శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఆత్మహత్య

కర్ణాటక శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ధర్మెగౌడ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం సాయంత్రం ధర్మెగౌడ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. మంగళవారం ఆయన కోసం పోలీసులు వెతకగా చిక్కమగళూరు జిల్లా కదూర్ తాలుకా గుణసాగర్ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన మ్రతదేహాన్ని కనుగొన్నారు. ఘటనా స్థలంలో ఓ సుసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 15న కర్ణాటక శాసనమండలిలో చైర్మన్ కె ప్రతాపచంద్ర శెట్టిపై ప్రవేశపెట్టిన అవిశ్వాత తీర్మానంపై రసాభాస జరిగింది. చైర్మన్ […]

Written By: Suresh, Updated On : December 29, 2020 10:05 am
Follow us on

కర్ణాటక శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ధర్మెగౌడ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం సాయంత్రం ధర్మెగౌడ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. మంగళవారం ఆయన కోసం పోలీసులు వెతకగా చిక్కమగళూరు జిల్లా కదూర్ తాలుకా గుణసాగర్ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన మ్రతదేహాన్ని కనుగొన్నారు. ఘటనా స్థలంలో ఓ సుసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 15న కర్ణాటక శాసనమండలిలో చైర్మన్ కె ప్రతాపచంద్ర శెట్టిపై ప్రవేశపెట్టిన అవిశ్వాత తీర్మానంపై రసాభాస జరిగింది. చైర్మన్ సీట్లో కూర్చున్న ధర్మెగౌడను కాంగ్రెస్ సభ్యులు చైర్మన్ సీటు నుంచి లాక్కెళ్లారు. కాగా ధర్మెగౌడ మ్రుతిపై మాజీ ప్రధాన దేవె గౌడ, జేడీఎస్ నేతలు తీవ్ర దిగ్బ్రాంతి చెందారు.