HomeNewsPakistan Nuclear Weapons : అణ్వస్త్రాలపై వెనక్కు తగ్గిన పాకిస్తాన్‌.. ఆ దేశంలో ఏం జరుగుతోంది?

Pakistan Nuclear Weapons : అణ్వస్త్రాలపై వెనక్కు తగ్గిన పాకిస్తాన్‌.. ఆ దేశంలో ఏం జరుగుతోంది?

Pakistan Nuclear Weapons : జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్‌ 22న పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. మతం పేరు అడిగి మరీ చంపేశారు. 26 మంది యాత్రీకులు మరణించారు. దీనికి ప్రతీకారంగా మే 7న భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టింది. కేవలం 20 నిమిషాల్లో పాకిస్తాన్, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. తర్వాత పాకిస్తాన్‌ ప్రతిదాడి చేయడంతో బారత్‌ వాటిని తిప్పికొట్టింది. 11 ఎయిర్‌ బేస్‌లను ధ్వంసం చేసింది. రాడార్‌ వ్యవస్థను కుప్ప కూల్చింది. ఇదే సమయంలో కిరాణా హిల్స్‌లోని అణ్వాయుధాలపైనా దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటని పాకిస్తాన్‌ ఖండించింది. కానీ, గతంలో తన వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని భారత్‌ను బెదిరించిన పాకిస్తాన్‌.. ఇప్పుడు ఆ విషయంలో వెనక్కు తగ్గింది. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పాక్‌ సైనికాధికారి ఆసిఫ్‌ మునీర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

భారత్‌ దెబ్బ గట్టిగానే తాకిందా..
ఆపరేషన్‌ సిందుర్ కన్నా ముందు పాకిస్తాన్‌.. తరచూ తన వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని చాలాసార్లు భారత్‌ను బెదిరించింది. అణ్వాయుధాలను భారత్‌వైపు గురిపెట్టి ఉంచామని ఆ దేశ సైనికాధికారి, రక్షణ మంత్రి, ప్రధాని, అధ్యక్షుడు అనేకసార్లు ప్రకటించారు. ఇక ఆపరేషన్‌ సిందూర్‌ ఐదో రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెరపైకి వచ్చి.. సీజ్‌ఫైర్‌ ప్రకటించారు. భారీ అణుయుద్ధాన్ని ఆపానని చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు పాకిస్తాన్‌ అణ్వాయుధాలపై వెనక్కు తగ్గింది. భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ దాడుల్లో పాకిస్తాన్‌లోని నూర్‌ ఖాన్‌ ఎయిర్‌బేస్‌తోపాటు కిరాణా హిల్స్‌లోని అణ్వాయుధ సంబంధిత వ్యవస్థ దెబ్బతిన్నాయని తెలుస్తోంది. అందుకే సైనికాధికారి జనరల్‌ ఆసిఫ్‌ మునీర్‌ తమ అణ్వాయుధాలు కేవలం ఆత్మరక్షణ కోసమేనని, యుద్ధం కోసం కాదని ప్రకటించారని తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్‌ అణ్వాయుధ హెచ్చరికల నుంచి గణనీయమైన మార్పును సూచిస్తాయి.

వెనక్కి తగ్గడానికి కారణాలు..
ఆపరేషన్‌ సింధూర్‌లో భారత్‌ జరిపిన దాడులు పాకిస్తాన్‌ అణ్వాయుధ వ్యవస్థలను నిర్వీర్యం చేసినట్లు తెలుస్తోంది. కిరాణా హిల్స్‌లోని సౌకర్యాలు దెబ్బతినడం వల్ల పాకిస్తాన్‌ అణ్వాయుధాలను సమర్థవంతంగా ఉపయోగించే సామర్థ్యం తగ్గిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితి మునీర్‌ను రక్షణాత్మక వైఖరిలో పడేసినట్లు తెలుస్తోంది.

ఆపరేషన్‌ సింధూర్‌ సమయంలో అమెరికా, సౌదీ అరేబియా, ఇరాన్, యూఏఈ వంటి దేశాలు జోక్యం చేసుకొని యుద్ధవిరమణకు మధ్యవర్తిత్వం వహించాయి. అమెరికా రాష్ట్ర కార్యదర్శి మార్కో రూబియో, ఉపాధ్యక్షుడు జే.డీ. వాన్స్‌ నేరుగా పాకిస్తాన్, భారత నాయకులతో మాట్లాడి ఉద్రిక్తతను తగ్గించారు. ఈ అంతర్జాతీయ ఒత్తిడి పాకిస్తాన్‌ను అణ్వాయుధ బెదిరింపుల నుంచి వెనక్కి తగ్గేలా చేసి ఉంటుందని సమాచారం.

ఆపరేషన్‌ సింధూర్‌లో భారత్‌ 11 పాకిస్తాన్‌ ఎయిర్‌బేస్‌లపై దాడి చేసింది, ఇందులో నూర్‌ ఖాన్‌ ఎయిర్‌బేస్‌ కూడా ఉంది. ఇది పాకిస్తాన్‌ యొక్క స్ట్రాటజిక్‌ ప్లాన్స్‌ డివిజన్‌కు సమీపంలో ఉంది. ఈ దాడులు పాకిస్తాన్‌ సైనిక నాయకత్వంలో అభద్రతాభావాన్ని సృష్టించాయి, ఫలితంగా జనరల్‌ మునీర్‌ రక్షణాత్మక వైఖరిని ప్రదర్శించారు.

పాకిస్తాన్‌లో జనరల్‌ మునీర్‌కు వ్యతిరేకంగా అసంతృప్తి ఉంది, ముఖ్యంగా ఇమ్రాన్‌ ఖాన్‌ యొక్క పాకిస్తాన్‌ తెహ్రీక్‌–ఎ–ఇన్సాఫ్‌ మద్దతుదారుల నుంచి. ఈ పరిస్థితిలో అణ్వాయుధ బెదిరింపులను కొనసాగించడం దేశీయంగా మరింత వ్యతిరేకతను రేకెత్తించవచ్చని మునీర్‌ భావించి ఉండవచ్చు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version