Homeప్రవాస భారతీయులుNRI Groom: అమెరికా వరులూ పెళ్లికాని ప్రసాద్‌లే.. నాలుగు పదులు దగ్గర పడినా బ్రహ్మచారులే.. ఇక...

NRI Groom: అమెరికా వరులూ పెళ్లికాని ప్రసాద్‌లే.. నాలుగు పదులు దగ్గర పడినా బ్రహ్మచారులే.. ఇక కన్యాశుల్కం తప్పదేమో!?

NRI Groom: భారత వివాహ బంధం చాలా గొప్పది. పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులు జరిగినా.. ఇప్పటికీ మన వివాహ బంధానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అయితే మన వివాహ వ్యవస్థలో ఒకప్పుడు కన్యాశుల్కం ఇచ్చి అమ్మాయిలను అబ్బాయిలు పెళ్లి చేసుకునేవారట. తర్వాత అమ్మాయిలే కట్నం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే రాబోయే రోజుల్లో మళ్లీ కన్యాశుల్కం ఖాయమంటున్నారు నిపుణులు. ఆడపిల్లల సంఖ్య తగ్గిపోవడం ఒకటైతే.. అమ్మాయిలు పెట్టే కండీషన్లు మరో కారణం. అమెరికాలో స్థిరపడిన వారికి కూడా పెళ్లిల్లు కాకపోవడమే పరిస్థితి తీవ్రతకు అద్ధం పడుతోంది.

40 ఏళ్లు వచ్చినా..
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు పెద్దలు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో జీవితంలో స్థిరపడాలన్న కారణంతో పెళ్లిళ్లు వాయిదా వేస్తున్నారు. మరో కారణం.. అమ్మాయిలు తగ్గడం. సంబంధాలు చూస్తున్నా పిల్ల దొరకడం లేదు. తెలంగాణకు చెందిన ఓ యువకుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏడాదికి రూ.50 లక్షలకుపైగా సంపాదిస్తున్నాడు అమెరికాలో ఇల్లు, కారు ఉన్నాయి. చింతలేని లైఫ్‌. కానీ అతనికి ఇంకా పెళ్లి కాలేదు. 40 ఏళ్లు దగ్గరకు వచ్చినా పిల్ల దొరకడం లేదు. వచ్చిన సంబంధాలు రిజక్ట్‌ చేస్తున్నాయి. కారణం. అతనికి తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఆస్తులు లేకపోవడమే. దీంతో ఎన్నారైకి పిల్లను ఇవ్వడానికి వెనుకాడుతున్నారు.

ఎన్నారైలపై ఎన్నో అనుమానాలు..
ఇక మరోవైపు ఎన్నారై పెళ్లి కొడుకు అంటే అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా, అమెరికా, లండన్, కెనడా లాంటి దేశాల్లో మంచి పొజిషన్‌లో ఉన్నా.. ఆడపిల్లల తల్లిదండ్రులు వారికి పిల్లను ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు ఎన్నారై అంటే గెంతులేసేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. అక్కడి కల్చర్‌కు అలవాటు పడి అమ్మాయిలను వేధించడం, ఇండియాలో వదిలేసి పోయేవారి సంఖ్య పెరగడం కూడా ఓ కారణం.

ఉద్యోగం పోతే ఎలా అనే ప్రశ్న !
ఇక కొందరు తల్లిదండ్రులు ఎన్నారైలకు ఉద్యోగం ఉన్నంత వరకే గుర్తింపు ఉంటుంది. ఒకవేళ కంపెనీలు తొలగిస్తే పరిస్థితి ఏంటన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆర్థిక మాంద్యం కారణంగా చాలా కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ లేదా ఆంధ్రాలో ఆస్తులు ఉండాలని కోరుకుంటున్నారు. అప్పుడే ఉద్యోగం పోయినా ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. ఈ కారణంగా కూడా ఎన్పారై పెళ్లి కొడుకులకు సంబంధాలు రావడం లేదు.

చేతులెత్తేస్తున్న మ్యాట్రిమొనీ కంపెనీలు..
ఒకప్పుడు విదేశాల్లో ఉద్యోగం చేసే అవ్బాయిలకు మంచి డిమాండ్‌ ఉండేది. దీంతో ఇలాంటి సంబంధం కుదిరిస్తే తమకు కమీషన్‌ కూడా బాగా వస్తుందని మ్యాట్రిమొనీ కంపెనీలు ఎక్కువగా ఆసక్తి చూపేవి. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఎన్నారై సంబంధం కుదుర్చడం అంత ఈజీ కాకపోవడంతో చేతులు ఎత్తేస్తున్నాయి వధువుల తల్లిదండ్రుల్లో స్పష్టమైన మార్పు నేపథ్యంలో అమెరికాలో స్థిరపడిన వారికి కూడా పిల్లను ఇవ్వడానికి ఇష్టపడడం లేదు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు...

Kerala Innovation: అమ్మ కష్టం చూడలేక.. ఈ కొడుకు చేసిన పని.. ఏకంగా సీఎం చప్పట్లు కొట్టాడు..

Kerala Innovation: ఉదయం లేవగానే ఇల్లు ఊడ్చి.. కల్లాపి చల్లాలి. ముగ్గు పెట్టాలి. బట్టలు ఉతకాలి. టీ దగ్గర నుంచి మొదలు పెడితే కూర వరకు వండాలి. ఇంటిని శుభ్రం చేయాలి. ఇన్ని...

Arunachalam Moksha Margam: అరుణాచలం మోక్షమార్గం.. తెలుగు భక్తులకే ఎందుకీ కష్టాలు..

Arunachalam Moksha Margam: అప్పుడెప్పుడో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అరుణాచలంలో ప్రదక్షిణలు చేయాలని.. మోక్ష మార్గం నుంచి బయటికి రావాలని పిలుపునిచ్చారు. ఆయన చెప్పడమే ఆలస్యం తెలుగు భక్తులు అప్పటినుంచి...

Suryakumar Yadav: సూర్య కుమార్ యాదవ్.. నీ కష్టం పగ వాడికి కూడా రావద్దు బ్రో

Suryakumar Yadav:  అతడి నాయకత్వంలో టీమిండియా టి20 లలో ఒక్క ట్రోఫీ కూడా కోల్పోలేదు.. చివరికి టి20 వరల్డ్ కప్ కూడా సాధించింది. 2024లో రోహిత్ నాయకత్వంలో టీమిండియా అద్భుతం చేస్తే.. 2026లో...
Oktelugu Epaper
Exit mobile version