spot_img
Homeఅత్యంత ప్రజాదరణబ్యాంకుల ముందు చెత్త వేయించిన కమిషనర్ కు పట్టిన గతి ఇదీ

బ్యాంకుల ముందు చెత్త వేయించిన కమిషనర్ కు పట్టిన గతి ఇదీ

కృష్ణా జిల్లా ఉయ్యూరులో బ్యాంకుల ముందు చెత్త వేసిన ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఏపీ ప్రభుత్వం పరువు తీసింది. వైఎస్ జగన్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను బ్యాంకులు అమలు చేయడం లేదని..రుణాలు ఇవ్వడం లేదని ఉయ్యూరు నగర పంచాయితీ కమిషనర్ డా. ప్రకాశ్ రావు ప్రోద్బలంతోనే పారిశుధ్య కార్మికులు ఈ చెత్త వేయించారనే ఆరోపణలు వచ్చాయి.

ఈ ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపడం.. కేంద్ర ఆర్థిక శాఖ జగన్ సర్కార్ ను చీవాట్లు పెట్టిందన్న వార్తలు వినిపించాయి. దీంతో ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. వెంటనే ఉయ్యూరు పంచాయితీ కమిషనర్ డా. ప్రకాస్ రావును తాజాగా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పురపాలక శాఖ కమిషనర్ విజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు

ఇక ప్రభుత్వం నుంచి చీవాట్లు రావడంతో సస్పెన్షన్ కు ముందు కమిషనర్ మీడియాతో మాట్లాడారు.పారిశుధ్య సిబ్బంది, లబ్ధిదారులు కలిసి బ్యాంకుల ముందు చెత్తవేయడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు, సిబ్బందికి తాను క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకర్లు, పంచాయితీ వర్గాలు కలిసి ముందుకు వెళతామన్నారు.

అయితే ఈ ఘటన దేశవ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం పరువు తీయడంతో ప్రభుత్వం విచారణ జరిపింది. దీనికి బాధ్యులు కమిసనర్ అని తెలియడంతో ఆయన మీడియా ముందు క్షమాపణ చెప్పిన కొద్ది సేపటికే ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...
Oktelugu Epaper
Exit mobile version