Home Blog Page 179

సాలరీ స్లిప్, ఇన్ కం సర్టిఫికెట్ లేకుండా క్రెడిట్ కార్డు పొందడమెలా..

How to get credit card without salary slip
How to get credit card without salary slip

How to get credit card without salary slip: ప్రస్తుతం క్రెడిట్ కార్డ్ అనేది కేవలం ఖర్చుల కోసం మాత్రమే కాకుండా, అత్యవసర సమయాల్లో ఆర్థిక సహాయంగా కూడా ఉపయోగపడుతోంది. సాధారణంగా బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు క్రెడిట్ కార్డ్ జారీ చేసే ముందు దరఖాస్తుదారుడి ఆదాయం, ఉద్యోగ స్థిరత్వం, క్రెడిట్ స్కోర్, రుణ చెల్లింపు చరిత్ర వంటి అంశాలను పరిశీలిస్తాయి. తమ నుంచి ఇచ్చే క్రెడిట్‌ను వినియోగదారు తిరిగి చెల్లించగలడా లేదా అన్నది అంచనా వేయడానికి ఈ వివరాలు కీలకంగా ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరి వద్ద జీత స్లిప్‌లు, ఆదాయపు పన్ను రిటర్నులు లేదా ఇతర ఆదాయ ధృవీకరణ పత్రాలు ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఇన్‌కమ్ ప్రూఫ్ లేకుండా క్రెడిట్ కార్డ్ పొందడం పూర్తిగా అసాధ్యం కాకపోయినా, కొన్ని ప్రత్యేక మార్గాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.

ఫిక్స్ డ్ డిపాజిట్:
ఇన్‌కమ్ ప్రూఫ్ లేకుండా క్రెడిట్ కార్డ్ పొందడానికి అత్యంత సులభమైన మార్గం సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్. ఇందులో దరఖాస్తుదారు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) రూపంలో ఒక నిర్దిష్ట మొత్తాన్ని జమ చేయాలి. ఆ డిపాజిట్‌ను భద్రతగా తీసుకుని బ్యాంకు క్రెడిట్ కార్డును జారీ చేస్తుంది. సాధారణంగా FD మొత్తంలో 75 నుంచి 90 శాతం వరకు క్రెడిట్ లిమిట్ ఇస్తారు. బ్యాంకుకు రిస్క్ తక్కువగా ఉండటంతో ఆదాయ పత్రాలపై ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఉద్యోగులు, విద్యార్థులు, స్వయం ఉపాధి చేసుకునే వారు ఈ మార్గాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

బ్యాంకుతో సత్సంబంధాలు:
కొన్ని సందర్భాల్లో బ్యాంకుతో చాలా కాలంగా ఖాతా నిర్వహిస్తున్న కస్టమర్లకు ప్రత్యేక ప్రాధాన్యం లభిస్తుంది. ముఖ్యంగా సేవింగ్స్ అకౌంట్ లేదా కరెంట్ అకౌంట్‌లో క్రమం తప్పకుండా లావాదేవీలు జరిపే కస్టమర్ల ఆదాయ ప్రవాహాన్ని బ్యాంకులు స్వయంగా అంచనా వేయగలవు. ఖాతాలో మంచి బ్యాలెన్స్ ఉండటం, రెగ్యులర్ ట్రాన్సాక్షన్లు జరగడం వంటి అంశాల ఆధారంగా కొన్ని బ్యాంకులు ముందస్తుగా ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ కార్డ్ ఆఫర్లను అందిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రత్యేక ఆదాయ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేకపోవచ్చు.

డిపాజిట్ల ఆధారంగా..
కొన్ని బ్యాంకులు తమ వద్ద ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు లేదా ఇతర ఆర్థిక ఆస్తులను పరిగణనలోకి తీసుకుని కూడా క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తాయి. వ్యక్తి వద్ద స్థిరమైన ఆదాయ పత్రాలు లేకపోయినా, గణనీయమైన పెట్టుబడులు ఉన్నట్లు నిరూపించగలిగితే బ్యాంకులు సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటుంది. ఈ విధానం సాధారణంగా అధిక విలువ గల కస్టమర్లకు వర్తిస్తుంది.

యాడ్-ఆన్ కార్డ్స్:
ఇన్‌కమ్ ప్రూఫ్ లేని వారికి మరో మార్గం యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఇప్పటికే క్రెడిట్ కార్డ్ ఉంటే, వారి ఖాతాపై అదనపు కార్డును పొందవచ్చు. దీనిని యాడ్-ఆన్ కార్డ్ లేదా సప్లిమెంటరీ కార్డ్ అంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో భార్యాభర్తలు లేదా కుటుంబ సభ్యులు కో-అప్లికెంట్‌గా ఉండటం ద్వారా కూడా క్రెడిట్ సదుపాయాలను పొందే అవకాశం ఉంటుంది. అయితే ప్రధాన బాధ్యత మాత్రం ప్రైమరీ కార్డ్ హోల్డర్‌పైనే ఉంటుంది.

క్రెడిట్ హిస్టరీ :
ఆదాయ పత్రాలు లేకపోయినా, మంచి క్రెడిట్ హిస్టరీ ఉంటే బ్యాంకులు మీ దరఖాస్తును పరిశీలించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గతంలో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడం, EMIలు ఆలస్యం చేయకపోవడం, మంచి క్రెడిట్ స్కోర్‌ను నిర్వహించడం వంటి అంశాలు విశ్వసనీయతను పెంచుతాయి. ముఖ్యంగా 750కు పైగా క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి బ్యాంకులు సులభంగా అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది.

ఇన్‌కమ్ ప్రూఫ్ లేకుండా క్రెడిట్ కార్డ్ పొందడం సాధ్యమైనా, కార్డు పొందిన తర్వాత బాధ్యతాయుతంగా వినియోగించడం చాలా ముఖ్యం. క్రెడిట్ లిమిట్‌ను పూర్తిగా వినియోగించడం, బిల్లులు ఆలస్యంగా చెల్లించడం లేదా కనీస మొత్తం మాత్రమే చెల్లించడం వల్ల భారీ వడ్డీ భారం పడుతుంది. అంతేకాకుండా క్రెడిట్ స్కోర్ కూడా దెబ్బతింటుంది. కాబట్టి అవసరమైనంత మాత్రమే ఖర్చు చేసి, బిల్లులను గడువులోపు చెల్లించడం ఉత్తమం.

సూర్యవంశీ పంట పండింది.. టీమిండియాకు ఆడకముందే సచిన్ రికార్డు బద్దలు..

Vaibhav Suryavanshi Sachin record broken
Vaibhav Suryavanshi Sachin record broken

Vaibhav Suryavanshi Sachin record broken: అండర్ 19 లో అదరగొట్టాడు. ఐపీఎల్ లో సత్తా చూపించాడు. అనేక రికార్డులను తన పాదాక్రాంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా టీమిండియాలో చోటు సంపాదించాడు. టీమిండియాలో ఆడకముందే సరికొత్త రికార్డును బద్దలు కొట్టాడు. అతడు మరెవరో కాదు వైభవ్ సూర్యవంశీ.

వైభవ్ సూర్యవంశీకి అనుకున్నట్టుగానే జాతీయ జట్టులో చోటు లభించింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్, ఏషియన్ గేమ్స్ లో చోటు దక్కించుకున్నాడు. ‘అతడి ఆట తీరు చూసిన తర్వాత జాతీయ జట్టులోకి ఎంపిక చేయకుండా ఎలా ఉంటాం. అతడు ఆడుతున్న తీరు అమోఘంగా ఉందని’ అంతటి గౌతమ్ గంభీర్ అన్నాడంటే బుడ్డోడి విధ్వంసం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

జాతీయ జట్టుకు ఎంపిక కావడం ద్వారా వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తున్న యంగ్ క్రికెటర్ గా అతడు ఘనత వహించబోతున్నాడు. సచిన్ టెండూల్కర్ 16 సంవత్సరాల 205 రోజులకు టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. సూర్యవంశీ 15 సంవత్సరాల వయసులోనే టీమిండియాలోకి ప్రవేశించబోతున్నాడు. సచిన్ రికార్డును బద్దలు కొట్టిన సూర్యవంశీ.. సరికొత్త ఘనతను తన పేరు మీదు రాసుకున్నాడు.

ఈనెల 26 నుంచి ఐర్లాండ్ సిరీస్ మొదలవుతుంది. ఈ సిరీస్ లో గొప్పగొప్ప ప్లేయర్లు ఆడుతున్నప్పటికీ వైభవ్ సూర్యవంశీ మీదే అందరి కళ్లూ ఉన్నాయి. ఎందుకంటే అతడు గనుక సత్తా చూపిస్తే టీమిండియాకు తిరుగుండదు. ఈ ఐపీఎల్ ఆడినట్టుగానే ఆడితే మాత్రం టీమిండియా స్కోరు రాకెట్ వేగంతో దూసుకుపోవడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. చిన్న వయసులోనే టీమిండియాలో చోటు సంపాదించుకున్న సూర్యవంశీ అనేక రికార్డులను బద్దలు కొట్టాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు.

