CM KCR: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ ఓటమిపై బీఆర్ఎస్ నేతల్లో సంతోషం వ్యక్తమవుతోంది. చాలా మంది మాటల్లో దక్షిణాది అనే మాట వినిపించింది. దక్షిణాదిలో బీజేపీకి చోటు లేదని ప్రజలు నిరూపించారని వారు చెప్పుకొచ్చారు. ఓ వరుస ప్రకారం దక్షిణాదిని హైలెట్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు చేసిన ప్రకటనలతో .. భారత్ రాష్ట్ర సమితి రాజకీయంలో కేసీఆర్ తరచూ చెప్పే గుణాత్మక మార్పు కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపించడం ప్రారంభమయింది. ఆ గుణాత్మక మార్పు దక్షిణాది ఉద్యమమే. ప్రాంతీయ ఉద్యమాల్లో కేసీఆర్ అపరచాణక్యుడు కేసీఆర్ ప్రాంతీయ ఉద్యమాల్లో దిట్ట. ఆయన ఉమ్మడి రాష్ట్రం విడగొట్టడం సాధ్యం కాదని వంద కు వందశాతం అనుకుంటున్న దశలో తెలంగాణ రాష్ట్ర సమితిపెట్టి చివరికి అనేక రకాల వ్యూహాలతో తెలంగాణ సాధించారు. ఇప్పుడు దేశ రాజకీయాలకు వెళ్లాలనుకుంటున్న ఆయన దక్షిణాది ఉద్యమం చేపట్టే అవకాశాలపై పరిశీలన చేస్తున్నారని అందుకే.. కొత్తగా దక్షిణాది అంటూ బీఆర్ఎస్ నేతలు ప్రకటులు చేస్తున్నారని చెబుతున్నారు. కేసీఆర్ రాజకీయ వ్యూహాల గురించి కనీస అవగాహన ఉన్న ఎవరైనా ఈ అంశాలను కొట్టి పారేయలేరు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Kcr special south movement
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com