Home Blog Page 279

మోడీ పొదుపు సూచన.. సీఎం చంద్రబాబు నుంచి మంత్రుల వరకు..

CM Chandrababu reduce convoy
CM Chandrababu reduce convoy

CM Chandrababu reduce convoy: పశ్చిమ ఆసియాలో యుద్ధం నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పొదుపు అంశాలపై పిలుపునిచ్చారు. ప్రధానంగా ఇంధన పొదుపు పై కీలక సూచనలు చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఏపీ ప్రజలకు ప్రత్యేక సూచనలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే ముందుగా తాము పొదుపు పాటించాలని భావించారు సీఎం చంద్రబాబు. తనతో పాటు మంత్రుల కాన్వాయ్ లో వాహన శ్రేణి తగ్గించారు. ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశం వేదికగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి మంత్రుల దాకా తమ కాన్వాయ్ లో వాహనాలు తగ్గించుకోవడం కనిపించింది.

క్యాబినెట్ భేటీ..
సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో క్యాబినెట్ భేటీ జరిగింది. దాదాపు పదికి పైగా వాహనాలతో వచ్చే చంద్రబాబు కేవలం నాలుగు వాహనాలకు మాత్రమే పరిమితం అయ్యారు. భద్రతా సిబ్బంది ఇబ్బంది పడకుండా ఉండేందుకు వారికోసం ఒక బస్సు ఏర్పాటు చేశారు. మంత్రి లోకేష్ సైతం తన కాన్వాయ్ ను తగ్గించుకున్నారు. కేవలం రెండు వాహనాలతో వచ్చారు. సీఎం మాదిరిగా తన సెక్యూరిటీ సిబ్బంది కోసం ఒక బస్సు ఏర్పాటు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ సైతం తన కాన్వాయ్ ని తగ్గించుకున్నారు. జడ్ క్యాటగిరి లో ఉన్న దుబారా తగ్గించేందుకు వీలుగా పవన్ సగానికి పైగా వాహనాలను తగ్గించుకోవడం విశేషం.

ఒకే ఒక్క వాహనంలో వచ్చిన మంత్రులు
చివరికి హోం మంత్రి వంగలపూడి అనిత సైతం తన ప్రోటోకాల్ పక్కన పెట్టి మరి తన వాహన శ్రేణిని తగ్గించుకున్నారు. కొందరు మంత్రులు అయితే సింగిల్ వాహనంలో క్యాబినెట్ భేటీకి హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుమేరకు ఎనిమిది పొదుపు అంశాలపై ఏపీ ప్రజలకు ప్రత్యేకంగా అవగాహన కల్పించేందుకు నిర్ణయించారు సీఎం చంద్రబాబు. ప్రధాని హైదరాబాద్ పర్యటనలో భాగంగా కీలక సూచనలు ఇవ్వగా ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఆచరించి.. మిగతా వారికి చెబితే బాగుంటుందని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వంలో పొదుపు చర్యలు ప్రారంభం కావడం విశేషం.

'పెద్ది' ట్రైలర్ హైలైట్స్ ఇవే.. ఇప్పటి వరకు ఒక లెక్క.. మే 18 నుండి మరో లెక్క..

Peddi Trailer Highlights
Peddi Trailer Highlights

Peddi Trailer Highlights: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమా నుండి విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ సెన్సేషన్ సృష్టించింది ఫ్యాన్స్ లోనే కాకుండా ఆడియన్స్ లో కూడా విపరీతమైన పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యేలా చేసింది. అయితే రెండు సార్లు ఈ చిత్రాన్ని వాయిదా వెయ్యడం తో ఆడియన్స్ లో ఈ చిత్రం పై ఉన్న అంచనాలు కాస్త తగ్గిన విషయం వాస్తవమే. ఆ ప్రభావం ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ పై చాలా బలంగా పడింది. 3 మిలియన్ డాలర్లు కేవలం ప్రీమియర్ షోస్ నుండి వస్తాయని అనుకుంటే , కనీసం 1.5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు కూడా వచ్చేలా కనిపించడం లేదు. అయితే ఈ నెల 18 న ముంబై లో విడుదల చేయబోతున్న థియేట్రికల్ ట్రైలర్ తర్వాత ఈ చిత్రం పై అంచనాలు తారా స్థాయికి చేరుకునే అవకాశాలు ఉంటాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

థియేట్రికల్ ట్రైలర్ నిడివి 2 నిమిషాల 35 సెకండ్ల వరకు ఉంటుందట. ఈ ట్రైలర్ లో పంచ్ డైలాగ్స్ తో పాటు, ఫైట్ షాట్స్, సినిమా స్టోరీ ని జనాలకు పూర్తిగా అర్థం అయ్యేలా చేస్తుందట. ముఖ్యంగా చివరి 10 సెకండ్స్ లో వచ్చే షాట్ ఆడియన్స్ ని మెంటలెక్కిపోయేలా చేస్తుందని, రామ్ చరణ్ ని ఇష్టపడని వాళ్ళు కూడా ఆ షాట్ ని చూసిన తర్వాత టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఎగబడుతారని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే , మరోపక్క మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ ని వేరే లెవెల్ లో ప్లాన్ చేయబోతున్నారు. అందుకు సంబంధించిన షెడ్యూల్ ని కూడా నేడు విడుదల చేశారు. జూన్ 18 నుండి సోషల్ మీడియా లో ‘పెద్ది’ తప్ప మరో పేరు వినిపించని రేంజ్ ప్లానింగ్ ఇది.

ముందుగా ముంబై లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. తెలుగు తో పాటు , అన్ని భాషలకు సంబంధించిన ట్రైలర్స్ కూడా అదే రోజున విడుదల కాబోతున్నాయి. అదే విధంగా ఈ నెల 22 న హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగబోయే సన్ రైజర్స్ హైదరాబాద్ , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ మ్యాచ్ లో కూడా మూవీ టీం సందడి చేయనుంది. రామ్ చరణ్ కూడా ఈ మ్యాచ్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక 23 వ తేదీన భూపాల్ లో స్పెషల్ సాంగ్ ని విడుదల చేయబోతున్నారు. అందుకు ఒక భారీ మ్యూజికల్ ఈవెంట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు , AR రెహమాన్ లైవ్ పెర్ఫార్మన్స్ ని ఇందులో చూడొచ్చు. అదే విధంగా 24 న బెంగళూరు లో , 28 న ఢిల్లీ లో , 30 న చెన్నై లో ప్రెస్ మీట్స్ ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇక చివరిగా జూన్ 1 న విజయనగరం లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్, జూన్ 2 న హైదరాబాద్ లో మరో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేయబోతున్నారు.

