బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్పై కేసు నమోదైంది. ఆయన హోస్ట్ట్గా నిర్వహిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 12లో ఆయన అడిగిన ప్రశ్న వివాదంగా మారింది. గత శుక్రవారం జరిగిన ఈ షోలో సామాజిక వేత్త బెజవాడ విల్సన్, నటుడు అనూప్ సోనీతో బిగ్బీ కౌన్ బనేగా కరోడ్ పతి గేమ్ ఆడారు. ఈ సందర్భంగా 6 లక్షల 40 వేల రూపాయలకు సంబంధించిన ఓ ప్రశ్నను బిగ్బీ అనూప్ను అడిగారు. దీంతో ఈ ప్రశ్న హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అమితాబ్తో పాటు షో నిర్వాహకులపై కేసు నమోదైంది. అంతేకాకుండా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ఆప్షన్లు హిందువులు మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.