ప్రభాస్ కు జోడిగా దీపిక పదుకొనే?

ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘జాన్; అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇటివల ప్రభాస్ 21వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు. ఈ సినిమాకు హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ భామ దీపిక పదుకొనేను సంప్రదించినట్లు ప్రచారం జరుగుతుంది. దీపికకు నాగ్ అశ్విన్ కథ చెప్పారంట ఆమెకు […]

Written By: Neelambaram, Updated On : March 3, 2020 4:08 pm
Follow us on

ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘జాన్; అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇటివల ప్రభాస్ 21వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు.

ఈ సినిమాకు హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ భామ దీపిక పదుకొనేను సంప్రదించినట్లు ప్రచారం జరుగుతుంది. దీపికకు నాగ్ అశ్విన్ కథ చెప్పారంట ఆమెకు నచ్చడంతో ఈ సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం. దీనిపై అధికార ప్రకటన రావల్సి ఉంది. ప్రభాస్ 21వ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

నాగ్ అశ్విన్ తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందారు. ప్రభాస్ చిత్రాన్ని కూడా ఆయన అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.