ఆటగాడిగా ఇప్పటికే సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న సూర్యవంశీ.. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. దిగ్గజ ప్లేయర్లు కూడా అతడితో ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపిస్తున్నారంటే అతడి రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సూర్య వంశీ ఈ సిరీస్ లలో కూడా ఓపెనర్ గానే రంగంలోకి దిగే అవకాశం ఉంది. అతడి మీద మేనేజ్మెంట్ భారీగానే ఆశలు పెట్టుకుంది. వాటిని అతడు అందుకుంటే అనతికాలంలోనే జట్టు పగ్గాలు దక్కినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

తెలుగులో 150 సెంటర్స్ లో 100 రోజులు ఆడిన మొదటి మూవీ ఆ స్టార్ హీరోదేనా..?

First Telugu movie to run 100 days
First Telugu movie to run 100 days

First Telugu movie to run 100 days: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. పాన్ ఇండియాలో మన స్టార్ హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుంది. అయినప్పటికి చాలా సినిమాలు 20, 30 రోజులకే తోకముడస్తున్నాయి. నిజానికి ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో 50 రోజులు, 100 రోజులు, 200 రోజులు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో సినిమాలు కేవలం 10, 20 రోజులకే పరిమితమవుతున్నాయి. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ ఫుల్ సినిమా అయినా కూడా 10 రోజుల తర్వాత ఆ సినిమాకి కలెక్షన్స్ అయితే భారీగా పడిపోతున్నాయి.

దానికి తోడుగా ఓటిటి హవా ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది ఓటిటి కి వచ్చిన తర్వాత సినిమాను చూద్దాంలే అని లైట్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ మధ్యకాలంలో 50 రోజులు, 100 రోజులైతే సినిమాలు ఆడటం లేదు. అయితే గతంలో 150 సెంటర్లలో వంద రోజులను పూర్తి చేసుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి.

నిజానికి బాలయ్య బాబు హీరోగా వచ్చిన నరసింహనాయుడు సినిమా 150 సెంటర్స్ లో 100 రోజులు ఆడింది. మొదటిసారి ఆ ఫీట్ ని అందుకున్న సినిమాగా నరసింహ నాయుడు చరిత్రలో నిలిచిపోయింది. అయితే ఈ సినిమాలో బాలయ్య తన నట విశ్వరూపాన్ని చూపించడమే కాకుండా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో బాలయ్య చేస్తే ఎలా ఉంటుందో చేసి ప్రేక్షకులను మెప్పించాడు.

అలాంటి నటుడి నుంచి వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడం అతని అభిమానులతో పాటు ఆయనకు కూడా చాలా వరకు సంతృప్తినైతే ఇచ్చింది… ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి హీరోగా చేసిన ఇంద్ర, ఠాగూర్ లాంటి సినిమాలు సైతం 150 సెంటర్స్ లో 100 రోజులు పూర్తి చేసుకున్నాయి. మొత్తానికైతే 150 సెంటర్లలో 100 రోజులను పూర్తి చేసుకున్న సినిమా బాలయ్య బాబుదే కావడం విశేషం…

ఇథనాల్‌ ఇంధనం వచ్చేసింది.. పెట్రోల్‌ కన్నా చీప్!

Ethanol Fuel in India
Ethanol Fuel in India

Ethanol Fuel in India: ప్రపంచ పర్యావదన దినం సందర్భంగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది ఇంధన రంగంలో కీలక మలుపు. కేంద్ర పెట్రోలియం మంత్రి హరదీప్‌ సింగ్‌ పురి ఢిల్లీలో ఈ–85 ఇంధనాన్ని అధికారికంగా లాంచ్‌ చేశారు. ఇందులో 80–85% ఇథనాల్, 14–19% పెట్రోల్‌ ఉంటాయి. ఢిల్లీలో దీని ధరూ.82.12గా నిర్ణయించారు. సాధారణ పెట్రోల్‌ ధరకన్నా రూ.20 తక్కువకే ఈ–85 ఇంధనం అందుబాటులోకి వచ్చింది.ఈ–20ను షెడ్యూల్‌ కంటే ముందే సాధించిన భారత్, ఇప్పుడు ఉన్నత స్థాయి ఇథనాల్‌ బ్లెండింగ్‌ దిశగా ధైర్యవంతమైన అడుగు వేసింది.

ఈ–85 అంటే ఏమిటి?
ఈ–85 అనేది ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వెహికిల్స్‌ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఇంధనం. సాధారణ కార్లు, బైకులు దీన్ని ఉపయోగించలేవు. ఇంజన్‌ను ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వాహనాలు మాత్రమే ఈ–85ను సమర్థవంతంగా ఉపయోగించగలవు. ప్రస్తుతం హీరో మోటోకార్ప్‌ (స్ప్లెండర్‌+ ఫ్లెక్స్‌ ఫ్యూయల్, ఏఊ డీలక్స్‌), సుజుకి గిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ 250 వంటి కొన్ని మోడల్స్‌ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మారుతి సుజుకి వాగన్‌ఆర్‌ ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వెర్షన్‌ను త్వరలో మార్కెట్‌లోకి తీసుకురావాలని యోచిస్తోంది.

ఆర్థిక ప్రయోజనాలు…
ఈ–85 ధర తగ్గడం వినియోగదారులకు తక్షణ ప్రయోజనం. కానీ నిజమైన లాభం దేశ స్థాయిలో ఉంది. ఈ–20 పాలసీ ద్వారా ఇప్పటికే రూ.1.84 లక్షల కోట్ల విదేశీ మారక నిల్వలు ఆదా అయ్యాయని మంత్రి పురి తెలిపారు. ఈ–85 విస్తరణతో ఈ సేవింగ్స్‌ ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇథనాల్‌ దేశీయంగా ఉత్పత్తి అవుతుంది కాబట్టి క్రూడ్‌ ఆయిల్‌ దిగుమతులు తగ్గుతాయి, డాలర్‌ ఖర్చు తగ్గుతుంది. రైతులకు అదనపు ఆదాయం (పంచదార, మొక్కజొన్న, 2ఎ ఇథనాల్‌ ద్వారా వ్యవసాయ వ్యర్థాలు) వస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి లభిస్తుంది.

పర్యావరణ ప్రయోజనాలు..
ఈ–85 సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే 50–60% తక్కువ కార్బన్‌ ఎమిషన్లను విడుదల చేస్తుంది. వాయు కాలుష్యం తగ్గడం, ఆరోగ్య సమస్యలు తగ్గడం దీర్ఘకాలిక లాభాలు. వరల్డ్‌ ఎన్విరాన్‌మెంట్‌ డే రోజే ఈ – 85ను లాంచ్‌ చేయడం యాదృచ్ఛికం కాదు. ఇది సవాలుతో కూడిన మార్గం. ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వాహనాలు ఇంకా చాలా తక్కువ.

ప్రస్తుతం ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, పూణే, నాగ్‌పూర్‌లో మాత్రమే 50 పెట్రోల్‌ బంకుల్లో అందుబాటులో ఉంది. 2026 చివరి నాటికి 500 స్టేషన్లు, 2027 నాటికి 5,000 స్టేషన్లు అన్నది లక్ష్యం.
ఇంజన్‌ పనితీరు, మైలేజ్, శీతాకాలంలో కోల్డ్‌ స్టార్ట్‌ సమస్యలు కూడా పరిశీలించాల్సి ఉంది.

ఈ–85 లాంచ్‌ భారత్‌ను ఇంధన దిగుమతి భారం నుంచి విముక్తి కగిలిస్తుంది. ఇది రైతు, పర్యావరణం, ఆర్థిక స్వావలంబన, శక్తి భద్రత నాలుగు లక్ష్యాలను ఏకకాలంలో సాధించే అవకాశం ఇస్తోంది. ఇది విజయవంతం కావాలంటే కేవలం లాంచ్‌ చేయడం సరిపోదు. ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వాహనాల ఉత్పత్తిని వేగవంతం చేయడం, ఇథనాల్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను త్వరగా విస్తరించడం, వినియోగదారుల్లో అవగాహన కల్పించడం ఇవన్నీ ఒకేసారి జరగాలి.

