మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ ఎంపీ ప్రఙ్ఞా సింగ్ గత కొన్ని రోజులుగా రెటీనా ఇన్ ఫెక్షన్ సోకడంతో చికిత్స పొందుతున్నారు. ఎయిమ్స్ లో రెటీనా చెకప్ కోసం రెండు రోజుల కిందట ఆమె ఢిల్లీ చేరుకున్నారు. ప్రాథమిక పరీక్షల నిమిత్తం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందాలని ఏయిమ్స్ వైద్యులు సూచించారు. దీంతో ప్రఙ్ఞా సింగ్ ఏయిమ్స్ లో అడ్మిట్ అయ్యారు. కాగా ఎంపీకి కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం నెగెటివ్ రిపోర్టు వచ్చింది. మరోవైపు తాను ఆసుపత్రిలో ఉన్నందువల్ల కోర్టుకు వెళ్లలేనని తెలిపింది. 2008లో జరిగిన మాలెగావ్ పేలుడు కేసులో ఎంపీ శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంది.