HomeNewsPopulation: ప్రపంచ జనాభా మరింత తగ్గుతుందా? ఏ దేశాలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాయి?

Population: ప్రపంచ జనాభా మరింత తగ్గుతుందా? ఏ దేశాలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాయి?

Population: జనాభా పెరుగుదల కారణంగా వనరుల కొరత, ఆర్థిక సమస్యలు, ఆహారం, నీటి సమస్యల గురించి చాలా తరాలు వింటూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు విషయం కాస్తా తలకిందులైంది. ప్రపంచంలోని అనేక దేశాలు జనాభా క్షీణతతో ఇబ్బంది పడుతున్నాయి. జననాల రేటును పెంచడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా చైనా, జపాన్‌లు తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నాయి. టెక్ బిలియనీర్ ఎలోన్ మస్క్, సోషల్ మీడియా పోస్ట్ ద్వారా, ప్రపంచ జనాభా క్షీణతను ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన సవాళ్లలో ఒకటిగా అభివర్ణించారు. గ్రాఫ్‌ను ఉటంకిస్తూ, 2100 సంవత్సరం నాటికి జనాభాలో భారీ క్షీణత ఉంటుందని, ఇది మొత్తం మానవాళికి పెద్ద ముప్పు అని చెప్పారు.

జననాల రేటు తగ్గడం ప్రధాన కారణం
జనాభా క్షీణత రోజు రోజుకు మరింత ముప్పుగా మారుతుంది. ప్రపంచానికి తీవ్రమైన ముప్పుగా దీన్ని అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు. ఈ గ్రాఫ్ భారతదేశం, నైజీరియా, యునైటెడ్ స్టేట్స్, ఇండోనేషియా, పాకిస్తాన్‌తో సహా ప్రధాన దేశాలకు 2018 2100 మధ్య అంచనా వేసిన జనాభాలో పెద్ద తేడాలను చూపుతుంది.

వివిధ దేశాలలో జనాభా తగ్గుదల వెనుక కారణాలు జనన రేటు తగ్గుదల, వృద్ధుల జనాభా పెరుగుదల, వలసలు మొదలైనవి ప్రధానంగా చెబుతున్నారు. అనేక దేశాల్లో ఒక మహిళకు సగటు పిల్లల సంఖ్య 2.1 కంటే తక్కువగా ఉంది. అయితే భారత్, చైనాలు ఈ సమస్యతో ఎక్కువగా ప్రభావితమయ్యాయి

2018లో, భారతదేశం, చైనా రెండింటి జనాభా దాదాపు 1.5 బిలియన్లు (150 కోట్లు), కానీ ఈ లెక్క వేగంగా మారుతున్నాయి. 2100 నాటికి భారతదేశ జనాభా 110 కోట్లకు తగ్గుతుందని అంచనా. అదే సమయంలో, చైనా జనాభా దాదాపు 74 కోట్ల భయంకరమైన క్షీణతతో మిగిలిపోతుంది. వృద్ధుల జనాభా పెరుగుదల, సంతానోత్పత్తి రేటు తగ్గడం చైనా జనాభాలో ఇంత భారీ తగ్గుదలకు కారణం. ఈ విధంగా, ఈ శతాబ్దం చివరి నాటికి, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం రెండవ అత్యధిక జనాభా కలిగిన దేశం నైజీరియా అవుతుంది.

ఈ శతాబ్దం చివరి నాటికి నైజీరియా జనాభా 79 కోట్లు ఉంటుందని అంచనా. యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకుల 2020 నివేదిక ప్రకారం, భారతదేశం, చైనాలో జనాభా మునుపటి కంటే వేగంగా తగ్గుతుంది . అదే సమయంలో, అమెరికా 2100 సంవత్సరం నాటికి జనాభా పరంగా ప్రపంచంలో నాల్గవ స్థానంలో ఉంటుంది. కెనడా, ఆస్ట్రేలియాలో జనాభా స్థిరంగా ఉంటుందని భావిస్తున్నారు. 2100 సంవత్సరం నాటికి, ఇండోనేషియా, పాకిస్తాన్ వంటి ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాల జనాభాలో కొంచెం తగ్గుదల ఉండవచ్చు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular