ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఎందుకన్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ త్రినాద్ ను సస్పెండ్ చేయాలని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. అదేవిధంగా మద్యం అక్రమంగా తరలిస్తున్నందుకు రూ. 5 లక్షలు జరిమానా విదించారు. ఇటువంటి సంఘటనలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు.
కరోనా లాక్ డౌన్ సమయంలో పోలీసులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులను నిర్వహిస్తున్నారు. త్రినాథ్ వారి వల్ల పోలీసులు ప్రదర్శిస్తున్న స్ఫూర్తికి విఘాతం కలుగుతోంది.