సహారాలో మరణ మృదంగం.. నీళ్లు దొరకక 49 మంది బలి

Sahara water crisis tragedy
Sahara water crisis tragedy

Sahara water crisis tragedy: ఎడారిలో ప్రయాణం ఒక నరకం. ఇక సహారా ఎడారి గురించి అయితే చెప్పనవసరం లేదు. ఎడారి ప్రయాణంలో మంచినీళ్లు చాలా ముఖ్యం. అయితే ఈడ్‌ అల్‌–అధా పండుగను మాలి దేశంలో జరుపుకుని తిరిగి వెళ్తున్న కుటుంబాలు వారు ప్రయాణిస్తున్న లారీ సహారా ఎడారి మధ్యలో చెడిపోయింది. మండే ఎండలు, నీళ్లు దొకక, సహాయం చేసేవారు లేక మూడు రోజుల్లో 49 మంది ప్రాణాలు వదిలారు. ఇద్దరు మాత్రం 50 కిలోమీటర్లకు పైగా నడిచి, నీటి వనరును చేరుకుని అధికారులకు సమాచారం అందించారు. వారు రక్షణ బృందాలను పంపించగా లారీ ఆగిపోయిన ప్రదేశంలో 49 మృతదేహాలను కనిపించాయి.

ఎడారిలో ఏం జరిగిందంటే..
మాలి–నైజర్‌–ఆల్జీరియా సరిహద్దుల సమీపంలో ఉన్న ఈ ప్రాంతం ఎడారి ప్రయాణాలకు ప్రసిద్ధి. అగాడెజ్‌ ప్రాంతంలో అస్సమాకా సరిహద్దు ప్రాంతానికి 80 కిలోమీటర్ల దూరంలో పండుగకు వెళ్లి వస్తున్న వారి లారీ ఇంజిన్‌ పనిచేయక ఆగిపోయింది. ప్రయాణికులు దాన్ని సరిచేయడానికి ప్రయత్నించారు. కానీ తీవ్రమైన వేడి, నీటి కొరత మధ్య ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఒక్కొక్కరు దాహం, డీహైడ్రేషన్‌కు బలైపోయారు. మృతదేహాలు లారీ కింద, చుట్టుపక్కల చెల్లాచెదురుగా కనిపించాయి.

సహారా ఎడారి అనేక మరణాలు..
సహారా ఎడారి ఎప్పటికప్పుడు ఇలాంటి విషాదాలకు సాక్షిగా నిలుస్తోంది. పేదరికం, నిరుద్యోగం, సరిహద్దు ప్రాంతాల్లోని అస్థిరత కారణంగా ప్రజలు ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు చేస్తుంటారు. ఈ సారి వారు మైగ్రంట్లు కాదు.. సాధారణ ప్రజలు, పండుగ సంబరాలు ముగించుకొని తిరిగి వస్తున్నవారు. ఈ ప్రాంతంలో రోడ్డు సదుపాయాలు, ఎమర్జెన్సీ సహాయం, కమ్యూనికేషన్‌ సదుపాయాలు చాలా పరిమితం. పేదరికం, మౌలిక సదుపాయాల కొరత, వాతావరణ మార్పుల ప్రభావం, సరిహద్దు భద్రతా సమస్యలు. పండుగ సందర్భంగా ప్రజలు ఎక్కువగా ప్రయాణించడం, అయినా భద్రతా చర్యలు తీసుకోకపోవడం కూడా ఈ దుర్ఘటనకు దోహదపడింది. గతంలో కూడా సహారాలో ఇలాంటి బహుళ మరణాలు జరిగాయి.

ఈ విషాదం నుంచి పాఠం నేర్చుకొని, ఎడారి ప్రయాణాలను సురక్షితం చేయడానికి నైజర్‌ ప్రభుత్వం మాత్రమే కాదు, పొరుగు దేశాలు కూడా తీవ్రంగా ఆలోచించాలి. ఎందుకంటే ఎడారి దాహం ఎవరినైనా మింగేస్తుంది. పండుగ సంబరాల నుంచి వస్తున్న సాధారణ ప్రజలనైనా. ఈ దుర్మరణాలు గుండెను కలచివేస్తాయి.

మెహర్ రమేష్ సినిమాను కాపీ చేసిన అల్లు అర్జున్, రాజమౌళి.. వీళ్లేంటి ఇలా తయారయ్యారు..

Allu Arjun Rajamouli copy allegation
Allu Arjun Rajamouli copy allegation

Allu Arjun Rajamouli copy allegation: బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం బీట్ చేస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ పొజిషన్ ని సాధించింది. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ ఈ ఫీట్ ని అందుకున్న తొలి సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీగా మన ఇండస్ట్రీ ఘన కీర్తిని అందుకుంటుందనే చెప్పాలి. ఇక ఇలాంటి సందర్భంలోనే కొంతమంది హీరోలు వాళ్ల నుంచి వచ్చే సినిమాలు అద్భుతంగా ఉండాలనే ఉద్దేశ్యంతో వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి క్రియేట్ చేసుకోవడానికి కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ‘బాహుబలి’ సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన రాజమౌళి ఇప్పుడు మరోసారి ‘వారణాసి’ సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ‘పుష్ప 2’ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టిన అల్లు అర్జున్ సైతం ఇప్పుడు అట్లీ డైరెక్షన్లో ‘రాకా’ అనే సినిమా చేస్తున్నాడు…

ఈ రెండు సినిమాలు కూడా మెహర్ రమేష్ చేసిన ‘శక్తి’ సినిమా నుంచి కాపీ చేస్తున్నారు అంటు కొన్ని వార్తలైతే వస్తున్నాయి. నిజానికి కథపరంగా కాపీ కాకపోయిన శక్తి సినిమాలో ఎంటైర్ క్యారెక్టర్ పేరు రుద్ర… ఇక వారణాసిలో మహేష్ బాబు పేరు కూడా రుద్ర కావడం విశేషం…

ఇక అదే సినిమాలో విలన్ పేరు ‘రాకా’… అల్లు అర్జున్ కొత్త సినిమా టైటిల్ కూడా రాకా నే కావడం విశేషం…ఇలా వీళ్ళిద్దరు మెహర్ రమేష్ సినిమాని కాపీ చేశారు అంటూ కొంతమంది కొన్ని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే వీళ్ళిద్దరు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లడంలో చాలా కీలకపాత్ర వహిస్తున్నారనే చెప్పాలి…

ఇక రాబోయే సినిమాలతో అటు అల్లు అర్జున్, ఇటు రాజమౌళి భారీ సక్సెస్ లను సాధించి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచం నలుమూలాల చాటి చెబుతారా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఇప్పటికే ఈ రెండు సినిమాలు ఎలాంటి కథాంశంతో తెరకెక్కబోతున్నాయనే విషయాన్ని గ్లింప్స్ ద్వారా తెలియజేశారు. అందుకే ఈ మూవీస్ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి…

పూణే జాతరలో ‘మేడ్‌ ఇన్‌ పాకిస్తాన్‌’ బెడ్‌షీట్‌ కలకలం.. అక్రమ సరఫరా అడ్డా!

Made in Pakistan bedsheet issue in Pune
Made in Pakistan bedsheet issue in Pune

Made in Pakistan bedsheet issue in Pune: మహారాష్ట్రలోని ఒక సాధారణ జాతర కొనుగోలు చేసిన ఒక వస్తువు భారతీయుల జాతీయ భావనలను, భద్రతా ఆందోళనలను, వాణిజ్య నియంత్రణలను ఏకేసారి ప్రశ్నించే స్థాయికి చేరుకుంది. పూణేలోని పింప్రి–చించ్వాడ్‌లోని ప్రసిద్ధ శ్రీ మోరయా గోసావి ఆలయం వద్ద జరిగిన సంకష్ట చతుర్థి జాతరలో ఒక మహిళ కొన్న బెడ్‌షీట్‌పై రహస్యంగా ఉన్న ‘మేడ్‌ ఇన్‌ పాకిస్తాన్‌’ లేబుల్‌ బయటపడింది. ఇది దేశంలోని అక్రమ వాణిజ్య వ్యవస్థ ఎంత సున్నితంగా, ఎంత సాహసోపేతంగా పనిచేస్తోందన్న హెచ్చరిక.

వాష్‌ చేసే సమయంలో..
మహిళ ఇంటికి వచ్చి బెడ్‌షీట్‌ను తొలి సారి వాష్‌ చేసినప్పుడు మూలలో దాచిన లేబుల్‌ స్పష్టంగా కనిపించింది. ఆమె వెంటనే వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఆ వీడియో వైరల్‌ అయింది. జాతరలో కొనుగోలు సమయంలో లేబుల్‌ కనిపించలేదు. అంటే ఉద్దేశపూర్వకంగా దాచి అమ్ముతున్నారని తెలుస్తోంది. ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి, కోపం కలిగించింది. హిందూ ఆలయ జాతరలో పాకిస్తాన్‌ ఉత్పత్తి విక్రయం అనేది కేవలం వాణిజ్య ఉల్లంఘన కాదు, జాతీయ భావాలకు గాయం.