నాగబాబుపై తెగ బాధపడుతున్న రోజా

Roja comments on Nagababu
Roja comments on Nagababu

Roja comments on Nagababu: ఎందుకో మెగా ఫ్యామిలీ అంటే మాజీ మంత్రి రోజా విరుచుకుపడుతుంటారు. ఆమె వైసీపీ హయాంలో మంత్రి అయినప్పుడు నేరుగా మెగాస్టార్ చిరంజీవి ఆశీర్వాదం తీసుకునేందుకు వెళ్లారు. అంతకుముందు మెగా బ్రదర్ నాగబాబు తో కలిసి బుల్లితెరలో జబర్దస్త్ షో చేశారు. ఎన్నెన్నో కార్యక్రమాల్లో వారిద్దరూ పాల్గొన్నారు. అయితే రోజా మంత్రి అయిన తర్వాత జబర్దస్త్ షో కు రావడం మానేశారు. మెగా బ్రదర్ నాగబాబు సైతం ఆ షో నుంచి తప్పుకున్నారు. అయితే మంత్రి పదవిపోయి.. ఎమ్మెల్యేగా ఓడిపోయిన రోజా తిరిగి జబర్దస్త్ లోకి రావాలి అనుకుంటే అనుమతి లభించలేదన్న టాక్ ఉంది. అదే సమయంలో మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీగా ఉంటూ.. బుల్లితెర షోల్లో పాల్గొంటున్నారు. దానినే తప్పు పడుతున్నారు మాజీ మంత్రి రోజా. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అప్పట్లో విమర్శలు..
గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రోజా జబర్దస్త్ షో చేశారు. అయితే ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా ఉంటూ.. అటువంటి షోలు చేయడం ఏమిటనేది సోషల్ మీడియా వేదికగా వచ్చిన కామెంట్. అయితే ఆమె షోలు చేయడం వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందన్న భావన వైసిపి నేతల్లో కూడా ఉండేది. అయితే ఎమ్మెల్యేగా ఉండే వరకు ఓకే కానీ.. తరువాత మంత్రిగా మారిన తర్వాత జబర్దస్త్ షోలకు గుడ్ బై చెప్పారు రోజా. దక్షిణ భారతదేశంలోనే ఈ షో ఎంతో ఆకట్టుకుంది. వివిధ కారణాలతో రోజా కంటే ముందే అశోక్ నుంచి తప్పుకున్నారు మెగా బ్రదర్ నాగబాబు. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు నాగబాబు. బుల్లితెర షోలకు హాజరవుతున్నారు.

దక్కని అవకాశాలు..
నగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు రోజా. మళ్లీ బుల్లితెరలో బిజీ కావాలని భావించారు. అనుకున్న మేర అవకాశాలు దక్కలేదు. కానీ అధికార పార్టీ తరపున ఎమ్మెల్సీ అయ్యారు నాగబాబు. ఆయనకు మాత్రం యధావిధిగా బుల్లితెర షోల్లో అవకాశాలు దక్కుతున్నాయి. ఇది ఎంత మాత్రం రోజాకు మింగుడు పడడం లేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అయితే ఎమ్మెల్సీ అయిన వారు సైతం మళ్లీ షో లకు వస్తున్నారని.. తనను మాత్రం తప్పు పట్టారంటూ నాగబాబుపై పరోక్ష విమర్శలు చేశారు రోజా. అయితే తనకు దక్కనిది నాగబాబుకు దక్కిందన్న ఆవేదన ఆమెలో కనిపిస్తోంది. సోషల్ మీడియాలో రోజాపై భిన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మారిన కెసిఆర్, జగన్ రాజకీయ స్నేహాలు!

KCR Jagan political friendship
KCR Jagan political friendship

KCR Jagan political friendship: దేశంలో ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు హాట్ టాపిక్. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బిజెపి పాగా వేస్తోంది. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్ ప్రభావం చూపుతోంది. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఐదు రాష్ట్రాలు ఉండగా అందులో నాలుగింట కాంగ్రెస్ ప్రభుత్వాలే నడుస్తున్నాయి. ఒక్క ఏపీలో మాత్రం టిడిపి కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. అదే టిడిపి కేంద్రంలో కీలక భాగస్వామి. జాతీయస్థాయిలో లెక్క కట్టాలంటే ఏపీ కూడా ఎన్డీఏ పక్షం అని అర్థం అవుతోంది. అయితే జాతీయస్థాయిలో అస్పష్టమైన రాజకీయ వాతావరణం కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో సైతం ప్రాంతీయ పార్టీల మధ్య వైరుధ్యం కనిపిస్తోంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం దక్షిణాది రాష్ట్రాలే ప్రభావితం చేస్తాయి రాజకీయాలను. అంతలా మారిపోయింది ఇక్కడ సీన్. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండగా.. బిజెపి సైతం గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

ఆ ఒక్క కారణంతో..
ఇప్పటివరకు ఏపీలో జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో కెసిఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారు. బిజెపి విషయంలో సానుకూలంగా ఉండేవారు. కానీ వీరి ఉమ్మడి శత్రువు చంద్రబాబు. ఇప్పుడు ఆయన రాజకీయంగా పై చేయి సాధించారు. ఆపై కేంద్ర పెద్దల సహకారం ఆయనకు ఉంది. అందుకే ఇప్పుడు వారు రూట్ మార్చారు. కాంగ్రెస్ పార్టీతో నేరుగా కలవడం లేదు కానీ.. కాంగ్రెస్ పార్టీ స్నేహితులతో చేయి కలుపుతున్నారు. 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అడుగులు వేయనున్నారు. అయితే తమ చిరకాల ప్రత్యర్థి ఎన్డీఏ లో కీలకంగా మారడంతో.. ఆ కూటమిలో ఛాన్స్ లేదని వారికి తేలిపోయింది. అందుకే ఇండియా కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.

స్టాలిన్ స్థానంలో విజయ్..
ఇప్పటివరకు కేసీఆర్, జగన్, స్టాలిన్ కలిసి రాజకీయాలు చేసేవారు. పరస్పరంగా రాజకీయంగా ఒకరికొకరు సహకరించుకునేవారు. ఇతర పార్టీల విషయంలో తమ స్వరాష్ట్రంలో ఉన్న పరిణామాలకు అనుగుణంగా నడుచుకునేవారు. కానీ ఇప్పుడు అదే స్టాలిన్ ను కెసిఆర్, జగన్మోహన్ రెడ్డి విడిచి పెట్టేసినట్టే అని తెలిసిపోతోంది. ఎందుకంటే విజయ్ గెలవడంతో ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు స్టాలిన్ ను మరిచిపోయారు. విజయ్ ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో పొలిటికల్ గేమ్ ఆడాలని చూస్తున్నారు. అయితే అదే విజయ్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంది. కాంగ్రెస్ పట్ల గౌరవభావంతో ఉన్నారు విజయ్. విజయ్ తో స్నేహం చేస్తున్నారు కేసీఆర్, జగన్. ఈ మొత్తం పరిణామాలతో కెసిఆర్ తో పాటు జగన్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయినట్టు పొలిటికల్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే దీనికి కొంత కాలం పడుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తో పాటు సార్వత్రిక ఎన్నికల ముంగిట దీనిపై క్లారిటీ వస్తుంది.

బెంగాల్‌ దేశద్రోహుల బాక్స్‌లు బద్ధలు.. వారికి ఇక దబిడి దిబిడే!

