబీఏ వరకు చదివాడు. ఇరాక్ లో చాలా కాలం ఉన్నాడు. ఆ తర్వాత అతని ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. క్రూరంగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. తోటి మనుషులను చంపడానికి తెగబడ్డాడు. సరైన సమయం కోసం చూస్తున్న అతడు మొహర్రం నాడు ఈ దారుణానికి పాల్పడేందుకు సిద్ధమయ్యాడు. అదృష్టవశాత్తు అతడి చేతిలో ఎవరూ చనిపోలేదు. అతడు ఇచ్చిన క్యాప్సూల్స్ ఎవరైనా తింటే మాత్రం పరిస్థితి వేరే విధంగా ఉండేది. ఇంతటి క్రూరమైన ఫయాజ్ ను జైల్లో పెట్టి మేపడం కంటే.. సజ్జనార్ మార్క్ న్యాయమే సరైనదని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్, సక్సెస్ ఈవెంట్స్ కి జానీ మాస్టర్ రాకపోవడానికి కారణం అదేనా..

Peddi OTT Release
Peddi OTT Release

Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం ఇంత పెద్ద హిట్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా కచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఈ సినిమాలోని ప్రతీ పాటకు కొరియోగ్రఫీ చేసింది ఆయనే. చికిరి చికిరి, రయ్ రయ్ రారా వంటి పాటలు నేషనల్ లెవెల్ లో ఏ రేంజ్ లో ట్రెండ్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ పాటలకు థియేటర్స్ లో ఆడియన్స్ వేసిన స్టెప్పులకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అయితే సినిమా విజయం లో ఇంతటి కీలక పాత్ర పోషించిన జానీ మాస్టర్, ప్రీ రిలీజ్ విడుదల వేడుక కార్యక్రమంలో కానీ, సక్సెస్ ఈవెంట్స్ లో కానీ పాల్గొనకపోవడం గమనార్హం. రామ్ చరణ్ కి ఎంతో సన్నిహితుడైన జానీ మాస్టర్ , ఎందుకు ఈ ఈవెంట్స్ లో పాల్గొనలేదని అభిమానులు సైతం అడుగుతున్నారు.

జానీ మాస్టర్ ని ఆహ్వానిస్తే కచ్చితంగా వచ్చేవారు, కానీ మేకర్స్ అంతటి సాహసం చేయలేకపోయారని తెలుస్తోంది. ఎందుకంటే జానీ మాస్టర్ పై పోక్సో కేసు ఉంది. యంగ్ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ ని ఈయన లైంగిక వేధింపులకు గురి చేసారని రెండేళ్ల క్రితం ఈయనపై ఆమె కేసు వేయడం, పోలీసులు కేసు నమోదు చేసి , జానీ మాస్టర్ కోసం గాలించి , బెంగళూరు లోని ఒక రిసార్ట్ లో అరెస్ట్ చేసి దాదాపుగా నెల రోజుల పాటు రిమాండ్ లో ఉంచి విచారించడం, అంతే కాకుండా వచ్చిన నేషనల్ అవార్డు కూడా వెనక్కి పోవడం వంటి సంఘటనలు చూసిన తర్వాత జానీ మాస్టర్ కి భవిష్యత్తు ఉంటుందా అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే రామ్ చరణ్ నుండి పిలుపొచ్చింది. దేశం మొత్తం ఊగిపోయే రేంజ్ స్టెప్పులు కంపోజ్ చేసి మరోసారి చరిత్ర సృష్టించారు.

అయినప్పటికి జానీ మాస్టర్ ని పెద్ది ఈవెంట్ కి పిలిస్తే , సినిమాపై లేనిపోనీవు నెగెటివిటీని కొంతమంది అంటిస్తారు , ఆ కారణం చేతనే జానీ మాస్టర్ ని ‘పెద్ది’ చిత్రానికి సంబంధించిన ఈవెంట్స్ కి పిలవడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. అయితే నెగెటివిటీ వస్తుంది అని తెలిసినప్పుడు , జానీ మాస్టర్ ని ఈ సినిమా కోసం తీసుకోకుండా ఉండాల్సింది, ఆయన చేత పాటలను కంపోజ్ చేస్తే రానటువంటి నెగెటివిటీ, ఈవెంట్స్ కి వస్తే వచ్చేస్తుందా?, ఇదెక్కడి న్యాయం అంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.