స్పందించిన పోలీసులు..
పింప్రి–చించ్వాడ్‌ పోలీసులు తక్షణం స్పందించి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బెడ్‌షీట్‌ను అమ్మిన వీధి వ్యాపారి ఎవరు? ఆ స్టాక్‌ ఎక్కడి నుంచి వచ్చింది? ఏ మార్గంలో స్థానిక మార్కెట్లోకి ప్రవేశించింది? అనే సప్లై చైన్‌ను పూర్తిగా ఛేదించాలని నిర్ణయించారు. అంతేకాకుండా, పింప్రి–చించ్వాడ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు లేఖ రాసి జాతరలు, ఆలయ పరిసరాల్లో అనధికారిక వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కొన్ని నెలల క్రితమే ఛత్రపతి శంభాజీనగర్‌ (ఔరంగాబాద్‌)లో ‘మేడ్‌ ఇన్‌ పాకిస్తాన్‌’ కాస్మెటిక్‌ ఉత్పత్తులు విక్రయించిన ముగ్గురు వ్యాపారులను పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు రూ.60 వేల విలువైన సరుకు సీజ్‌ చేశారు. ఇలాంటి సంఘటనలు ఒక పెద్ద, సంఘటిత అక్రమ నెట్‌వర్క్‌ ఉన్నట్టు తెలియజేస్తున్నాయి.

పుల్వామా ఘటన తర్వాత రద్దు..
2019 పుల్వామా ఉగ్రవాద దాడి తర్వాత భారత్‌ పాకిస్తాన్‌కు ఇచ్చిన మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌ స్థితిని రద్దు చేసింది. దీంతో పాకిస్తాన్‌ నుంచి దిగుమతులు దాదాపు పూర్తిగా నిషేధించబడ్డాయి. అయినప్పటికీ ఇలాంటి వస్తువులు దేశంలోకి వస్తున్నాయంటే ఇది సరిహద్దు భద్రత, కస్టమ్స్, ఇంటెలిజెన్స్‌ యంత్రాంగాల్లో ఉన్న లోపాలను సూచిస్తోంది. డబాయ్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాల ద్వారా భారత్‌లోకి రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది.

వోకల్‌ ఫర్‌ లోకల్‌ కేవలం నినాదం కాకుండా వాస్తవ అమలులోకి రావాలి. జాతరలు, స్థానిక మార్కెట్లు, ఆలయ పరిసరాల్లో విక్రయించే ప్రతి ఉత్పత్తిపై కఠిన నిఘా అవసరం. వినియోగదారులు కూడా లేబుల్స్‌ను జాగ్రత్తగా చదవాలి. ఒక్క బెడ్‌షీట్‌ ఘటన దేశ ఆర్థికం మాత్రమే కాదు జాతీయ భద్రత, స్వావలంబన, స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహం వంటి పెద్ద సమస్యలను మన ముందుకు తెచ్చింది. ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, స్థానిక పరిపాలన కలిసి కఠిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయి.

అనిల్ రావిపూడి కి సక్సెస్ సీక్రెట్ తెలుసా..? ఆయనకి ఎందుకు సాధ్యం అవుతుంది..

Anil Ravipudi success secret
Anil Ravipudi success secret

Anil Ravipudi success secret: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించడమంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలతో సక్సెస్ ని సాధించడం చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి. అలాంటిది మొదటి నుంచి కూడా వరుసగా కమర్షియల్ సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధించిన వాళ్ళలో అనిల్ రావిపూడి ఒకరు. ఆయన చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఎంటర్ టైన్ చేస్తుంటాయి. కామెడీ ప్లస్ యాక్షన్ జానర్ లో ఆయన చెలరేగుతూ ఉంటాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన తొమ్మిది సినిమాల్లో తొమ్మిది కూడా సూపర్ సక్సెస్ లను సాధించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…

ఇదంతా చూస్తున్న చాలామంది సినిమా మేధావులు సైతం అనిల్ రావిపూడి సక్సెస్ ఫార్ములా ఏంటంటే ఆయన స్క్రీన్ ప్లే ను చాలా బాగా వాడుకుంటూ ఎక్కడ ఏ ఎలిమెంట్ అయితే కావాలో దాన్ని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాడు. అందువల్లే అతనికి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఆయన సినిమాలను చూసిన ప్రేక్షకులు ఒక హై ఫీల్ కి లోనవుతుంటారు.

అందువల్లే ఆయన రొటీన్ ఫార్మాట్ ని ఫాలో అయినా కూడా సక్సెస్ ల మీద సక్సెస్ లను సాధిస్తూ ప్రేక్షకులకు విపరీతమైన ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్నాడు… ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించగలిగే కెపాసిటి ఉన్న కొంతమంది దర్శకులు పాన్ ఇండియాలో తమ సత్తాను చూపిస్తుంటే అనిల్ రావిపూడి మాత్రం కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు…

ఇక ఫ్యామిలీ ఆడియన్స్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ప్రతిసారి నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. అందుకే ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి తో ‘మన శంకర్ వరప్రసాద్’ అనే సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఈ మూవీతో 400 కోట్ల వరకు కలెక్షన్స్ ను కొల్లగొట్టాడు…

సూర్యను పక్కనపెట్టి.. అయ్యర్ కు కెప్టెన్సీ అప్పగించింది అందుకే..

Shreyas Iyer Captaincy
Shreyas Iyer Captaincy
Shreyas Iyer replaces Suryakumar Yadav: వన్డే, టెస్ట్ మాత్రమే కాదు.. టి20 ఫార్మాట్లో కూడా గౌతమ్ గంభీర్ ప్రయోగాలు మొదలుపెట్టాడు. టీమ్ ఇండియాకు పొట్టి ఫార్మాట్ లో తిరుగులేదు. సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా 2024 నుంచి ఇప్పటివరకు ఒక్క ట్రోఫీ కూడా కోల్పోలేదు. పైగా వరుసగా 2026 లో కూడా t20 వరల్డ్ కప్ గెలిచింది. 2024లో రోహిత్ నాయకత్వంలో టీమిండియా పొట్టి ప్రపంచ కప్ అందుకుంది. అంతకుముందు అంటే 2007లో ధోని నాయకత్వంలో టీమిండియా పొట్టి ప్రపంచ కప్ సాధించింది.

ఐపీఎల్ వల్ల కొత్త కొత్త ప్లేయర్లు అందుబాటులోకి వస్తున్నారు. వారంతా కూడా అద్భుతంగా ఆడుతున్నారు. అందువల్లే పొట్టి ఫార్మాట్ లో కూడా ప్రయోగాలు చేసేందుకు గౌతమ్ గంభీర్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే వచ్చే ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్ లకు టీమిండియా ను ప్రకటించాడు.. ఇదే జట్టు ఏషియన్ గేమ్స్ లో కూడా ఆడుతుందని ప్రకటించాడు.. భారత జట్టుకు అయ్యర్ నాయకత్వం వహించబోతున్నాడు. వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మ వ్యవహరిస్తాడు. యువ సంచలనం సూర్య వంశీకి జట్టులో చోటు లభించింది.. సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. సంజు శాంసన్ ,అభిషేక్ శర్మ, రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్, హర్షిత్ రానా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్ దీప్ సింగ్, శివం దుబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్య వంశీ వంటి ప్లేయర్లకు ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్ లో అవకాశం లభించింది. ఇక ఏషియన్ గేమ్స్ లో బుమ్రా కు చోటు లభించింది.

కొంతకాలంగా సూర్య ఆటగాడిగా తన ప్రతిభను చూపించలేకపోతున్నాడు. జట్టు ను ముందుకు నడిపించడంలో అతడు విజయవంతమవుతున్నప్పటికీ.. ఆటగాడిగా మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. పరుగులు తీయలేకపోతున్నాడు. తాజాగా ఐపీఎల్లో కూడా అతడు అంతగా సత్తా చూపించలేకపోయాడు. అందువల్ల మేనేజ్మెంట్ అతడికి రెస్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది.. అయితే ప్రస్తుతం టి20 జట్టులో విపరీతమైన పోటీ ఉంది. ఆ పోటీ ఎలా ఉంటుందో సూర్యకు తెలిసినప్పటికీ.. అతడు సరిగ్గా తన ఆటతీరును మెరుగుపరుచుకోలేకపోయాడు. హార్దిక్ పాండ్యా కూడా వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేకపోయాడు. రింకూ సింగ్ కూడా అలానే ఆడలేక పోవడంతో.. వీరి ముగ్గురిని మేనేజ్మెంట్ పక్కన పెట్టింది.