West Bengal
West Bengal

West Bengal: పశ్చిమ బెంగాల్‌ చట్ట వ్యవస్థ ఒక్కసారిగా కఠినపడింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ 15 ఏళ్ల పాలనలో ఆడిందే ఆటగా, పాడిందే పాటగా సాగిన ఆగడాలకు కొత్తగా కొలువుదీరిన బీజేపీ సర్కార్‌ చెక్‌ పెడుతోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ బాటలో నడుస్తున బెంగాల్‌ సీఎం సువేందు అధికారి ప్రభుత్వం.. స్మగ్లర్లను ఎన్‌కౌంటర్‌ చేయిస్తోంది. నక్సల్స్‌ నాయకులను అరెస్టు చేస్తోంది. అల్లరి గ్యాంగ్‌లపై వేట కొనసాగిస్తోంది. టీఎంసీ సీనియర్‌ నాయకురాలు మహువా గార్గా ఛటర్జీ అరెస్టు రాజకీయ తుఫాను రేపింది. ఆమె దేశవ్యతిరేక వ్యాఖ్యలు, రాష్ట్ర విభజనవాద ధోరణి ఈ చర్యకు మూలం. ’బంగా పొక్కో’ ఉపన్యాసాల్లో భారత్‌ను కించపరిచి, బెంగాల్‌ను స్వతంత్ర దేశంగా చిత్రీకరించడం జాతీయ ఐక్యతకు ముప్పుగా మారింది. ఈ అరెస్టు టీఎంసీపై ఒత్తిడి పెంచింది.

ఉన్మాద వ్యాఖ్యల ట్రాక్‌ రికార్డ్‌..
టీఎంసీ సంస్థాపక సభ్యురాలు, మాజీ ఎంపీ గార్గా ఛటర్జీ 2024 నుంచి దేశవ్యతిరేక వాగ్దానాలు చేస్తున్నారు. ’బంగా పొక్కో’ సిరీస్‌లో భారత్‌–బంగ్లాదేశ్‌ సంబంధాలు లేవని, బెంగాల్‌ స్వాతంత్య్రం కోసం పోరాటం అవసరమని ప్రచారం చేశారు. సోషల్‌ మీడియాలో కేంద్రాన్ని ’ఫాసిస్ట్‌’ అని విమర్శించి, సీఏఏ, ఎన్‌ఆర్‌సీను ’జెనోసైడ్‌’గా పిలిచారు. మే 10న చేసిన పోస్టులో ’బెంగాల్‌ ఇండిపెండెంట్‌ స్టేట్‌’ అని పేర్కొన్నారు. దీంతో తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఆమె అరెస్టు టీఎంసీలో అంతర్గత విభేదాలను బయటపెడుతోంది.

అక్రమాలపై కఠిన వ్యూహం..
గత నెలల్లో పోలీసులు సాండ్స్‌ స్మగ్లింగ్‌లో 18 మందిని కాల్చి, 45 మంది అరెస్ట్‌ చేశారు (సందీప్‌ సింహ్‌ గ్యాంగ్‌). నక్సల్‌ మార్గదర్శకులు 32 మంది పట్టుకున్నారు. జంగల్‌మహల్‌ ప్రాంతంలో 10 ఎన్‌కౌంటర్లు. అల్లర్లకు పాల్పడిన 150 మంది అరెస్టు చేశారు.

మొత్తంగా సువేందు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు టీఎంసీకి మింగుడు పడడం లేదు. మరోవైపు బంగ్లాదేశ్‌లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో సరిహద్దులో అల్లర్లకు కొన్ని సంఘాలు ప్లాన్‌ చేస్తున్నాయి. ఈ తరుణంలో బెంగాల్‌ సర్కార్‌తోపాటు కేంద్రం కూడా అలర్ట్‌ అయింది.

ఆ బిజెపి ఎంపీ కేంద్రమంత్రి!

Modi Cabinet Expansion
Modi Cabinet Expansion

Modi Cabinet Expansion 2026: కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 15న విదేశీ పర్యటనకు వెళ్ళనున్నారు. 20న పర్యటన ముగించుకొని రానున్నారు. ఏ క్షణంలోనైనా విస్తరణ ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పైగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. 2029 సార్వత్రిక ఎన్నికలను టార్గెట్ చేసుకొని మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తారని కూడా సమాచారం. అయితే ఏపీ నుంచి బిజెపి ఎంపీ ఒకరికి పదవి ఖాయమని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రచారం ఉంది.

* ఇప్పటికే ఒకరు..
ప్రస్తుతం బిజెపి నుంచి కేంద్ర మంత్రివర్గంలో నరసాపురం ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మకు అవకాశం ఉంది. అయితే ఇప్పుడు బిజెపి నుంచి ఒకరికి ఇస్తే అది సీఎం రమేష్ కెనని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి బిజెపిలో చేరారు సీఎం రమేష్. 2019లో తెలుగుదేశం ఓటమి ఎదురుకావడంతో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న సీఎం రమేష్ రాజ్యసభ సభ్యుడిగా ఉండి కూడా బిజెపిలోకి వెళ్లిపోయారు. మొన్నటి ఎన్నికల్లో బిజెపితో టిడిపి పొత్తు వెనుక సీఎం రమేష్ కృషి ఉంది. పొత్తులో భాగంగా అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తప్పకుండా కేంద్రమంత్రివర్గంలో సీఎం రమేష్ కు స్థానం ఉంటుందన్న అంచనాలు కూడా అప్పుడు వచ్చాయి. కానీ వివిధ సమీకరణలో భాగంగా భూపతిరాజు శ్రీనివాస వర్మకు అప్పట్లో అవకాశం వచ్చింది.

* ఏపీ లో బలం పెంచుకోవాలని..
ప్రస్తుతం ఏపీలో బిజెపి బలం పెంచుకోవాలని చూస్తోంది. మూడు పార్టీల పొత్తు కొనసాగుతూనే ఎవరికివారు బలం పెంచుకోవాలన్నది ఒక వ్యూహం అన్నట్లు సమాచారం. అందులో భాగంగా సీఎం రమేష్ కు కేంద్రమంత్రిగా ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది అయితే కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కాలంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉండాలన్న టాక్ కూడా ఉంది. ఈ లెక్కన సీఎం రమేష్ కు ఆ అవకాశం లేదు. కానీ కేంద్ర పెద్దలతో ఉన్న సాన్నిహిత్యంతో.. ఆపై ఏపీ సీఎం చంద్రబాబు ఆశీస్సులతో సీఎం రమేష్ కు మంత్రిగా అవకాశం ఇస్తారని పొలిటికల్ వర్గాల్లో తెగ ప్రచారం సాగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

కేంద్ర రాజకీయాల్లోకి చంద్రబాబు.. మళ్లీ మొదలు!

Chandrababu Naidu Rajya Sabha Selectio
Chandrababu Naidu Rajya Sabha Selectio

Chandrababu Naidu National Politics: ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల బిజీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆయన ఇంటికి వెళ్లి చర్చించడం. తరువాత చంద్రబాబు ఢిల్లీ వెళ్లడం.. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీలు కావడం… ప్రత్యేకంగా హోం శాఖ మంత్రి అమిత్ షా తో చర్చించడం.. ఇవన్నీ చూస్తుంటే దేశంలో ఏదో రాజకీయ నిర్ణయం ఉంటుందన్న చర్చ నడుస్తోంది. ప్రధానంగా చంద్రబాబు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారు అన్న ప్రచారం పతాక స్థాయిలో జరుగుతోంది. అన్నింటికీ మించి ఆయన ఈ దేశానికి ఉప ప్రధాని కాబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభం అయింది. అనేక రకాల కథనాలు, గాసిప్స్ వస్తున్నాయి. అయితే మూడు నెలల కిందట ఇటువంటి ప్రచారం జరిగింది. బీహార్ సీఎం గా ఉన్న నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. త్వరలో ఆయన కేంద్ర మంత్రివర్గంలో చేరుతారన్న ప్రచారం నడుస్తోంది. అయితే అప్పట్లోనే సీఎం చంద్రబాబు తన పదవికి రాజీనామా చేసి ఈ దేశానికి ఉప ప్రధాని అవుతారన్న ప్రచారం నడిచింది.

