మంత్రులతో చర్చలకు సిద్ధమేనన్న రైతులు

కేంద్రప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని రైతు సంఘాలు ప్రకటించాయి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర మంత్రులతో భేటికి హాజరవుతామని రైతు సంఘాల నాయకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ బిల్లుకు వ్యతిరేకంగా రైతులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో రైతుల ధర్నాకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ముగ్గురు మంత్రులు కలిసి రైతులతో చర్చలు జరపాలని నిర్ణయించింది. దీంతో రైతు సంఘాలకు ఈ విషయాన్ని తెలుపింది. అయితే రోడ్డుపై […]

Written By: Suresh, Updated On : December 1, 2020 1:39 pm
Follow us on

కేంద్రప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని రైతు సంఘాలు ప్రకటించాయి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర మంత్రులతో భేటికి హాజరవుతామని రైతు సంఘాల నాయకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ బిల్లుకు వ్యతిరేకంగా రైతులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో రైతుల ధర్నాకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ముగ్గురు మంత్రులు కలిసి రైతులతో చర్చలు జరపాలని నిర్ణయించింది. దీంతో రైతు సంఘాలకు ఈ విషయాన్ని తెలుపింది. అయితే రోడ్డుపై చర్చలు జరుపలేమని తేల్చింది. దీంతో రైతు సంఘాలు మంత్రుల బ్రుందంతో చర్చలు జరిపేందుకు రైతు సంఘాల నాయకులు అంగీకరించారు.