మందుబాబులూ.. ఈ లక్షణాలు ఉన్నాయా? డాక్టరుని కలవండి

కారోన భయంతో 21 రోజుల సంపూర్ణ లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణలో మద్యం దుకాణాలు అన్నీ మూసివేయబడ్డాయి. దింతో మందుబాబులు తెగ ఇబ్బందిపడిపోతున్నారు. కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్న వాళ్లతో నగరంలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా.. మల్కాజిగిరి జిల్లా హాస్పిటల్‌లో 2రోజుల వ్యవధిలో సుమారు 15 కేసులు నమోదయ్యాయి. మతిస్థిమితం కోల్పోవడంతోనే మందుబాబులు ఆస్పత్రల్లో చేరుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇటీవల మల్కాజిగిరి జిల్లా ఆస్పత్రికి సుమారు 15మంది రోగులు చికిస్త […]

Written By: Neelambaram, Updated On : March 30, 2020 3:49 pm
Follow us on


కారోన భయంతో 21 రోజుల సంపూర్ణ లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణలో మద్యం దుకాణాలు అన్నీ మూసివేయబడ్డాయి. దింతో మందుబాబులు తెగ ఇబ్బందిపడిపోతున్నారు. కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్న వాళ్లతో నగరంలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా.. మల్కాజిగిరి జిల్లా హాస్పిటల్‌లో 2రోజుల వ్యవధిలో సుమారు 15 కేసులు నమోదయ్యాయి. మతిస్థిమితం కోల్పోవడంతోనే మందుబాబులు ఆస్పత్రల్లో చేరుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఇటీవల మల్కాజిగిరి జిల్లా ఆస్పత్రికి సుమారు 15మంది రోగులు చికిస్త కోసం వచ్చారు. మద్యం దొరక్క మతిస్థిమితం కోల్పోతున్నారని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో మద్యం దొరక్కపోవడంతో చాలా మంది మందుబాబులు విచిత్ర ప్రవర్తన చేస్తున్నారని డాక్టర్లు తెలుపుతున్నారు.

నిత్యం మద్యం అలవాటున్న ఉన్న వ్యక్తులకు ఒక్కసారిగా దొరక్కపోవడం వల్ల అసాధారణంగా ప్రవర్తిస్తారు. కొందరికి శరీరంలో విపరీతమైన వొణుకు వస్తుంది. ఆ తర్వాత ఇలాంటి వారికి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇదే ముదిరి రోగి పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తారన్నారు. ఆత్మహత్య చేసుకోవడం, ఇతరులను గాయపర్చడం, వారికి వారే గాయపర్చుకోవడం లాంటివి చేస్తారని డాక్టర్లు తెలిపారు. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్నవారు. వెంటనే వైద్యులను సంప్రదిస్తే మంచిది