HomeజాతీయంPydimarri Venkata Subbarao : ‘భారతదేశం నా మాతృభూమి’ ప్రతిజ్ఞ రాసింది తెలంగాణ బిడ్డే!

Pydimarri Venkata Subbarao : ‘భారతదేశం నా మాతృభూమి’ ప్రతిజ్ఞ రాసింది తెలంగాణ బిడ్డే!

Pydimarri Venkata Subbarao : భారతీయ సంస్కృతిలో, విద్యార్థుల దినచర్యలో మన జాతీయ గీతం, జాతీయ గేయం భాగం. ఈరెండింటితోపాటు ప్రతిజ్ఞ కూడా నిత్యకృత్యం. జాతీయ గీతం పాఠశాలలతోపాటు చట్ట సభలు, వివిధ అధికారిక కార్యక్రమాలతోపాటు ప్రస్తుతం సినిమా ప్రదర్శనకు ముందు థియేటర్లలోనూ పాడుతున్నారు. ఇక జాతీయ గేయం వందేమాతరం పాఠశాలల్లో నిత్యం ఆలపిస్తున్నారు. కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోనూ వందేమాతరం పాడుతున్నారు. వందేమాతరం రాజకీయ నాయకులకు ఒక నినాదంగా కూడా మారింది. ఇక ప్రతిజ్ఞ.. ఇది కూడా విద్యార్థి నిత్య కృత్యం పాఠశాల దశలో ప్రతీ విద్యార్థి రోజు చేయాల్సిందే.
చరయితలు.. నేపథ్యం..
జాతీయ గీతం జనగణమన రచయిత ఎవరంటే చాలా మంది టక్కున చెబుతారు. విద్యార్థులకు అయితే తప్పక గుర్తుంటుంది. ఇక నేతల విషయం వేరు.. చాలా మందికి జనగణ మన పాడడమే రాదు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన కవి, రచయిత రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ఈ గీతాన్ని రచించారు. స్వాతంత్య్రం వచ్చాక దానిని జాతీయ గీతంగా ప్రకటించారు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ జనగణమనతోపాటు అనేక రచనలు చేశారు. ఆయన చాసిన గీంతాంజలి రచన ప్రఖ్యాతి చెందింది. 1913లో ఆయనను నోబుల్‌ ప్రైజ్‌ కూడా వరించింది.
– జాతీయ గేయం వందేమాతరం రాసింది కూడా బెంగాల్‌ రచయితే. బెంగాలీ కవి, వ్యాస రచయిత, సంపాదకుడు అయిన బంకీంచంద్రచటోపాధ్యాయ వందేమాతర గేయం రాశాడు. విద్యార్థులకు ఈ విషయం తెలుసు. ఇతను రాజిన ఆనంద్‌ మuЇ అనే నవల నుంచి వందేమాతర గేయాన్ని సంగ్రహించారు. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో వందేమాతర నినాదం సమరశంఖమైంది. ప్రస్తుత రాజకీయ నేతలు కూడా వివిధ ఉద్యమాల సమయంలో వందేమాతరం అంటూ నినదిస్తుంటారు.
ప్రతిజ్ఞ : భారత దేశం నా మాతృభూమి.. భారతీయులంతా నా సహోదరులు అంటూ ప్రతీ పాఠశాలలో విద్యార్థులు ఉదయం ప్రతిజ్ఞ చేస్తుంటారు. ప్రతిజ్ఞ అయితే చేస్తుంటారు కానీ, ఈ ప్రతిజ్ఞ ఎవరు రాశారో చాలా మందికి తెలియదు. పాఠ్యపుస్తకాల్లో ముందు పేజీల్లో జాతీయ గీతం జనగణమన, జాతీయ గేయం వందేమాతరంతోపాటు ప్రతిజ్ఞ ఉంటుంది. జాతీయ గీంత, జాతీయ గేయం కింద రచయిత పేరు ఉంటుంది. కానీ ప్రతిజ్ఞ రచయిత పేరు ఎక్కడా కనిపించదు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు చెప్పరు. వాస్తవంగా చాలా మంది ఉపాధ్యాయులకు రచయిత ఎవరో కూడా తెలియదు.
రాసింది తెలంగాణ బిడ్డే.. 
ప్రతీ రోజూ విద్యార్థులు చేసే ప్రతిజ్ఞ రాసింది మన తెలంగాణ బిడ్డే. కానీ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా ఈ విషయం చాలా మందికి తెలియదు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేళ ఆయన గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ వాసులుగా మనపై ఉంది. నల్లగొండ జిల్లా అన్పెర్తికి చెందిన పైడిమర్రి వెంకటసుబ్బారావు ప్రతిజ్ఞ రాశారు. భారతదేశంపై, భారతీయులపై ఉన్న అపారమైన భక్తి, సోదరభావం, ప్రేమతో వెంకటసుబ్బారావు ఈ ప్రతిజ్ఞ రాశారు. విద్యార్థి దశలోనే పిల్లల్లో దేశభక్తి, భారతీయులపై సోదరభావం, మాతృభూమిపై ప్రేమ, దేశ సంపద పరిరక్షణ బాధ్యత చేపట్టాలన్న సంకల్పంతో ఈ ప్రతిజ్ఞను పాఠ్యపుస్తకాల్లో ముద్రిస్తున్నారు. తెలుగు, ఇంగ్లిష్‌లో దీనిని అచ్చువేయడంతోపాటు ప్రతీ పాఠశాలలో నిత్యం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ బిడ్డలుగా ప్రతిజ్ఞ రచయిత వెంకటసుబ్బారావును మననం చేసుకుందాం. గౌరవించుకుందాం.
Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version