OMD India: భారత సంతతి వారికి ఇటీవల అత్యున్నత పదవులు దక్కుతున్నాయి. ఇటీవలే ట్విట్టర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ నియామకం అయిన సంగతి తెలిసిందే. అది మరిచిపోకముందే మరో భారతీయురాలికి అరుదైన గౌరవం దక్కింది. ఏకంగా ప్రతిష్టాత్మక సంస్థకు సీఈవోగా నియామకం అయ్యింది.

ఒమ్ని కామ్ మీడియా గ్రూప్ (ఓఎండీ) ఇండియా సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా భారత సంతతికి చెందిన అనిషా అయ్యార్ ను నియామకం అయ్యారు. అయ్యర్ కు డిజిటల్, టెక్నాలజీతోపాటు వ్యాపారంలో దాదాపు 18 సంవత్సరాల అనుభవం ఉంది. ఆమె 2019లో మలేషియాకు మేనేజింగ్ డైరెక్టర్ గా గ్రూప్ కు అనుసంధానంగా ఉన్న ఒమ్ని కామ్ మీడియాలో చేరారు. అయ్యర్ అప్పటి నుంచి ఓమ్నికామ్ మీడియా గ్రూప్ లో ఉన్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ గా థాయిలాండ్ లో ఉన్నారు. అనిషా అయ్యర్ గతంలో మైండ్ షేర్, మ్యాడ్ హౌస్ మరియు గ్రూప్ కామ్ వంటి కంపెనీలలో ఆమె పనిచేశారు. ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఆటో, ట్రావెల్, టెలికాం, ఇ-కామర్స్, ఆహారం అలాగే రిటైల్ వ్యాపారాలలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించి మంచి పేరు తెచ్చుకుంది.
Also Read: టీమిండియాలో ఆధిపత్యపోరుకు ముగింపు పలికేదెవరు?
ఓఎండీ ఇండియా అనేది అంతర్జాతీయ మీడియా నెట్ వర్క్ యొక్క భారతీయ విభాగం. ఒమ్నికామ్ మీడియా గ్రూప్ అనేది ఒమ్నికామ్ యొక్క మీడియా సేవల విభాగం. మీడియా గ్రూప్ లో ఓఎండీ, హార్ట్ అండ్ సైన్స్, పీహెచ్.డీ వంటి మీడియా ఏజెన్సీలు ఉన్నాయి.
మార్కెట్ రీసెర్చ్ ఫ్లాట్ పారమ్ స్టాటిస్టా ప్రకారం.. 2020లో భారతీయ ప్రకటనల పరిశ్రమ విలువ రూ.564 బిలియన్లకు పైగా ఉంది. అలాగే 2022 నాటికి రూ.700 బిలియన్లకు చేరుతుందని అంచనా..
Also Read: వాట్సాప్ సూపర్ ఫీచర్.. ఆ అధికారం అడ్మిన్ లకు మాత్రమే?