అత్యంత ప్రజాదరణఒలంపిక్స్ లో నారిభేరి: అతివలదే సత్తా

ఒలంపిక్స్ లో నారిభేరి: అతివలదే సత్తా

Tokyo Olympics

135 కోట్ల మంది భారతీయులున్నారు.. ఇంతమంది ఉన్నా ప్రపంచ ప్రఖ్యాత క్రీడాసంబురం ఒలింపిక్స్ లో భారత్ కు పతకాలు తెచ్చింది మాత్రం మన అతివలే కావడం విశేషం. గడిచిన కొన్నేళ్లుగా భారత్ కు ఒలింపిక్స్ లో పతకాలు ఐదు వచ్చాయి. ఆ ఐదు కూడా మన మహిళా క్రీడాకారులే తేవడం విశేషం అని చెప్పొచ్చు. అతివలే మన కీర్తి పతకాన్ని ప్రపంచ క్రీడా పండుగలో చాటిచెప్పారు. .

ఒలంపిక్స్ లో తాజాగా భారత్ కు వరుసగా రెండో పతకాన్ని పీవీ సింధు అందించింది. 2016 రియో ఒలింపిక్స్ లో రజతం గెలిచిన సింధు.. టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం సాధించింది. టోక్యో ఒలింపిక్స్ సింగిల్స్ బ్యాడ్మింటన్ లో భాగంగా మూడో స్థానం కోసం చైనా క్రీడాకారిణి బింగ్ జియావో తో జరిగిన పోరులో సింధు చెలరేగిపోయింది. భారీ అంచనాల నడమ ఒలింపిక్స్ కు వెళ్లిన సింధూ దాన్ని సాకారం చేసుకుంటూ భారత్ కు పతకం అందించి త్రివర్ణ పతకాన్ని అంతర్జాతీయ వేదికపై మరోసారి రెపరెపలాడించింది.

తాజా పోరులో పీవీ సింధు 21-13,21-15 తేడాతో బింగ్ జియావోపై గెలిచింది. 2016లో రియోలో జరిగిన ఒలింపిక్స్ లో రజతం సాధించిన సింధూ తాజా ఒలింపిక్స్ లో కూడా పతకం సాధించి భారత అభిమానులు పెట్టుకున్న ఆశలను నిలబెట్టింది.

ఒలింపిక్స్ చరిత్రలోనే రెండు పతకాలు సాధించిన ఏకైక భారత క్రీడాకారిణిగా సింధు కొత్త అధ్యాయం లిఖించింది. స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించేకపోవడమే సింధుకు చేదు అనుభవంగా ఉంది. కాంస్యం గెలిచి ఆలోటును కాస్తంత పూరించింది. భారతీయులను ఉప్పొంగేలా చేసింది.

ఒలింపిక్స్ లో ఇప్పటివరకు రెజ్లర్ సుశీల్ కుమార్ మాత్రమే రెండు పతకాలు గెలుపొందాడు.. 2008లో జరిగిన బీజింగ్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం గెలుపొందిన సుశీల్ కుమార్.. 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్ లో రజత పతకాన్ని భారత్ కు అందించాడు. అప్పటి నుంచి ఇప్పటివరకూ భారత క్రీడాకారులు ఎవరూ ఈ రికార్డ్ కు చేరువకాలేదు. కానీ తాజాగా పీవీ సింధూ బ్యాక్ టు బ్యాక్ పతకాలతో సుశీల్ కుమార్ సరసన చేరారు.

గత 2016లో కూడా మహిళలే భారత్ కు రెండు పతకాలను లండన్ ఒలింపిక్స్ లో తెచ్చిపెట్టారు. ఇదే బ్యాడ్మింటన్ తార పీవీ సింధు ఫైనల్ లో ఓడిపోయి సిల్వర్ మెడల్ సాధించగా.. రెజ్లింగ్ లో సాక్షి మాలిక కు కాంస్య పతకం దక్కింది.