* బిజెపి బాధిత పార్టీలన్నీ..
ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పార్టీ కొద్దిపాటి బలం పెంచుకుంటుందన్న టాక్ వినిపిస్తోంది. భారతీయ జనతా పార్టీలో దెబ్బతిన్న విపక్షాలు ఇప్పుడు ఏకతాటిపైకి వస్తున్నాయి. దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ నేతలంతా బిజెపి పై కారాలు మిరియాలు నూరుతున్నారు. అయితే ఒక్కో రాష్ట్రం బిజెపి స్వాధీనం అవుతున్నా.. సార్వత్రిక ఎన్నికల విషయానికి వచ్చేసరికి ప్రజల మూడ్ మారే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ నేతలు ఏకతాటి పైకి వస్తే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని బిజెపి పెద్దలు అంచనా వేస్తున్నారు. ఆ కూటమిలోకి చంద్రబాబు చేరితే అదనపు బలం అన్న అంచనాలు కూడా ఉన్నాయి. అందుకే జాతీయస్థాయిలో చంద్రబాబుకు ఉప ప్రధాని పదవి ఇచ్చి.. రాజకీయ మూడ్ మారకుండా… విపక్ష నేతలు బలం పెంచుకోకుండా ఉండేందుకు కేంద్ర పెద్దలు ఇలా ప్లాన్ చేసినట్లు ప్రచారం నడుస్తోంది.

* కుదిరే పనేనా?
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లడం కుదిరే పని కాదు. ఆయన కేంద్ర రాజకీయాల్లోకి వెళితే సీఎం బాధ్యతలు లోకేష్ కు అప్పగిస్తారన్న ప్రచారం ఉంది. కానీ కూటమి ప్రభుత్వం నడుస్తున్న దృష్ట్యా రాజకీయంగా ఇది ఇబ్బందికర పరిణామం. ఎందుకంటే రాష్ట్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధి పదాన నడుస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు పనులు కూడా ఊపొందుకుంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లడం అనేది ఊహాజనితం అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనే ఒక అంశం పనిచేస్తూ ఉంటుంది. చూడాలి ఈ ప్రచారం ఎంతవరకు తీసుకెళ్తుందో..

హద్దులు దాటితే జాగ్రత్త.. అమెరికాకు ఇచ్చి పడేసిన చైనా.. ట్రంప్ ముఖం వాడిపోయిందిగా

Taiwan Issue China Warning
Taiwan Issue China Warning

Taiwan Issue China Warning: చైనా ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందువల్లే ప్రపంచంలో ఏర్పడే ప్రతి విపత్తును తనకు అనుకూలంగా మార్చుకుంటున్నది. ఇప్పటికే తయారీ రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న చైనా.. టెక్నాలజీ, ఆటోమొబైల్, ఇంకా అనేక రకాల పరిశ్రమలను అత్యంత స్థాయిలో ఆధునికరిస్తోంది. తద్వారా ప్రపంచ మార్కెట్లను మొత్తం తన గుప్పిట్లో పెట్టుకుంది. వచ్చే రోజుల్లో ఈ విధానాన్ని చైనా జోరుగా కొనసాగిస్తే.. అమెరికా గుత్తాధిపత్యానికి కచ్చితంగా చెక్ పెడుతుంది.

ఇటీవల మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధం జరిగిన నేపథ్యంలో.. అమెరికా అధ్యక్షుడు చైనాలో పర్యటిస్తున్నారు. 9 సంవత్సరాలు అనంతరం ట్రంప్ అమెరికాలో పర్యటిస్తుండడం విశేషం. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో కలిసి ట్రంప్ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటున్నారు. వాణిజ్యానికి సంబంధించి జరుగుతున్న చర్చలో తైవాన్ గురించి ప్రస్తావన వచ్చింది. ఈ నేపథ్యంలోనే చైనా అమెరికా మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తైవాన్ విషయంలో హద్దు మీరి ప్రవర్తిస్తే ఆ తర్వాత పరిణామాలు వేరే విధంగా ఉంటాయని చైనా అధ్యక్షుడు ట్రంప్ కు సూచించినట్టు సమాచారం. తైవాన్ సమస్యను సక్రమంగా పరిష్కరించాలని.. అలాకాకుండా అమెరికా తన ప్రయోజనాల కోసం వేరే విధానాలకు కొనసాగిస్తే.. అప్పుడు ఘర్షణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు హెచ్చరించినట్టు తెలుస్తోంది. తైవాన్ జల సంధిలో శాంతిని పెంపొందించాలని.. స్థిరత్వ లక్షలను పరిరక్షించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో జిన్ పింగ్ వ్యాఖ్యానించినట్టు సమాచారం.

మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధం జరిగిన నేపథ్యంలో.. అమెరికా ఆర్థిక పరిస్థితి కాస్త ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలో అమెరికా మళ్లీ ట్రేడ్ విషయంలో అన్ని దేశాలతో సంప్రదింపు జరుపుతోంది. అందులో చైనా కూడా ఉంది. చైనా ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో నేరుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్కడికి వెళ్లారు. చైనా అధ్యక్షుడితో భేటీ అయ్యారు. దీనిని అతిపెద్ద శిఖరాగ్ర సమావేశం అని ట్రంప్ కొనియాడారు. అనేక రకాల ఒప్పందాలు.. వాణిజ్యానికి సంబంధించిన వ్యవహారాలు.. ఎగుమతులు.. దిగుమతులకు సంబంధించిన కీలక విషయాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయని తెలుస్తోంది. అయితే తదుపరి తైవాన్ విషయంలో చైనా ఎటువంటి అడుగులు వేస్తుంది.. అమెరికా ఏ విధమైన వ్యవహారాలకు పాల్పడుతుంది.. ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభిస్తుందని రెండు దేశాలకు సంబంధించిన ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

వధువుకు అది నచ్చలేదట.. పీటలపై పెళ్లి రద్దు చేసేసింది...

Uttar Pradesh Wedding Incident
Uttar Pradesh Wedding Incident

Uttar Pradesh Wedding Incident: అది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం. బలియా జిల్లా రేవతి పోలీస్ స్టేషన్.. అక్కడికి చాలామంది వచ్చారు. కొందరికి గాయాలయ్యాయి. వారంతా రక్తపు మరకలతో కనిపించారు. అంతమంది రావడంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. జరిగిన విషయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశారు . అయితే వారు చెప్పిన వివరాలు విన్న పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇలా కూడా జరుగుతుందా అంటూ ఖిన్నులయిపోయారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బలియా జిల్లాలో రేవతి పోలీస్ స్టేషన్ పరిధిలో గాయ్ ఘాట్ గ్రామంలోని పంచర్ముఖి ఆలయంలో ఈనెల 11న ఒక పెళ్లి జరగాలి. ఆ పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఘనంగా జరిగాయి. మరి కొద్ది సేపట్లో పెళ్లి జరుగుతుందనుకుంటుండగా.. ఊహించని గొడవ చోటుచేసుకుంది. దీంతో పెళ్లి వేదిక కాస్త రణరంగంగా మారిపోయింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో వరుడు సోదరుడు, అతడి తల్లి, మరో మహిళా గాయపడ్డారు.

