HomeNews‬Telangana Earthquake : తెలంగాణలో భూకంపం.. బయటకు పరుగులు తీసిన జనం

‬Telangana Earthquake : తెలంగాణలో భూకంపం.. బయటకు పరుగులు తీసిన జనం

‬Telangana Earthquake : తెలంగాణలోని కరీంనగర్, జగిత్యాల, వేములవాడ, సిరిసిల్ల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో సోమవారం సాయంత్రం స్వల్ప తీవ్రతతో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రత నమోదైనట్లు ప్రాథమిక సమాచారం. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.

Also Read :ఉద్యోగులకు కోలుకోలేని షాక్ ఇచ్చిన రేవంత్ రెడ్డి

భయంతో పరుగులు తీసిన ప్రజలు..
భూకంపం సమయంలో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగెత్తి ఖాళీ స్థలాల్లో గుమిగూడారు. అధికారులు వెంటనే అప్రమత్తమై, ప్రజలను భవనాల నుంచి దూరంగా ఉండాలని సూచించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. అయితే, అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు.

నిపుణుల విశ్లేషణ.. భవిష్యత్ హెచ్చరికలు
భూగర్భ శాస్త్రవేత్తలు ఈ భూకంపం స్థానిక ఫాల్ట్ లైన్ కదలికల వల్ల సంభవించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో గతంలో ఇలాంటి స్వల్ప తీవ్రత భూకంపాలు నమోదైనప్పటికీ, పెద్ద ఎత్తున నష్టం జరగలేదు. నిపుణులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, భూకంప సమయంలో భద్రతా పాటించాలని సూచిస్తున్నారు.

ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం, విపత్తు నిర్వహణ బృందాలు ఏవైనా అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని అధికారులు కోరుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular