ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. బీజాపూర్ జిల్లా బాసగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో తర్రెం వద్ద రోడ్డుపై మావోయిస్టులు మందుపాతరను అమర్చారు. మంగళవారం ఇటువైపు నుంచివెళ్తున్న వాహనం మందుపాతర పైనుంచి వెళ్లడంతో ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఇద్దరు పౌరులకు గాయాలయ్యాయి. మరో చోట ఇద్దరు గ్రామస్థులను మావోయిస్టులు హత్య చేశారు. పోలీస్ ఇన్ ఫార్మర్ అనే నెపంతో వీరిని హత్య చేసినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఛత్తీస్ గఢ్ అడవుల్లో మావోయిస్టుల ఏరివేతపై భద్రతా భలగాలు ఆపరేషన్ నిర్వహిస్తోంది. రెండు రోజుల కింద మావోయిస్టుల చేతిలో కమాడర్ మరణించారు. తాజాగా ఇద్దరు గ్రామస్థులను చంపడం కలకలం రేపింది.