యాదాద్రి ఆలయ పునర్నిర్నాణం అత్యుద్భుతమని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. శుక్రవారం యాదాద్రి లక్ష్మీ నర్సింహ స్వామిని మంత్రి దర్శించుకుని ఆయన పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్ లో యాదాద్రి ఆలయాన్ని కేసీఆర్ నిర్మించారని చెప్పుకుంటారని పేర్కొన్నారు. దేవుడి ఆశీస్సులతో సీఎం కేసీఆర్ సంకల్పం తప్పకుండా నెరవేరుతుందని మంత్రి పేర్కొన్నారు.