
దేశంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 36,011 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 482 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 96,44,222గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,40,182కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,03,248 యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 91,00,792గా ఉంది. కరోనా కేసులు తగ్గినట్లు కనిపిస్తున్నా ఓవరాల్ గా మాత్రం 96 లక్షల కేసులు దాటాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 14,69,86,575 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్రం తెలిపింది.