
దేశంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 37,975 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 480 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 91,77,840గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,34,218 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,38,667 యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 86,04,955 గా ఉంది. గత పది రోజులుగా కరోనా కేసులు మరోసారి 40 వేలకు దిగువకు తగ్గాయి. గత కొన్ని రోజుల కిందట 30 వేలకు దిగువకు కేసులు తగ్గి మళ్లీ పెరిగాయి. తాజాగా మళ్లీ 40 వేల దిగువకు కేసులు తగ్గడంతో కాస్త ఊరట లభించినట్లవుతోంది.