ఇంత గొడవ జరగడానికి ప్రధాన కారణం చీర. వివాహాలు జరుగుతున్నప్పుడు మటన్ ముక్కలు వేయలేదని.. చికెన్ సరిపడా వడ్డించలేదని గొడవలు పడ్డ సందర్భాలు అనేకం చూశాం. కొన్ని సందర్భాలలో వివాహాలు జరిగిపోయిన వ్యవహారాలు కూడా ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ వరుడి తరఫున వధువుకు తెచ్చిన చీర నచ్చకపోవడంతో గొడవ జరిగింది. దీంతో పెళ్లి చేసుకోవడానికి వధువు ఒప్పుకోలేదు. దీంతో రెండు కుటుంబాల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. రెండు కుటుంబాల వారు కూడా విపరీతంగా దాడులు చేసుకున్నారు. దీంతో వివాహ క్రతువు కాస్త యుద్దభూమిగా మారిపోయింది. పెళ్లి కుమారుడు విశాల్ గోండు తీసుకొచ్చిన చీర తనకు ఏమాత్రం నచ్చలేదని వధువు చెప్పింది. అంతేకాదు అతడిని పెళ్లి చేసుకోలేనని స్పష్టం చేసింది. దీంతో వివాహం ఆగిపోయింది. ఆ తర్వాత గొడవ జరిగింది.

ఇరు వర్గాల వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో పోలీసులు రెండు వర్గాల వారిని విచారించారు. జరిగిన విషయాన్ని తెలుసుకొని.. కేసులు నమోదు చేశారు. ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. చీర కోసం వధువు ఈ స్థాయిలో పట్టుబట్టడం సరికాదని.. వధువు నచ్చే చీర తేకుండా.. వరుడి తరుపువారు ఇలా చేయడం ఏమాత్రం బాగోలేదని స్థానికులు అంటున్నారు.

హత్య కేసులో జగన్ మేనమామ!

YS Family Controversy
YS Family Controversy

YS Family Controversy: వివేకానంద రెడ్డి హత్య కేసు చాలదన్నట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి మరో కేసు వెంటాడుతోంది. అదే కడపలోని పెద్ద దస్తగిరి హత్య కేసు. ఈ కేసులో ఇప్పుడు జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ హత్య వెనుక రవీంద్రనాథ్ రెడ్డి హస్తం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో.. లోతుగా అన్వేషణ ప్రారంభించారు. కడప మాజీ డిప్యూటీ మేయర్ ఈ కేసులో లొంగిపోయారు. తెర వెనుక ఉన్న రాజకీయ ప్రముఖుల పేర్లు బయటపెట్టారు. దీంతో ఇదో హై ప్రొఫైల్ కేసుగా మారనుంది. కడప జిల్లాలో అసలే ఇబ్బందుల్లో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇది షాకింగ్. కచ్చితంగా కూటమి దీనిని ఒక ప్రచార అస్త్రంగా మార్చుకుంటుంది.

* కొద్ది రోజుల కిందట హత్య..
కొద్దిరోజుల కిందట కడపకు చెందిన పెద్ద దస్తగిరి హత్యకు గురయ్యారు. అయితే ఈ హత్యకు ఆస్తివ్యవహారాలే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు మరింత దర్యాప్తు చేయగా జగన్మోహన్ రెడ్డి మేనమామ పేరు బయటకు వచ్చింది. రవీంద్రనాథ్ రెడ్డికి పెద్ద దస్తగిరి బినామీగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. 100 కోట్ల రూపాయల విలువైన భూమి వ్యవహారంలో వీరి మధ్య విభేదాలు వచ్చాయి. ఆ భూమిని పెద్ద దస్తగిరి భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. తిరిగి తమకు రిజిస్ట్రేషన్ చేయాలని పెద్ద దస్తగిరిని కొడితే ఆయన తిరస్కరించారు. అందుకే పెద్ద దస్తగిరిని అడ్డు తొలగించుకోవాలని పక్కా ప్రణాళికతో హత్య చేయించారు. కానీ పోలీసుల దర్యాప్తులో రవీంద్రనాథ్ రెడ్డి పేరు బయటపడింది. దీంతో ఆయన అరెస్టు ఉంటుందన్న ప్రచారం కడపలో జరుగుతోంది.

* లొంగిపోయిన మాజీ డిప్యూటీ మేయర్..
ఈ కేసులో కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి లొంగిపోయారు. ఈ కేసులో తనను ఇరికించడంతో ఆయన లొంగిపోయి రవీంద్రనాథ్ రెడ్డి పేరు బయట పెట్టేశారు. ఇప్పటికే వివేకానంద రెడ్డి హత్య అంశంతో జగన్మోహన్ రెడ్డికి చాలా నష్టం జరిగింది. ఇప్పుడు ఏకంగా మేనమామ కూడా హత్య కేసులో ఇరుక్కునే పరిస్థితి దాపురించింది. తద్వారా పొలిటికల్ గా కూడా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. కడప జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దెబ్బ తినడానికి వివేకానంద రెడ్డి హత్య అంశమే కారణం. అది తేలకముందే వైయస్ ఫ్యామిలీలో ఒకరు ఇలా హత్య కేసులో ఇరుక్కోవడం చూస్తుంటే.. మున్ముందు ఈ కేసు పరిణామాలు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది.

హర్మూజ్ దాటిన మరో భారత నౌక.. ఎల్పీజీ కొరత తీరినట్లే!

Indian LPG Ship
Indian LPG Ship

Indian LPG Ship: పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచ ఇంధన సరఫరాను దెబ్బతీసింది. ఆర్మోస్ మూసివేతతో సప్లయ్ చైన్ దెబ్బతిన్నది. దీంతో ఇంధన సంక్షోభం రోజు రోజుకూ పెరుగుతోంది. భారత నౌకలు హర్మూజ్దా దాటేందుకు ఇరాన్ అనుమతి ఇచ్చినా ఉద్రిక్తతల నేపథ్యంలో చాలా నూకలు అక్కడే చిక్కుకుపోయాయి. రెండున్నర నెలల వ్యవధిలో కేవలం 14 నౌకలు మాత్రమే భారత్ కు వచ్చాయి. తాజాగా భారత నౌకాదళం సహకారంతో 15వ నౌక హర్మూజ్ దాటింది. మిగిలినవి ఎప్పుడు వస్తాయో చెప్పలేని పరిస్థితి.

ఎల్ పీ జీ నౌకల సురక్షిత ప్రయాణం..
హర్మూజ్ జలసంధి ప్రపంచ గ్యాస్ సరఫరాలు 20 శాతం ఈ మార్గం గుండా జరుగుతుంది. తాజాగా భారత్ కు చెందిన ఏం వీ సన్ షైన్ నౌక హర్మూజ్ దాటింది. భారత నౌకాదళం, అంతర్జాతీయ ఏజెన్సీల సహాయంతో ఈ నౌక సురక్షితంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో 1,200 మెట్రిక్ టన్నుల ఎల్ పీ జీ ఉంది. .