అయ్యర్ కొంతకాలంగా స్థిరమైన ఆట తీరు కొనసాగిస్తున్నాడు.. అతడికి టి20 లలో అంతగా అవకాశాలు రాలేదు. అయినప్పటికీ ఐపీఎల్ ద్వారా తాను ఏమిటో నిరూపించుకున్నాడు. అంతకుముందు ఆస్ట్రేలియా సిరీస్ లో కూడా అతడు అదరగొట్టాడు. పక్కటెముకలు గాయం కారణంగా కొద్దిరోజులపాటు క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. 2024లో అయ్యర్ నాయకత్వంలో కోల్కతా ఐపిఎల్ ఛాంపియన్గా ఆవిర్భవించింది.. ఆటగాడిగా ఏ స్థానంలోనైనా అయ్యర్ బ్యాటింగ్ చేయగలడు. అందువల్లే గౌతమ్ గంభీర్ అయ్యర్ వైపు మొగ్గు చూపించినట్టు తెలుస్తోంది. వరుసగా మూడు సిరీస్ లకు నాయకుడిగా అయ్యర్ కు ప్రమోషన్ లభించిన నేపథ్యంలో ఇన్ని రోజులపాటు చూసిన ఎదురుచూపుకు ఫలితం లభించింది.

ఏసీని ఇలా ఆఫ్ చేస్తున్నారా..

How to switch off AC correctly
How to switch off AC correctly

How to switch off AC correctly: వేసవి కాలంలో ఎయిర్ కండీషనర్ (AC) అనేది చాలా ఇళ్లలో నిత్యావసరంగా మారిపోయింది. అయితే ACని ఎలా ఉపయోగిస్తున్నామన్నది దాని పనితీరు, విద్యుత్ వినియోగం, జీవితకాలంపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఏసీని వాడే క్రమంలో చాలా మంది గది చల్లబడగానే దానిని ఆఫ్ చేసి, కొద్ది సేపటి తర్వాత మళ్లీ ఆన్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కరెంట్ ఆదా అవుతుందని భావిస్తారు. వాస్తవానికి ఇది విద్యుత్ వినియోగాన్ని పెంచడమే కాకుండా ACలోని కీలక భాగాలపై అదనపు ఒత్తిడిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.అదెలాగో చూద్దాం..

ACలో అత్యంత ముఖ్యమైన భాగం కంప్రెసర్. ఇది గదిలోని వేడిని బయటకు పంపించే ప్రధాన యంత్రాంగం. ACని ఆన్ చేసిన ప్రతిసారి కంప్రెసర్ ప్రారంభమయ్యేందుకు ఎక్కువ విద్యుత్ అవసరమవుతుంది. గది చల్లబడగానే ఆఫ్ చేసి, 10 లేదా 15 నిమిషాల తర్వాత మళ్లీ ఆన్ చేస్తే కంప్రెసర్ పదేపదే స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది. ఈ ప్రక్రియ వల్ల విద్యుత్ వినియోగం తగ్గడం కంటే పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కంప్రెసర్‌పై అదనపు ఒత్తిడి పడటంతో దాని జీవితకాలం కూడా తగ్గవచ్చు.

తరచూ ఆన్-ఆఫ్ చేసే అలవాటు వల్ల కంప్రెసర్ మోటార్ అధిక ఉష్ణోగ్రతలకు గురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పాత ACలు లేదా సరైన మెయింటెనెన్స్ లేని యంత్రాల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తుంది. దీర్ఘకాలంలో కంప్రెసర్ పనితీరు తగ్గడం, మరమ్మతుల ఖర్చులు పెరగడం లేదా పూర్తిగా దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. కంప్రెసర్ మార్పిడి ఖర్చు చాలా ఎక్కువగా ఉండటంతో ఈ విషయంలో జాగ్రత్త అవసరం.

రాత్రంతా AC నడిపితే ఉదయం ఎలా ఆఫ్ చేయాలి?
చాలామంది రాత్రంతా AC నడిపిన తర్వాత ఉదయం లేవగానే నేరుగా ఆఫ్ చేస్తారు. కానీ నిపుణుల సూచనల ప్రకారం.. వెంటనే పూర్తిగా ఆఫ్ చేయకుండా ముందుగా కొంతసేపు ఫ్యాన్ మోడ్‌లో నడపడం మంచిది. ఇలా చేయడం వల్ల AC లోపల ఉన్న కాయిల్స్‌పై పేరుకున్న తేమ ఆవిరైపోతుంది. దీంతో ఫంగస్, బ్యాక్టీరియా, దుర్వాసన వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే AC అంతర్గత భాగాలు పొడిగా ఉండటంతో వాటి పనితీరు కూడా మెరుగుపడుతుంది.

రిమోట్‌తో ఆఫ్ చేయడం ఎందుకు అవసరం?
చాలామంది ACని నేరుగా మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి నిలిపేస్తుంటారు. అయితే ముందుగా రిమోట్ ద్వారా ACని ఆఫ్ చేసి, కొన్ని క్షణాల తర్వాత అవసరమైతే మెయిన్ పవర్‌ను నిలిపేయడం ఉత్తమ పద్ధతి. రిమోట్ ద్వారా ఆఫ్ చేసినప్పుడు ACలోని నియంత్రణ వ్యవస్థలు సక్రమంగా షట్‌డౌన్ ప్రక్రియను పూర్తి చేస్తాయి. ఇది ఎలక్ట్రానిక్ భాగాల భద్రతకు సహాయపడుతుంది.

విద్యుత్ ఆదా చేయాలంటే ACని 18 లేదా 20 డిగ్రీల వద్ద కాకుండా 24 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచడం మంచిది. ఈ ఉష్ణోగ్రత వద్ద గది సౌకర్యవంతంగా చల్లబడటమే కాకుండా విద్యుత్ వినియోగం కూడా తక్కువగా ఉంటుంది. అదనంగా సీలింగ్ ఫ్యాన్‌ను ఉపయోగిస్తే చల్లదనం మరింత సమానంగా వ్యాపిస్తుంది.

గేమింగ్ యూజర్లు, బ్యాటరీ లైఫ్ కోరుకునేవారికి బెస్ట్ ఫోన్ ఇదే..

Tecno Pova 8 gaming smartphone
Tecno Pova 8 gaming smartphone

Tecno Pova 8 gaming smartphone: శక్తివంతమైన బ్యాటరీ, ఆకర్షణీయమైన డిజైన్, గేమింగ్ ఫీచర్లు కావాలని కోరుకునే మొబైల్ యూజర్లకు అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ మార్కట్లోకి త్వరలో రాబోతుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్, భారీ బ్యాటరీతో పాటు గ్లిఫ్-స్టైల్ లైటింగ్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. అయితే దీని వివరాల్లోకి వెళితె..

ఇండియాలో 11 జూన్ 2026 తేదీన Tecno Pova 8 స్మార్ట్ఫోన్ విడుదల కాబోతుందని అధికారికంగా ప్రకటించింది. ఈ మొబైల్ లో అత్యంత విశేషమైన ఫీచర్ బలమైన బ్యాటరీ. ఇందులో 8,000mAh బ్యాటరీ ఉండనుంది. ఇది Tecno బ్రాండ్ లోనే అత్యంత పెద్ద బ్యాటరీగా పేర్కొంటున్నారు. ఈ బ్యాటరీకి 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

ఈ కొత్త మొబైల్ లో లో 6.76 అంగుళాల HD+ AMOLED డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ తో ఉండడంతో గేమింగ్ యూజర్లకు అద్భుతమైన అనుభవం ఇస్తుంది. ప్రాసెసర్ విషయంలో మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్ ఉండనుంది. Android 16 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేసే ఇందులో 8GB RAM, 128GB స్టోరేజ్ ఉండే అవకాశం ఉంది.

Tecno Pova 8 మొబైల్ లో 50MP మెయిన్ కెమెరా ఉండనుంది. 13MP సెల్ఫీ కెమెరాను అమర్చారని తెలుస్తోంది. డిజైన్ విషయంలో, Tecno Pova 7నే పోలి ఉంటుందని తెలుస్తోంది. బ్యాక్ పానెల్ డిజైన్ కంపెనీ ఆఫీషియల్గా రివీల్ చేసింది. ఫోన్ యొక్క ఫ్రంట్ పానెల్ గ్లాస్తో తయారీ అయ్యింది. ఈ మొబైల్ ఇండియాలో రూ.25,000 నుండి రూ.30,000 మధ్యలో విక్రయిస్తారని అంచనా. ఈ మొబైల్ ప్రధానంగా గేమింగ్ యూజర్లు, బ్యాటరీ లైఫ్ కోసం ప్రయోజనం పొందే వ్యక్తులను టార్గెట్ చేసి తయారీ చేయబడిందని తెలుస్తోంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి అలర్ట్.. ముందు ఈ 5 విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి

Electric scooter buying guide
Electric scooter buying guide

Electric scooter buying guide: పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో చాలా మంది ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ నిర్వహణ ఖర్చులు, పర్యావరణానికి మేలు చేయడం వంటి కారణాలతో EVలకు డిమాండ్ పెరుగుతోంది. అయితే కేవలం ఆకర్షణీయమైన డిజైన్ లేదా ప్రకటనలు చూసి స్కూటర్ కొనేస్తే తర్వాత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే కొనుగోలు చేసే ముందు కొన్ని కీలక అంశాలను పరిశీలించడం చాలా అవసరం. ముఖ్యంగా ఈ 5 విషయాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి..

