
కాంగ్రెస్ నాయకురాలు, సినీ నటి విజయశాంతి తెలంగాణ ముఖ్యమంత్రిపై ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపించారు. విద్యర్థులు, రైతులను మనో వంచనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ‘ధరణి పేరిట తెలంగాణ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని, ఈ కార్యక్రమం ఎంత అస్తవ్యస్తంగా సాగుతుందో అర్థమవుతుందని’ అన్నారు. ఆస్తిపన్ను కట్టనిదే ఆన్లైన్ నమోదే ప్రక్రియ సాగడం లేదన్నారు. ఇక కోవిడ్ విషయానికొస్తే నిమ్స్ లో ఫ్రంట్ లైన్ వారియర్ల ధర్నాపై ఇప్పటికీ సీఎం స్పందించకపోవడం దారుణమన్నారు.