HomeజాతీయంRam Mandir: అయోధ్యకు వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

Ram Mandir: అయోధ్యకు వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

Ram Mandir: అయోధ్య సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు పుట్టిన పుణ్యభూమి. ఆ మహాపురుషుడు పుట్టిన దేశంలో మనం పుట్టడం ఎన్నో జన్మల పుణ్యఫలం. వందల ఏళ్ల చరిత్ర ఉన్న అయోధ్యలో అభినవ రామమందిర నిర్మాణం పూర్తి కావస్తోంది. జనవరి 22న ఆలయంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా నిర్వహించే ఈ వేడుకను చూసేందుకు ఇప్పటికే వేల మందికి ఆహ్వానాలు అందాయి. వీవీఐపీలు, వీఐపీలతోపాటు సామాన్య భక్తులకు కూడా ఆహ్వాన లేఖలు అందడంతో చాలా మంది జనవరి 22 నాటికి అయోధ్య వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరికొందరు. విగ్రహ ప్రాణప్రతిష్ట తర్వాత అయోధ్య వెళ్లాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యకు ఎలా వెళ్లాలి. ఎంత ఖర్చవుతుంది.. అక్కడ బస చేసేందుకు ఉన్న వసతులు ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం.

ఖర్చుకు వెనుకాడకుండా..
అయోధ్యకు వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారని, ఖర్చుకు వెనుకాడడం లేదని ఈజ్‌ మై ట్రిప్, థామస్‌ కుక్, ఎస్‌ఓటీసీ తదితర ట్రావెల్‌ సంస్థలు తెలిపాయి. ఏడు వేల మందికి మాత్రమే జనవరి 22న నిర్వహించే ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు అందాయి. ఈ నేపథ్యంలో తర్వాతి రోజు కూడా వెళ్లేందుకే వేలాది మంది ఎదురు చూస్తున్నారు. ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నుంచి అయోధ్యకు విమాన టికెట్ల ధరలు పెరిగాయి. రూ.20 వేల నుంచి రూ.30 వేలకు చేరుకున్నాయి. ఇతర సమయాల్లో ఉన్న ధరకంటే రెట్టింపు స్థాయిలో చార్జీలు పెంచేశాయి. మేక్‌ మై ట్రిప్‌ ట్రావెల్‌ సంస్థ అయోధ్య వెళ్లడానికి విమాన టికెట్‌ ధర రూ.17,900 నుంచి రూ.24,600 వసూలు చేస్తోంది. జనవరి 21 నాటికి నాన్‌స్టాప్‌ విమానాల ధర రూ.20,699గా ఉంది. జనవరి 20న కోల్‌కతా నుంచి అయోధ్యకు విమాన టికెట్ల ధర రూ.18,456 నుంచి రూ.25,761గా ఉంది. బెంగళూరు నుంచి అయోధ్యకు జనవరి 20న రూ.23,152 నుంచి రూ.32,855 వరకు విమాన టికెట్ల ధర ఉంది. ఇదిలా ఉండగా, ఈనెల 22 తర్వాత నిత్యం మూడు నుంచి ఐదు లక్షల మంది అయోధ్యకు వస్తారని అంచనా వేస్తున్నారు.

వసతి ఇలా..
రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యలోని హోటళ్లన్నీ ఇప్పటికే బుక్‌ అయిపోయాయి. హోటళ్లలో గదుల ఆక్యుపెన్సీ రేటు 80 నుంచి 100 శాతానికి చేరుకుంది. దీంతో కొన్ని హోటళ్లలో రాత్రిపూట గది అద్దె ధర రూ.70 వేలు వరకూ చెబుతున్నారు. అందుకే అయోధ్యకు వచ్చే చాలామంది భక్తులు పగటిపూట అయోధ్యలో ఉంటూ, రాత్రి లక్నో లేదా ప్రయాగ్‌రాజ్‌లో బస చేసేందుకు ప్లాన్‌ చేసుకోవడం మంచిదంటున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version