ఇరాన్ హామీ మేరకు..
ఇరాన్ ఉపవిదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబ్‌బాదీ హర్మూజ్ పరిస్థితులు మెరుగుపడుతాయని హామీ ఇచ్చారు. శాంతి పునరుద్ధరణ తర్వాత భద్రతా ప్రమాణాలు మరింత బలపడతాయని చెప్పారు. అమెరికా దౌత్య నిబద్ధత లేకపోవడాన్ని విమర్శించారు. తమవి అంతర్జాతీయ చట్టాలకు అతీతం కాదని స్పష్టం చేశారు. ఈ వాగ్దానాలు

భారత్ 85 శాతం ఎల్ పీ జీ ని దిగుమతి చేసుకుంటుంది. ఇందులో 50 శాతం పర్షియన్ గల్ఫ్ నుంచే జరుగుతుంది. తాజా ఉద్రిక్తతల కారణంగా దేశంలో ఎల్ పీ జీ ధరలు 15 శాతం పెరిగాయి. సంక్షోభం ముగిస్తే మార్కెట్ స్థిరపడుతుంది. తాజా నౌక భారత్ కు చేరితే ఎల్ పీ జీ కష్టాలు కొంత వరకు తీరుతాయి.

ఇదేం ఆచారం.. పూర్వీకుల ఎముకలకు కొత్త దుస్తులు.. ఆపై డ్యాన్స్..

Malagasy Tribe Tradition
Malagasy Tribe Tradition

Malagasy Tribe Tradition: సాంకేతికంగా విపరీతంగా అభివృద్ధి చెందినప్పటికీ.. ఆకాశాన్ని తాకే భవంతులు నిర్మిస్తున్నప్పటికీ.. అనేక రకాలుగా మనుషులు మారిపోయినప్పటికీ.. కొంతమంది మాత్రం అలానే ఉంటున్నారు. పైగా తమ సంస్కృతిని కాపాడుకుంటున్నారు. తమ నేపథ్యాన్ని ప్రపంచానికి గొప్పగా చాటుకుంటున్నారు. అటువంటి వారిలో వీరు మొదటి స్థానంలో ఉంటారు.

పురాతన చరిత్రకు నిలయమైన మడగాస్కర్ ప్రాంతంలో మలగసి అనే తెగ ప్రజలను నివసిస్తూ ఉంటారు. వీరు వేట, వ్యవసాయం ఆధారంగా జీవనం సాగిస్తూ ఉంటారు. వీరు సామూహిక జీవితాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే వేటకు వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు.. అత్యంత పదునైన బాణాలు, విల్లంబులు ఉపయోగిస్తుంటారు. ఎంత పెద్ద జంతువునైనా సరే వేటాడుతూ ఉంటారు. వీరు తమ సంస్కృతి ఆధారంగా ఫామా దిహన అనే ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు. ఈ ఆచారం చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రపంచంలో ఎవరు కూడా దీనిని పాటించరు. ఈ ఆచారం ప్రకారం మలగసి తెగవారు ఏడు సంవత్సరాలకు ఒకసారి తమ పూర్వీకుల సమాధులను తెరుచుతారు. వారి ఎముకలను బయటకు తీస్తారు. ఆ ఎముకలకు కొత్త వస్త్రాలను ధరింపజేస్తారు. సంగీత వాయిద్యాల మధ్య బంధువులందరూ నృత్యాలు చేస్తారు. ఇలా చేయడం వల్ల మృతుల కుటుంబాల ఆశీస్సులు తమకు ఉంటాయని వారు నమ్ముతుంటారు.

ఎముకలకు చనిపోయిన వారికి ఇష్టమైన దుస్తులను మాత్రమే ధరిస్తారు. వారికి నచ్చిన వంటకాలను తయారు చేస్తారు. సమాధుల మీద ప్రత్యేకమైన పాత్రలలో ఆ వంటకాలను పెట్టి.. ఆరగించి వెళ్ళిపోవాలని కోరుకుంటారు. ఆ తర్వాత ఎముకలకు ప్రత్యేకమైన వస్త్రాలను ధరింపజేసి ఊరేగింపు చేస్తారు. అంతేకాదు పాటలు పాడుతూ.. పూర్వికుల ఆత్మ శాంతించాలని ప్రార్థనలు చేస్తారు. ఎముకలు బయటికి తీస్తున్నప్పుడు మలగసి తెగవారు కన్నీటి పర్యంతమవుతారు. దీనివల్ల తమ పూర్వీకుల ఆత్మలు శాంతిస్తాయని.. వారి ఆశీస్సులు లభిస్తాయని మలగసి తెగవారు చెబుతుంటారు.

ఇది కూడా ఉద్యోగమే..కుక్కలు తినే ఆహారం తినాలి.. నెలకు ఎంతిస్తారో తెలుసా

Dog Food Tasting Job
Dog Food Tasting Job

Dog Food Tasting Job: ప్రభుత్వ ఉద్యోగం అయితే ఉదయం 10 గంటలకు వెళ్లి సాయంత్రం ఐదు గంటలకు రావాలి.. కొన్ని ప్రాంతాలలో ప్రభుత్వ ఉద్యోగాలు వేరే విధంగా ఉంటాయి. నిర్దిష్ట సమయానికి కార్యాలయానికి వెళ్లి వస్తే సరిపోతుంది.. ప్రైవేట్ కార్యాలయాలలో పనిచేసే వారి పరిస్థితి కాస్త భిన్నంగా ఉంటుంది. అక్కడ పని చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందువల్లే మేనేజ్మెంట్ చెప్పిన సమయానికి అనుగుణంగా ఉద్యోగులు పనిచేయాల్సి ఉంటుంది.

నేటి కాలంలో వర్క్ కల్చర్ పూర్తిగా మారిపోయింది కాబట్టి.. అర్ధరాత్రి పూట పని చేసే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్ లో ఈ తరహా ఉద్యోగాలు కొనసాగుతూ ఉంటాయి.. అయితే కొన్ని ఉద్యోగాలు మాత్రం విచిత్రంగా ఉంటాయి.. చాలామంది ఇలాంటి వాటిని ఉద్యోగాలు అంటారా.. అని ఆశ్చర్యపోతారు కూడా.

సాధారణంగా మనం కార్యాలయాలకు వెళ్లి కష్టపడితే డబ్బులు వస్తాయని భావిస్తుంటాం. కానీ మనలో చాలామందికి జంతువులు తినే ఆహారాన్ని ముందుగా టేస్ట్ చేసే ఒక వింత ఉద్యోగం ఉందని విషయం తెలియదు. జంతువులకు సంబంధించి ఆహారాన్ని తయారుచేసే చాలావరకు కంపెనీలు.. ఉత్తమ ఉత్పత్తుల నాణ్యత.. రుచి వంటి వాటిని పరీక్షించేందుకు. పెట్ ఫుడ్ టెస్టర్ లను నియమించుకుంటాయి. వారు జంతువుల కోసం తయారు చేసిన ఆహారాన్ని రుచి చూస్తారు. వాసన పసిగడతారు. ఆకృతిని బట్టి లోపాలను చెబుతుంటారు. అయితే ఈ ఆహారంలో ఎటువంటి కెమికల్స్ వాడరు కాబట్టి సైడ్ ఎఫెక్టులు ఉండవు.

