ఒకే కుటుంబంలో నలుగురి హత్య

ఛత్తీస్ గఢ్ లో దారుణం చోటు చేసుకుంది. ఒకే కేటుంబానికి చెందిన నలుగురిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రంలోని దుర్గా జిల్లా అమలేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఖుద్ ముద గ్రామంలో బాలరాజ్ సోంకర్, దులారిన్ బాయ్, వీరి కుమారుడు రోహిత్, కోడలు కీర్తిన్, ఓ మనువడు ఉన్నారు. వీరంతా ఒకే ఇంట్లో జీవిస్తున్నారు. సోమవారం ఉదయం దులారిన్, కీర్తిన్ హత్యకు గురై ఉండడం, 11 సంవత్సరాల బాలుడు గాయాలతో ఉండడాన్ని చూసిన గ్రామస్థులు […]

Written By: Suresh, Updated On : December 22, 2020 3:40 pm
Follow us on

ఛత్తీస్ గఢ్ లో దారుణం చోటు చేసుకుంది. ఒకే కేటుంబానికి చెందిన నలుగురిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రంలోని దుర్గా జిల్లా అమలేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఖుద్ ముద గ్రామంలో బాలరాజ్ సోంకర్, దులారిన్ బాయ్, వీరి కుమారుడు రోహిత్, కోడలు కీర్తిన్, ఓ మనువడు ఉన్నారు. వీరంతా ఒకే ఇంట్లో జీవిస్తున్నారు. సోమవారం ఉదయం దులారిన్, కీర్తిన్ హత్యకు గురై ఉండడం, 11 సంవత్సరాల బాలుడు గాయాలతో ఉండడాన్ని చూసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు నిందితులను గుర్తించేందుకు ప్రయత్నించగా పోలంలోని వ్యవసాయ బావి వద్ద సోంకర్, రోహిత్ మ్రుతదేహాలను కొనుగొన్నారు. గాయాలైన బాలుడిని సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.