భారీ తనానికి యూవీ దూరం.. రాధేశ్యామ్ ఆఖరు !

టాలీవుడ్ లో యూవీ క్రియేషన్స్ అనగానే భారీ తనం గుర్తుకు వస్తుంది. భారీ బడ్జెట్ సినిమాలకు యూవీ కేరాఫ్ అడ్రెస్ అనే పేరు వినిపిస్తోంది. సాహో లాంటి భారీ పాన్ ఇండియా సినిమా నిర్మాణం తర్వాత, యూవీ పేరు బాలీవుడ్ లో కూడా ప్రముఖంగా వినిపించింది. దీనికితోడు ప్రస్తుతం సెట్స్ పై ఉన్న రాధేశ్యామ్ కూడా భారీ పాన్ ఇండియా సినిమానే. మరి ఇలాంటి యూవీ క్రియేషన్స్ ప్రస్తుతం చిన్న సినిమాల నిర్మాణంలో ఫుల్ బిజీగా ఉంటుందని […]

Written By: admin, Updated On : June 15, 2021 3:51 pm
Follow us on

టాలీవుడ్ లో యూవీ క్రియేషన్స్ అనగానే భారీ తనం గుర్తుకు వస్తుంది. భారీ బడ్జెట్ సినిమాలకు యూవీ కేరాఫ్ అడ్రెస్ అనే పేరు వినిపిస్తోంది. సాహో లాంటి భారీ పాన్ ఇండియా సినిమా నిర్మాణం తర్వాత, యూవీ పేరు బాలీవుడ్ లో కూడా ప్రముఖంగా వినిపించింది. దీనికితోడు ప్రస్తుతం సెట్స్ పై ఉన్న రాధేశ్యామ్ కూడా భారీ పాన్ ఇండియా సినిమానే.

మరి ఇలాంటి యూవీ క్రియేషన్స్ ప్రస్తుతం చిన్న సినిమాల నిర్మాణంలో ఫుల్ బిజీగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఎందుకు పూర్తిగా తమ రూటు మార్చారు ? నిర్మాతల ఆలోచనలు మారడానికి కరోనానే కారణమని తెలుస్తోంది. అందుకే, కొన్నాళ్ల పాటు ఇక భారీ బడ్జెట్ సినిమాలు ఆపేయాలని యూవీ క్రియేషన్స్ నిర్ణయించుకుందట.

ఒకవేళ భారీ సినిమా చేయాలనిపిస్తే.. భాగస్వామ్యంలోనే చేయాలి తప్ప, సోలో నిర్మాణంలో చేయకూడదు అనేది యూవీ తీసుకున్న లేటెస్ట్ నిర్ణయం. ప్రస్తుతం యూవీ చేతిలో ఎనిమిది చిన్న సినిమాలు ఉన్నాయి. ఇంత భారీగా లైనప్ ఉండటానికి కారణం, అన్నీ చిన్న సినిమాలే, అలాగే అందరు డైరెక్టర్లు కొత్తవాళ్లే. మొత్తానికి ఈ బడా నిర్మాణ సంస్థ మరో రెండేళ్ల పాటు చిన్న సినిమాలతోనే కాలక్షేపం చేయనుంది.

పైగా ఇప్పట్లో భారీ బడ్జెట్ సినిమాల జోలికి పోదు. కాబట్టి మరిన్ని చిన్న సినిమాలు నిర్మించే అవకాశం ఉంది. జులై లాస్ట్ వీక్ నుండి అనుష్కతో ఓ సినిమా ప్లాన్ చేశారు. నవీన్ పొలిశెట్టి, అనుష్క కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా కథ డిఫరెంట్ లవ్ స్టోరీ అట. ఇక ఈ సినిమాతో పాటు జులై నుండి మరో చిన్న సినిమాని కూడా ఒకేసారి షూటింగ్ రెడీ చేయాలని యూవీ కసరత్తులు చేస్తోంది.