ఈ ఆహారం కుక్కల కోసం మాత్రమే తయారు చేస్తారు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. పైగా అందులో ఎటువంటి హానికర పదార్థాలు ఉండవు. అయితే ఈ ఆహారాన్ని రుచి చూసే వారికి నెలకు లక్షలలో వేతనం ఉంటుంది. దాంతోపాటు ఇతర ప్రయోజమాలు కూడా లభిస్తాయి. పైగా ఇలాంటి ఉద్యోగాలకు ప్రొఫెషనల్ వ్యక్తులను మాత్రమే కంపెనీలు నియమించుకుంటాయి. మన దగ్గర కంటే వెస్ట్రన్ కంట్రీస్ లో చాలామంది కుక్కలను పెంచుకుంటారు. వాటికి పెట్టే ఆహారం విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కారు. అందువల్లే కంపెనీలు కుక్కల ఆహారం విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటాయి.

కింద పడిన మామిడికాయలు.. తీసుకుంటే జేబుకు చిల్లు పడినట్టే..

Fallen Mangoes Singapore
Fallen Mangoes Singapore

Fallen Mangoes Singapore: మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో మామిడి చెట్లు కనుక ఉండి ఉంటే.. అవి గనక కాయలు కాసి ఉంటే.. పక్వానికి వచ్చిన కాయలను తెంపకుండా ఉండి ఉంటే.. గాలి దుమారాలకు అవి రాలిపోతాయి. అటువంటి వాటిని చూస్తూ వదిలేయలేం. పైగా మనలో చాలామందికి మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం. అందువల్లే అలా పడిన పండ్లను ఊరికే వదిలేయం. కచ్చితంగా తీసుకొని తింటాం. దీనిని ఎవరూ తప్పుపట్టరు.

మనదేశంలో ఇలా ఉంటే.. అక్కడ మాత్రం విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే నోరు ఊరించే మామిడి కాయలు కింద పడి ఉంటే.. వాటిని వెనక తీసుకుంటే అక్కడ ఖచ్చితంగా నేరం. పైగా 3.5 లక్షల అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది.. అంతేకాదు ఆరు నెలల పాటు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది. ఆ ప్రాంతం పేరు సింగపూర్. ఇలాంటి నిబంధనలు సింగపూర్లో ఉండడానికి దాని వెనుక చాలా పెద్ద కథ ఉంది

సింగపూర్ ప్రాంతంలో జనం బాగా తిరిగే ఏరియాలలో.. అక్కడి ప్రభుత్వం విపరీతంగా మొక్కలు నాటింది. అందులో మామిడి మొక్కలు కూడా ఉన్నాయి. ఇతర పండ్ల మొక్కలు కూడా ఉన్నాయి. అవి ఇప్పుడు చెట్లుగా ఎదిగిపోయాయి. వాటికి కాసే ఫలాలు ప్రభుత్వ ఆస్తులు. వాటిని తెంపడానికి ఉండదు. ఏరుకోవడానికి కూడా ఉండదు. ప్రభుత్వం కూడా వాటిని సేకరించదు. కేవలం ఆ ఫలాలు పశువులు, పక్షులు మాత్రమే తినాలని సింగపూర్ ప్రభుత్వం నిబంధన విధించింది. ఈ నిబంధన అతిక్రమిస్తే 3.5 లక్షల ఫైన్ తో పాటు జైలు శిక్ష కూడా అనుభవించాలి.

మనుషులు ఎక్కడైనా ఆహారాన్ని సేకరించుకోగలుగుతారు. పండ్లను కొనుగోలు చేసి తినగలుగుతారు. కానీ పశువులు అలా చేయలేవు. పక్షులకు ఆ అవకాశం లేదు. అందువల్లే ఆ చెట్లకు కాసిన పండ్లను అవి మాత్రమే తినే విధంగా సింగపూర్ ప్రభుత్వం నిబంధన విధించింది. దీనివల్ల పశువులు, పక్షుల ఆకలి తీరుతుంది. అవి ప్రశాంతంగా జీవించగలుగుతున్నాయి. సింగపూర్ తీసుకొచ్చిన నిబంధన విచిత్రంగా ఉన్నప్పటికీ.. దీనిని అమలు చేయడం అద్భుతమైన విషయమని సోషల్ మీడియాలో నెటిజన్లు కొనియాడుతున్నారు.

అక్కడ నిత్యం సూర్యోదయమే.. సూర్యాస్తమయం ఎన్ని రోజుల కంటే..

Alaska Utqiagvik Sun
Alaska Utqiagvik Sun

Alaska Utqiagvik Sun: ఇప్పుడు మనకు ఎండాకాలం. సూర్యుడు ఉదయం 6 గంటలకే ఉదయిస్తున్నాడు. భగభగ మండిపోతున్నాడు. మధ్యాహ్నం అయిందంటే చాలు చుక్కలు చూపిస్తున్నాడు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉదయం 10 గంటలకే రోడ్లమీద అనధికారికంగా కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతోంది. దీంతో జనం బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. సూర్యుడు ఎంత తొందరగా అస్తమిస్తే బాగుండు అనుకుంటున్నారు. సూర్యుడు త్వరగా అస్తమిస్తే ఉపశమనం పొందచ్చని భావిస్తున్నారు. మనకు మామూలుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తుంటే ఈ స్థాయిలో ఇబ్బంది ఉంటే.. అక్కడి ప్రజలకు నిత్యం సూర్యోదయమే. ఇక వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

అలస్కా ప్రాంతంలోని ఉట్కి యాగ్విక్ ప్రాంతంలో సూర్యుడు ఉదయిస్తాడు. 84 రోజులపాటు సూర్యుడికి అస్తమయం అనేది తెలియదు.. ఈ ప్రాంతంలో మే 10న తెల్లవారుజామున రెండు గంటల 57 నిమిషాలకు సూర్యోదయం అయ్యింది. ఇప్పటికి అక్కడ సూర్యాస్తమయం కాలేదు. ఆగస్టు రెండున సూర్యుడు విశ్రాంతి తీసుకుంటాడని.. ఆ రోజే సూర్యాస్తమయం అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. దీనిని సైంటిఫిక్ భాషలో మిడ్ నైట్ సన్ ఫినామిన అని పిలుస్తుంటారు. ఇక శీతాకాలంలో ఇక్కడ పరిస్థితి చాలా విచిత్రంగా ఉంటుంది.

65 రోజులపాటు సూర్యుడు ఇక్కడ ఉదయించడు. అన్ని రోజులు ఇక్కడ చీకటి ఉంటుంది.. ఇలా ఇక్కడ ఏర్పడేందుకు ప్రధాన కారణం ఈ ప్రాంతం ఉత్తర దుర్గం పరిధిలో ఉంటుంది.. నార్వే, గ్రీన్ ల్యాండ్, ఫిన్లాండ్, స్వీడన్ లాంటి ప్రాంతాలలో ఇటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఉట్కి యాగ్విక్ ప్రాంతంలో ఇటువంటి వింతలు సర్వ సాధారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. ఈ ప్రాంతంలో మంచు ఎక్కువగా కురుస్తూ ఉంటుంది. పర్యాటకులు ఈ వాతావరణాన్ని ఆస్వాదించడానికి వస్తూ ఉంటారు. అయితే సూర్యాస్తమయం కంటే కూడా సూర్యోదయాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తూ ఉంటారు. ఈ ప్రాంతం ఉత్తర దుర్గం పరిధిలో ఉండడం వల్లే ఇటువంటి అద్భుతాలు చోటు చేసుకుంటాయి.

