Homeఅత్యంత ప్రజాదరణఒలంపిక్స్ లో నారిభేరి: అతివలదే సత్తా

ఒలంపిక్స్ లో నారిభేరి: అతివలదే సత్తా

Tokyo Olympics

135 కోట్ల మంది భారతీయులున్నారు.. ఇంతమంది ఉన్నా ప్రపంచ ప్రఖ్యాత క్రీడాసంబురం ఒలింపిక్స్ లో భారత్ కు పతకాలు తెచ్చింది మాత్రం మన అతివలే కావడం విశేషం. గడిచిన కొన్నేళ్లుగా భారత్ కు ఒలింపిక్స్ లో పతకాలు ఐదు వచ్చాయి. ఆ ఐదు కూడా మన మహిళా క్రీడాకారులే తేవడం విశేషం అని చెప్పొచ్చు. అతివలే మన కీర్తి పతకాన్ని ప్రపంచ క్రీడా పండుగలో చాటిచెప్పారు. .

ఒలంపిక్స్ లో తాజాగా భారత్ కు వరుసగా రెండో పతకాన్ని పీవీ సింధు అందించింది. 2016 రియో ఒలింపిక్స్ లో రజతం గెలిచిన సింధు.. టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం సాధించింది. టోక్యో ఒలింపిక్స్ సింగిల్స్ బ్యాడ్మింటన్ లో భాగంగా మూడో స్థానం కోసం చైనా క్రీడాకారిణి బింగ్ జియావో తో జరిగిన పోరులో సింధు చెలరేగిపోయింది. భారీ అంచనాల నడమ ఒలింపిక్స్ కు వెళ్లిన సింధూ దాన్ని సాకారం చేసుకుంటూ భారత్ కు పతకం అందించి త్రివర్ణ పతకాన్ని అంతర్జాతీయ వేదికపై మరోసారి రెపరెపలాడించింది.

తాజా పోరులో పీవీ సింధు 21-13,21-15 తేడాతో బింగ్ జియావోపై గెలిచింది. 2016లో రియోలో జరిగిన ఒలింపిక్స్ లో రజతం సాధించిన సింధూ తాజా ఒలింపిక్స్ లో కూడా పతకం సాధించి భారత అభిమానులు పెట్టుకున్న ఆశలను నిలబెట్టింది.

ఒలింపిక్స్ చరిత్రలోనే రెండు పతకాలు సాధించిన ఏకైక భారత క్రీడాకారిణిగా సింధు కొత్త అధ్యాయం లిఖించింది. స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించేకపోవడమే సింధుకు చేదు అనుభవంగా ఉంది. కాంస్యం గెలిచి ఆలోటును కాస్తంత పూరించింది. భారతీయులను ఉప్పొంగేలా చేసింది.

ఒలింపిక్స్ లో ఇప్పటివరకు రెజ్లర్ సుశీల్ కుమార్ మాత్రమే రెండు పతకాలు గెలుపొందాడు.. 2008లో జరిగిన బీజింగ్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం గెలుపొందిన సుశీల్ కుమార్.. 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్ లో రజత పతకాన్ని భారత్ కు అందించాడు. అప్పటి నుంచి ఇప్పటివరకూ భారత క్రీడాకారులు ఎవరూ ఈ రికార్డ్ కు చేరువకాలేదు. కానీ తాజాగా పీవీ సింధూ బ్యాక్ టు బ్యాక్ పతకాలతో సుశీల్ కుమార్ సరసన చేరారు.

గత 2016లో కూడా మహిళలే భారత్ కు రెండు పతకాలను లండన్ ఒలింపిక్స్ లో తెచ్చిపెట్టారు. ఇదే బ్యాడ్మింటన్ తార పీవీ సింధు ఫైనల్ లో ఓడిపోయి సిల్వర్ మెడల్ సాధించగా.. రెజ్లింగ్ లో సాక్షి మాలిక కు కాంస్య పతకం దక్కింది.

ఇక 2021లో తాజాగా ఒలింపిక్స్ లో మీరాబాయి చాను బాక్సింగ్ లో పతకం సాధించింది. ఇప్పుడు పీవీ సింధు.. ఈ లెక్కన గడిచిన రెండు ఒలింపిక్స్ లో మన అమ్మాయిలే భారత్ కు పతకాలు అందించారు. అబ్బాయిలు ఆ ఘనత సాధించలేకపోవడం గమనార్హం.

ఇక అంతకుముందు 2000 సంవత్సరంలో మన ఏపీ ఆడకూతురు కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్ లో కాంస్యం గెలిచింది. ఇక 2012లో బ్యాడ్మింటన్ లో సైనా నెహ్వాల్ కాంస్యం గెలిచింది. ఇక ఇదే 2012లో మేరికోమ్ బాక్సింగ్ లో కాంస్య పతకం సాధించింది.

ఇలా భారత చరిత్రలో కరణం మల్లీశ్వరి, సైనా నెహ్వాల్, మేరికోమ్, పీవీ సింధు, సాక్షి మాలిక్, మీరాభాయి చాను, లవ్లోని బార్గోనిలు ఒలింపిక్స్ పతకాలు గెలిచి భారత నారీలే ఈ ఘనత సాధించి దేశ పతాకాన్ని రెపరెపలాడించారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Oktelugu Epaper
Exit mobile version