వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన రైతులకు ప్రముఖ బాక్సర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత విజేందర్ సింగ్ మద్దతు పలికాడు. నిన్న రైతు ఉద్యమంలో పాల్గొన్న ఆయన.. నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాడు. లేదంటే ప్రభుత్వం తనకు ఇచ్చిన రాజీవ్గాంధీ ఖేల్రత్న అవార్డును తిరిగి ఇచ్చేస్తానని హెచ్చరించాడు.