‘భారత్ సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఒక పెద్ద సంఘర్ణ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. దీనిని తేలికగా తీసుకోం’ అని భారత భద్రతా దళాల అధిపతి బిపిన్ రావత్ అన్నారు. చైనాతో, భారత్ ఎనిమిదో సారి చర్చలు జరపనుంది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ మొత్తం భద్రతా చర్యలో భాగంగా సరిహద్దు ఘర్షణలు, కవ్వింపు చర్యలను చైనా ప్రేరేపించిందన్నారు. దీంతో చైనాతో యుద్ధం రాదని అనుకోవద్దని అయన తెలిపారు. ఇక దాయాది దేశం మన భూభాగంలోకి ఎల్వోసి వెంబడి ఉగ్రవాదులను పంపించాలంటే భయపడుతుందనిఅన్నారు.