Uniform Civil Code : త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మరో ఏడాది సార్వత్రిక ఎన్నికలు.. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మరో వివాదాస్పదమైన నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. తేనె తుట్టే లాంటి ఉమ్మడి పౌర స్మృతిని అమలులోకి తీసుకొచ్చేందుకు బలమైన అడుగులు వేసింది. ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఏకంగా పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు సమాయత్తమైంది. జూలై మూడో వారంలో మొదలయ్యే వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లు పెట్టాలని నిర్ణయించినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి. న్యాయశాఖపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం జూలై 3న కేంద్ర న్యాయశాఖకు చెందిన చట్టవ్యవహారాలు, శాసనసభ వ్యవహారాల విభాగాలు, లా కమిషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఆ సందర్భంగా బిల్లుకు తుది తీసుకురావాలని భావిస్తోంది. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాక దీనిని మరింత లోతుగా పరిశీలించేందుకు సెలెక్ట్ కమిటీకి పంపుతారని తెలుస్తోంది. ప్రభుత్వం నియమించిన ఆ కమిటీ వివిధ వర్గాలు, భాగస్వాములతో విస్తృతంగా సంప్రదింపులు జరుపుతుంది.
K.R. is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More