రోజువారీ ప్రయాణం ఎంత? మీ అవసరానికి సరిపోయే రేంజ్ ఉందా?
ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంపికలో మొదట పరిశీలించాల్సిన విషయం రోజూ మీరు ఎంత దూరం ప్రయాణిస్తారనేది. ఉదాహరణకు రోజుకు 20-30 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తే సాధారణ రేంజ్ ఉన్న స్కూటర్ సరిపోతుంది. అయితే ఉద్యోగం, వ్యాపారం లేదా డెలివరీ పనుల కోసం రోజుకు 60-100 కిలోమీటర్లు తిరిగేవారైతే అధిక రేంజ్ కలిగిన మోడల్‌ను ఎంచుకోవాలి. కంపెనీలు ప్రకటించే రేంజ్ సాధారణంగా ఆదర్శ పరిస్థితుల్లో పరీక్షించినదే. వాస్తవ పరిస్థితుల్లో ట్రాఫిక్, బరువు, రోడ్ల పరిస్థితి, డ్రైవింగ్ శైలి కారణంగా రేంజ్ కొంత తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అవసరానికి కనీసం 20-30 శాతం అదనపు రేంజ్ ఉన్న మోడల్‌ను ఎంపిక చేసుకోవడం మంచిది.

బ్యాటరీ వారంటీపై ప్రత్యేక శ్రద్ధ అవసరం
ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అత్యంత ఖరీదైన భాగం బ్యాటరీ. అందువల్ల బ్యాటరీ వారంటీ ఎంతకాలం ఉంటుందో, ఎన్ని కిలోమీటర్ల వరకు వర్తిస్తుందో తెలుసుకోవాలి. ప్రస్తుతం చాలా కంపెనీలు 3 నుంచి 8 సంవత్సరాల వరకు లేదా నిర్దిష్ట కిలోమీటర్ల వరకు వారంటీ ఇస్తున్నాయి. బ్యాటరీ సామర్థ్యం తగ్గితే లేదా లోపం తలెత్తితే వారంటీ కింద మార్పిడి చేస్తారా? లేదా? అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే బ్యాటరీ మార్చాల్సి వస్తే భారీ ఖర్చు భరించాల్సి రావచ్చు.

ఛార్జింగ్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి?
స్కూటర్ కొనేముందు ఛార్జింగ్ వ్యవస్థ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఇంట్లో సులభంగా ఛార్జ్ చేసుకునే అవకాశం ఉందా? బ్యాటరీ తొలగించి ఇంట్లోకి తీసుకెళ్లి ఛార్జ్ చేయవచ్చా? ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందా? వంటి అంశాలను పరిశీలించాలి. సాధారణంగా పూర్తి ఛార్జ్ కావడానికి 4 నుంచి 8 గంటల సమయం పట్టవచ్చు. మీరు తరచూ ఎక్కువ దూరం ప్రయాణిస్తే మీ ప్రాంతంలో పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయా? లేదా? కూడా చెక్ చేయడం అవసరం.

బ్రాండ్‌తో పాటు సర్వీస్ నెట్‌వర్క్ కూడా ముఖ్యమే
చాలామంది స్కూటర్ ఫీచర్లు, ధర మాత్రమే చూసి కొనుగోలు చేస్తారు. కానీ విక్రయానంతర సేవలు కూడా అంతే ముఖ్యమైనవి. మీ నగరంలో లేదా సమీప ప్రాంతంలో ఆ బ్రాండ్‌కు సంబంధించిన సర్వీస్ సెంటర్లు ఉన్నాయా? విడి భాగాలు సులభంగా లభిస్తున్నాయా? సాంకేతిక సమస్యలు వస్తే త్వరగా పరిష్కారం లభిస్తుందా? వంటి విషయాలను ముందుగానే తెలుసుకోవాలి. మంచి సర్వీస్ నెట్‌వర్క్ ఉన్న బ్రాండ్‌ను ఎంచుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తగ్గుతాయి.

ఎక్స్-షోరూమ్ ధరే తుది ధర కాదు
చాలా మంది ప్రకటనల్లో కనిపించే ఎక్స్-షోరూమ్ ధరను చూసి బడ్జెట్ నిర్ణయించుకుంటారు. కానీ వాస్తవానికి రిజిస్ట్రేషన్, బీమా, హ్యాండ్లింగ్ ఛార్జీలు, యాక్సెసరీలు, పొడిగించిన వారంటీ వంటి ఖర్చులు అదనంగా చేరుతాయి. దీంతో చివరకు చెల్లించాల్సిన మొత్తం ధర గణనీయంగా పెరగవచ్చు. అందువల్ల కొనుగోలు చేసే ముందు “ఆన్-రోడ్ ధర” ఎంత అవుతుందో డీలర్ వద్ద పూర్తిగా తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి.

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు అనేది కేవలం వాహనం కొనడం మాత్రమే కాదు, దీర్ఘకాలిక పెట్టుబడి కూడా. మీ ప్రయాణ అవసరాలు, బ్యాటరీ నాణ్యత, ఛార్జింగ్ సౌకర్యం, సర్వీస్ మద్దతు, వాస్తవ ఖర్చు వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తే సరైన స్కూటర్‌ను ఎంపిక చేసుకోవచ్చు. కొంత సమయం కేటాయించి పరిశోధన చేయడం వల్ల భవిష్యత్తులో డబ్బు, సమయం రెండూ ఆదా అవుతాయి.

ఆ దర్శకులకు స్టార్ హీరోలతో సినిమాలు చేసే ఛాన్స్ ఎందుకు రాలేదంటే..?

Telugu Directors
Telugu Directors

Telugu directors and star heroes: కొంతమంది దర్శకులు చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగినా కూడా వాళ్లకు స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలైతే రావు. ముఖ్యంగా కొంతమంది హీరోలు కావాలనే వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా పక్కన పెడుతున్నారనే కామెంట్స్ కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి హీరోలు అలాంటి వైఖరిని పాటించడానికి గల కారణం ఏంటంటే…ఆయా దర్శకులు స్టార్ హీరోలు ఇమేజ్ ను హ్యాండిల్ చేయలేరని భావిస్తున్నారట. దానికి ఈ దర్శకులు మాత్రం అవకాశం ఇస్తే కదా మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకునేది అంటూ దర్శకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక టాలెంట్ ఉంది కూడా స్టార్ డైరెక్టర్ల తో సినిమాలు చేయలేని దర్శకులలో శేఖర్ కమ్ముల మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన మొదటి నుంచి కూడా స్టార్ హీరోలతోనే సినిమాలు చేయడానికి ప్రయత్నం చేసిన కూడా ఆయన తీసే సినిమాలు చాలా క్లాస్ గా ఉంటాయి.

కాబట్టి వాటికి స్టార్ హీరోల ఇమేజ్ అడ్డం వస్తుంది. ఆ సినిమాలను తమ అభిమానులు చూడలేరనే ఉద్దేశ్యంతో స్టార్ హీరోలు ఎప్పటికప్పుడు ఆయనకి హ్యాండ్ ఇస్తు పక్కకు తప్పుకుంటున్నారు. శేఖర్ కమ్ముల మాత్రం టైర్ వన్ హీరోలు అవకాశం ఇస్తేవాళ్ల ఇమేజ్ ను మార్చే విధంగా తను కథ చేసి ప్రేక్షకులను మెప్పిస్తాననే ఒక కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు.

కానీ ఏ స్టార్ హీరో కూడా తనని పెద్దగా నమ్మడం లేదు… దేవకట్ట లాంటి దర్శకుడు సైతం స్టార్ హీరోలతో సినిమా చేయడానికి ఆద్యంతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. కానీ అతనికి అవకాశం ఇచ్చే హీరోలైతే కరువయ్యారు. ముఖ్యంగా దేవకట్ట చాలా మంచి రైటర్ ఆయన కథ బాగా రాసుకుంటాడు. దాని నుంచి సినిమాని ఎలా ప్రజెంట్ చేయాలి. ప్రేక్షకుడికి నచ్చే విధంగా సినిమాని ఎలా తీర్చిదిద్దాలి అనేది తనకు చాలా బాగా తెలుసు…

కానీ స్టార్ హీరో ఇమేజ్ చట్రం లో ఇరుక్కుపోయి ఉండడం వల్ల ఆయన సినిమాలో నటిస్తే ప్రేక్షకులకు హై ఎలివేషన్స్ ఉండవేమో కమర్షియల్ గా సినిమా ప్రేక్షకుడిని మెప్పించదేమో అనే ఉద్దేశ్యంతో అతనికి సినిమాలు ఇవ్వడానికి చాలామంది భయపడుతున్నారు. ఈ స్టార్ డైరెక్టర్లు ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాల పైనే అవుతున్నప్పటికి ఒక స్టార్ హీరోతో కూడా సినిమా చేయలేదు…

రాజమౌళి, ప్రశాంత్ నీల్ ఇద్దరు ఎలివేషన్ సీన్స్ రాసేటప్పుడు ఏం చేస్తారో తెలుసా..?

