ఈ సినిమాకు హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ భామ దీపిక పదుకొనేను సంప్రదించినట్లు ప్రచారం జరుగుతుంది. దీపికకు నాగ్ అశ్విన్ కథ చెప్పారంట ఆమెకు నచ్చడంతో ఈ సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం. దీనిపై అధికార ప్రకటన రావల్సి ఉంది. ప్రభాస్ 21వ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
నాగ్ అశ్విన్ తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందారు. ప్రభాస్ చిత్రాన్ని కూడా ఆయన అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.