కేంద్ర ఆరోగ్య సహాయమంత్రికి కరోనా పాజిటివ్

దేశంలో మరో కేంద్ర మంత్రి కరోనా బారిన పడ్డాడు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి అశ్విని కుమార్ బేబే కరోనా టెస్టులు నిర్వహించుకొనగా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. ఇటీవల తనకు స్వల్ప అస్వస్థతగా ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. తనతో సన్నిహితంగా ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అయితే తాను ఆరోగ్యంగానే ఉన్నానని, వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నానని తెలిపారు. దేశంలో మొత్తంగా కరోనా కేసులు తగ్గు ముఖం పడుతున్నా ప్రముఖులు మాత్రం […]

Written By: Suresh, Updated On : December 29, 2020 1:26 pm
Follow us on

దేశంలో మరో కేంద్ర మంత్రి కరోనా బారిన పడ్డాడు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి అశ్విని కుమార్ బేబే కరోనా టెస్టులు నిర్వహించుకొనగా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. ఇటీవల తనకు స్వల్ప అస్వస్థతగా ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. తనతో సన్నిహితంగా ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అయితే తాను ఆరోగ్యంగానే ఉన్నానని, వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నానని తెలిపారు. దేశంలో మొత్తంగా కరోనా కేసులు తగ్గు ముఖం పడుతున్నా ప్రముఖులు మాత్రం కరోనా బారిన పడుతున్నారు. కాగా నేడు టాలీవుడ్ హీరో రామ్ చరన్ కు సైతం కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఇక దేశంలో కరోనా స్ట్రేయిన్ ప్రారంభం కావడం కలకలం రేపుతోంది.