Rajamouli and Prashanth Neel
Rajamouli and Prashanth Neel

Rajamouli and Prashanth Neel: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కని విని ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధించిన దర్శకులు చాలామంది ఉన్నారు. నిజానికి పాన్ ఇండియాలో ఎంత మంది దర్శకులు ఉన్నప్పటికి రాజమౌళి, ప్రశాంత్ నీల్ లకు ఉన్న క్రేజ్ వేరే లెవెల్ అనే చెప్పాలి… ఈ దర్శకులు భారీ సినిమాలను చేస్తు ప్రేక్షకుల మెప్పు పొందుతూ వాళ్లకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నారు. ముఖ్యంగా వాళ్ళ సినిమాలో ఎలివేషన్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి. ఇక వాటిని రాయడానికి వాళ్ళు చాలా వరకు శ్రమిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా వాళ్లకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడానికి డిఫరెంట్ ప్రయత్నాలైతే చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఇప్పటివరకు వీళ్ళిద్దరు తెరకెక్కించిన సినిమాలు కమర్షియల్ గా సూపర్ సక్సెస్ లను సాధించాయి.

రాజమౌళి ఇప్పటివరకు 12 సినిమాలు చేస్తే అందులో 12 కూడా సూపర్ సక్సెస్ ని సాధించాయి. ఇక ప్రశాంత్ నీల్ ఇప్పటి వరకు 4 సినిమాలు చేయగా ఆ నాలుగు సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలవడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… వీళ్లిద్దరి సినిమాలో ఎలివేషన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎలివేషన్స్ రాసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రాటజీని ఫాలో అవుతూ రాస్తుంటారట.

ప్రశాంత్ నీల్ తను నైట్ టైం లో మందు తాగుతూ ఎలివేషన్ రాసుకుంటాడట. ఇక రాజమౌళి అయితే కథ రచయిత రాసిన సీన్స్ ను ఎమోషనల్ గా కనెక్ట్ చేసి అందులో ఎలివేషన్ సన్నివేశాలను సినిమా కథ కి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే లో అమర్చుతాడట.

అక్కడ ఎలాంటి ఎమోషన్ ని వాడితే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది అనే విషయాలను ఆలోచించి రాస్తాడట. రాజమౌళి ఎర్లీ మార్నింగ్ టైమ్ లో మొక్కలకు నీళ్లు పడుతూ ప్రశాంతంగా ఉన్న టైమ్ లో రాసుకుంటారట. ఇక మొత్తానికైతే వీళ్ళిద్దరి సినిమాలు సూపర్ సక్సెస్ ని సాధిస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

శరీరంలో ప్రొటీన్ తక్కువగా ఉందని ఎలా తెలుస్తుంది..

Signs of Protein deficiency in Body
Signs of Protein deficiency in Body

Signs of Protein deficiency in Body: శరీరానికి అవసరమైన పోషకాల్లో ప్రోటీన్ కీలకమైనది. మన శరీర కణజాల నిర్మాణం, కండరాల బలం, రోగనిరోధక వ్యవస్థ పనితీరు అంతా ప్రోటీన్లపైనే ఆధారపడి ఉంటుంది. అయితే, ఆధునిక జీవనశైలిలో సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల అనేక మంది ప్రోటీన్ లోపం సమస్యను ఎదుర్కొంటున్నారు. కొంత మంది వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శరీరంలో ప్రోటీన్ స్థాయిలు పడిపోయినప్పుడు మన శరీరం కొన్ని హెచ్చరికలను జారీ చేస్తుంది. వీటిని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం. మరి ప్రొటీన్ తక్కువైనప్పుడు ఎలాంటి హెచ్చరికలు వస్తాయి?

సాధారణంగా జుట్టు రాలడం , చర్మం పొడిబారడం వంటి లక్షణాలు కనిపిస్తే అది ప్రోటీన్ లోపానికి సంకేతం కావచ్చు. మన శరీరానికి అవసరమైనంత మోతాదులో ప్రోటీన్ అందనప్పుడు, అందుబాటులో ఉన్న కొద్దిపాటి ప్రోటీన్‌ను గుండె, మెదడు వంటి అత్యవసర అవయవాలు తమ పనితీరు కోసం వాడుకుంటాయి. దీనివల్ల చర్మం, జుట్టు, గోళ్ల వంటి తక్కువ ప్రాధాన్యత కలిగిన కణజాలాలకు పోషకాలు అందక అవి బలహీనపడతాయి. ఫలితంగా జుట్టు రాలడం, చర్మం జీవం కోల్పోయి పొడిబారడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

ప్రోటీన్ లోపం ఉన్నవారిలో కడుపు నిండినట్లు అనిపించకపోవడం మరొక ప్రధాన సమస్య. సాధారణంగా ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. కానీ, డైట్‌లో ప్రోటీన్ లోపించినప్పుడు ఆ సంతృప్తి కలగదు. దీనివల్ల శరీరం తక్షణ శక్తి కోసం షుగర్స్ మరియు కార్బోహైడ్రేట్లపై ఆధారపడుతుంది. ఫలితంగా తరచుగా తీపి పదార్థాలు లేదా జంక్ ఫుడ్ తినాలనే కోరిక పెరిగి, బరువు పెరగడానికి లేదా జీవక్రియలో అసమతుల్యతకు దారితీస్తుంది.

శరీరం తరచూ ఇన్ఫెక్షన్లకు గురికావడం, జ్వరం రావడం కూడా ప్రోటీన్ లోపానికి నిదర్శనం. మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీబాడీలు ప్రోటీన్లతోనే తయారవుతాయి. తగినంత ప్రోటీన్ లేకపోతే, శరీరం వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని కోల్పోతుంది. దీనివల్ల చిన్నపాటి వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా త్వరగా సోకడం, కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టడం జరుగుతుంది. కాబట్టి, పప్పు ధాన్యాలు, గుడ్లు, పాలు, మాంసం వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు.

మన గ్యాస్‌ కష్టాలు తీరినట్లే.. అండమాన్‌లో అద్భుతం!

Andaman gas discovery
Andaman gas discovery

Andaman gas discovery: పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తగా చమురు సంక్షోభం నెలకొంది. హర్మూజ్‌ను మూసివేయంతో గల్ఫ్‌ దేశాల నుంచి రమురు, సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జీ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, చైనా వంటి దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. చమురు, గ్యాస్‌ ధరలు భారీగా పెంచాయి. ఈ పరిస్థితిలో తాజాగా భారతీయుల గ్యాస్‌ కష్టాలు తీరే ఒక వార్త ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌(ఓఐఎల్‌) మరోసారి సంచలనం సృష్టించింది. అండమాన్‌ దీవుల తూర్పు తీరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో, 355 మీటర్ల లోతట్టు సముద్ర జలాల్లో విజయపురం–3 అన్వేషణ బావిలో సహజ వాయువు ఉనికిని గుర్తించింది.

ఓఐఎల్‌ రెండో విజయం..
ఇది ఓఐఎల్‌ సంస్థ ఆండమాన్‌ బ్లాక్‌లో సాధించిన రెండో విజయం. గత సెప్టెంబర్‌ 2025లో విజయపురం–2 బావిలో కనుగొన్న మొదటి ఆవిష్కరణతోపాటు, ఇప్పుడు రెండో బావిలో కూడా గ్యాస్‌ ఉనికి తెలియడంతో అండమాన్‌–నికోబార్‌ బేసిన్‌ హైడ్రోకార్బన్‌ సంభావ్యత గురించి ఆశలు భారీగా పెరిగాయి.కేంద్ర పెట్రోలియం మంత్రి హరదీప్‌ సింగ్‌ పురి దీనిని ఇంధన అవకాశాల సముద్రం అని అభివర్ణించారు. ఇది దేశం ఇంధన భద్రత, ఆర్థిక స్వావలంబన, ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యాలకు ఒక ముఖ్యమైన మైలురాయి.

