భార్యను బ్లాక్ మెయిల్ చేస్తున్న సినీ రచయితపై కేసు

టాలీవుడ్ కు చెందిన ఓ సినీ రచయితపై పోలీసులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. సదరు రచయిత తన భార్యనే వేధింపులతోపాటు బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె ఫిర్యాదు మేరకు బంజారు హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. దీంతో ఆ రచయిత ఎవరు? అని తెలుసుకునేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. టాలీవుడ్లోని పలు సినిమాలకు యెర్రంశెట్టి రమణ గౌతమ్‌ మాటల రచయిత పని చేశాడు. ఆయన […]

Written By: NARESH, Updated On : September 7, 2020 4:55 pm

arrachment wife

Follow us on

టాలీవుడ్ కు చెందిన ఓ సినీ రచయితపై పోలీసులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. సదరు రచయిత తన భార్యనే వేధింపులతోపాటు బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె ఫిర్యాదు మేరకు బంజారు హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. దీంతో ఆ రచయిత ఎవరు? అని తెలుసుకునేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు.

టాలీవుడ్లోని పలు సినిమాలకు యెర్రంశెట్టి రమణ గౌతమ్‌ మాటల రచయిత పని చేశాడు. ఆయన బంజారాహిల్స్ లోని రోడ్డు నెంబర్ 12లోగల ఎన్బీటీనగర్లో నివాసం ఉంటున్నాడు. ఈక్రమంలోనే సినీ పరిశ్రమకు చెందిన భవానీని 2019మార్చిలో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నిరోజులకే మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. దీంతో ఆమె తన భర్తపై అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేయగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అనంతరం పోలీసులు వీరిద్దరికి కౌన్సిలింగ్ నిర్వహించారు. రచయిత రమణ తన తప్పు ఒప్పుకొని భార్యతో కలిసి ఉంటానని హామీ ఇచ్చాడు. దీంతో వీరిద్దరు భవానీ సోదరి వెంటలక్ష్మి ఇంటిపక్కనే కాపురం పెట్టారు. కాగా కొద్దిరోజుల నుంచి రమణ ముఖం చాటేస్తూ తిరుగుతున్నారు. దీంతోపాటు పరిశ్రమలో ఆమెపై చెడుగా ప్రచారం చేస్తున్నాడట. తనపై పెట్టిన కేసులు వాపస్ చేసుకోకుండా యూట్యూలో నీ అసభ్యకర చిత్రాలు పెడుతానంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడట.

 
దీంతో బాధితురాలి సోదరి వెంటకలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. రచయిత రమణపై మరోసారి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. సినీ రంగానికి చెందిన ఇద్దరు ఈ కేసులో ఉండటంతో ఈ విషయంలో టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.