Site icon OkTelugu

 సైనికుల సామర్థాన్ని ఎవరూ దెబ్బదీయలేరు: కేంద్రమంత్రి రాజనాథ్ సింగ్

భారతదేశ సైనికుల సామర్థ్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథథ్ సింగ్ అన్నారు. సోమవారం జిరిగిన ఫిక్కీ వార్షిక సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత సరిహద్దుల్లో పొరుగు దేశాల వైఖరి ఎలా ఉందో ప్రపంచ దేశాలు చూస్తున్నాయన్నారు. ఉగ్రవాదంలో భారత్ ఎన్నో ఏళ్లుగా పోరాడుతోందని, ఎవరూ అండగా లేనప్పడు ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా తిప్పి కొడుతుందన్నారు. ఇక రైతుల ఆందోళన గురించి మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన రైతు సంస్కరణలు వారి ప్రయోజనకోసమేనన్నారు. వ్యవసాయ రంగం సంక్షోభం నుంచి కోలుకోవడానికి ఈ సంస్కరణలు ఉపయోగపడుతాయన్నారు. రైతుల అభిప్రాయాలు స్వీకరించేందుకు తామెప్పుడు సిద్ధంగానే ఉన్నామన్నారు.

Exit mobile version