జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాపై శివసేన ఎంపీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను పాకిస్థాన్ వెళ్లాలనుకుంటే వెళ్లిపోవచ్చని శివసేన ఎంపీ సంజయ్రౌత్ అన్నారు. భారత్లో 370 ఆర్టికల్కు, 35-ఏ అర్టికల్కు ఆస్కారం లేదని, ఈ ఆర్టికల్స్ను తిరిగి అమలు చేయాలని వ్యాఖ్యలు చేసే నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కావాలంటే పాకిస్థాన్కు వెళ్లి ఆ దేశంలో 370 ఆర్టికల్ విధించుకోవచ్చని శివసేన ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఇటీవల జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా 370 ఆర్టికల్ను తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు.