
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 38,310 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన్లో పేర్కొంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 82,67,623 కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 470 మంది వైరస్ సోకి మరణించారు. దీంతో 1,23,097కి మరణాల సంఖ్యకు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 5,41,405 యాక్టివ్ కేసులు ఉండగా.. 76,03,121మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా 24 గంటల్లో 58,323 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో మొత్తం నమోదైన కేసులలో 1.49 శాతం మరణాల రేటు ఉండగా, యాక్టివ్ కేసుల శాతం 6.55గా ఉంది.