ఇక 2021లో తాజాగా ఒలింపిక్స్ లో మీరాబాయి చాను బాక్సింగ్ లో పతకం సాధించింది. ఇప్పుడు పీవీ సింధు.. ఈ లెక్కన గడిచిన రెండు ఒలింపిక్స్ లో మన అమ్మాయిలే భారత్ కు పతకాలు అందించారు. అబ్బాయిలు ఆ ఘనత సాధించలేకపోవడం గమనార్హం.

ఇక అంతకుముందు 2000 సంవత్సరంలో మన ఏపీ ఆడకూతురు కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్ లో కాంస్యం గెలిచింది. ఇక 2012లో బ్యాడ్మింటన్ లో సైనా నెహ్వాల్ కాంస్యం గెలిచింది. ఇక ఇదే 2012లో మేరికోమ్ బాక్సింగ్ లో కాంస్య పతకం సాధించింది.

ఇలా భారత చరిత్రలో కరణం మల్లీశ్వరి, సైనా నెహ్వాల్, మేరికోమ్, పీవీ సింధు, సాక్షి మాలిక్, మీరాభాయి చాను, లవ్లోని బార్గోనిలు ఒలింపిక్స్ పతకాలు గెలిచి భారత నారీలే ఈ ఘనత సాధించి దేశ పతాకాన్ని రెపరెపలాడించారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

PV Sindhu Japan Open : పడిలేచిన తెలుగింటి కెరటం.. భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో పీసీ సింధు కొత్త రికార్డు!

PV Sindhu Japan Open : భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ.సిందు మరో చరిత్ర సృష్టించింది. రెండు మూడేళ్లుగా వరుస పరాజయాలు ఎదురైనా ఎక్కడా నిరాశ చెందలేదు. ఓటమినే గులుపుకు నాందిగా భావించింది....

Most Popular

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

FIFA World Cup 2026: వాటర్ బాటిల్ 500.. చికెన్ ఫ్రై 1800.. ఈ రేట్ల వెనుక ఉన్న...

FIFA World Cup 2026: మనం ఒక వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తే ఎంత ఖర్చు పెడతాం.. మహా అయితే 20.. ఇంకాస్త ప్రీమియం అనుకుంటే 30.. ఇంకా బాగా ప్రీమియం అనుకుంటే...

Trump FIFA Club World Cup: నీ ప్రచార పిచ్చి తగలెయ్య.. ఫిఫా కప్ లో అమెరికా అధ్యక్షుడు...

Trump FIFA Club World Cup: ప్రజా జీవితంలో ఉన్న వాళ్లకు ప్రచారం కచ్చితంగా కావాలి. వాళ్లు చేసే చిన్న పని అయినా సరే.. అందరికీ తెలియాలి. అందువల్లే నేటి కాలంలో...

Rohit Sharma: రిటైర్మెంట్ పై తొలిసారి నోరు విప్పిన రోహిత్.. క్లారిటీ ఇచ్చేశాడుగా..

Rohit Sharma: "అతడి వయసు 40 కి దగ్గరగా వచ్చింది. అంతగా ఆడలేడు. ఐపీఎల్ లో సత్తా చూపించలేకపోయాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెట్టలేకపోతున్నాడు. అతడు రిటైర్మెంట్ తీసుకునే సమయం వచ్చింది....

Skyroot Aerospace: స్కై రూట్ మాత్రమే కాదు.. ఇంకా చాలా ఉన్నాయి.. భవిష్యత్తు మొత్తం వీటిదే..

Skyroot Aerospace: స్కై రూట్ అంతరిక్ష పరిశోధన లో సరికొత్త చరిత్రను ఆవిష్కరించింది. తక్కువ, మధ్య స్థాయి బరువున్న ఉపగ్రహాలను ప్రత్యేకమైన రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించి అద్భుతం సృష్టించింది. ప్రైవేట్ రంగంలో...
Exit mobile version