కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరతతో చాలా మంది మరణిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆక్సిజన్ కొరతను తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య తెలిపింది. విదేశాల నుంచి దిగుమతి చేసిన 40 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ను ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ కు టీఐఎఫ్ ప్రతినిధులు అందించారు. కేటీఆర్ మాట్లాడుతూ కరోనాను ఎదుర్కొనేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని కరోనా రోగులను ఆదుకునేందుకు సహకారం అందించాలన్నారు.