ఇక్కడ ప్రజలకు ఉపాధి పర్యాటకం ద్వారా ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. అక్కడక్కడ పంటలు కూడా సాగవుతూ ఉంటాయి. కాకపోతే రైతులు సూర్యోదయం ఆధారంగా పంటలు సాగు చేస్తూ ఉంటారు. ఆ ఉత్పత్తులను వేరే ప్రాంతాలకు తరలిస్తూ ఉంటారు. సూర్యాస్తమయ సమయంలో.. రైతులు విశ్రాంతి తీసుకుంటారు.

ఏమిటీ పరిస్థితి.. వెరీ చీప్.. అమెరికాలో ఇళ్లు కొనేవారే లేరు..

US Housing Market
US Housing Market

US Housing Market: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రపంచ దేశాలపై విధించిన ప్రతీకార సంఘలతో అమెరికాలో ధరలు భారీగా పెరిగాయి. నిరాంతో యుద్ధం కారణంగా ట్రంపు పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అమెరికా హౌసింగ్ మార్కెట్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. గత దశాబ్దాల్లో కనిపించని డిమాండ్ క్షీణత ప్రస్తుతం నెలకొంది. 6 లక్షలకు పైగా ఇళ్లు అమ్మకానికి ఉన్నాయి. ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకిన తర్వాత, రుణ వడ్డీ రేట్లు ఎగసినప్పుడు కొనుగోళ్లు కరువయ్యారు. అమ్మేవారు ధరల ఒత్తిడికి గురవుతున్నారు.

ధరల బూమ్ నుంచి పతనానికి..
2020-2022 మధ్య పాండమిక్‌తో ఇళ్ల ధరలు దేశవ్యాప్తంగా 40% పెరిగాయి. ,మియామీలో మీడియన్ ఇళ్ల ధరలు రెట్టింపు అయ్యాయి.. కానీ 2022 నుంచి ఫెడరల్ రిజర్వ్ రేట్లు 5.5%కు ఎత్తడంతో 30-సంవత్సర మార్ట్‌గేజ్ రేట్లు 7.5%కు చేరాయి. ఫలితంగా నెలవారీ ఈ ఎం లు భారీగా పెరిగాయి. ఫలితంగా కొనుగోలు 25 శాతం పడిపోయాయి. ఫ్లోరిడా, టెక్సాస్, ఫెనిక్స్ వంటి ‘హాట్ స్పాట్లు’లో డిమాండ్ 40 శాతం క్షీణించింది.

ఇన్వెంటరీ పెరుగుదల..
ఇప్పుడు అమ్మకానికి 6.2 లక్షల ఇళ్లు ఉన్నాయి. 2008 క్రైసిస్ తర్వాత ఇదే అత్యధికం. సాధారణ 3-4 నెలల సప్లై అవసరం, కానీ ఇప్పుడు 9 నెలలు. అమ్మేవారు ‘లాక్-ఇన్ ఎఫెక్ట్’తో ఇబ్బంది పడుతున్నారు.

ఆర్థిక ప్రభావాలు..
ఈ క్రైసిస్ స్థానిక ఆర్థిక వ్యవస్థలను తాకుతోంది. రియల్టార్ల ఆదాయం 20 శాతం పడిపోయింది. యంగ్ జనరేషన్ రెంట్‌కి మారుతోంది. అధిక ధరలు, వడ్డీ పెరుగుదల మార్కెట్‌ను అస్థిరపరుస్తాయి. ఫెడ్ రేట్లు 2026 చివరిలో 4 శాతం తగ్గితే రికవరీ రావచ్చు, కానీ ఇన్వెంటరీ అదుపులో లేకపోతే 2008 నాటి పరిస్థితి రిపీట్ అవుతుంది.

అమెరికాలో పడిపోయిన ఇళ్ల ధరలతో ఇల్లు అమ్ముకునేవారు తక్కువ ధరకు విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. రియల్ ఎస్టేట్ రంగం పతన దిశలో పయనిస్తుంది.

సింగిల్ స్క్రీన్స్ విషయంలో ప్రొడ్యూసర్ నాగవంశీ ఎవరిని తిట్టారు...

Producer Nagavamsi
Producer Nagavamsi

Producer Nagavamsi: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎల్లలు దాటి ముందుకు దూసుకెళ్తుంది. సినిమా థియేటర్ల విషయంలో ఇప్పటికి చాలావరకు గొడవలైతే జరుగుతూనే ఉన్నాయి. మల్టీప్లెక్స్ రావడంతో సింగిల్ స్క్రీన్స్ ని పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయారు. ఇక దానికి తోడుగా సింగిల్ స్క్రీన్స్ కి రెంటేడ్ పర్పస్ లో డబ్బులు చెల్లించడం వల్ల ఎగ్జిబ్యూటర్లు తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దానివల్ల వాళ్లకు వచ్చే లాభాలేమీ లేవని థియేటర్ మెయింటినెన్స్ కే విపరీతంగా డబ్బులు ఖర్చు అవుతున్నాయంటూ వాళ్ళు వాపోతున్నారు. మల్టీప్లెక్స్ లకు పర్సంటేజ్ రూపంలో డబ్బులు చెల్లిస్తున్నారు. సింగిల్ స్క్రీన్స్ కి మాత్రం రెంటేడ్ పర్పస్ లో చెల్లించడంతో వల్ల వాళ్లు తీవ్రమైన నష్టాన్ని చవిచూస్తున్నామంటూ గత కొన్ని రోజులుగా కామెంట్లయితే చేస్తున్నారు.

దాంతో థియేటర్ ఎగ్జిబ్యూటర్లు అందరు కలిసి మే 30వ తేదీ నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసి వేయాలని కామెంట్లు చేస్తున్నారు. ఇక దానికి తోడుగా ప్రొడ్యూసర్లందరు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇక ఆ ప్రెస్ మీట్ లో నాగ వంశీ మాట్లాడుతూ ఎక్కడ చిన్న కాళీ ప్రదేశం దొరికిన కూడా మల్టీ ఫ్లెక్స్ లు కట్టే ఒక ప్రొడ్యూసర్ సింగిల్ స్క్రీన్స్ గురించి మాట్లాడటం చాలా హాస్యస్పదంగా ఉందన్నాడు.

ఇక అలాంటి వ్యక్తి కూడా ఇలాంటి మాటలు మాట్లాడితే చేసేది ఏముంది అంటూ అతని మీద వ్యంగ్యంగా కామెంట్లు చేశాడు. ప్రస్తుతం నాగావంశీ చేసిన కామెంట్స్ ని బట్టి చూస్తే ఆయన ప్రముఖ ప్రొడ్యూసర్ అయిన సునీల్ నారంగ్ ను ఉద్దేశించే కామెంట్స్ చేస్తున్నారు అంటూ కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు…ఇక దీని మీద సునీల్ నారంగ్ కానీ ఇంకా వేరే ప్రొడ్యూసర్స్ గానీ ఎవరు ఎలాంటి స్పందనను తెలియజేయలేదు…

మొత్తానికైతే సింగిల్ స్క్రీన్స్ ను మూసి వేస్తే సినిమాలు ఆడటం కష్టమవుతుంది… కాబట్టి దీనిమీద సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది… ఇప్పటికే సినిమా థియేటర్ కి జనాలు రావడం తగ్గించారు. కాబట్టి సింగిల్ స్క్రీన్స్ ను కూడా మూసి వేస్తే సినిమాలను పట్టించుకునే వాళ్ల సంఖ్య మరింత తగ్గిపోతుంది. ఇక చిన్న సినిమాలకు పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉంది…