భారత్లో కరోనా ప్రవేశించినప్పుడు కేరళ రాష్ట్రంలోనే మొదలైంది. ఆ తరువాత జాగ్రత్తలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంతో జీరోస్థాయికి వచ్చింది. అయితే ఆన్లాక్ తరువాత కేరళలో కరోనా విజృంభిస్తోంది. రోజూ వేలల్లోనే కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర గవర్నర్ మహ్మద్ఖాన్కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఆయనకు స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు. దీంతో గవర్నర్కు కరోనా సోకిందని రాజ్భవన్ వర్గాలె ప్రకటించాయి. అయితే లక్షణాలు స్వల్పంగానే ఉండడంతో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదన్నారు రాజ్భవన్ పీఆర్వో. కాగా గత వారం న్యూఢిలీల్లలో తనను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని లేదా ముందు జాగ్రత్తలతో పర్యవేణలో ఉండాలని గవర్నర్ సూచించారు.