Odisha Farmer: భారత దేశంలో 50 శాతం మంది వ్యవసాయంపై ఆధారడి ఉపాధి పొందుతున్నారు. అందుకే భారత్ అన్నపూర్ణగా పిలుస్తారు. మన వాతావరణ పరిస్థితులు వ్యవసాయానికి అనుకూలంగా ఉండడంతో పంటలు అధిక విస్తీర్ణంలో సాగతువున్నాయి. అయితే ప్రకృతి వైపరీత్యాలు, అతివృష్టి, అనావృష్టి కారణంగా ఏటా లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. రైతులు నష్టపోతున్నారు. వ్యవసాయం దండగ అన్న భావన నెలకొంది. కానీ, కరోనా సమయంలో చాలా మంది ఉద్యోగాలు వదిలి సొంత ఊళ్లకు వచ్చారు. వ్యవసాయంపై దృష్టి పెట్టారు. ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలా ఓడిశాకు చెందిన రైతు కూడడా ఉద్యోగం వదిలి ఏటా రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలు సంపాదిస్తున్నాడు.
Also Read: భారత్ వరకూ వచ్చిన యుద్ధం.. అమెరికా తెగించేసింది..
పది ఎకరాల్లో సాగు..
సుందర్గఢ్ జిల్లా టంగర్పల్లి మండలం రతన్పూర్ గ్రామంలోని 35 ఏళ్ల హిరోడ్ పటేల్, 12వ తరగతి, ఐటీఐ ఎలక్ట్రిషన్ పూర్తి చేశాడు. ఉద్యోగాల ఖోసం వెతికాడు. ప్రైవేటు ఉద్యోగాలు చేశాడు. సంతృప్తి చెందలేదు. తండ్రి శివశంకర్ పటేల్ పెరటి సాగు, భద్రతా పనులతో కష్టాన్ని చూశాడు. 2015లో 10 ఎకరాల కుటుంబ భూమిపై పూర్తి వ్యవసాయం ప్రారంభించాడు. మహారాష్ట్ర జల్గావ్లో పందిరి సాగులో నైపుణ్యాలు నేర్చుకున్నాడు. బహుళ పంటల సాగు, బహుల ఆదాయాలు సంపాదించే మార్గాలు రూపొందించాడు.
చెరువులపై కూరగాయల సాగు..
2019లో వ్యవసాయ శాఖ యాప్లో నీటి సంరక్షణ యూనిట్ సహాయంతో ఎకరంలో నాలుగు ట్యాంకులు తవ్వించాడు. ఒకటి 40 డెసిమల్స్, మూడు 20 డెసిమల్స్ చొప్పున. మూడు టాంకుల్లో చేపలు (రౌ, కత్లా వంటివి) పెంచుతూ, పెద్ద టాంకు మీద బాంబూ/ఇనుప ఫ్రేమ్ వేసి సోరకాయలు, పుచ్చకాయలు పెంచాడు. ఇది నీటిని 30% ఆదా చేస్తూ, పై పంటల నీటిని టాంకుకు జారిపోయి చేపలకు రక్షణగా, టాంకు చుట్టూ పందం, గువా, తెంగెలు, మామిడి నాటాడు. 120 మొక్కల నుంచి ఒక్క సీజన్కు 1,800–2,000 కాయలు పండించాడు.
బహుళ ఆదాయాలు..
ఒకవైపు చేపల సాగుతో ఏటా రూ.1 లక్షల నుంచి రూ.1.5 లక్షలు, మల్లె పూలు సాగుతో రెండు సీజన్లలో రూ.12 లక్షల నుంచి రూ.1.5 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇక పందం, మామిడి, పుంప్కిన్, కూరగాయలు, పెరటి (మాన్సూన్) సాగుతో రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు ఆర్జిస్తున్నాడు. అదనంగా కోళ్ల పెంపకం, పాడి పెంపకం ద్వారా మరింత ఆదాయం పొందుతున్నాడు. ఇలా ఏటా మొత్తంగా రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలు సంపాదిస్తున్నాడు. మరో ఆరు మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాడు.
మోదీ ప్రశంసలు..
ఒడిశా ప్రభుత్వం ’యువ ప్రగతి రైతు’ బహుమతి ఇచ్చింది. 2026 ఫిబ్రవరి 23న ‘మన కీ బాత్’లో ప్రధాని మోదీ ‘భూమి, నీరు సమర్థవంత వాడకంతో కొత్త దృక్పథం‘ అని ప్రశంసించారు. దేశవ్యాప్తంగా రైతులు, విజ్ఞానులు సందర్శించి నేర్చుకుంటున్నారు. హిరోడ్ ‘తెలుసుకోవాలంటే ఉచితంగా బోధిస్తాను‘ అని చెబుతూ షేర్ చేస్తున్నాడు.
హిరోడ్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ భూమి వాడకాన్ని 2–3 రెట్లు పెంచి, వర్షాకాలంలో పెరటి, ఆబాల్లో పూలు/కూరగాయలు సాగుతూ స్థిర ఆదాయం రుజుచేస్తుంది. తక్కువ పెట్టుబడి (బాంబూ ఫ్రేమ్ రూ.20– రూ.30 వేలు), పర్యావరణ హితం (నీటి రీసైక్లింగ్), రిస్క్ తగ్గింపు చేశాడు.