spot_img
Homeవింతలు-విశేషాలుMoney: అనుకోకుండా ఒకరి ఖాతాల్లో వేలకోట్ల రూపాయలు వస్తే ఏమవుతుంది.. రూల్స్ తెలుసుకోండి

Money: అనుకోకుండా ఒకరి ఖాతాల్లో వేలకోట్ల రూపాయలు వస్తే ఏమవుతుంది.. రూల్స్ తెలుసుకోండి

Money : ‘ధనం మూలం జగత్’ ప్రపంచం అంతా డబ్బుతోనే నడుస్తుంది. డబ్బులేకపోతే ఇతరులు మీకు కనీస విలువ కూడా ఇవ్వరనేది అక్షర సత్యం. అందుకే జనాలు ఎంత కష్టపడైనా డబ్బులు సంపాదిస్తుంటారు. కొన్ని సార్లు ఎంత కష్టపడ్డా రూపాయి కూడా మిగలదు. కొంతమందికి ఏం చేయకపోయినా అదృష్టం తన్నుకుంటూ వస్తుంది. కోట్లకు కోట్లు లాటరీలా వచ్చేస్తుంటాయి. ఒక్కోసారి వాళ్ల అకౌంట్లో అన్ని కోట్లు పడ్డాయి. అనే వార్తలు వింటూనే ఉంటాం. అలా విన్నప్పుడు మనకు కూడా అలా పడితే ఎంత బాగుండు అని చాలా మందే అనుకుని ఉంటారు. ఆ మధ్య ఎవరి అకౌంట్లోనో రూ.400కోట్లు బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయన్న వార్త న్యూస్ పేపర్లలలో చదివే ఉంటాం. అయితే అకస్మాత్తుగా ఎవరి ఖాతాలోనైనా అంత డబ్బు ఒకే సారి పడితే ఏమవుతుందో తెలుసా ? దానికి సంబంధించిన నియమాలేంటి.. అలా పడితే బ్యాంక్ వాళ్లు ఏం చేస్తారు. ఆర్బీఐ ఏవిధంగా స్పందిస్తుంది. ఈ రోజు ఈ వార్తలో దాని గురించి వివరంగా తెలుసుకుందాం. దీనితో పాటు ఇది ఎవరికైనా ఎప్పుడు, ఎందుకు జరుగుతుందో కూడా ఈ కథనంలో తెలుస్తుంది.

ఇది ఎలా జరుగుతుంది
భారతదేశంలో కొన్ని వందల కోట్ల రూపాయలు అకస్మాత్తుగా ఎవరో ఒకరి ఖాతాలోకి పడ్డాయన్న ఇలాంటి వార్తలు తరచుగా వినిపిస్తున్నాయి. ఎవరికైనా ఇది జరిగినప్పుడు, బ్యాంకు చేసే మొదటి పని అతని ఖాతాను స్తంభింపజేయడం, తద్వారా మొత్తం గురించి సమాచారం వచ్చే వరకు ఎవరూ డబ్బును విత్‌డ్రా చేయలేరు. ఏదైనా సాంకేతిక లోపం వల్ల ఈ డబ్బు ఎవరి ఖాతాలోకి వచ్చిందో లేదా ఎవరైనా పొరపాటున పంపినట్లు తేలితే, క్షుణ్ణంగా విచారణ తర్వాత డబ్బు తిరిగి అసలైన ఖాతాకు ట్రాన్స్ ఫర్ చేయబడుతుంది. డబ్బు గురించి సమాచారం అందుబాటులో లేకుంటే.. బ్యాంకు డబ్బును స్తంభింపజేస్తుంది. ఈ దేశంలోని ప్రభుత్వ సంస్థలు దర్యాప్తు చేస్తాయి.

ఎవరైనా డబ్బు విత్‌డ్రా చేస్తే ఏమవుతుంది?
ఇప్పుడు పొరపాటున ఎవరి ఖాతాలోకి కోటి రూపాయలు వచ్చినా ఖాతాదారుడు ఆ డబ్బును విత్‌డ్రా చేసి ఖర్చుచేస్తే ఏం జరుగుతుందనే ప్రశ్న తలెత్తుతోంది. తాజాగా నోయిడాలో ఇలాంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పొరపాటున ఓ వ్యక్తి ఖాతాలోకి రూ.26 లక్షలు చేరాయి. ఆ వ్యక్తి డబ్బును చూడగానే ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసి ఖర్చు చేశాడు. ఎవరైనా ఇలా చేస్తే, బ్యాంకు అతనిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 406 కింద కేసు నమోదు చేయవచ్చు. అటువంటి కేసులో, వ్యక్తి దోషిగా తేలితే అతనికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు. ఇది కాకుండా, వ్యక్తిపై సెక్షన్ 34, సెక్షన్ 36 కింద డబ్బు రికవరీ కోసం కూడా కేసు నమోదు చేయవచ్చు. అటువంటి పరిస్థితిలో, కోర్టు నిందితుల అన్ని రకాల ఆస్తులను పరిశీలించి, వాటిని అటాచ్ చేస్తుంది. ఆ ఆస్తి ద్వారా డబ్బు తిరిగి పొందబడుతుంది.

Related News

Most Popular

Jogi Ramesh

Jogi Ramesh: చిక్కుల్లో మాజీ మంత్రి రమేష్ ఫ్యామిలీ!

Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన...
Akhil Akkineni

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...
Toli Ekadashi 2026

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...
Today 25 July 2026 Horoscope:

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...
Oktelugu Epaper