HomeNewsMamata Banerjee Messi Controversy: ఓహో.. మమతాబెనర్జీ చివరికి మెస్సిని కూడా వదలలేదా ..బాప్ రే...

Mamata Banerjee Messi Controversy: ఓహో.. మమతాబెనర్జీ చివరికి మెస్సిని కూడా వదలలేదా ..బాప్ రే ఇంత జరిగిందా..

Mamata Banerjee Messi Controversy: 15 సంవత్సరాలపాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని ఏక ఛత్రాధిపత్యంగా పరిపాలించింది మమతా బెనర్జీ. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వలేదు. కనీసం రోడ్ల మీదకి వచ్చే స్వేచ్ఛ ఇవ్వలేదు. దాడులు చేయడం.. హత్య చేయడం.. ఆడవాళ్లను దారుణంగా చెరచడం వంటి వాటిని నాటి తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అలవాటుగా మార్చుకున్నారు. బెంగాల్ రాష్ట్రంలో సొంత రాజ్యాంగాన్ని అమలు చేశారు. మమత అండదండలు ఉండడంతో వారంతా విచ్చలవిడిగా వ్యవహరించారు. పదిహేను సంవత్సరాల తర్వాత బెంగాల్ ప్రజలకు బుద్ధి వచ్చింది. ఇంకా వీరి ఆగడాలు భరించే ఓపిక లేదని ఓటుతో బుద్ధి చెప్పారు.

ప్రజలనే కాదు..

బెంగాల్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు మమత ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసేది. ఈ పథకాలకు లబ్ధి పొందిన వారి నుంచి నాటి టిఎంసి కార్యకర్తలు.. నాయకులు డబ్బులు కొంతమేర మినహాయించుకునేవారు. దీనికి అక్కడ పెట్టిన పేరు కట్ మనీ. ఇలా లబ్ధిదారుల నుంచి ప్రతినెల కట్ మనీ వసూలు చేసేవారు. ప్రజలకు నరకం అంటే ఏంటో చూపించేవారు.. ప్రజల నుంచి వసూలు చేసిన కట్ మనీ ద్వారా చాలామంది నేతలు కోట్లకు ఎదిగిపోయారు. కొందరైతే సమాంతర వ్యవస్థలను నడిపారు. జిల్లాలలో కలెక్టర్లను డమ్మీలుగా మార్చారు. అధికారుల మీద దాడులు కూడా చేశారు. కొన్ని సందర్భాలలో వివిధ అక్రమాలపై దర్యాప్తు సాగించడానికి వచ్చే కేంద్ర బృందాలపై కూడా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేశారంటే అక్కడ శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

మెస్సిని కూడా వదిలిపెట్టలేదు

పశ్చిమ బెంగాల్లో ఫుట్ బాల్ ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా మెస్సికి అక్కడ విపరీతంగా అభిమానులు ఉంటారు. అతని ఆటను సంపూర్ణంగా ఆస్వాదిస్తూ ఉంటారు. మెస్సి గత ఏడాది గోట్ టూర్ లో భాగంగా కోల్ కతా లోని సాల్ట్ లేక్ స్టేడియంలోకి వచ్చారు. అక్కడ మెస్సి టీం సందడి చేసింది. మెసేజ్ విగ్రహాన్ని కోల్ కతా ప్రభుత్వం భారీగా ఖర్చుపెట్టి ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో మెస్సి కూడా పాల్గొన్నారు. అయితే నాడు కోల్ కతా టూర్ లో గందరగోళం నెలకుంది. మెస్సి టూర్ లో చీకటి లావాదేవీలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వినిపించాయి. దీని వెనక నాడు ప్రమోటర్ గా వ్యవహరించిన శతద్రు దత్తా తప్పు ఉందని అప్పట్లో అధికారులు గుర్తించారు.

మెస్సీ టీమ్ రాసిన లేఖతో..

మెస్సి బృందం ఇప్పుడు కోల్ కతా పోలీసులకు లేఖ రాయడంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. నాడు ఈ టూర్లో అక్రమాలు జరగడానికి మమతా బెనర్జీ ప్రభుత్వం లో కీలకంగా పనిచేసిన మంత్రి ఆరూప్ విశ్వాస్ వ్యవహరించిన తీరు కారణమని తేలింది. దీంతో మమతా బెనర్జీ చివరికి మెస్సిని కూడా వదిలిపెట్టలేదని.. అక్రమాలకు.. దారుణాలకు ఎంతటివారినైనా మమతా బెనర్జీ వాడుకుందని బిజెపి నేతలు అంటున్నారు. మరి దీనిపై అక్కడి బిజెపి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version