అండమాన్‌ బేసిన్‌లో అన్వేషణ..
ఈ బ్లాక్‌ 2019లో ఆయిల్‌ ఇండియాకు కేటాయించబడింది. సంస్థ మూడు బావుల అన్వేషణ క్యాంపెయిన్‌ను చేపట్టింది. విజయపురం–2లో 87 శాతం మీథేన్‌ కంటెంట్‌తో గ్యాస్‌ లభించగా, ఇప్పుడు విజయపురం–3లో కూడా గ్యాస్‌ ఫ్లో నిర్ధారణ అయింది. గ్యాస్‌ నమూనాల విశ్లేషణ, అప్‌ప్రైజల్‌ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది. అండమాన్‌ బేసిన్‌ ఇప్పటి వరకు తక్కువ అన్వేషణ జరిగిన ఫ్రంటియర్‌ బేసిన్‌గా పరిగణించబడేది. మయన్మార్, ఇండోనేషియా వంటి పొరుగు దేశాల్లోని ఉత్పాదక బేసిన్లతో భూగర్భ నిర్మాణ సారూప్యతలు ఉన్నాయని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది భారత్‌కు కొత్త ఆశలు కల్పిస్తోంది.

ఇంధన భద్రతకు కీలకం..
భారత్‌ ప్రస్తుతం తన సహజ వాయువు అవసరాలలో గణనీయమైన భాగాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఆర్థిక వృద్ధి, పారిశ్రామిక అవసరాలు, నగరీకరణతో గ్యాస్‌ డిమాండ్‌ సంవత్సరానికి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక నిక్షేపాలు పెరగడం వల్ల విదేశీ మారక నిల్వలు ఆదా అవుతాయి, ఇంధన ఖర్చులు తగ్గుతాయి, జాతీయ భద్రత బలపడుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ 2025లో ప్రారంభించిన ‘సముద్ర మంథన్‌’ మిషన్‌కు ఈ ఆవిష్కరణలు ప్రత్యక్ష మద్దతు అందిస్తాయి. లోతట్టు సముద్ర అన్వేషణను ప్రోత్సహించడం ద్వారా దేశం ఇంధన దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవాలన్నది ప్రభుత్వ వ్యూహం.

ఇంకా ఆవిష్కణ దశలోనే..
అయితే ఉత్సాహంతో పాటు వాస్తవికతను కూడా గుర్తించాలి. ఇవి ఇంకా ఆవిష్కరణ దశలోనే ఉన్నాయి. వాణిజ్య సాధ్యత, నిక్షేపాల పరిమాణం, ఉత్పత్తి వ్యయాలు ఇంకా పూర్తి స్థాయిలో నిర్ధారణ కాలేదు. లోతట్టు సముద్ర ప్రాంతంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధి చాలా ఖరీదైనది, సవాల్‌తో కూడుకున్నది. పర్యావరణ సున్నిత ప్రాంతం కావడంతో పర్యావరణ రక్షణ, స్థానికుల హక్కులు, సముద్ర జీవ వైవిధ్యం కాపాడటం వంటి అంశాలు కూడా కీలకమవుతాయి.

అండమాన్‌ సముద్రంలో ఆయిల్‌ ఇండియా సాధించిన వరుస విజయాలు భారత్‌ ఇంధన రంగ చరిత్రలో ముఖ్యమైన మలుపు. ఇంధన దిగుమతి నుంచి విముక్తి పొందడానికి, ఆర్థిక బలం పెంచుకోవడానికి, వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని సాకారం చేయడానికి ఒక బలమైన ఆధారం. సరైన దిశలో అడుగులు వేస్తే, అండమాన్‌ భారత్‌ యొక్క కొత్త ఇంధన హబ్‌గా ఎదగడం ఖాయం.

ఈ ఫోన్ ధర తక్కువ.. కానీ ప్రీమియం ఫీచర్లు.. తెలిస్తే వెంటనే కొంటారు..

Xiaomi 17T Price In India
Xiaomi 17T Price In India

Xiaomi 17T Price In India: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రీమియం ఫీచర్లు కలిగిన మొబైల్స్ కు ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. లగ్జరీ లైఫ్ ను మెయింటేన్ చేసేవారు ఇలాంటి ఫీచర్లు కలిగిన ఫోన్ ను ఇష్టపడుతుంటారు. అయితే ఇప్పుడు ఈ ఫీచర్లు తక్కువ ధర కలిగిన మొబైల్స్ లో కూడా ఉంటున్నాయి. Xiaomi కంపెనీ నుంచి Xiaomi 17T అనే మొబైల్ గురించి ఇప్పుడు టెక్ ప్రపంచంలో ప్రత్యేక చర్చకు దారి తీసింది. ఇందులో ఖరీదైన ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో కనిపించే అనేక ఫీచర్లను ఈ మధ్యస్థ ధరలో అందిస్తోంది. ముఖ్యంగా Leica కెమెరా భాగస్వామ్యంతో వచ్చిన ఇమేజింగ్ సామర్థ్యాలు ఈ ఫోన్‌ను మరింత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

డిస్ ప్లే:
Xiaomi 17T డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. సన్నని బెజెల్స్, ఫ్లాట్ ఫ్రేమ్, స్లిమ్ బాడీతో ఇది ప్రీమియం ఫోన్‌లా కనిపిస్తుంది. చేతిలో పట్టుకున్నప్పుడు తేలికగా, సౌకర్యంగా అనిపించేలా కంపెనీ రూపొందించింది. గ్లాస్ ఫినిష్, నాణ్యమైన నిర్మాణంతో ఈ ఫోన్ ధర కంటే ఎక్కువ విలువ కలిగిన డివైస్‌గా అనిపిస్తుంది. ఈ ఫోన్‌లో హై-రిఫ్రెష్ రేట్ AMOLED డిస్‌ప్లేను అందించారు. వీడియోలు చూడటం, గేమింగ్ ఆడటం, సోషల్ మీడియా బ్రౌజింగ్ చేయడం వంటి పనుల్లో స్మూత్ అనుభవాన్ని అందిస్తుంది. ప్రకాశవంతమైన రంగులు, లోతైన బ్లాక్ లెవెల్స్, మెరుగైన కాంట్రాస్ట్‌తో కంటెంట్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సూర్యరశ్మిలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా అధిక బ్రైట్‌నెస్‌ను అందించారు.

Leica కెమెరా మ్యాజిక్
Xiaomi 17Tలో ప్రధాన ఆకర్షణ Leica ట్యూన్ చేసిన కెమెరా వ్యవస్థ. ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కెమెరా సహజమైన రంగులు, అద్భుతమైన డైనమిక్ రేంజ్, మెరుగైన డీటెయిల్స్‌ను అందిస్తుంది. పగలు మాత్రమే కాకుండా తక్కువ వెలుతురులో కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. Leica Vibrant, Leica Authentic వంటి ప్రత్యేక మోడ్‌లు ఫోటోలకు ప్రొఫెషనల్ టచ్‌ను జోడిస్తాయి. పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీలో కూడా ఈ ఫోన్ ఆకట్టుకునే పనితీరును కనబరుస్తుంది.

ఆధునిక ప్రాసెసర్:
Xiaomi 17Tలో ఆధునిక ప్రాసెసర్‌ను అమర్చారు. మల్టీటాస్కింగ్, హై-ఎండ్ గేమింగ్, వీడియో ఎడిటింగ్ వంటి పనులను సులభంగా నిర్వహించగలదు. అధిక RAM, వేగవంతమైన స్టోరేజ్ టెక్నాలజీ కారణంగా యాప్‌లు వేగంగా ఓపెన్ అవుతాయి. రోజువారీ వినియోగంలో ఎలాంటి ల్యాగ్ లేకుండా స్మూత్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఫోన్‌లో భారీ బ్యాటరీని అందించారు. సాధారణ వినియోగంలో ఒక రోజు కంటే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే సామర్థ్యం ఉంది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వల్ల కేవలం కొద్ది నిమిషాల ఛార్జింగ్‌తో గంటల తరబడి ఉపయోగించవచ్చు. తరచూ ప్రయాణాలు చేసే వారికి ఇది పెద్ద ప్లస్ పాయింట్‌గా మారుతుంది.

సాఫ్ట్‌వేర్, AI ఫీచర్లు
Xiaomi 17T తాజా HyperOS ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో AI ఆధారిత ఫీచర్లు, మెరుగైన యూజర్ ఇంటర్‌ఫేస్, స్మార్ట్ బ్యాటరీ మేనేజ్‌మెంట్, మెరుగైన భద్రతా ఫీచర్లు ఉన్నాయి. యూజర్ అనుభవాన్ని మరింత సులభతరం చేసే అనేక స్మార్ట్ టూల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మొబైల్ ధర 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ను రూ. 59,999 నుంచి విక్రయిస్తున్నారు.